Wednesday, October 17, 2018

ఆధ్యాత్మిక జీవనం

వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమిగా పేరు పొందిన భరతభూమి, భారతీయ సంస్కృతి, నాగరికతలు ఎంతో ఉత్కృష్టమైనటువంటివి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు మన సంస్కృతీ నాగారికతల ఔన్నత్యాన్ని గుర్తించి ప్రశంసించినవే!

ఈ ప్రకృతి, అందులోని చరాచారాలన్నింటిలోనూ దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత. అంతేకాకుండా మనం పాటించే ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలు, మనం జరుపుకునే పండుగలు, పర్వదినాలు అన్నింటిలోనూ ఎన్నో ఉత్తమమైన విషయాలు దాగున్నాయి. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అంతేకాదు, ప్రతిరోజూ నిద్రలేవడం నుంచి తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకూ పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రాలు, పురాణాల్లో పేర్కొనబడ్డాయి.
వీటన్నింటినీ ఆచరించడం వల్ల మానసిక ప్రాశాంతత కలుగుతుంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి దూరమై, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రాచీనకాలంనుంచీ వస్తున్న సాంప్రదాయాన్ని గమనిస్తే, తెల్ల వారుఝామునే నిద్రలేవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. ఈ కాలాన్ని ‘బ్రాహ్మీముహూర్తం’ అని అంటారు. సూర్యుడు ఉదయించడానికి సుమారు ఒకటిన్నర గంట ముందు ఉండే కాలాన్నీ బ్రాహ్మీముహూర్తం అని చెప్పవచ్చు. అంటే సుమారు నాలుగు – నాలుగున్నర గంటల మధ్యకాలం. ఈ కాలంలో ప్రతిదినం నిద్రలేవడం అనేది మంచిది. నిత్య జీవితంలో అనుసరించాల్సిన నియమాల్లో ఇది ప్రధానమైనది. బ్రాహ్మీముహూర్త సమయంలో నిద్రించడంవల్ల పుణ్యఫలాలన్నీ నశిస్తాయి అని చెప్పబడుతోంది.
నిద్రలేస్తున్న సమయంలో భగవంతుని స్మరించుకోవడం మంచిది. నిద్రలేచి కూర్చుండగానే “కర్మదర్శనం” చేయాలని శాస్త్రవచనం. అంటే కుడిచేతిని చూసుకోవాలి. చూస్తూ –
“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కర వృష్టే చ గోవిందః ప్రాతే కరదర్శనమ్”
అనే శ్లోకాన్ని పఠించాలి.
అంటే, అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చేతి మొదట్లో శ్రీమహావిష్ణవు ఉంటారని భావం. నిద్రలేస్తూనే అరచేతిని దర్శిస్తూ, పై శ్లోకాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీమహావిష్ణువులను దర్శించినట్లు లెక్క. అంతేకాకుండా నిద్ర లేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవడం శ్రేష్ఠం.
ఈ విధంగా నిద్రలేచి, పడకమీద కూర్చుని చేతిని చూసుకున్న అనంతరం దైవప్రార్ధన చేయడం ముఖ్యం. అంటే, ఎవరికీ ఇష్టమైన దేవతలను వారుస్మరించుకుంటూ, వారిని స్తుతిస్తూ గుర్తున్న శ్లోకాలను మననం చేసుకోవడం మంచది. అంతే కాకుండా, గతంలో దర్శించినటువంటి పుణ్యక్షేత్రాలను గుర్తుకు తెచ్చుకుని, కళ్ళు మూసుకుని వాటిని దర్శించినట్లు ఊహించుకుంటూ, వాటిని కళ్ళముందు సాక్షాత్కరింపజేసుకుని ప్రార్థించవచ్చు.
ఈ విధంగా ఉదయాన్నే దైవస్మరణ చేయడం వల్ల ఆ రోజంతా మానసిక ప్రశాంతతను పొందడంలో పాటూ పుణ్యఫలాలను కూడా పొందవచ్చు.
తర్వాత భూమిపైన కాళ్ళుమోపుతూ –
“సముద్రవసనేదేవి పర్వతస్తమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” అనే శ్లోకాన్ని పఠిస్తూ భూదేవికి నమస్కరించాలి. అంటే – “సముద్రము వాస్తంగా కలిగి, పర్వతాలను స్తనములుగా కలిగిన శ్రీమహావిష్ణువు భార్య అయినా ఓ భూదేవి! నీకు నమస్కరిస్తున్నాను. నా కాళ్ళు నీకు తగులుతున్నందుకు నన్ను క్షమించు” అని అర్థం.
పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలన్నీ మనకు దైవంతో సమానం. తొలిరోజుల నుంచి వీటిని పూజించడం జరుగుతోంది. వాటిల్లో భూమి ఒకటి. ఈ భూమిని భూదేవిగా భావిస్తాం. భూదేవి శ్రీమహావిష్ణువు యొక్క సతీమణి. నిత్యం మన భారాన్ని మోస్తున్న మహాతల్లి. ప్రతిదినం ప్రాతఃకాలాన భూమిపైన కాలు మోపుతూ, ఆ చల్లని తల్లిని ప్రార్థించడంవల్ల, భూదేవి ఆశీస్సులతో పాటూ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలు కూడా లభిస్తాయి.
నిద్రలేస్తూ ముఖం కడుక్కుని మంచినీళ్లు సేవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనీసం సుమారు ఒక లీటరు మంచినీరు తాగడం ఆరోగ్యదాయకమని ఆయుర్వేదం కూడా చెబుతోంది. నీటిని సేవించడం అనేది మలమూత్రాదుల విసర్జనకు, ‘పళ్ళుతోముకోవడాని కంటే ముందే చేయాలి. అది కూడా ముందురోజు రాత్రి రాగిచెంబులో నీరు పోసి ఉంచి, మారునాటి ఉదయమే సేవించడం శ్రేష్టం. లేదంటే మట్టికుండలోని నీరుసేవించాలి. ఈ విధంగా నీటిని సేవించిన అనంతరమే మాలమూత్ర విసర్జనలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ప్రతిదినం నిద్రలేవగానే, పళ్ళు కూడాతోమకుండా నీరు త్రాగడం వల్ల చాలా అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేదశాస్రం చెబుతోంది. అంతేకాకుండా, నేటి ఆధునిక వైద్యులు, శాస్త్రజ్ఞులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అనంతరం స్నానంచేయాలి. ఈ స్నానవిధికి సంబంధించి మన సాంప్రదాయాలు అనేక నిబంధనలను ఏర్పాటుచేశాయి. ప్రతిదినం వేకువఝామునే స్నానం చేయాలనేది శాస్త్రవచనం. స్నానం చేసే సమయంలో “సంకల్పం” చెప్పుకోవాలని నిబంధన. (పూజలు, వ్రతాలు వంటివి చేసే సమయంలో ఏ విధంగా ఆస్మిన్ వంమాన వ్యావహారిక చాంద్రమానేన….అని చెప్పుకున్నట్లు) ప్రతిదినం చల్లని నీటిలో స్నానమాచరించాలి. అభ్యంగనస్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే తలస్నానం నిత్యం ఆచరించవలెనని. స్నానం చేసే సమయంలో పూర్తిగా బట్టలు విప్పి నగ్నంగా స్నానంచేయరాదు. నగ్నంగా స్నానం చేస్తే నరకబాధలు అనేకం అనుభవించాల్సి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఉపవాసం ఉండే రోజుల్లో, పితృకర్మలు చేయు రోజుల్లో , అంటే ఆబ్దికం వంటివి జరిపంచే రోజుల్లో, తర్పణాలు, పిండప్రదానాలు చేసే రోజుల్లో తలంటుకుని స్నానం చేయరాదు. ఇంకా సంక్రమణ దినాలు, తదియ, సప్తమి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఉన్న రోజుల్లోనూ, ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలంటుకుని స్నానం చేయరాదు. మిగతా రోజుల్లో చేయవచ్చు. ఈ దినాల్లో తలంటుకుని మాములుగా తలస్నానాలు ఆచరించవచ్చు. అలాగే కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో కూడా తలంటుస్నానం చేయరాదని శాస్త్రవచనం.
“గుణాదశ స్నాన పరస్యసాధో
రూపంచ పుష్టిశ్చ బలంచ తేజః
ఆరోగ్య మాయుశ్చ మనోసురుద్ వ
దు: స్వప్న ఘాతశ్చ తవశ్చ మేధా” అని దక్షస్మృతిలో చెప్పబడింది. అంటే – స్నానం వలన రూపం, పుష్ఠి, బలము, తేజస్సు, ఆరోగ్యం, దీర్ఘఆయుర్ధాయం, చిత్తప్రసన్నత, దుఃస్వప్న నాశనము, తపస్సు, గ్రంథాధారణ చేసేందుకు తగిన బుద్ధి, శక్తి అనే పది ప్రత్యక్ష లాభాలు కలుగుతాయని అర్థం.
అట్లే విష్ణుస్మృతిలో –
అజ్ఞానాద్యాది వా మోహద్రాత్రే
యుద్దరితం కృతమ్
ప్రాతః స్నానానికి తత్సర్వం
శోధయంది ద్విజోత్తమా!! అని పేర్కొనబడింది. అంటే, అజ్ఞానం వలనగానీ, మొహం వలనగానీ, రాత్రులందు చేసే పాపకార్యాలవలన శరీరదోషాలు ప్రాప్తిస్తాయి. ప్రాతః స్నానంతో ఆ దోషాలు తొలగిపోతాయి అని అర్థం.
అంతటి పవిత్రమైన స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించవలెను.
తీక్షణదంష్ట్ర! మహాకాయ!కల్పాందత దహనోపమ!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్వసి
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు
గంగా గంగేతి యోబ్రూయాత్ యోజయానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి
యో సా సర్వగతో విష్ణుః చిత్ స్వరూపీ నిరంజనః
