Wednesday, October 31, 2018

సిరి సంపదలిచ్చే “లక్ష్మీ గవ్వలు"

గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం .

క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి. గవ్వలని లక్ష్మీ దేవి చెల్లెల్లు అని శంఖాలని లక్ష్మీదేవి సోదరులనీ పలువురు భావిస్తారు.గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉన్నాయి. ఇంకా శివుని జటాజూటం లోను, నందీశ్వరుని మెడలోను గవ్వలే అందం.

గవ్వలు కొందరికి అలంకరణ వస్తువుగాను, కొందరికి ఆటవస్తువుగాను, కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు. "అని ఉంది.కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.

ఉపయోగాలు

పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని, మొలతాడులోగాని కట్టాలి.

కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.

గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు.

కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.

గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.

గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.

వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.

వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది.

గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది.కాబట్టి గవ్వలు కామప్రకోపాలు. వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.

వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే.

లక్ష్మీదేవి అనుగ్రహ మాల "తామరమాల"

తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలను ‘కలువలు’ అని కూడా అంటారు. తామరలకు ‘పుత్రజీవి’ అను పేరు కలదు. తామర పూసలను సంతానం లేని వారు ప్రతి నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతఃకాలం నందు తింటే చాలా మంచిది. చూర్ణం చేసుకొని కొద్దిగా వేడి చేసిన ఆవు పాలతో త్రాగవలెను. ఈ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగును.

తామరమాల ధరించిన వారిలో మనో నిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్విక గుణాలుంటాయి. ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది.

స్పటికమాల, పగడాల మాలకంటే ఉన్నత ఫలితాలను తామర మాల ఇస్తుందని రత్నశాస్త్రం చెబుతోంది. సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.

“ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా.”

అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి. చేతిలో ధనం నిలబడని వారు తామరమాలతో జపం చేసిన ధరించిన ఐశ్వర్యం, ధనం, స్ధిరాస్తులు పొందగలరు. తామరమాలతో అమ్మవారి పఠాన్ని గాని, విగ్రహాన్ని గాని, శ్రీయంత్ర మేరువుని గాని అలంకరించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మికా దేవి కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. సకలైశ్వర్య ప్రదాయిని, శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. మహాలక్ష్మిని కమలవాసిని అని కూడా అంటారు.

వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్య వలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు శుకాశ్రామాన్ని చేరి స్వర్ణముఖీ నదీ తీరాన సరోవరం నిర్మించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి తామర పుష్పంలో ఉద్భవించినట్లు పద్మ పురాణం తెలుపుతుంది.

పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జన్మించిన పద్మావతి లేదా అలమేలు మంగ. తమిళంలో అలర్‌ అనగా పువ్వు. మేల్‌ అనగా పైన. మంగై అనగా అందమైన స్త్రీ - అలమేలు అనగా పద్మంలో ప్రకాశించున సుందరి. చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలెన స్త్రీమూర్తి అని అర్థం.

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.

తామర విత్తనాలను పద్మ, కమల, లోటస్ విత్తనాలని కూడ అంటారు. లక్ష్మీదేవి స్వరూపమైనతామర విత్తనాలు సహజ సిద్దమైనవి. తామరవిత్తనాల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు, పటాలకు, శ్రీచక్రాలకు అలంకరించటం మంచిది.

తామరమాలను జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు మెడలో దరించటం గాని, జపంచేయటం గాని చేస్తే జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి.

తామర విత్తనాలు లక్ష్మీ, శ్రీచక్ర పూజలో తప్పనిసరిగా ఉంచి పూజ చేయాలి. తామర విత్తనాలు, తామరమాలతో పూజ చేస్తే దనాభివృద్ధి కలుగుతుంది.

జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్న వారికి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, గొడవలు, అపోహలు ఉంటాయి. ఇలాంటి వారు తామరమాలతో శ్రీచక్రానికి పూజ చేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి భాదలు ఉండవు.

దీపావళి రోజున "ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా". అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి.

లక్ష్మీదేవి అనుగ్రహానికి "శ్రీ లక్ష్మీ నారికేళం"

          శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం, లఘు నారియల్, లక్ష్మీ నారికేళం, పూర్ణ ఫలం అని కూడ అంటారు. శ్రీఫలాలు క్షార వృక్ష జాతికి చెందినవి. సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు పండుతాయి. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి. చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు , బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.   

        శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి. కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో చిన్న, పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. కొబ్బరి కాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది. పీచు దిగువున మామూలు కొబ్బరి కాయలకు ఉండే  విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

        శ్రీ లక్ష్మీ ఫలాన్ని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగిన స్త్రీల ఋతు సమస్యలు, అతి మూత్ర వ్యాదులు, తెల్ల బట్ట, సుఖ వ్యాదులు, గర్బ సంబంధ రోగాలు నయం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా లేనివారు, ఎప్పుడు జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవు తున్నవారు శ్రీ లక్షీ ఫలంతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని స్వీకరించిన అనారోగ్యాలు మటుమాయం అవుతాయి.  

       శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి. ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసు కొని పసుపు, గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి. తరువాత కుంకుమతో బొట్లు పెట్టాలి. శ్రీఫలం చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు, యాలకులు, పండ్లు నైవేద్యం ఇవ్వాలి. కర్పూరం, సాంబ్రాణితో ధూపం చూపాలి. తరువాత పసుపు గాని, ఎరుపు గాని, తెలుపు గాని వస్త్రాన్ని తీసుకొని అష్టలక్ష్మీ స్వరూపంగా ఎనిమిది శ్రీఫలాలను గాని, లాభలక్ష్మీ స్వరూపంగా పదకొండు శ్రీలక్ష్మీ ఫలాలను, కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. శ్రీలక్ష్మీ ఫలం తో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు, నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. "ఓం శ్రీం శ్రియై నమః" అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేసి పూజ అనంతరం శ్రీలక్ష్మీ ఫలాలను ఎర్రటి వస్త్రంలో కుంకుమ, నాణేలను మూటకట్టి వ్యాపార సంస్ధలలోగాని ఇంట్లోగాని ఉంచిన సుఖ సౌఖ్యాలు, ధన దాన్యాభివృద్ధి కలుగుతాయి.

లక్ష్మీ దేవి స్వరూపం "గోమతి చక్రాలు"

గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే "సముద్రపు శిల". గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభరాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే "నాగచక్రం" అని "విష్ణుచక్రం" అనికూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని "నత్త గుళ్ళ స్టోన్" అని కూడ అంటారు. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతిచక్రం ముందుభాగం తెల్లగాను, కొన్నిఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకలకార్యసిధ్ధికి, ఆరోగ్యసమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్నగోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.

గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం, వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చక పోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి. గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో లేదా పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్టలక్ష్మీయంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి.

గోమతిచక్రాలను “ఓం హ్రీం మహాలక్ష్మీ శ్రీ చిరాలక్ష్మీ ఐం మమగృహే ఆగచ్ఛ ఆగచ్ఛ స్వాహా” అనే మంత్రంతో గాని లలితాసహస్త్ర నామంతో గాని జపిస్తూ కుంకుమతో లేదా హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజుగాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించు కోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరం లో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లోపల గాని వెండి బాక్స్ లోపల గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.

►‘ఒక్క గోమతిచక్రాన్ని’ త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్టదోషాలు కూడ పోతాయి.

►‘రెండు గోమతిచక్రాలను’ బీరువాలో గాని పర్సులో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

►‘మూడు గోమతిచక్రాలను’ బ్రాస్‌లెట్‌గా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద నల్లని కాటుక గాని బొగ్గు పొడితో గాని అతని పేరు వ్రాసి నీటిలో వేయటం లేదా వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

►‘నాలుగు గోమతిచక్రాలు’ పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహనిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహనానికి కట్టటం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాలనుండి నివారించబడతారు.

►‘ఐదుగోమతిచక్రాలు’ తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

►‘ఆరు గోమతిచక్రాలు’ అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాదించవచ్చు. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాదించవచ్చును.

►‘ఏడు గోమతిచక్రాలు’ ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి. ఏడు గోమతి చక్రాలను నదిలో విసర్జితం చేసిన దంపతుల మధ్య అభిప్రాయబేధాలు మటుమాయం అవుతాయి.

►‘ఎనిమిది గోమతిచక్రాలు’ అష్టలక్ష్మీ స్వరూపంగా పూజించిన ధనాభివృద్ధి కలుగుతుంది.

