Wednesday, March 7, 2018

పూర్వజన్మ సుకృతమా? పెరిగిన వాతావరణమా?

🕉🕉🕉🕉🕉🕉

ఒక ఆశ్రమంలో గురు శిష్యుల మధ్య చర్చ జరుగుతోంది. మానవులలో కొంతమంది సన్మార్గులుగా, మరికొంతమంది హింసా ప్రవృత్తి కల దుర్మార్గులుగా, కొందరు ఆస్తికులుగా, మరి కొందరు నాస్తికులుగా జీవించడానికి గల కారణమేమిటని శిష్యుడి సందేహం. మనిషి పుట్టిన వాతావరణము, అక్కడి స్థితిగతులను బట్టి గుణభావములు ఏర్పడతాయి, అని చెపుతూ గురువుగారు శిష్యుడికి ఒక పిట్టకధను యిలా తెలియజేసారు.

ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం మీద చిలక ఒకటి గూడు కట్టి గుడ్లను పెట్టింది. ఒక రోజు ఆ చిలక బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చెట్టుమీది గూటిలోనుండి ఒక గ్రుడ్డు క్రిందపడి పగిలిపోయి అందులోంచి చిన్న చిలక బయటకు వచ్చి ఎగరలేక అవస్థలు పడుతూంటుంది. ఆది చూసిన ఒక కసాయివాడు ఆ చిలకను తనతోపాటు తీసుకుపోతాడు. తర్వాత, యింకొన్నాళ్ళకు మరొక గ్రుడ్డు కూడా క్రిందపడి చితికిపోయి మరో చిలక బయటకు వస్తుంది. ఆ దారిన పోతున్న ఒక సాధువు దానిని చూసి జాలిపడి తనతో తీసుకు పోయి జాగ్రత్తగా పెంచసాగాడు.

ఒకరోజు, ఆ రాజ్యాన్నేలే రాజు వేట కోసం అడవికి వచ్చి అలసిపోయి విశ్రాంతికోసం అనువైన చోటుకోసం వెతుకుతూ, కసాయివాడి గుడిసె వేపు వెళతాడు. రాజుగారిని చూసి, కసాయివాడు పెంచుతున్న చిలక గట్టిగా,  "  చెట్టుకు కట్టేయండి, చంపండి, నరకండి, బాగా చితక్కొట్టండి, చంపండి, చంపండి" అంటూ గోల గోలగా అరవడం ప్రారంభించింది.  రాజుగారు ఆ చిలక పలుకులకు నివ్వెరపోతూ , అక్కడనుండి వెడలి, సాధువున్న ఆశ్రమం వైపు వస్తాడు. రాజుగారిని చూసిన ఆ చిలక, గట్టిగా,"  అతిధులొచ్చారు. లోపలకు తీసుకువెళ్ళండి. ముందు దాహాన్ని తీర్చి, పళ్ళూ, ఫలహారాలు సమర్పించండి. విశ్రాంతికి ఏర్పాట్లు చేయండి " అంటూ చిలక పలుకులు పలుకుతుంది.
రాజుగారు ఆ ఆశ్రమవాసులు కల్పించిన ఆతిధ్యం తీసుకుని ఆనందంగా వెళతాడు.
ఒకే జాతి పక్షులే కానీ వాటి మాటలో, చేష్టలో ఎంతో తేడా . కారణం , అవి పెరిగిన వాతావరణం. పెంచినవారి సంస్కారం. ఆ సంస్కారం ఎలా లభిస్తుంది. పూర్వజన్మ సుకృతం వలన.
మరొక విషయం చెపుతాను. ఆకాశం వర్షిస్తుంది. మేఘాలలోంచి వచ్చే నీరు శుధ్ధమైనదే. కానీ అది క్రింద పడినప్పుడు ఉండే పరిసరాలను బట్టి ఆ నీటియొక్క, లక్షణమూ మారుతుంది. బురదలోపడిన వాన బురదమయంగా, నల్లమట్టిలో పడ్డ వాన నల్లగా త్రాగడానికి అనువైనదిగా ఉండదు. కానీ, అదే వర్షపు నీరు, బావులలో, చెరువులలో, నదులలో చేరితే దానిని మనం అనుభవించగలుగుతున్నాము. అంటే స్థల ప్రభావం అని తెలుస్తోంది.
మరొక విషయం చూడు. మన రామాయణ గాధే ఉంది. విభీషణుడు ,రావణ కుంభకర్ణుల సోదరుడు. జన్మతః అసురుడు. కానీ, ఏ పూర్వపుణ్యఫలం వలననో శ్రీరాముని మైత్రి చేసి ఆయన అనుగ్రహం పొందాడు. లోకమంతటిచేత ప్రశంసించబడ్డాడు.
మహాభారతగాధలోని కర్ణుడు సూర్యాంశతో జన్మించి, వీరాధివీరుడిగా,  దాతృత్వంలో అసమాన్యుడిగా, స్వామి భక్తుడిగా పేరుపొందాడు. కానీ, కర్ణుడిలోని మంచి లక్షణాలన్నీ దుర్యోధనుడి సహచర్యం వలన మరుగున పడిపోయాయి. దుష్ట సహవాసం చేసి దుష్ట చతుష్టయంలోని వ్యక్తిగా అందరిచేత పరిగణింపబడ్డాడు. దుర్యోధనుని అక్రమకార్యాలలో భాగస్తుడై బలి అయిపోయాడు."
గురువుగారు చేసిన హితోపదేశం శిష్యుడికి సంతోషం కలిగించింది. మన  జీవిత గమ్యాన్ని చేరడానికి,  లక్ష్యాన్ని సాధించడానికి సజ్జన సాంగత్యం, సుహృద్భావ వాతావరణం ఎంతో అవసరమని ఆ శిష్యుడు గ్రహించాడు.