న ఏవ ద్రరూపేణగంగాంభో నాత్రా సంశయః
అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్ఠం.
లేదంటే కనీసం –
“గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు” అనే శ్లోకాన్నైనా పఠించి స్నానం చేయడం మంచిది.
స్నానానంతరం “విభూతి” ని, కుంకుమను, గంధములను నుదుట ధరించాలని భారతీయ సాంప్రదాయం.
“భూతిర్ధూతికరీ పవిత్ర జననీ పాపౌఘవిధ్వంసివే
సర్వోపద్ర నవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్యవిశేష మొక్షణకరీ భూతిం పదా ధార్యతాం!!” అని చెప్పబడింది.
విభూతి సంపదలను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది. సర్వ అరిష్టాలను తొలగించి సకలశుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. గ్రహాబాధలు, భూతప్రేతపిశాచాది బాధలను దూరం చేసి తేజస్సును ప్రసాదిస్తుంది. ముక్తిని చేకూరుస్తుందని చెప్పబడింది. విభూతిని ధరించే సమయంలో ఈ క్రింది శ్లోకాలను పఠించాలి.
“త్రాయుషం జమదగ్నేః
కశ్యపశ్య త్రాయుషమ్
యద్దేవేషు త్ర్యాయుషమ్
తన్నోస్తు త్రాయుషమ్”
అంటే జమదగ్ని, కశ్యపుడు దేవదేవుల యొక్క ఆయుర్దాయం కంటే మూడురెట్లు ఆయుర్దాయం కలుగుగాక అని అర్థం.
“శ్రీకరంచ పవిత్రంచ
శోకరోగ నివారణ
లోకే వశీకరణం పుంసాం
భస్మం త్రైలోక్యపావనమ్”
ముల్లోకాలను పావనం చేసే మంగళప్రదమైన భస్మధారణంతో సకల రోగాలు, పాపాలు, సకల శోకాలు నిర్మూలనం కాగవలని అర్థం.
అలాగే, గంధం ధరించే సమయంలో –
“శంఖ చక్ర గదాపాణే
ద్వారకానిలయాచ్యుత
గోవింద పుండరీకాక్ష
రక్షమాం శరణాగతిమ్!!”
అనే శ్లోకాన్ని పఠించాలి.
కుంకుమను ధరించే సమయంలో –
ఓంకార పంజర శుకీం
ఉపనిషాదుద్యాన కేళికలకంఠీమ్!
ఆగమ విపిన మయూరీ
మార్యా మంతర్విభావయే గౌరీం!!
అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్టం.
స్నానంతరం ఈ విధంగా విభూతి, కుంకుమ గంధాలను ధరించిన తరువాత, ఇష్టదేవతా పూజను, అర్చనలు చేయాలి. అంతేకాకుండా, ఈ చరాచరజగత్తుకు వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దేవుడైన సూర్యునికి నమస్కరించుకోవాలి.
“జపాకుసుమ సంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరీమ్ సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరమ్!!”
ఎర్రనిపువ్వులు, ఎరుపు రంగు ప్రతీకారమైన కశ్యపుని సంతానమైన దివాకారునికి నామస్కరిస్తున్నాను. నా పాపాలను పటాపంచలు చేసి, నన్ను రక్షించగలవంటూ సూర్యునికి నమస్కరించవలెను. ఈ శ్లోకమే కాకుండా…
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!! దివాకర్ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!
అనే శ్లోకాన్ని పఠించి అయినా నమస్కరించవచ్చు. అనంతరం, తులసి వృక్షం వద్ద దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేసి ఈ క్రింది శ్లోకంతో నామస్కరించడం మంచిది.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహామ్
నమస్తులసీ కళ్యాణీ నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని
అని పఠిస్తూ నమస్కరించాలి.
అలాగే, శమీవృక్షం, రావిచెట్టు, వేపచెట్టు వంటి దేవతావృక్షాలు, ఇంటి పెరట్లోగాని, చుట్టుప్రక్కలాగాని ఉన్నట్లయితే, వాటికి కూడా నమస్కరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసే ముందు, భోజనం చేసే సమయంలోనూ కొన్ని నిబంధనలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనానికి తూర్పు ముఖం గానూ, లేదంటే దక్షిణ ముఖంగాను కూర్చుని భుజించడం మంచిది. తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు, దక్షిణముఖంగా కూర్చుని భుజిస్తే యశస్సు కలుగుతాయని చెప్పబడుతోంది. భోజనానికి కూర్చునే ముందు, కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. బిగుతుగా ఉండే దుస్తులను ధరించారాదు. తలపైన టోపీ వంటివి ధరించారాదు. నెలపైన పద్మాసనస్థితిలో కూర్చుని భుజించడం మంచిది. భోజనానికి ముందు ఈ క్రింది నియమాలను పాటించాలి.