►‘తొమ్మిది గోమతిచక్రాలు’ఇంటిలో ఉండటం వలన మన ఆలోచన లని ఆచరణలో పెట్టవచ్చు. ఆద్యాత్మికచింతన కలుగుతాయి. ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

►‘పది గోమతిచక్రాలు’ ఆఫీసులో ఉంచటం వలన ఆసంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

►’పదకొండు గోమతిచక్రాలు’ లాభలక్ష్మి స్వరూపంగా పూజించిన ఆర్ధికాభివృద్ధి కలుగుతుంది. భవననిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతి చక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు, శల్యదోషాలు ఉండవు.

►‘పదమూడు గోమతిచక్రాలను’ శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

►‘ఇరవై ఏడు గోమతిచక్రాలు’ వ్యాపార సముదాయములలో ద్వారబందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది.

జాతకచక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాలదృష్టి గాని, సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్న వారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్‌గా ధరించటం గాని చేయాలి.

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!

Tuesday, October 30, 2018

మారుతున్న సమాజం - విలువలు -ఉపాధ్యాయుల పాత్ర‌

సమాజం: మనుషులు సమిష్టిగా ప్రకృతి తో కలిసిప్రకృతి తో పోరాడుతూ సాగించే ఉత్పత్తిపునరుత్పత్తి ప్రక్రియల,మానవ సంబంధాల సమాహారమే సమాజం. ఇందులో మనుషుల పాత్రప్రకృతి పాత్ర ఉంటాయి. ప్రకృతి ని ఉపయోగించుకునిఅవసర‌మయితే ప్రకృతి తో పోరాడి,మనిషి మనుగడ కు ఉత్పత్తి సాగుతుంది. నిరంతరాయంగామానవ పునరుత్పత్తి జరుగుతుంది. మనుషుల మధ్య సామూహిక సంబంధాలు నెలకొంటాయి. ఆ సంబంధాలలో ఐక్యతాఘర్షణా ఉన్నాయిఘర్షణే సమాజ చలనానికి చోదక శక్తిసమాజం నిరంతరం మార్పు కు లోనవుతుంది.క్లుప్తంగా సహజీవనం చేస్తున్న ప్రకృతి లోని జీవకోటి సమూహమే సమాజం. ఇందులో మెదడు అభివృద్ధి చెందిన మానవుని పాత్ర ప్రత్యేకం. మనిషి కార్యక్రమాలు మొత్తం సమాజాన్నిదాని ఉనికిమనుగడ లను ప్రభావితం చేస్తాయి.
మారిన సామాజిక విలువలు: విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుంది. మానవత్వానికి,ప్రకృతికి అర్థం చెప్పే ఆజీవన ప్రక్రియ విద్య. ప్రాచీన భారత విద్యా వ్యవస్థ వ్యక్తిత్వ నిర్మాణంవిలువలునైతికనిస్వార్థ జీవన విధానాలను నేర్పింది. సామాజిక అభివృద్ధికి దోహద పడింది. ఈ ప్రక్రియలలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. వారు కూడా నిరంతరం విద్యాభ్యాసం చేస్తూ,విద్య ద్వారా ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేవారు. సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని అందించే వారు. మార్గ దర్శకులుగా మనుగడ సాగించేవారు. వారికి సొంత ఇల్లుఆస్తులు లేవు. రోజూ ఆహారానికిఇతర జీవితావసరాలకు ఇతరుల పై ఆధార పడి ఉండేవారు. ప్రతి ఒక్కరి నుండి వారికి గౌరవ, మర్యాదలు లభించేవి. జీత భత్యాలుసౌకర్యాలు తక్కువగా ఉండి "బ్రతక లేక బడి పంతులు" అనే రోజులలో ఉపాధ్యాయులకు పాఠశాలల మీద మమకారంవిద్యార్థుల మీద ప్రేమాభిమానాలువృత్తి