Wednesday, April 10, 2019

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీరాముని ఎన్నో రకాలుగా స్తుతిస్తాము. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం కలదు. ఈ రామ రక్షా స్తోత్రాన్ని బుధ కౌశిక ముని రచించారు. ఈ స్తోత్రంలో 38 శ్లోకాలు ఉన్నాయి. శ్రీరాముని మనసారా భక్తి యుక్తులతో ధ్యానించి పూజించేవారు, తమకు రక్షణ నివ్వమని కోరుకునే ఈ స్తోత్రం మనస్ఫూర్తిగా నమ్మి పఠించినవారు, ఆ శ్రీరాముని కృపకు పాత్రులవుతారు.

రామరక్షా స్తోత్ర జపం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి పాపాలు నశించడమే గాక, శరణాగతి వేడుకొన్న వారికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా వెన్నంటి ఉంటుంది. ఈ స్తోత్రం చేసిన వారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషము కలుగుననుటలో ఏమాత్రము సందేహము లేదు.

మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షా స్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో, వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేయాలి.

నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు ఇలా ఒకటేమిటి జీవితంలో ఇబ్బంది పడే ఎటువంటి సమస్యనుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి, రాముని శరణు వేడితే తప్పక బయట పడి జీవితము సాఫల్యత వెంపు నడుచుటకు తగు మార్గము కనపడుతుంది.

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య | బుధకౌశిక ఋషిః | శ్రీసీతారామచంద్రో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా శక్తిః | శ్రీమద్ హనుమాన కీలకమ్ | శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||

ధ్యానమ్-
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |
వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ ||

స్తోత్రం-
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || ౧ ||

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితమ్ || ౨ ||

సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ |
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ || ౩ ||

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || ౪ ||

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || ౫ ||

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || ౬ ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || ౭ ||

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ || ౮ ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః || ౯ ||

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || ౧౦ ||

పాతాళభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || ౧౧ ||

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ |
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి || ౧౨ ||

జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః || ౧౩ ||

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ || ౧౪ ||

ఆదిష్టవాన్యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః |
తథా లిఖితవాన్ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః || ౧౫ ||

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ |
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః || ౧౬ ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ || ౧౭ ||

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౮ ||

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || ౧౯ ||

ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ || ౨౦ ||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః || ౨౧ ||

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః || ౨౨ ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః || ౨౩ ||

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః |
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || ౨౪ ||

రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ |
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః || ౨౫ ||

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ |
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ |
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ || ౨౬ ||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || ౨౭ ||

శ్రీరామ రామ రఘునందన రామ రామ |
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || ౨౮ ||

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || ౨౯ ||

మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళుః |
నాన్యం జానే నైవ జానే న జానే || ౩౦ ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || ౩౧ ||

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || ౩౨ ||

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే || ౩౩ ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ || ౩౪ ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || ౩౫ ||

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ || ౩౬ ||

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్ |
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర || ౩౭ ||

శ్రీ రామ రామేతి రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || ౩౮ ||

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"

ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునందు మొదటిసర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి.

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

Wednesday, April 3, 2019

మన పంచాంగం ప్రాముఖ్యత

పండగలొస్తాయి వెళ్లిపోతాయి సాదాసీదా కేలండర్ లో. తేదీల పేజీని కొందరూ, నెలల పేజీలను ఇంకొందరూ చింపి అవతల పడేస్తారు కదా! అలాగే పంచాంగాలు మార్చి, కొత్త పంచాంగం తెస్తాం! ఇవేవీ ఈ కాలం పిల్లలకి చెప్పడానికి చాలామందికి తెలియదు. తెలుగు కేలండర్ ని పంచాంగం అంటారు. తిథి,వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు(విషయాలు) పంచాంగంలో ఉంటాయి.