భోజన పదార్థములన్నీ విస్తారాకులోగానీ, పళ్ళేలలోగాని వడ్డించిన అనంతరం, నీటిని కుడిచేతిలోనికి తీసుకుని, గాయత్రీ మంత్రాన్ని జపించి, ఆ నీటిని తినబోవు భోజనంపై చల్లాలి. అనంతరం మళ్ళీ చేతిలోకి నీరు తీసుకుని –
“సత్యం త్వరైన పరిషించామి” – అని అంటూ కుడిచేతిని ఎడమవైపు నుంచి కుడిచేతివరకు ప్రదక్షిణగా విస్తరించుట్టూ ఆ నీరు విడువవలెను.
అదే రాత్రిపూట భోజనం చేసే సమయంలో –
“ఋతంత్వా సత్యేవ పరిషించామి” అని అంటూ నీటినిం విడువవలెను. అనంతరం ఐదుసార్లు ఎన్నో కొద్దీ కొద్దిగా తీసుకుని –
“ఓం ఉదావాయస్వాహా, ఓం ఆపావాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయ స్వాహా” అనే మంత్రాలను పఠిస్తూ నోట్లో వేసుకుని నమలకుండా మింగాలి.
ఈ విధంగా చేయలేనివారు, కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించాలి.
“త్వదీయం వాస్తు గోవిందా
తుభ్యంఎవ సమర్పయామి!
గృహానికి సముఖోభూత్వా
ప్రసీత పరమేశ్వరం||”
ఓ గోవిందా! నీ వస్తువును నీకే అర్పిస్తున్నానుశీ నీవు నాయందు ప్రసన్నుడవై, ప్రసన్నముఖంతో దీనిని గ్రహించు అని అర్థం.
“బ్రహ్మర్పణం బ్రహ్మహవిః
బ్రహ్మగ్నే బ్రహ్మణా హుతమ్!
బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా||
ఆహారాన్ని భుజించే ముందు, నివేదన చేసిన అనంతరం, పైశ్లోకాన్ని పఠించిన అనంతరం, భుజించాలి. అంతేకాకుండా –
“అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాందేహ మాశ్రితః| ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమ్||”
నేను జఠరాగ్ని రూపంగామారి, ప్రాణుల శరీరాలను ఆశ్రయించి, ప్రాణా పానములతో కూడినవాడినై, నాలుగు రకాలైన అన్నాన్ని పచనం చేస్తున్నానని చెప్పి భుజించడం మంచిది. భోజనం చేయడం ముగించిన అనంతరం –
అమృతాపి ధానమాసి రౌరవే ఆపుణ్యానిలయే పద్మార్డుద| నివాసినామ్ ఆర్థినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు” అని శ్లోకాన్ని పలుకుతూ నీటిని అప్రదక్షిణంగా విస్తరిచుట్టూ తిప్పాలి.
భోజనం చేయడం ముగించి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవాలి. నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి. అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి.
“ఆగస్త్యం వైనతేయఇపశ్చ
శవఞ్చ బడబానలమ్
ఆహార పరిపాకార్థం స్మరే
ద్దీమఞ్చ పఞ్చమమ్”
అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు భీములను స్మరించడం వాళ్ళ ఆహారం సమంగా జీర్ణం కాగలదని అర్థం. అలాగే పిల్లలకు ఆహారం పెట్టిన అనంతరం –
“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అని పొట్టను రుద్దాలి.
పెద్దలు కూడా పొట్టపైన చేతిని ఉంచి రుద్దుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించవచ్చు.
సాధారణంగా సాయంత్రం సూర్యాస్తమయం అవుతూనే ఇంటిముందు లైట్లు వేయడం, దీపాన్ని వెలిగించడం ఆచారం. లైట్లు వేయగానే దేవుడి పటంవైపు చూసి నమస్కరిస్తుంటాం. అంతేకాకుండా, దీపాన్ని వెలిగించాక గానీ, లైట్లు వేశాక గానీ –
“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యాదీప నమోస్తుతే!!
అనే శ్లోకాన్ని పఠించాలి.
అంతేకాకుండా,
“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం జ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం
సంధ్యాదీప నమోస్తుతే!!”
“దీపమే పరబ్రహ్మ, దీపమే జనార్ధనుడు. సకల పాపాలను హరింపజేస్తుంది – దీపం. అటువంటి సంధ్యాదీపానికి నామస్కరిస్తున్నాను” అని దీపానికి నమస్కరించాలి.
అలాగే, సాయంత్రం లక్ష్మీదేవిని, ఇషా దేవతలను పూజించవచ్చు.
తులసికోట వద్ద దీపాలను వెలిగించి, ప్రదక్షిణం చేసి నమస్కరించవచ్చు. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించేముందు లేదా లైటు వేసే సమయంలో ఇంటి ప్రధాన వాకిలిని తెరచి ఉంచాలి. పెరటివైపునున్న వాకిలిని మూసి ఉంచాలి.
