Wednesday, August 22, 2018

గాయత్రి ముద్రలు

ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః

ఓం భూర్బువ స్సువః 5
తత్స వితుర్వ రేణ్యం 7
భర్గో దేవస్య ధీమహి 8
ధియో యోనః (ప్రచోదయాత్) 4
24
గాయత్రి ముద్రలను గురు ముఖంగా సాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.ముద్రా విజ్ఞానాన్ని తత్త్వయోగం అంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయని రుజువైంది. మన ప్రాచీనులు ఈ విశ్వంలో 24 నిర్ధారణ మూలకాలు ఉన్నాయని విశ్వసించారని, గాయత్రి మంత్రంలో 24 పదాలు ఉండడం, 24 మంది జైన తీర్ధాంకరులు, సనాతన ధర్మంలో 24 అవతారా లు ఉండడం యాధృచ్ఛికం కాదని పలువురు అంటుంటారు.

మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. బొటని వేలు అగ్నికి, చూ పుడు వేలు వాయువుకు, మధ్యవేలు ఆకా శం, ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని మందులు, ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు. గాయత్రి మంత్రం కూడా ముద్రలు ఎంత విలువైనవో తెలియజేస్తుంది.

ఏత ముద్రన జానాతి గాయత్రి నష్ఫల భవత్‌ (ముద్రల గురించి తెలియనివారు గాయత్రీ మంత్ర ఫలాన్ని పొందలేరు).

గాయత్రి మంత్రం 24 ముద్రలను చెప్తుండగా, యోగాలోని అనేక రూపాలలో పలు ముద్రలను వివరిస్తుంది. కాగా, ఆధునిక వ్యాధులను నియంత్రించడం లో తోడ్పడే విధంగా అనేక ముద్రలకు కూడా రూపకల్పన చేయడం జరుగుతోంది. మన సంప్రదాయం లోనే అనేక ఆరోగ్య సూత్రాలు ఇమిడున్నాయి.

కాళ్ళు ఊపుతూ కూచున్నప్పుడో, వేళ్ళు ఊరుకే విరుచుకుంటుంటేనో ఇంట్లో పెద్దలు అరు స్తుంటారు. అలా చేయవద్దనడానికి కారణం ఆ చ ర్యల వల్ల ప్రాణశక్తి వృధా అవుతుందనే. అనవసరంగా ప్రాణశక్తి వృధా అవడమనేది మెద డుకు నష్టం జరుగుతుంది. ముద్రా విజ్ఞానం వ్యక్తికి ఉపశమనం కలిగించేందుకు ఈ శక్తిని తట్టి లేపుతుం దంటారు దీనిని సాధన చేసే వారు. మానవ సంక్షేమానికి యోగా ఇచ్చిన అద్భుతమైన బహుమతులలో ఈ ముద్రా విజ్ఞానమొకటని కూడా భావిస్తా రు. ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు. అయితే ఈ సాధన చేసే సమయంలో పద్మాసనం వేసుకోవడం మంచిది. అలాగే నడిచేటప్పుడు కూడా ముద్రలను సాధన చేయవచ్చు.

ముద్రలు అధిక శక్తిని పుట్టించవు, ప్రాణ శక్తిని సమతులం చేస్తాయి అంతే. ఆరోగ్యాన్ని, మేధస్సును పెంచడమే కాదు సిద్ధులు సాధించడం కోసం, మన చుట్టూ ఉండే ఆరాను ఆరోగ్యవంతం చేయడం, కుండలినినిలోని ప్రాణ కుండలిని, చిత్‌ కుండలిని, పరా కుండలినిని ఉత్తేజితం చేసి మరింత క్రియాశీలకమయ్యేందుకు దోహదం చేస్తాయి. ముద్రలను సాధన చేసేటప్పుడు చేతుల సున్ని తత్వాన్ని పెంచుకునేందుకు, వేళ్ళ చక్రాలను క్రియాశీలకం చేసేం దుకు మన చేతివేళ్ళ పై, అరచేతిపై దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి.

ఈ వ్యా యామం చేతిలో ఉండే చక్రాలను పెద్దవి చేసే శక్తి అవసరమైనట్టుగా ఇరువైపులా ప్రవహించేలా చేస్తుంది. ఈ వ్యాయామం చేసేందుకు ముందుగా, ప్రతి వేలి చివరి మీద కనీసం ఒక నిమిషం పాటు దృష్టి కేంద్రీకరించాలి. వేలి చివర్లలో రక్తం ప్రవహించడం, స్పందనలు అనుభవంలోకి రావాలి. ముందుగా ఒక చేతితో ప్రారంభించి, తరువాత మరో చేతి వేళ్ళ మీద దృష్టి కేంద్రీకరించాలి. తరువాత దృష్టిని మూడు నిమిషాలపాటు అరచేతిపై కేంద్రీకరించాలి. అరచేతిలో పువ్వు వికసిస్తున్న అనుభూతిని పొందాలి. ఈ సాధనను కనీసం 40 రోజుల పాటు సాధన చేస్తే, మన చేతులలో ఉండే చక్రాలు శాశ్వతంగా పెద్దవై, మరింత సున్నితత్వం వస్తుంది. ఈ సమయంలో ముద్రలను సాధన చేయడం మంచిది.

ముద్రల సాధనను ప్రారంభించే ముందు వ్యక్తి మనస్సును, శరీరం కొంతమేరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ముద్రలను కొన్ని బీజ మంత్రాలను ఉచ్ఛరిస్తూ కూడా సాధన చేయవచ్చు. ఈ మంత్రాలు చక్రాలను ఉత్తేజి తం చేయడమే కాక సూక్ష్మ వాహకాలను విస్తరింపచేస్తాయి. అంటే మానసిక, భౌతిక ప్రబావాన్ని చూపిస్తాయి. బీజ మంత్రాన్ని ఉచ్ఛరించేటప్పుడు బలం గా ఉచ్ఛరించాలి. అప్పుడే ఆ మంత్ర బలం మనలోని వివిధ మానసిక కేంద్రాలకు అనుభవంలోకి వస్తుంది. మంత్రాన్ని బలంగా ఉచ్ఛరించడం అంటే బిగ్గరగా చదవడమని కాదు అందులోని అక్షరాలను ఉచ్ఛరించవలసినట్టుగా ఉచ్ఛరించడం. అందుకే బీజ మంత్రాలను ఎప్పుడూ గురు ముఖంగా పొందాలంటారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...