పై అంకిత భావంసామాజిక బాధ్యత ఉండేవి. అయితే ప్రస్తుతం విద్య విపరీత లాభాలను ఆర్జించే వ్యాపారమయింది. విధేయులైన వేతన కార్మికులను తయారు చేసే విధ్యావిధానాన్ని అమలు చేస్తున్నారు. మానవ జీవితం లో ఆర్థిక ఆదాయాన్ని ఆశించని ప్రక్రియ లేదు. మానవత్వమే మాయమయింది. విద్య కూడా దీనికి అతీతం కాదు. ఉపాధ్యాయుడు ఈ విషవలయం లో పనిముట్టుగా మారిపోయాడు. విద్యారంగం సమాజం మీద ప్రగాఢమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. విద్య సమాజాన్ని సమూలంగా మార్చి వేస్తుంది. ఫలితంగా సామాజిక నియమాలువిలువలు మారి పోయాయి.
"జనులను పీల్చి పిప్పి చేసే దురాచారాలను దహించలేని విద్య ఎందుకు? - విద్య ను దాని బలాన్ని సొంతం చేసుకున్న వాళ్ళున్న దేశంలో 'దురాచారాలుఇష్టారాజ్యంగా ప్రబలి పోవడం విద్యావంతులకే అవమానం. మనిషి హృదయం లో మానవత ను ప్రోది చేయలేనిది 'విద్యకానే కాదు. అది అజ్ఞాన మహా శిఖరం" అని మహాకవి జాషువా అన్నారు."సమాజం లో పాతుకు పోయిన హింసఅన్యాయాలు,అసమానతలను రూపు మాపే సాధనం విద్య." అని మహాత్మా గాంధి అన్నారు. విలువల విద్య విద్యార్థుల వ్యక్తిత్వాన్ని రూపొందించిసశాస్త్రీయ సామాజిక వైఖరులను,విశ్వజనీన దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఆధునిక ప్రపంచపు సమస్యలను అధిగమించగల శక్తిసామర్థ్యాలను విద్యార్థులు సంతరించుకుంటారు. ఆకలి కిఅగచాట్లకు గత జన్మ పాపాలు కారణం కాదనిసామాజిక పరిస్థితులు,దోపిడీ శక్తుల విధానాలు కారణమని తెలుసుకుంటారు. విద్యార్థులకు ఈ విషయాలను బోధించాలి. ఇలాంటి పుస్తకాలను చదవమని చెప్పాలి. ప్రకృతి వనరులను,పర్యావరణాన్నిపనినిమాతృభాష ను ఉపయోగించుకొని సమాజ పరిణామానికి విద్యార్థులను సన్నద్ధం చేయడం విద్య లక్ష్యం. బహుళభిన్న సంస్కృతులు పరిఢవిల్లిన ఈ దేశం లో శాంతిసౌభాగ్యంసహన శీలతసామాజిక,శాస్త్రీయ దృక్పథాలుమానవీయత వంటి ఉత్తమ విలువలను విద్యార్థుల లో పెంపొందించడమే విద్యావిధానపు ప్రధాన ధ్యేయం.
మాస్కో లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక ప్రశ్న అడిగాడు, "ఒక వ్యక్తి ఒక వస్తువు ను 50 రూబుల్స్ కు కొని10% లాభంతో అమ్మాడు. అతని లాభమెంత?" "3 సం.రాల కఠిన కారాగార శిక్ష" అని ఒక చురుకైన విద్యార్థి జవాబు చెప్పాడు. సోవియట్ యూనియన్ లో ఇది సరయిన సమాధానం. అక్కడ కమ్యూనిస్టు విలువల తో విద్యాబోధన జరిగేది. జర్మనీఇటలీ లలో విద్య‌ ఫాసిజం నేర్పుతుంది. యథాస్థితి ని కొనసాగించడానికి ప్రభుత్వ యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. బ్రిటన్అమెరికా లలో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించే విద్యా విధానాన్ని పాటించడం ప్రభుత్వాల లక్ష్యం. నిజమైన విద్యను నేర్పితే పిల్లలు అమలులో ఉన్న వ్యవస్థ కు దూరమవుతారు. హృదయాలు ఉప్పొంగితే మార్గదర్శక ఆలోచనలు మొలకెత్తుతాయి. ప్రభుత్వాలు పనిగట్టుకొని మానసిక వికాస విద్యను నిరోధిస్తున్నాయి. శక్తిసామర్థ్యాలు,సృజనాత్మకతకళాహృదయంమానవత్వం ఉన్న వారిని ప్రోత్సహించవు.