మనకి తెలసిన కేలండర్ కీ, పంచాంగానికీ దోమకీ, ఏనుగుకీ ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అవి డేట్స్ మాత్రమే చెప్పి చిరిగిపోతాయి. పంచాంగం అలా కాదు. సూర్య చంద్రాది గ్రహ గతులు అపార వైదిక గణిత శాస్త్రంతో విడమర్చి చెప్తాయి. పున్నమి చంద్రుడు ఎప్పుడొస్తాడు? ఆ చంద్రుడ్ని రాహువో, కేతువో ఎప్పుడు మింగేద్దామని చూస్తాడు? (అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్నమాట). ఇలాంటి మహత్తరమైన కాలపు లెక్కలు మన పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ మనం ఈ రోజు చూస్తున్న కేలండర్ కి చాలాచాలా వేల సంవత్సరాలకి ముందే మన భారతీయులు సాధించిన ఖగోళ గణిత విజ్ఞానం. అదే పంచాంగంగా రూపొందించే జ్ఞానం అన్నమాట.

సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు అనేవే కాకుండా మిగిలిన గ్రహాలూ మన జీవితంలో  ఎంతో ప్రభావం చూపిస్తాయి. అవును కదా! సూర్యుడొస్తే పగలు, వెళ్లిపోతే రాత్రి. అలా ఏదో రూపంలో చీకటి వెలుగులనిచ్చే శక్తి మిగిలిన గ్రహాలకి ఎందుకుండదు? ఏదైనా మంచి జరిగితే మనం…  ‘టైమ్ బావుందనీ’, ‘లక్కీ’ అని, ‘కలిసి వచ్చిందనీ’ అంటాం కదా! అలాగే టైమ్ బాగోకపోవడం, బ్యాడ్ లక్ ల గురించి కూడా అనుకుంటూ ఉంటాం కదా! ఉదాహరణకు కష్టపడి పరీక్షలకి చదివి మనం అనుకున్న ప్రశ్నలు రాకపోతే, మనకి గుర్తున్న జవాబులు తట్టకపోతే పరీక్ష గోవిందా! అయితే ఇందుక్కారణం  ఉంది- అని  పంచాంగం రాసిన పెద్దలు చెబుతుంటారు.

మనం పుట్టిన వేళని బట్టి, అప్పుడున్న గ్రహగతుల్ని బట్టి ఎప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడు బాధలోస్తాయో లెక్కలు గట్టి…. దానికి రెమెడీలు చెబుతారు. అంటే, చీకటి పడుతుంటే మనం అలా చీకట్లో బాధపడకుండా కొవ్వొత్తో, లాంతరో, లైటో వాడతాం! అంటే సూర్యగ్రహానికి రెమెడీని మనం వాడుతున్నామన్నమాట. అలా అన్ని గ్రహాలకీ రెమెడీను మన పెద్దవాళ్లు కనిపెట్టారు. ఫలానా పూజలు చెయ్యి, ఫలానా జపాలు చెయ్యి, ఫలానా దానాలు చెయ్యి-అని కొవ్వొత్తులూ, లాంతర్లూ వాడడం లాగా –పరిహారాలను చెప్పే పుస్తకమే పంచాంగం.

మనకీ నెల్లో బాగుందనీ, మనకీ నెల్లో నష్టం జరగవచ్చుననీ కేలండర్లు చెప్పలేవు. కానీ పంచాంగం ఆ బాధ్యత తీసుకుని, (చలేస్తుంది! స్వెట్టర్ వేసుకెళ్లు! బండి మీద వెళ్తున్నావు కదా! హెల్మెట్ పెట్టుకుని వెళ్లు! అని అమ్మ హెచ్చరించినట్టుగానే) మనకి కాషన్స్, రెమెడీస్ చెబుతుంది. అలాంటి మంచి మాటలూ, మంచి రోజులూ చెబుతుంది. గనుకనే పంచాంగాన్ని ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం ప్రేమించి, గౌరవిస్తున్నాం.

భవిష్యత్తును సైతం అంచనా వేయగల మేధావులు మన పంచాంగకర్తలు .
ప్రపంచంలో ఏజాతికి లేని ఖగోళ పరిజ్ఞానం....అతి ప్రాచీన కాలంలోనే మన హైందవజాతికి ఉంది. శాస్ర్తీయమైన యతార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా, పాశ్చాత్య సాంప్రదాయాలపై నేడు మన హిందూ యువత మోజు చూపుతోంది. పరమ ఆరోగ్యదాయకమైన మన హిందూ సంవత్సరాదిని ఓ ప్రక్కకు నెడూతూ...విష్ యూ హేపీ న్యూ ఇయర్ అంటూ పరుగులు తీస్తోంది.

