Friday, December 13, 2013

మన తోటి ప్రాణుల నుండి గ్రహించవలసినది

మన తోటి ప్రాణుల నుండి గ్రహించవలసినది 

ఉమామహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 1 ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 2 ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 3 ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 4 ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 5 ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 6 ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 7 ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 8 ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 9 ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 10 ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 11 ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 12 ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || 13 ||

శివపురాణాంతర్గగ అంధకకృత శివాష్టోత్తర శతనామస్తోత్రమ్

మహాదేవం విరూపాక్షం చంద్రార్థకృత శేఖరమ్!
అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్!!
వృషభాక్షం మాహాజ్ఞేయం పురుషం సర్వకామదమ్!
కామారిం కామదహనం కామరూపం కపర్దినమ్!!
విరూపం గిరీశం భీమం స్రగ్విణం రక్త వాసనం!
యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్!!
గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్!
అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్యదాయకమ్!!
వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటుమ్!
మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్!!
త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్!
కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాసనమ్!!
గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్!
దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితమ్!!
అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్!
భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితమ్!!
భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగమ్!
క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్!!
చండం తుంగం గరుత్మంతం నిత్య మాసవ భోజనమ్!
లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరమ్!!
మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినమ్!
రాగం విరాగం రాగాంధం వీతరాగ శతార్చితమ్!!
సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజమ్!
సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్!!
అర్థనారీశ్వరం భానుం భాను కోటీశతప్రభమ్!
యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివమ్!!
అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః!
శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్త్మాన్మహాభయాత్!!

"మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే"


"మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ,
స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే" అని ఆదిశంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథంలో అన్నారు. అద్వైత ప్రకరణ గ్రంథమైన వివేక చూడామణికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశంకర భగవత్పాదులు వేదాంత సారమైన ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసి వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రకరణ గ్రంథాల్ని కూడా వ్రాశారు. జ్ఞానమార్గం ద్వారా మోక్షం పొందవచ్చన్నది ఆయన కనుగొన్న సత్యం. సాధన, సంపత్తి కావాలి. వివేక, వైరాగ్యాలు కావాలి. ఇహపర సుఖాలు కోరకుండా ఉండాలి, మనస్సునూ, ఇంద్రియాలనూ నియంత్రించాలి. ఇంద్రియ వస్తువులు మనముందు ఉన్నప్పటికీ వాటిని వద్దనుకుని తన హృదయంలో ఉన్న ఆత్మపై ధ్యానం చేయాలి. తీవ్రమైన ముముక్షుత్వం కావాలి. అంటే ముక్తిని తప్ప మరేదీ కోరకూడదు. సాధకునికి అఖండ ఆనందం తద్వారా లభిస్తుందని వారిబోధ.
శ్రీ శంకర భగవత్పాదులు అపర శంకరులు. ఎన్నోభక్తి స్తోత్రాల్నీ వారు రచించారు. వివేక చూడామణిలో మొదటి శ్లోకాలు చదివినట్లయితే మనకు తెలిసేది వివేక వైరాగ్యాదులు చాలా ముఖ్యమని! వారి భాష్యాల్లో జ్ఞానసంపాదనకు ప్రాముఖ్యం ఇచ్చారు. అంటే, భక్తిని ఆయన ఎప్పుడూ నిరసించలేదు. తనలోనే ఉన్న ఆత్మను ఎల్లప్పుడూ ఎరుకతో జ్ఞాపకం ఉంచుకోవాలి అంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు "ఈశ్వరః సర్వభూతానామ్ హృద్దేశేర్జున తిష్ఠతి" - సర్వజీవరాశుల్లో భగవంతుడు వారి వారి హృదయాల్లో విరాజిల్లుతున్నాడు.
"అహమాత్మా గుడాకేశ సర్వభూటాశయస్థితః" - నేను ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. ఓ అర్జునా! ’సర్వస్యాహం హృది సన్నివిష్ఠః’ - నేను, సర్వజీవరాశుల హృదయాల్లో నివసిస్తున్నాను.
భక్తి అనేది ముక్తికి సోపానం. అదేవిధంగా జ్ఞానమార్గం ద్వారా మోక్షం లభిస్తుంది. ’జ్ఞానాదేవతు కైవల్యం. ప్రజ్ఞానం బ్రహ్మ’ అని వేదాలు ఘోషిస్తున్నాయి. శ్రీరామకృష్ణ పరమహంస వైరాగ్య పరిపూర్ణులైన సర్వసంగ పరిత్యాగులకు జ్ఞానమార్గం, గృహస్థ భక్తులకు భక్తిమార్గం బోధించారు. మార్గాలేవైనా గమ్యం ఒక్కటే అని గుర్తించి, నమ్మిన మార్గంలో సాధన చేయాలి.

శ్రీ మహావిష్ణువుకు మంటే అరాగిపాత్రలో నైవేద్యమిత ఇష్టం

సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తు ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు మంటే అరాగిపాత్రలో నైవేద్యమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. గుడాకేశుడు విష్ణువు భక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది. సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర ! కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడూ లోక క్షేమమే కదా చేస్తాడు,.....లోకాస్సమస్తాస్సుఖినో భవంతు !!!!!!!