1986 లో పాపాల పుట్ట ప్రపంచీకరణ తో ప్రపంచ దేశాలకు బలవంతపు పెళ్ళి చూపులు జరిగాయి. 1990 లో నిశ్చితార్థం, 1995 లో పెళ్ళి ఆయాచితం గాప్రజల ప్రమేయంపార్లమెంటు ఆమోదం లేకుండా నిర్వహించ బడ్డాయి. అమెరికాపాశ్చాత్య దేశాల ప్రతిపాదనలయిన ఈ క్రతువులకు ప్రపంచ బ్యాంకుఅంతర్జాతీయ ద్రవ్య నిధి నియంతృత్వ సాక్షులు. దీని ద్వారా సాంకేతికతయంత్రాలు,ఆధునిక పరికరాలు ఆర్థిక దోపిడీలో భాగంగా సరఫరా చేయబడ్డాయి. సమాజం సర్వనాశనం చేయబడింది. ప్రతి రంగం పరాధీనం చేయబడి, ప్రతి కార్యం పరాన్నబుక్కుల వశమయింది. దీనికి విద్యారంగం అతీతం కాదు. ప్రైవేటీకరణ పాలయింది. ప్రపంచీకరణ ధనవంతుల విద్యాలయాలను స్థాపించింది. పేదలను విద్యకు దూరం చేసింది. "సంస్కృతి హీనత‌ సర్వవినాశనకారి. దానికి విద్య విశిష్ట మార్గం" అన్న‌ మెకాలే సూత్రం మరొక్క సారి అమలు చేయబడింది. మెకాలే ను ద్వేషించే ప్రస్తుత పాలకులు పాటిస్తున్న పరమార్థ భావజాల సూత్రం కూడా ఇదే. వీటన్నిటి ఫలితాలే విద్యారంగ వినాశనం. సమాజ సర్వ నాశనం. అనుభవ రాహిత్యంప్రాపంచిక జ్ఞాన లోపమయిన విద్యాబోధన జరుగుతున్నది. కనీసం అనుసంధాన విద్య కూడా అందుబాటు లో లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు,చట్టాలలో పొందుపరిచిన సామాజిక బాధ్యతలను కూడా నిరాకరించాయి. చట్టాలు ఆదేశించిన‌ సంక్షేమ పథకాలను అమలు పరచడం లేదు. మానసిక‌ వత్తిళ్ళకు లోనయిన‌ అమాయక విద్యార్థుల ఆత్మహత్యలు నిత్య కృత్యాలయ్యాయి. అయినా అడిగే నాథుడు లేడు. రక్షకుడే భక్షకుడయినట్లు కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులే మంత్రులయితే ఇక అడిగేదెవరిని? విద్యలో సృజనాత్మకత ఉండాలి. కవిత్వ రచన కంటే కవిత్వ పఠనకునాటక రచన కంటే నాటక ప్రదర్శనకుసృజనాత్మకతతో కూడిన వస్తూత్పత్తి కంటే వస్తు వర్ణనలకు మన ప్రభుత్వ విద్యావిధానం ప్రాధాన్యతనిస్తోంది. మోదీ ప్రభుత్వం పురాణాలను చరిత్ర గానూచరిత్ర ను పురాణాలు గానూ చిత్రీకరిస్తోంది. చరిత్ర ను వక్రీకరించింది. పాఠ్య పుస్తకాలలో హిందు పురాణాలనువాస్తుజ్యోతిష్యంయోగ ధ్యానాల బోధనలను తప్పని సరి అంశాలుగా చేరుస్తున్నది. ఫలితంగా భావి పౌరులు జీవశ్చవాలుగా మారుతున్నారు.
ఉపాధ్యాయుల పాత్ర‌: తన ప్రధాన‌ అవసరాలయిన విద్య,వైద్యాలను వాటి సంధాన కర్తలయిన ఉపాధ్యాయ,వైద్యులను మొత్తం సమాజం ఆదర్శం గా తీసుకుంటుంది."21 వ శతాబ్దం లో నిరక్షరాస్యుడు అంటే చదవడం,రాయడం రానివాడు కాదు. గుణపాఠాలను నేర్చుకోవడానికి,తప్పులను సరిదిద్దుకోవడానికిసరైన మార్గంలో పయనించడానికి సిద్ధపడని వాడు" అని అమెరికా రచయితభవిష్యత్తు ఊహకర్త ఆల్విన్ టోఫ్లర్ అన్నారు.ఆధునిక సమాజంలో బాహ్యప్రపంచపు సంపర్కంతో పిల్లల తెలివి తేటలు పెరిగాయి. పెద్దలుఉపాధ్యాయులు సౌకర్య,స‍ంధాన కర్తలుగా మాత్రమే వ్యవహరించాలి. ఉపాధ్యాయులు మానసిక శాస్త్ర అధ్యయనం చేయాలి.1990 మార్చ్ 5 - 9 తేదీలలో థాయ్ లాండ్ లో "అందరికీ విద్య" అన్న అంశం పై జరిగిన ప్రపంచ విద్యా మహాసభలలో "సార్వత్రిక విద్య కు సమానావకాశాలు" అన్నది కేంద్రీకృత లక్ష్యాలలో ప్రధానమైనది. ఈ విద్యా గమ్యసాధనకు మన ప్రభుత్వాలు ప్రయత్నించలేదన్నది నగ్న సత్యం. ప్రజా