హేపీ న్యూఇయర్ అనే మాట వినగానే ఇవాళ చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఫస్ట్..! జనవరి ఫస్ట్ సంవత్సరారంభం అయితే....మరి ఉగాది నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం మాటేమిటి...?  ఉగాది అంటే కేవలం వేపపువ్వు పచ్చడి తినే పండుగేనా...? ఇంతకీ ఏది కొత్త సంవత్సరం. జనవరి ఫస్టా...లేకా ఉగాదా...! ఏది శాస్త్రీయమైన సంవత్సరాంభం...? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది ఎప్పుడు?  విజ్ఞులు అనుసరించిన, అనుసరించవలసిన అసలు కాలమానం ఏది? ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ కాలమానంలో లోపాలు ఉన్నాయా? అసలు నిజం ఏమిటీ?

ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి "ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోళ శాస్ర్త రీత్యా ఏర్పాటు చేసుకున్న ఏకైక జాతి హిందూ జాతి. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం. పుష్కరం, శకం, యుగం కల్పకం మొదలైన అన్నింటినీ ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ శాస్ర్త ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.

వేషభాషలు, ప్రవర్తన, ఆహార విహారాలూ అన్నింటిలోనూ విదేశీ అనుకరణనే ఇష్టపడుతున్నారు మనవాళ్లు. అయితే అదే సమయంలో మన ప్రాచీన హైందవ సంస్కృతీ సాంప్రదాయాలకు విదేశాల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందనే మాటను మనవాళ్లు మరచిపోతున్నారు. పండుగలను అనుసరించే పద్దతులలో కూడా విదేశీ అలవాట్లకు బానిసలౌతున్నారు. మన పండుగల నిర్వాహణా విధనాల్లో ఉన్న విజ్ఞాన అంశాల్ని గ్రహించలేక మూర్ఖపు ధోరణులకు, అసభ్య నడవడికలకు బలి అవుతున్నారు.

విశ్వం....లోని అంశాలైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మొదలైన వాటి స్థితి గతుల్ని వివరించే శాస్ర్తమే ఖగోళశాస్ర్తం. శాస్ర్తాలన్నింటిలో ప్రముఖమైన శాస్ర్తంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్ర్త పరిజ్ఞానం అత్యంత ముఖ్యం. భూమి వాతావరణానికి అవతల వ్యాపించి ఉన్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహతారకాదులతో కూడి ఉన్న ఈ అంతరిక్ష పరిధినే ఖగోళం అని వ్యవహరిస్తారు. భూమి ఒక ఆత్మ ప్రదక్షిణం చేస్తే 1 రోజు అనీ, చంద్రుడు ఒక భూ ప్రదక్షిణ చేస్తే 1 నెల అని, భూమి ఒక సూర్య ప్రదక్షిణం చేస్తే 1 సంవత్సరం అనీ...ఇలా కాలమానాన్ని ఖగోళ విషయ ఆధారంగానే ఉండి తీరాలనేది ఈ నియమాల సారం.

సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికీ సంవత్సర ఆరంభానికి ఖచ్చితంగా ఒక ఖగోళ ప్రత్యేకత అంటూ ఉండి తీరాలి. ఏ ఖగోళ పత్ర్యేకతా , ఆధారమూ లేకుండా ఎవరికో తోచిన జనవరి ఫస్ట్ ను సంవత్సరారంభంగా అంగీకరించి అనుసరించడం సరికాదు. యదార్థ సంవత్సరారంభం ఉగాదిని మరిచి, పాశ్చాత్య పోకడల వెర్రి వ్యామోహంలో పడి జనవరి ఫస్ట్ కు దాసోహమంటున్నాం.

క్రీస్తు శకం అంటూ కాలమానాన్ని లెక్కించడం చూసి హిందువులు చాలా మంది అపోహలకు లోనౌతున్నారు. మరి హిందువుల చరిత్ర అత్యంత ప్రాచీనమైనదైతే... క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తూ కాలాన్ని లెక్కిచండం ఎందుకొచ్చిందనేది అనేకమందికి సందేహం...! ప్రపంచమంతా కూడా ఈ క్రీస్తు శకాన్నే వాడడంలో ఏమైనా ప్రముఖ విశేషం ఉందా..? ఈ క్రీస్తు శకాన్ని విదేశీయులతోపాటు, మన దేశంలోని  నాస్తికవాదులు సైతం చాలా గొప్పగా భావిస్తుంటారు...! ఇంతకీ ఈ క్రీస్తుశకం అనేది ఎందుకొచ్చింది. ? ఈ శకం వెనుక దాగివున్న యధార్ధం ఏమిటీ?