🕉🕉🕉🕉🕉🕉

‘శివాలయ దర్శన విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాత శివలింగం అని అంటారు.

అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, సృష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు, పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే. శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుంది ఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీమనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్శనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వాతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురాణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ, మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"

హర హర మహా దేవ శంభో శంకర !

భగవద్గీతను ఎందుకు పఠించాలి?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. 

లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. 

గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

ఉగ్రరధ శాంతి షష్టి పూర్తి మహోత్సవం

మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు.

షష్టి పూర్తి 60 సం|లు నిండిన తరువాత చేసుకోవలసిన ఉత్సవము. ఒకమనిషి జీవితంలో 60 సం|లు పరిక్రమ పూర్తి అవుతుంది. మృత్యుంజయుడు అయిన రుద్రుడు ఆజీవియందు ఉగ్రుడై ఉంటాడు. రుద్రుణ్ణి శాంతిపచేయు కార్యక్రమము అందుకే దీనిని "ఉగ్రరధ శాంతి" అంటారు. అపుడు నక్షత్ర, గ్రహ, మృత్యుంజయ జప, తర్పణ హోమాదులు, ఆయుష్య సూక్త పారాయణ హోమాదులు, రుద్రాభిషేకం, సూర్యనమస్కారములు, ఇతర దేవతాపారాయణాలు యధావిధిగా శక్త్యానుసారం జరిపించుకొనుట ఉత్తమము.

"ఉగ్రరధ" అనే భయంకర దోషము అరవై నిండగానే మనిషి కి ఆవహిస్తుంది . దానివల్ల భయంకర శోకము ను మానవులు పొందుదురు . అందువల్ల షష్టి పూర్తి కార్యక్రమము లో భాగంగా ' ఉగ్రరధ ' దోషనివారణ కార్యక్రమనూ జరుపుకుంటారు .

షష్టి పూర్తి అనగా అరువది సంవత్సరములు ఆయువు పూర్తి అయిన పిదప మరల అరువది సంవత్సరముల ఆయువును ప్రసాదించమని భగవంతును కోరుచూ చేయు ఉత్సవము. దీనినే షష్టి పూర్తి మహోత్సవం అని అంటారు. ఈ షష్టి పూర్తి మహోత్సవం నే అమృతోత్సవం అని కుడా అందురు. అమృత + ఉత్సవం అమృతము అనగా మోక్షము . ఉత్సవం అనగా ఆనందమును పుట్టించు శుభకార్యము. మోక్షమును, అమితానందమును కలిగించమని ఆ భగవంతుని కోరుకోనుచు చేయు శుభకార్యమే" అమృతోత్సవము ".