శ్రేయస్సు పట్టని ప్రభుత్వాల పాలన లో విద్యారంగం కార్పొరేట్ సంస్థల స్వాధీనం చేయబడింది. తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసే, దోపిడీ ని కొనసాగించే విధానాలు అమలు చేయబడుతున్నాయి. ప్రభుత్వాలు నిర్ణయించిన తప్పుడు పాఠ్యాంశాలనుతప్పుడు పద్దతులలో బోధించడం వరకే ఉపాధ్యాయుల బాధ్యతలు పరిమితం చేయబడ్డాయి. విద్యార్హతలు బలహీనంగా ఉన్న,నిరుద్యోగ రాక్షసి కి బలవుతున్న‌ ప్రైవేటు రంగ ఉపాధ్యాయుల పాత్ర వినాశనకరమే. ఇక మిగిలిన ప్రభుత్వ రంగ ఉపాధ్యాయుల పాత్ర కూడా విద్య ను సంస్కరించడం లోసామాజిక మార్పు లో నామ మాత్రమే. అయినా విశ్వకవి రవీంద్రుని 'శాంతి నికేతన్స్ఫూర్తి తోమనం చదివిన ప్రభుత్వ పాఠశాలల విద్యానుభవంతో మన గురువుల ఆశయఆదర్శాల తో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రజాపక్షం వహించే ఉపాధ్యాయులకే ఇది సాధ్యం.
విద్యార్థులకు ప్రేమస్నేహ స్వభావాలనుసుగుణాలను పంచాలి. పిల్లలు ఉపాధ్యాయుని చూసి భయపడ రాదు. దగ్గరికి చేరాలి. బోధన అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదు. పిల్లలను అర్థం చేసుకొని వారితో కలిసి జీవించడం. పిల్లలతో మౌలిక బాంధవ్యాన్ని నెలకొల్పుకోవాలి.  పాఠశాలనుజీవితాన్ని విద్యార్థుల దృష్టితో చూడాలి. నియమిత అంశాలను మాత్రమే బోధించిసామాజిక సమస్యలను అవగతం చేయక పోవడంవాస్తవాలను,అనుభవాలను చెప్పకపోవడం పరిస్థితులను యథాతథంగా కొనసాగించడానికే ఉపయోగపడతాయి. జీవితాలను మెరుగు పరిచే వ్యవస్థ సాధన‌ కు దోహదపడవు. భావితరాలు బాగుపడాలంటే నేటి తరానికి నీతి,నిజాయితీలనుమానవత్వ విలువలను నేర్పాలి. అన్యాయాలనుఅక్రమాలను ధైర్యంగా ఎదిరించి,పోరాడటం అలవాటు చేయాలి. సమస్యల పరిష్కార ప్రక్రియలను తెలియజేయాలి. ప్రపంచం ఎలా ఉంది. ఎలా ఉండాలి. అన్న సమాచారంతో సమాజాన్ని విశ్లేషించి,అనుగుణ్యత కలిగిన సంస్కరణలతో సామాజిక మార్పుకు ప్రయత్నించాలి. పిల్లలపై పరీక్షలు చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. వెనుకబడిన వారిలో ఆత్మ న్యూనతను,చురుకైన వారిలో గర్వాన్ని పెంచే అవకాశముంది. తరగతి లో తలలున్న విద్యార్థులుతలపులున్న విద్యార్థులు ఉంటారు. ప్రభుత్వాలు తలలున్న వారినే ప్రోత్సహిస్తాయి. ఉపాధ్యాయులు తలపులున్న వారిని ప్రోత్సహించాలి. విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని అధ్యయనం చేయాలి. లక్షణాల మూలకారణాలను వెదకాలి. పిల్లల పక్షం వహించాలి. ఆ మేరకు కొందరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయ వృత్తి లో వామపక్ష ధోరణి కలిగిన సంఘటిత శక్తిసహకారసామూహిక ప్రభావ ఫలితం అవసరం. అనివార్యం. ఉపాధ్యాయుల వృత్తి పాఠశాలల్లో ఉన్నా ప్రవృత్తి సమాజంలో ఉండాలి. విద్యార్థులను తరగతి గదులలో బంధించ కూడదు. విశాల ప్రకృతి లో తిప్పి ప్రకృతి రహస్యాలనునియమాలనుసామాజిక స్థితిగతులను అవగతం చేయాలి. మానసిక వికాసానికి తోడ్పడాలి. దేశభక్తి తో మేధోపరమైన శిక్షణ నివ్వడం మాత్రమే సరిపోదు. భావావేశాలతో పిల్లలు దురాచారాలను అలవాటు చేసుకోక మునుపే వారిని ఉపాధ్యాయులు