“యదాతు మానసిక్లాంతే కర్మాత్మానః క్లామాన్వితాః!! విషయేభ్యో నివర్తంతే తదాస్వపితి మానవః!!”
అని చరకసంహితలో పేర్కొనబడింది. మనస్సు అలసట చెందినటువంటి స్థితిలో ఇంద్రియాలన్నీ తమ తమ కర్తవ్యాలను మన మనస్సునకే కైవసం అవ్వడంవల్ల శారీరక మానసిక పనులు చేయలేక విశ్రాంతిని కోరుతాయి. అదే నిద్రావస్థ.
ప్రతిమనిషి కనీసం ఆరుగంటలు నిద్రించాలని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. నిద్రించే ముందు కొన్ని నియమాలను పాటించాలి.
నిద్రించే సమయంలో తడికాళ్ళతో పడుకోరాదు. తడికాళ్ళతో పడుకుని నిద్రిస్తే ఆయుష్షు క్షీణిస్తుంది అని శాస్త్రవచనం. తూర్పువైపుగానీ, దక్షిణంవైపు గానీ తల ఉంచి పడుకుని నిద్రించాలి.
ఇతరుల ఇంట్లో పడుకునే సమయంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి.
ఎప్పటికీ ఉత్తరంవైపున తలఉంచి పడుకుని నిద్రించరాదు. ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యరీత్యా మంచిదని చెప్పబడుతోంది.
నిద్రలేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవాలి.
నిద్రపోవడానికి ముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.
“కరచరణకృతం వా కర్మా వాక్కా యజం వా
శ్రవణ సయసజంవా మానసంవా ప రాధామ్
విహిత మావిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కారుణాబ్దే హి మహాదేవ శంభో”
“చేతులతోగానీ, కాళ్లతోగానీ, మాటలవల్లగానీ, చేతలవల్లగానీ, శరీరంచేతగానీ, చెవులతోగానీ, కళ్ళతోగానీ, మనస్సుతోగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, చేసిన నా సర్వ అపరాధాలను కారుణామయుడవైన ఓ శివుడా క్షమించు” అని ప్రార్థించి నిద్రించాలి.
బ్రాహ్మిముహూర్తంలో నిద్రలేచినప్పటి\నుంచి రాత్రి నిద్రించే వరకు, ఈ విధంగా విధులను ఆచరించడంవల్ల జీవితం సుఖవంతమవుతుంది.
అంతేకాకుండా, ఇంకా వివిధ సమయాల్లో వివిధ శ్లోకాలను పఠించడంవల్ల అనేక సత్ఫలితాలు లభిస్తాయి.
నిద్రించే సమయంలో స్వప్నాలు వచ్చినా…. చెడుకలలు రాకుండా ఉండేందుకు –
“రామం స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనేయః పఠేనిత్యం
దుస్స్వప్నం తస్యనశ్యతి” అనే శ్లోకాన్ని పఠించాలి. ఉరుముతున్నప్పుడు, పిడుగులు పడుతున్న సమయంలో అర్జునునిని స్తుతించాలని పురాణకథనం.
అర్జున ఫల్గుణః పార్థః
కిరిటీ శ్వేత వాహనః
బీభత్సో విజయః కృష్ణః
సవ్యసాచీ ధనుంజయః అనే శ్లోకాన్ని పఠించాలి. ఆనారోగ్యంవల్ల ఏమైనా మందులు వేసుకునే సమయంలొ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.
“ధన్వంత్రిణం గరుత్మంతం – ఫణిరాజంత చ కౌస్తుభం|
ఆచ్యుతం చామృతం చంద్రం – స్మరేత్ ఔషధ కర్మణీ|
శరీరే జర్ఘరీ భూతే – వ్యాధిగ్రస్తే కళేబరే|
ఔషధం జాహ్నవీతోయం -వైద్యోనారాయణోహరిః||” ప్రతినెలా అమావాస్య తర్వాత వచ్చే క్రొత్తనెలలో చంద్రుదు ఉదయిస్తాడు. ఉదయిస్తున్న చంద్రబింబాన్ని నెలబాలుడు అని పిలుస్తారు. సాధారణంగా నెలబాలుని ఆకాశంలో చూస్తూనే, దేవుడి ఫోటోను గానీ ఇష్టమైనవారి ముఖాన్నిగానీ చూస్తుంటారు. అంతేకాకుండా, నూలు పోగును తీసి చంద్రుని వైపు వేస్తుంటారు.
అలాగే నెలబాలుని దర్శిస్తూనే ఈ క్రింది శ్లొకాన్ని పఠించడం మంచిది.
“క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర
హిరణ్మకుట వాసాయా బాలచంద్ర నమొస్తుతే||”
అలాగే, ఇంటినుంచి బయటకు వెళ్ళేముందు –
“యశ్శివో సమారూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో సంస్మరణాతే పుంసాం సర్వతో జయమంగళం
లాభాస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవే
యేషామిందీవర్శ్యామే హృదయాస్థో జ్ఞార్ధనః” అనే శ్లోకాన్ని పఠించడం మంచిది.
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