చరిత్రలో ఎప్పుడు ఏ సంఘటన జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి సంవత్సరాలను వరుసగా లెక్కించుకుంటూ రావడం అవసరమైంది. అయితే ఈ లెక్కకు ఎక్కడ నుంచి మొదలైందని చెప్పడం కష్టమే. పురాణ పురుషుల కాలం నుంచో.. మహా ప్రతిభావంతులైన చక్రవర్తుల కాలం నుంచో, ప్రవక్తల కాలం నుంచో... ఏదైనా గొప్ప సంఘటన జరిగిన నాటి నుంచో- సంవత్సరాలను  లెక్క పెట్టడం చరిత్రలో ఒక రివాజు. దీనినే శకం లెక్కింపు అంటారు.

ఒక్కొక్క జాతి ఒక్కొక్క కాలంలో తమ శకాలను ప్రారంభించుకుంది. మన హిందూజాతికి అతి పురాతన కాలం నుంచీ అనేక శకాలున్నాయి. కలిశకం, విక్రమశకం, శాలివాహన శకం మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం కలిశకం లెక్క ఆచరణలో ఉంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో  అలవాటు చేయబడిన క్రీస్తు శకం కాలమానాన్ని ప్రపంచరీతి కోసం నేటికీ మనం అనుసరిస్తున్నాం. నేడు ప్రపంచంలో క్రైస్తవాన్ని ఆదరించే దేశాల ప్రాబల్యంతో ఏసు క్రీస్తు శకాన్ని ఉమ్మడి శకంగా తీసుకోవాల్సివచ్చింది. అంతేగానీ ఈ శకాల కంటే క్రీస్తు శకానికి ఏదో ప్రత్యేకత ఉందని మాత్రం కాదు.

వివిధ దేశాల ప్రజలు వివిధ కాలమానాలతో జీవనాలు సాగించేవారు. ఎవరి లెక్కలు వారికుండేవి. తమకు తెలియని విషయాన్ని, మరో జాతి నుంచి నేర్చుకునేవారు. అయితే కాలం గడిచేకొలదీ...ప్రపంచమంతా ఒకే కాలమాన పద్ధతిని అనుసరిస్తే బావుంటుందనే భావన మొదలయ్యింది. అయితే ఎవరి కాలమానాన్ని...ఈ ప్రపంచ కాలమానంగా తీసుకోవాలనే సమస్య వచ్చింది. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో అనేక ప్రాంతాలు బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్నాయి. దీంతో బ్రిటీష్ వారు తాము స్వీకరించిన క్రీస్తు శకం అనే కాలమానాన్ని బలాతిశయంతో ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చారు. తమ ఆధీనంలోని అన్ని దేశాలలో ఈ శకాన్ని అమలుపర్చడం మొదలు పెట్టారు. ఈ విధంగా ప్రపంచలోని అనేక దేశాల్లో క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఆ తర్వాత మిగిలిన దేశాలు తమ సౌలభ్యం కోసం క్రీస్తు శక కాలమానాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది.

అయితే క్రీస్తు శకంలో ఓ తిరకాసు ఉంది. ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడనే విషయాన్ని చరిత్రకారులెవరు కూడా ఒక నిర్థారణగా ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. క్రీస్తు జీవితానికి సంబంధించిన ఏ చారిత్రక ఆధారమూ కన్పించడం లేదని విదేశీ చరిత్రకారులు తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు హెచ్. జివెల్స్ తన ప్రపంచ చరిత్ర గ్రంథంలో క్రీస్తు జీవితానికి సంబంధించిన ఆధారాలు లభించడం లేదని తెలిపారు. బైబిల్ కూడా క్రీస్తు అనంతరం రాయబడింది.