ఈ ఉత్సవమును అరువద్ది సంవత్సరములు పూర్తి అయిన తల్లితండ్రులకు వారి సంతానము చేయదగినట్టిదే ఈ మహోత్సవం. ఇందు ఆయుష్కామన యజ్ఞము కూడా జరిపించబడును. అనగా ఆయు: + కామన + యజ్ఞము - ఆయు: అనగా ఆయువు, కామన అనగా కోరి, యజ్ఞమనగా శ్రేష్టమైన, పవిత్రమైన మరియు భగవంతునికి ప్రేతి పాత్రమైన శుభకర్మ. దీనిద్వారా నిండు నూరేళ్ళు ఆయువును ప్రసాదించమని పరమాత్మను కోరుకోనుచు చేయు శ్రేష్టమైన కర్మే " ఆయుష్కామన యజ్ఞ " మందురు. ఈ ఉత్సవమును యజ్ఞము ద్వారా శాస్త్రజ్ఞానము కలిగిన బ్రాహ్మణుల ద్వారా జరిపించుట శ్రేష్టము. ఇది కడు ఉత్తమోత్తమైన సత్కర్మ. ఈ కార్యక్రమము జరుగుచుండగా ఆ తల్లితండ్రులు పొందు ఆనందానుభూతిని వర్ణించలేము. అది స్వయముగా చూడవలయును. మన ప్రత్యక్ష - సాకార దేవతల పూజ అంటే ఇదే. ఇది ఎంతో పుణ్యం చేసుకున్న గుణవంతులైన సంతానమునకు మాత్రమె లభించును. ఇట్టి సేవ, పూజ కొన్ని లక్షలు, కోట్లు గుమ్మరించినా ఈ ఫలము లభించదు. ఈ సంస్కారమునే సాకార - ప్రత్యక్ష దేవతల పూజ అనియు అంటారు.

భీమరధ శాంతి: 70 సం|లు నిండిన తరువాత చేసుకొనే శాంతి.
విజయరధ శాంతి: 78 సం|లు నిండిన తరువాత జరిపించుకొను శాంతి.
సహస్ర చంద్రోదయ దర్శన వ్రతం: 83 సం|లు ప్రారంభంనుండి చేసుకునే శాంతి. వ్రతంలేదా 1000(పౌర్ణమి) చంద్రోదయదర్శనములు పూర్తి అయినతరువాత (లేదా) మునిమనమలు పుట్టినతరవాత చేసుకోవలసిన కార్యక్రమం దీనినే "ప్రపౌత్రజననశాంతి" అనికూడ అంటారు. ఈ వ్రతము యదాశక్తిగా సూర్యచంద్ర అరాధనతోపాటు విశేషమైన కార్యక్రమములు జపదాన హోమాదులు జరిపించుకోనవలెను. వంశంలోని పిల్లలందరూ వీరికి పుష్పాభిషేకం చేయుట అచారంగ కలదు.

మన ధర్మంలో విధినిషేధాలు ఎందుకు ?

ఈ  మధ్య  చాలా మంది  అడిగే  ప్రశ్న: మేమెందుకు గర్భగుడిలోకి వెళ్ళలేము? మేమెందుకు మూల విగ్రహాన్ని ముట్టుకోకూడదు? మేమెందుకు  వేదం  నేర్చుకోకూడదు? పుస్తకాలు కొనుక్కుని మంత్రాలు మేము మాత్రం చదవలేమా?