ధర్మ సందేహాలు

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.

2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం  పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.

నవవిధా భక్తి మార్గాలు


భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తి  అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం 
'పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం
తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా! 
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
శ్రవణ భక్తి: 
సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
కీర్తనా భక్తి: 
భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
స్మరణ భక్తి: 
భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
పాదసేవన భక్తి: 
భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
అర్చన భక్తి: 
ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
వందన భక్తి: 
వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.
దాస్య భక్తి: 
ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
సఖ్య భక్తి: 
సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి: 
ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి ?

భస్మం శివారాధన చేసేవాళ్ళో ,లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే
ఐశ్వర్యం గోషు సంపన్నం (మహాభారతం ) లో చెప్పబడినది. అంటే ఐశ్వర్యం గోవు తో పోల్చారు
గోవు ఎక్కడ ఉంటె అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అనిఅర్ధం . కొంతమంది అడగవచ్చు .ఏమని ,
గోవు ఉంటె ఐశ్వర్యం ఉండటం ఏమిటి అని ,(మహాభారతం గోమాహాత్మ్యం పర్వం ) లో చెప్పబడినది గోమయం లో లక్ష్మి దేవి ఉంటుంది అని. ఆ గోమయాన్ని మనం ముఠాలు అనగా గుండ్రముగా తయారుచేసి దానిని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని (భస్మాన్ని) మనం ధారణ చేస్తున్నాము.అంటే మనము సాక్షాత్తు లక్ష్మిదేవిని ధారణ చేస్తున్నాము.అందుకనే భస్మాన్ని (విభూతిర్భూతిరైస్వర్యం) అన్నారు భస్మము ధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు ,పెద్దలు, చెప్తూఉంటారు. కొన్ని పురాణాలలో
(త్రి పుమ్డ్రేన వినదానం త్రి పుమ్డ్రేన వినా జపం త్రి పుమ్డ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం )అన్నారు.
భస్మం లేకుండా చేసిన దానం ,భస్మం లేకుండా చేసిన జపం, భస్మం లేకుండా చేసిన శ్రాద్ధం ఫలితం ఇవ్వవు అని .
భస్మం ఎవ్వరైనా ధారణ చేయవచ్చు ,భస్మ ధారణ చేసి మహాలక్ష్మి ,పరమేశ్వర అనుగ్రహము పొంది అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు ,ఏ మాత్రము సందేహము లేదు.

కంచు పాత్రల్లో ఎవరు భోజనం చేయకూడదో వివరించండి ?

ఆ పాత్రల్లో మఠాదిపతులు  ,  మతప్రచారకులు,  సన్యాసులు, దీక్ష తీసుకున్నవారు తినకూడదు. కంచు అధికముగా శరీర పటుత్వాన్ని  పెంచుతుంది. తత్కారణంగా ఐహికమైన  విషయలపై   ఆసక్తిని పెంచుతుంది

భార్య భర్తలలో పురుషునికి పెద్ద వయసు ఉండాలంటారు ఎందుకు?

మన ఋషులు మన భద్రతకు, ఒక్కొక్క విషయాన్ని అనుభవ పూర్వకముగా గుర్తించారు.  సామాజిక కారణాలవల్ల స్త్రీలకు సిగ్గు బిడియము ఎక్కువ, అందువలన సంసారిక భాద్యతలలో కష్టించి పోషించాల్సిన భాద్యత మగవాడిదే.  ఆర్ధిక స్థితి గతులన్ని పురుషుడే చూసుకోవాలి.  గృహభాద్యతలు, సంతానాన్ని సక్రమంగా పెంచటం, పురుషుడు కష్టించి తెచ్చిన ధన దాన్యాడులను సక్రమముగా వినియోగించటం, పొదుపుగా కాపురం కొనసాగించటం మాత్రమె స్త్రీ కర్తవ్యం

చెవులెందుకు కుట్టిస్తారు?

ఆడ పిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీ దేవిలా తలచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా వుంది.చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది.

ఏ సంతానాన్ని దానమివ్వాలి?

పెద్దకొడుకు తొలిసంతానం---దైవ సంతానం.  చివరి కొడుకు ముద్దుల కొడుకు --- జ్ఞాన సంతానం.  మధ్యవాడు కామ సంతానం .  కాన , వాడిని  దత్తత ఇవ్వాలి

సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?


ఏ  శుభకార్యములో  లేని  విధంగా  సీమంతం  సమయములో  గర్భినికి  అందరు  గాజులు  తొడుగుతారు .  ఐదోతనంతో   పాటు  పండంటి  బిడ్డను  కనాలని  ఆశిర్వాదిస్తారు . అలా  గాజులు  తొడిగే  కార్యములో  చక్కని  పరమార్థం  దాగుంది . గర్భం  ధరించిన  స్రీ  గర్భకోశం  మీద  కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.