చాలా మంది క్రీస్తు పుట్టుక నుంచే క్రీస్తు శకం మొదలైందని అనేకమంది భావిస్తారు. ఏసు క్రీస్తు జీవించాడానికి చెప్పబడుతున్న కాలానికి కొన్ని శతాబ్దాల తర్వాత క్రీ.శ. 532వ సంవత్సరంలో డయోనీషియన్ ఎక్సీగస్ అనే రోమన్ సన్యాసి, క్రీస్తు పేరుతో ఒక శకాన్ని ప్రారంభించాలంటూ ప్రచారం మొదలు పెట్టాడట..! క్రీస్తు పుట్టిన సంవత్సరం క్రీ.శ.1అని ఆయన ప్రతిపాదించాడు. అయితే చాలా కాలం వరకూ ఈ క్రీస్తు శకం అనే అంశాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్రీ.శ.816లో చల్సా బిషప్ ల మహాసభ క్రీస్తు శకాన్ని వాడకంలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చింది. అయినా కూడా చాలా సంవత్సరాలు ఎవరూ పట్టించుకోలేదు.  క్రీ.శ.879 లో జర్మనీ చక్రవర్తి 2వ ఛార్లెస్ మొట్టమొదటగా క్రీస్తు శకాన్ని అమలులో పెట్టాడట. అనంతర కాలక్రమంలో ఇతర చోట్ల మెల్లమెల్లగా క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఇది క్రీస్తు శకం అసలు చరిత్ర.! అంటే క్రీస్తు జీవితానంతరం సుమారుగా 800 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం అమలులోకి వచ్చిందన్నమాట. అయితే క్రీస్తు పుట్టింది. క్రీ.శ.1 లో కాదనీ , క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అయి ఉండవచ్చుననీ సుప్రసిద్ధ చరిత్రకారుడు సర్ జాన్ కెప్లర్ తేట్చాడని కొంతమంది చెబుతారు. అయినా కూడా క్రీస్తు శకం లెక్కను మాత్రం ఎవరూ మార్చలేదు. అలాగే వదిలేశారు. ఇది అలాగానే కొనసాగుతోంది.

అమెరికాకు చెందిన చరిత్రకారుడు విల్ డ్యూరాంట్...క్రీస్తు గత చరిత్రపై పరిశోధన చేశాడు. డిసెంబర్ 25న క్రిస్ మస్ పండుగపై కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. క్రీ.స్తు పుట్టిన సంవత్సరాన్ని చరిత్రకారులు బయటపెట్టలేకపోయాడు. ఆయన పుట్టిన నెల, తేదీలను నిర్ణయించగల అవకాశాలు చరిత్రలో ఎక్కడ కనిపించలేదని...దీంతో ఆ కాలాన రోమ్ నగరంలో ప్రతియేటా డిసెంబర్ 25వ తేదీన శాటర్నేలియా అనే పండుగ వేలాది మందితో తిరునాళ్ల వలే జరుపుకునేవారు. ఇది క్రైస్తవ మత ప్రచారానికి అనుకులంగా ఉంటుందని భావించిన ఎక్సీగస్ ఇదే రోజును క్రీస్తు జన్మదినంగా ప్రచారం చేసేవాడట..! కాలక్రమేణ ఆ ప్రచారం ముదిరి క్రీ.శ.1020 నాటికి డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా అనేక చోట్ల స్థిరపడిందట..!

ఒక ఆధారమంటూ లేకుండా కొనసాగుతున్న ఆచారం...క్రీస్తు శకం వాడకం.! వసంత రువుతులో సంత్సరాదిని ఏర్పాటు చేసుకోవడం ఖగోళపరంగా ఖచ్చితమైన పద్ధతి. కాలమానంలో సుక్ష్మఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు...మొదలైనవి ఏర్పరచిన అతి ప్రాచీన కాలమానం మనది. ఇవన్నీ కూడా ఖగోళ ఆధారంగానే ఏర్పరచడం జరిగింది. విదేశీ కాల్యెండర్ లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ తేదీల్ని అంకెల్లో లెక్కించుకోవడం తప్ప... ఏ తేదీన ఖగోళ పరిస్థితి ఎలా ఉన్నది తెలిపే విధానం ఏదీ లేదు. కానీ అదే మన హిందూ...పంచాంగంలో ఖగోళ పరిస్థితి తెలిపే విధానం ఉంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...