వీటికి  కొంచెం సహేతుకంగా సమాధానపరుద్దాం.ఒక  కధ చెప్పుకుందాం.
ఒక రీసెర్చ్ లాబరేటరీ వుంది. దానిలో కొన్ని అణుధార్మిక పదార్ధాలు ఉంచబడ్డాయి. ఆ ల్యాబ్ లోకి వెళ్ళడానికి  కొందరికే అనుమతి వుంది. దానిలోకి  వెళ్ళాలంటే ప్రత్యేక ట్రైనింగ్, తీసుకోవలసిన జాగ్రత్తల మీద కొంత orientation అన్నీ వున్నాయి. దానిలోకి  వెళ్ళడానికి కొంతమందినే ఎంచి  వారికి మాత్రమె లోనకు వెళ్ళే అనుమతిని ఇచ్చారు ఆ పరిశోధనా గృహం వారు. ఇంతలో కంచర గాడిదయ్య అనే ఒకడు, అసంతృప్తి దేశదిమ్మరమ్మ అనే  మరో మహిళా శిరోమణి ఆ  సంస్థ మీద కసితో దీన్ని కొన్ని వర్గాల వారి కుట్ర అని గొడవ చేసి, గగ్గోలు పెట్టి వారు పని చెయ్యని సోమరులు వారిని మాత్రమె ప్రత్యేకంగా అనుమతిస్తున్నారని నానా యాగీ చేసి ఆ సంస్థను అప్రతిష్టపాలు చేసేవారు. చివరికి ఒకరోజు ఆ సంస్థ వారికి వెళ్ళండి, కానీ సరైన ట్రైనింగ్ తీసుకోండని చెప్పారు. అబ్బ చ్చా మాకన్నీ  తెలుసులే అని వెళ్లి ఆ గదిని పరిశీలించి అక్కడ  వాళ్ళకేమి అర్ధం కాక ఆ పదార్ధాలను అటు ఇటు చూసి పట్టుకుని, మొహం మీద పెట్టుకుని సేల్ఫీలు దిగి కొన్ని టీవీ చానెళ్ళలో తాము చేసిన గొప్ప పనిని అందరికీ తెలిసేలా చేసి ఇన్నాళ్ళు తమను ఎలా అణగదోక్కారో కధలు అల్లి మరీ వివరించారు.కొన్నేళ్ళు బాగానే గడిచాయి. ఆ అణుధార్మిక వస్తువులకు తమవాడు, పగవాడు అని ఏమి తేడా వుండదు. ఇద్దరికీ శుబ్బరంగా కొన్ని అంతు తెలియని వ్యాధులు సంక్రమించాయి. కాన్సర్ అని, మరొకటి అని, ఎన్నో ఆ వస్తువుల దీర్ఘకాలిక రోగాలోచ్చి చివరికి దేహత్యాగం చేసారు.

మేరీ క్యూరీ అణుధార్మికత మీద పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో విషయాలు కనుక్కుంది. దాని వల్ల శరీరం మీద ఎటువంటి ప్రభావం వుంటుందో వివరంగా చెప్పింది. ఎలా కాపాడుకోగలమో చెప్పింది. కానీ ఆవిడ మాత్రం వాటి మీద పూర్తి అవగాహన సాధించే క్రమంలో ఎంతో దగ్గరగా ఆ  రేడియం తో పని చేసింది. దానివల్ల శరీర రుగ్మత కలిగి, కాన్సర్ తో మరణించింది. కానీ ఆవిడ తెలిపిన విధానంతో ఎందరో శాస్త్రజ్ఞులు కాపాడబడ్డారు. ఆవిడ భర్త కూడా అటువంటి రోగానికే ప్రాణం వదిలారు. కానీ వీరి పరిశోధనల వలన ఎన్నో విషయాలు, జాగ్రత్తలు తెలుసుకున్నారు. అటువంటి అన్ని విషయాలు గ్రంధస్థం చేసారు. దాన్ని వారు భావితరాలకు అందించారు. ఆ చెప్పిన విషయాల వలన ఎంతో జాగ్రత్తగా మరింత పరిశోధనలు చేసి యురేనియం, ప్లుటోనియం ఇలా ఎన్నో పదార్ధాలను కనుక్కుని, వాటి ద్వారా అమోఘమైన శక్తిని ఉత్పత్తి చేసారు మన శాస్త్రజ్ఞులు. కానీ దీనికి ఆది మాత్రం క్యూరీ దంపతుల విశేష పరిశోధన, కృషి. వారు ఈ విషయంలో వారు నేటికాలం మహర్షులు.