ఆకట్టుకోవాలి. ఉపాధ్యాయుల వ్యక్తిత్వం విద్యార్థుల జీవితాలలో ప్రధాన భూమిక ను పోషిస్తుంది. బోధనా పదవులలో ఉన్నవారికంటే పర్యవేక్షణా బాధ్యతలు కలిగిన ఉపాధ్యాయుల వ్యక్తిత్వం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఉపాధ్యాయులు తమ బోధనాపటిమను పెంచుకోవాలి. పైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ విద్యాలయాలు శ్రేయస్కరమన్న నిజాన్ని నిరూపించాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి. విద్యార్థులకు స్వేచ్ఛావాతావరణం కల్పించాలి. స్వేచ్ఛ కలిగిన పిల్లలు మాత్రమే నూతన ప్రపంచాన్ని నిర్మించగలరు. నేటి ఉపాధ్యాయులు తమ ప్రతిభపరిజ్ఞానాలను విద్యార్థులకు అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేకం ఉచితంగా లభిస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కడు పేదలు కూడా ప్రైవేటు విద్యాసంస్థలలోనే తమ పిల్లలను చేరుస్తున్నారు. కార్పొరేటు విద్యాధిపతులు మంత్రులుగా వెలుగుతున్న "మన" ప్రభుత్వాలకు కావలసింది ఇదే. ఉపాధ్యాయులు దీనికి కారణాలను వెదకాలి. పరిష్కార మార్గాలను చేపట్టాలి. సౌకర్యాలు లేవన్న సాకు తో శాంతినికేతన్ లను అవమానించే పనులకు స్వస్తి పలకాలి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేయాలి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రచార కర్తలుగా పని చేస్తున్న మంత్రులనుఅధికారులను ప్రశ్నించాలి. ప్రభుత్వ పాఠశాలల్ల్లోకళాశాలల్లో సంచలన విజయాలను సాధించిన విద్యార్థులను సన్మానించిప్రచారం చేయాలి.   
విద్యార్థులను తీర్చిదిద్దడం లోవారికి శాస్త్రీయ దృక్పథాన్ని,సక్రమ భావజాలాన్ని అలవర్చడం లోఛాందస భావాలను,మూఢ నమ్మకాలను రూపుమాపడం లో,ప్రత్యామ్నాయాలను సూచించినిర్మించినిర్వహించడం లో ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. విద్యార్థులు సం.రాల వయసు నుండి 18 సం.రాల వయసు వచ్చి ఓటరుగా మారి, 25 సం.రాల వయసు తో సమాజం లో ప్రవేశించే వరకు విద్యాలయాల ప్రభావం లో ఉంటారు. ప్రధానమైన నిర్ణాయక వయసులో వీరిని తీర్చి దిద్దవలసినదశా దిశలను చూపించ వలసిన అవకాశం,అవసరంబాధ్యత విద్యాలయాల (ఉపాధ్యాయుల) మీద ఉన్నాయి. విద్యార్థులతోనే భవిష్యత్ భారతం నిర్మితమవుతుంది. ఈ పరిస్థితులను సరిగా ఉపయోగించుకోకపోవడంమన పాత్ర ను సరిగా పోషించక పోవడం ప్రస్తుత దుష్పరిణామాలకు కారణాలు. సమకాలీన సామాజిక దుస్థితికి మూలాలు. జాతి అవసరాలకు అనుగుణంగా సామాజికసాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి. వ్యక్తిత్వ వికాసంసామాజికాంశాల మెళకువలు నేర్పాలి. దీనితో నిత్యజీవితం లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే నైపుణ్యతలుఎదిరించి పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు విద్యార్థులకు అబ్బుతాయి. సామాజిక చైతన్యం పెరుగుతుంది. ఆత్మహత్యలు తగ్గుతాయి. విద్యా బోధన లో భాగంగా పిల్లలనుసామాజిక సంబంధాల ద్వారాసమాజం తో మమేకం చేయాలి. సమాజం ద్వారానే జ్ఞాన సముపార్జన సంపూర్ణమవుతుంది. ప్రాథమికమాధ్యమిక విద్య సక్రమంగా జరిగితే తర్వాతి విషయాలను విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేసి అయినా నేర్చుకోగలరు. అయితే సాంస్కృతికసాహిత్యభాషా విషయాలను మాత్రం తప్పక నేర్పించాలి. సంస్కృతీ సంపన్నత పిల్లలను సద్గుణవంతులుగాసకల కళా కోవిదులుగాసంపూర్ణ మానవులుగా మార్చుతుంది. అసలైన సామాజిక సంపద వీరే. అంతే కాదు ఉపాధ్యాయులు విద్యార్థులకు పౌర విజ్ఞానాన్ని అందించాలి. ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలి.హక్కులనే కాదు బాధ్యతలను గుర్తు చేయాలి. సమాజపు అలవాట్లనుక్రమశిక్షణ నువాటిని పాటించే నిబద్దతను నేర్పాలి. ఇంటి నుంచి చట్టసభల వరకు ప్రజాస్వామ్య అవసరాన్ని నొక్కి చెప్పాలి. ప్రజా సంస్థలలో అంతర్గత ప్రజాస్వామ్య ప్రాధాన్యతను వివరించాలి. చట్ట పాలనను,రాజ్యాంగ విలువలను బోధించాలి. ఈ లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయ వర్గం కృషి చేయాలి. మాతృభాషా మాధ్యమం లో కళాక్రీడా విద్యలను పిల్లలకు అందించాలి. వ్యాపార ధోరణులు లేకుండాఫలితాన్ని ఆశించకుండాఅంకిత భావం తో బోధన చేయడం ఒక పద్దతి. విద్యార్థుల నడవడిక లోనైపుణ్యత లోసామాజిక ఆలోచనలుధోరణుల్లో మార్పు ను ఆశించడం మరొక పద్దతి. ఈ మార్పులు వచ్చే వరకు తమ బోధన తోప్రవర్తన తోజీవితం తో నిరంతర ప్రయత్నం చేయాలి. అయస్కాంత క్షేత్రాలయిన గురువులు ఇనుప ముక్కలయిన శిష్యులను కూడా తమ కంటే ఉత్తమ అయస్కాంతాలుగా మార్చాలి.
నీతినిజాయితీలతో వ్యవహరించే ఉపాధ్యాయులను,విద్యావేత్తలనుఅధికారులను ప్రొత్సహించాలి. కంప్యూటర్లనుసాంకేతిక విద్యను ఆలోచనలను రేకెత్తించడానికిసృజనాత్మకతను పెంచడానికి వినియోగించే విధానాలను నేర్పాలి. వికాసం విద్య లో భాగం కావాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల చేసే చిన్న పొరపాటు భావి భారత ప్రజల జీవితాలలో అంధకారం నింపగలదు.ఉపాధ్యాయ సంఘాలు ఆర్థికాంశాలుఉద్యోగ సౌకర్యాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాధ్యాయులను సిద్దాంత బద్దులను చేయాలి. సామాజికరాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. విద్యార్థులను బానిసలనుగా తయారు చేసే విద్యావిధానాన్ని తిరస్కరించాలి. ఇప్పటి వరకూ అనేక విద్యా కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేసేటట్లుగా ప్రభుత్వాలపై వత్తిడి తీసుకు రావాలి. ప్రభుత్వాల కొమ్ముకాసే సంఘాలతో చర్చలు జరిపి ప్రజల పక్షాన నిలబడేటట్లు చేయాలి. భారత దేశానికి ఆర్థిక విధానం తప్ప విద్యా విధానం లేదనిపరీక్షా పద్దతులే తప్ప విద్యా పద్దతులు లేవని విదేశీయులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య ను ప్రజాశ్రేయస్సుకు అనుకూలంగా మార్చాలన్న రాజకీయ సంకల్పం మన పాలకులకు లేదు. రాజకీయ వ్యవస్థ మార్పుకు కూడా మన ఉపాధ్యాయులు కృషి చేయాలి. అందుకు విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ,సహకారాలను కూడా గట్టాలి. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులుఉపాధ్యాయులుతల్లిదండ్రులుసమాజాల సుందర అనుసంధాన‍ం అమరాలి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...