ఇంట్లో ఉండే “పెరుగు” పెంచుతుంది మీ సౌందర్యాన్ని!!
ప్రతిరోజూ
ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు
దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో
నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత
చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.
తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు
పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే.. మళ్లీ విడిగా కండీషనర్
ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని
కండీషనర్లా ఉపయోగపడుతుంది. పెరుగులో శనగపిండిని కలిపి, నలుగుపిండిలా
శరీరానికి పట్టిస్తే.. చర్మం, ముఖం మీదనున్న మృతకణాలు తొలగిపోతాయి.
ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి,
శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది. పెరుగులో
కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలిపి.. ముఖానికి
పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. పెరుగులో కాస్త పచ్చి
పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది.
ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్క్యూబ్లు వేసి ఆ మిశ్రమంతో
ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.
No comments:
Post a Comment