        అందుకే ఏడో నెలలో   శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత  గాజులు  తొడుగుతారు .  చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై  సరియైన   ఒత్తిడి వచ్చి  సుఖప్రసవం జరుగుతుంది.

గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా?

గర్భవతులు 7 వ నెల వచ్చిన తరువాత దేవాలయమునకు వెళ్ళకూడదు.  ఆమె ఆరోగ్య రీత్యా కూడా ఇది సరియైనది కాదు.  అందుకే పాన పూర్వీకులు గర్భవతులు దేవాలయ ప్రవేశము చేయకూడదని చెప్పినారు.  ముఖ్యముగా మూల నక్షత్రము, అనూరాధ నక్షత్రము, అశ్విని నక్షత్రము, జ్యేష్ట నక్షత్రము వారు 5 వ నెల నుండే దేవాలయ ప్రవేశము నిషిద్దము

 భార్య గర్భవతిగా ఉన్నపుడు  భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?

శాస్త్ర ప్రకారముగా ఆవిధముగా చేయక పోవడము మంచిది.  ఎందుకనగా  భార్య గర్భవతిగా వున్నపుడు 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది.  అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము.  అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు.  కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదు. 

అడవారిలాగా మగవారికి పాతివ్రత్య నియమం ఎందుకు పెట్టలేదు?


తప్పు ఎవరు చేసిన తప్పే.  మగవాడు చేసిన దానికి నరకలోకంలో  శిక్షలు స్రిలతో పాటే.  ఐతే  పాతివ్రత్యాన్ని పెట్టకపోవటానికి కారణం, పురుషుడు తప్పు చేస్తే వంశం  చెడదు.  అదే  స్రీ  తప్పు చేస్తే ఆ వంశమే కకావికలమైపోతుంది .  పితృదేవతలు వంశకళంకంతో విలవిలలాడిపోతారు.  స్రీ  తప్పు  చేస్తే  భర్త ముందుతరాల వారందరికీ  ద్రోహం చేసినట్టే

ఆచారము అంటే ఏమిటి?


        ఆచరణీయమైన దానిని ఆచారము అంటారు.  బుద్దివంతులు, మేధావులు, పండితులు, ధర్మవేత్తలు, కులపెద్దలు, ఆగమ కోవిదులు ఎందరెందరో ఆలోచించి, తర్కించి, అనిషిని మహోన్నతుని చేయటానికి, దురాచారం నుండి దూరం చేయటానికి ప్రవేశపెట్టిన ఆలోచనే ఆచారము.  

         మన ప్రాచీన గ్రంధాలలో మనుష్యుల వృత్తినిబట్టి, ప్రవృత్తిని బట్టి మన సమాజములో నాలుగు మాత్రమె కులాలు వున్నవి.  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను వర్ణములు మాత్రమె కలవు.  ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క ఆచారము వున్నది.  కాలక్రమములో శూద్ర వర్ణం వివిధ రకాల మార్పులకు, వివిధమైన చిభాగాలకు లోనైనది.  ఫలితముగా అనేక తెగలుగా విడిపోయి ఎవరికి ఇష్టమైన ఆచారములను వారు స్థిరపరుచుకున్నారు.  ఒక్కొక్క తెగకు ఒక్కొక గురువు (కులపెద్ద) ఉండటమువలన ఎవరి ఆచారాలు వారు అనుసరించడము జరిగినది.  

          ఇందులో కేవలము శూద్రవర్ణము మాత్రమె వివిధ కులాలుగా విడిపోయినది.  అందుకు కారణము వారు విద్యావంతులు కాకపోవటమే.  చాలా వరకు తమ తమ తేగల కట్టుబాట్ల కోసమే ఈ ఆచారములు ఏర్పడినవి.

ఎవరు ముందు చెప్పినట్లు


స్ర్తీయొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!



మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాద సంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా?

బిగ్ బ్యాంగ్ థీరి ఒక అగ్నిగోళం బ్రద్ధలయి స్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!
మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత స్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??

భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!

మరి మన పురాణాలు చెప్పే కాలమాణం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం  ...అంటే 2018 నాటికి 197,29,49,120 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మల్లీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!

మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పకం అంతమందు సకల ప్రాణులూ తన యందు లీనమవుతాయని మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??

ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!
మరి వేల సంవత్సరాల నుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి?? ఎవరు ముందు చెప్పినట్లు?

తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!

అంతకు ముందు భారతీయులకు ఉన్న విమాన శాస్ర్తాన్ని కూడా కాస్త పక్కన పెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారు చేసిన "మరుత్సబి" గాలిలో ఎగిరింది కదా.. మధ్యలో ఆగిపోయిన ఆ విమాన ప్లాన్ ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...

మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!

మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...

పెద్దపెద్ద వృక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్ర్తం కదా!

మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??

తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటే.... మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజిస్తారెందుకబ్బా!......

సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!

మరి మన పురాణాలకాలం వారికి "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...

భారతీయ గోవు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ యుగాలకాలం నుంచి ఎందుకుందబ్బా!.....

లోహవిజ్ఞానంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!

మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తంభం (విష్ణు ద్వజం) ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తభం తుప్పపట్టి కనిపిస్తుందెలా??

నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!

మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??

అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!

మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం" అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని రాశిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరు వచ్చినట్లు తెలుస్తోంది...ఎవరు ముందు చెప్పినట్లు??

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!

మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....

సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!

మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః" అని చెప్పారనుకుందామా??

భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!

విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...

ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....

ప్రస్తుతం భారతదేశం న్యాయవ్యవస్ద విదేశాలను అనుసరించిది అని వాదిస్తుంటారే!
మరి క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం విఘ్నేశ్వరుడు రచించిన "మితాక్షర" గ్రంధం లోని అంశములను తెలియబరుస్తూ యాజ్ఞవల్క ఋషి రచించిన  స్మృతులను, 13వ శతాబ్దంనాటి తెలుగు కవి కేతన రచించిన విఘ్నేశ్వరం అనే గ్రంధంలోని అంశములను, ఇప్పటికి హిందూ న్యాయ వ్యవస్ద అనుసరిస్తున్నదని న్యాయ పుస్తకాల్లోనే ఎందుకుంది?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాశిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...
ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, ఆటలాడి పాటలు పాడాం..```
నేడు నీచులచే వక్రీకరింపబడ్డ మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో ఉన్నాం...

ఇప్పుడు చెప్పండి.. ఎవరు చెప్పినట్లు ముందు ఈ లోకానికి లౌక్యం..?
  
 ఇలాంటి మరుగునపడిన భారతీయ చరిత్ర గురించి చిన్నతన్నం నుండి పాఠ్య పుస్తకాలలోగాని పాఠశాలల ద్వారాగాని పిల్లలకు తెలియనియక మెకలె  విద్యా  విధానం ద్వారా వక్రీకరించబడ్డ చరిత్ర చదివి ప్రతి ఒక్కటీ విదేశీవాడే కనుగొన్నాడన్న ధోరణిలో విదేశాలకు జేజేలు పలుకుతూ మన భరత మాతను భారతదేశాన్ని పనికిమాలిన దేశం ఇక్కడ ఏమున్నదని తిట్టే స్దాయికి చేరుకున్నాం. కనుక మన దేశ ఘన చరిత్ర గురించి భావితరానికి తెలియజేయండి మన పూర్వీకుల జ్ఞాన భాండాగారాన్ని తిరిగి పంచండి అప్పుడే దేశం పట్ల జాతి పట్ల సంస్కృతి పట్ల ఆచార వ్యవహారాల పట్ల గౌరవ భావం తోపాటుగా దేశ భక్తి పెరుగుతుంది.

నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం




మనం తోటివారికి నమస్కరించేటప్పుడుఅది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.



తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.



అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి' ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!

భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది

ఈరోజు శ్లోకాలు దేహత్యాగం లేదా మరణానంతర యాత్ర గురించి చెప్తాయి.  ఈ విషయంలో "భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది.   




పార్వతి దేవి శివుడిని " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు.  "దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు " అని చెప్పాడు. 

పార్వతీ దేవి " నాథా ! బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది. పరమేశ్వరుడు " దేవీ ! ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది " అని చెప్పాడు.

పార్వతీదేవి " నాథా ! మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ? ఎందువలన తగ్గుతుంది ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయకలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తికలిగి ఉండాలి. వీటన్నింటిని మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది. అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటివలన ఆయువు క్షీణిస్తుంది. పార్వతీ " తపస్సుచేతనూ, బ్రహ్మచర్యముచేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములీ తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది " అని  చెప్పాడు.

" నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది " తెలియజెయ్యండి. పరమశివుడు " పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతాలు  వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. సత్యము పలకడం, ఇతరులపట్ల దయకలిగి ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది.

అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్థిని దండించి విద్యాబోధ చేస్తాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది.

జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది.

మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే " అన్నాడు శివుడు.

" పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. 

పార్వతీదేవి " మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? " అని అడిగింది. " పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి " అని చెప్పాడు మహేశ్వరుడు.

పార్వతీదేవి "మానవులు కర్మలు చేస్తుంటారు కదా ! ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా ! లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీలేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు. మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసేపనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయ త్నాలు. ఒక పనిచెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది. నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది.

అలాగే ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు. కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పకకావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు" అని చెప్పాడు శివుడు. స్వస్తి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

ధ్వజస్థంభం పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...