శ్వేత శంఖాలు

ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తమైన శ్వేత శంఖాలు రెండు నిత్యపూజలు అందుకుంటూ ఉంటాయో ఆఇంటి యజమాని సదా ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఏకార్యం చేట్టినా అందులో విజయం సాధిస్తాడు. అపజయాలు, దుర్దశలు ఆవ్యక్తి దరిదాపుల్లోకి కూడా రావని ప్రజల నమ్మిక. శాస్త్ర ప్రకారం శంఖం లక్ష్మీ స్వరూపం.
"మహాభషేకం సర్వత్ర శంఖేనైవ ప్రకల్పయేత్!
సర్వత్రైవ ప్రశస్తోబ్జః శివ సూర్యార్చనం వినా!!"(తిథి తత్త్వే బ్రాహ్మే)
సర్వదేవతా పూజల్లోనూ శంఖంతో మహభిషేకం చేయాలి. శంఖంతో శివ సూర్యులను మాత్రం అభిషేకించరాదు. శంఖ ద్వారా ఇచ్చే తీర్థాన్ని ఎలా స్వీకరించాలంటే
చతుర్గుణీ కృత వస్త్రే పాణిం నిధాయ తేనాదౌ శంఖతీర్థం శిరసి ధారయేత్!
శంఖ మధ్య స్థితం తోయం భ్రామితం కేశవోపరి! అంగ లగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దహేత్!! (నిత్య కర్మాష్టకే)
నాలుగు మడతలు పెట్టిన వస్త్రం మీద కుడి చేతిని ఉంచాలి. ముందుగా అందులోకి శంఖ తీర్థాన్ని తీసుకొని, శిరస్సున జల్లుకోవాలి. శంఖమధ్యమున ఉండేదీ, విష్ణు ప్రదక్షిణం చేసినదీ అయిన ఈశంఖం తీర్థం మానవుల శరీరాన్ని స్పృశించి, బ్రహ్మ హత్యల వల్ల కలిగే పాపాన్ని సైతం పోగొడుతుంది. శంఖాన్ని చెవిదగ్గర ఉంచుకొన్నప్పుడు మంద్రమైన శబ్దాలు వినిపిస్తే అది ఉత్తమమైన శంఖం.
ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉండాలనుకుంటారో, ఋణబాధలు, దరిద్రం లేకుండా సిరిసంపదలతో తులతూగాలనుకుంటారో అలాంటి వాళ్ళు దక్షిణావర్త శ్వేత శంఖాన్ని(కుడివైపు తెరుచుకొని ఉండే తెల్లటి శంఖాన్ని) పూజగదిలో పెట్టుకోవాలి. ఈవిషయాన్ని పులస్త్య సంహితలో మహర్షి పులస్త్యుడు, లక్ష్మీ సంహితలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పారు. దక్షిణావర్తమైన తెల్లటి శంఖం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోనట్లయితే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆశంఖం మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

ఎందరో మహానుభావులు చెప్పిన మాటాలు

ఎందరో మహానుభావులు చెప్పిన మాటాలే మరోసారి చెప్పుకోవాలనిపించింది. అందులో స్వార్ధం ఉంది. అవి నాలోనూ నాస్నేహితులకు కూడా ఒకసారి విచారణచేసుకొడానికి ఉపయోగపడతాయన్న ఆశ. భగవంతుడు ఇచ్చిన ఈ బ్రతుకుని ఎంతవరకు సార్థకం చేసుకుంటున్నామని ఒకసారి అలోచిద్దాం. ఎమైనా లోపాలు ఉంటే దిద్దుకుని మారడానికి ఈ రోజునుండీ ప్రయత్నిద్దాం. మనలో చాలామందికి తప్పులు ఏమిటో తెలుసు.. మనగుణాలు. ముఖ్యంగా అరిషడ్వర్గాలు.. ఇవి మన ఇహలోక పరలోక అభ్యున్నతిని అడ్డుకుంటూ ఉంటాయి. వీటిని నియంత్రించడానికి మనవంతు కృషి చేస్తూ భగవంతుడిని శరణు వేడుదాం. ఈ ఆరు శత్రువుల గురించి అందరికీ తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి కాక మమత, అభిమానం కూడా స్థానభ్రంశం చెంది దుర్గుణాలుగా మారుతూ ఉంటాయి. వీటిని నియంత్రించాలంటే యమ, నియమ, ప్రత్యాహార, ఆసన, ధ్యాన మొదలైన అష్ట యోగాలను చెప్పేరు. ఇవి నియమ ప్రకారం చేయడం ప్రస్తుత జీవనశైళిలో కొంచెం కష్టమే. మనకి ఏ కోరికలు తీరాలన్నా భగవంతుడిని కోరుకోవడం అలవాటు. మరి ఈ గుణాలను నియంత్రించడానికి కూడా అతనినే త్రికరణ శుద్ధిగా శరణు వేడుదాం.

శని త్రయోదశి

శని త్రయోదశి.  శనిదేవుని స్మరించినా, అర్చించినా, శివపూజ చేసినా శనిదోషాలు నశిస్తాయి. రుద్రాభిషేకం వంటివి ఈరోజున విశేషఫలాన్నిస్తాయి. ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈక్రింది నామాలను, స్తోత్రాన్ని పఠిస్తే శనిబాధలు ఉండవు.

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగలాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే!!
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో!!
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్యచ!!

మంచి మాటలు

1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో రెండు ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం,విష్ణువుకి అలంకారం,వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు.ఒక దీపం వెలుగుచుండగా,రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.

14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...