పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన ప్రయోజనం ఏమిటి..?
ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న
మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు
అవసరమవుతాయి. అటువంటి అనుభవం కోసం కొన్ని ప్రాంతాలను,
వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది.
ఇలా వెతుక్కుంటూ వెళ్ళటమే తీర్థయాత్ర. గతంలో ప్రజలు మునీశ్వరుల
దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను
తీర్చుకునేవారు.
ఆ మహానుభావులున్న ప్రదేశాలే పుణ్యక్షేత్రాలయ్యాయి. అటువంటి శక్తి
ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా
లభిస్తుంది. ఆ విశేష స్థలపురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల
మానవుల మనసులో మార్పువస్తుంది.
మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది.
పుణ్యక్షేత్రాల సందర్శన మనస్సు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు
వ్యాపారాభివృద్ధి, అనుకున్న కార్యాలు
దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
ఇట్లు
మీ సుబ్రహ్మణ్య శర్మ
No comments:
Post a Comment