మన సనాతన ధర్మం గురించి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలిసిన విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే. తమ శరీర సౌఖ్యాలను వదులుకుని తాము ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేసి, తపించి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో విషయాలు తాము శిష్యులకు తరతరాలుగా బోధించారు. గ్రంధస్థం చేసారు. అవే మనకు పురాణఇతిహాసాలు, ధర్మ శాస్త్రాలు, ఆగమాలు ఇలా ఎన్నో రకంగా ఎన్నో విషయాలను జాగ్రత్తగా అందించబడ్డాయి. వాటిలో ఏ క్రతువులు ఎలా చెయ్యాలో, ఏ విగ్రహ ప్రతిష్ట ఎలా జరగాలో, ఒకడు దేవాలయంలో ఎలా మసలుకుంటే వాడికి మంచిది, ఏది చెయ్యకూడదు లాంటి  ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాటిని చదవాలన్నా ముందు వారికి కొంత వేదజ్ఞానం వుండాలని నియమం పెట్టారు. ఇదేదో అందరికీ అందించవలసిన విషయాలు కావు, కేవలం ఎవరికైతే అధికారం వుందో వారు మాత్రమె ఈ గర్భగృహ ప్రవేశం చెయ్యాలి అన్న నియమాలను చెప్పారు. అలాగే సామాన్య జనం ఎలా ఉండాలో,వారి పరిధి ఎంతవరకో నిర్ణయించారు. మంత్రశక్తితో అక్కడ దైవీ శక్తిని ఎలా అక్కడకు ఆహ్వానించవచ్చో శాస్త్రం తెలిసిన వారికి తెలుస్తుంది. ఒక గురువు దగ్గర ఎలా మసలుకోవాలో, ఒక దైవం దగ్గర ఎలా మసలుకోవాలో చెబుతుంది శాస్త్రం. తద్విరుద్ధంగా చేస్తే  వారు తత్వ్యతిరిక్తమైన ఫలితాలు చవి చూస్తారు. ఒక శాస్త్రజ్ఞుడు చేసే పరిశోధన తెలియని వాడికి ఎలా పిచ్చిగా  వుంటుందో, మన క్రతువుల గురించి తెలియని వారికి అలాగే అర్ధం కాదు. అవన్నీ జాత్యహంకారంతో ఇలా వాళ్లకు వాళ్ళే  రాసేసుకున్నారని నేడు కొందరు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు. నేడు ఆ గర్భగుడిలోకి వెళ్లామని గొప్పగా చెప్పుకుంటున్నారు. దీని పర్యవసానాలు నేడు తెలియవు. కొన్ని రోజులు ఓపిక పడితే వారి ప్రాభవం మనం చూడకపోము.

ఒక  దైవప్రాసాదంలో మడి వుంటుంది, ఆచారం వుంటుంది. అక్కడ ప్రతిష్టితమైన శక్తి కి అనుసరణీయమైన ఒక పద్ధతి వుంటుంది. అవన్నే పాటిస్తేనే అక్కడకు వెళ్ళిన ఫలితం దక్కుతుంది. ఒక యూనివర్సిటీ కి ఎందుకు ఒక  స్కూల్ కు  వెళ్ళాలంటే ఒక యూనిఫారం వేసుకుని వెళ్తాం. ఒక ముఖ్యమైన మీటింగ్ కు  వెళ్ళాలంటే ఎంతో జాగ్రత్తగా తయారవుతాము. అంత భక్తి నమ్మకం వున్నవాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక రకం దుస్తులు ధరించాలంటే బాధ ఎందుకు?

ఎలాగైతే ఒక యంత్రాన్ని నడపగల టెక్నీషియన్ కు  మాత్రమె ఆ యంత్ర గదిలోకి  అనుమతి వుంటుందో, ఒక ఆపరేషన్ థియేటర్ లో ఎలా వైద్యం, శాస్త్ర చికిత్స తెలిసిన వైద్యులకు మాత్రమె ప్రవేశం వుంటుందో, యంత్ర తంత్ర మంత్రం ప్రతిష్టితమైన ఒక దేవాలయ గర్భగుడికి కూడా కొందరికే అనుమతి వుంటుంది. అది ఏ వర్ణం వారైనా సరే. బ్రాహ్మణుడు కదా అని అందరు బ్రాహ్మణులకు గర్భ గుడిలో ప్రవేశం వుండదు. ఇది తెలియని కొందరు కేవలం ఇది బ్రాహ్మణ కుట్ర అని అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారు.
తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినది అన్నట్టు ఒక అర్ధం కాని మూర్ఖుడు మరింత మందిని మూర్ఖత్వంలోకి నేట్టేస్తున్నాడు. తద్వారా దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళకు ఎప్పటికైనా బుద్ధి రావాలని ప్రార్ధిద్దాం.

వారికి కొంతైనా జ్ఞానం ప్రసాదించమని కోరుకుందాం

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...