Sunday, November 11, 2018

వన భోజనాల విశిష్ఠత

ప్రకృతి   వనభోజనం,   *కార్తీక   మాసం,
పూజా    విధుల్లో    ముఖ్యమైనది  ..
*కార్తీక   మాసంలో   వనభోజనం*   ఆచరించడం   ఆధ్యాత్మిక,   సామాజిక   భావనలను   పెంచుతుంది.   ముక్తికే   కాదు,   సమైక్యతకు,   చక్కని   ఆరోగ్యానికి   దోహదపడుతాయి,    పర్యావరణ   పరిరక్షణకు   తోడ్పడుతాయి,.   వన  భోజనం   అంటే   పచ్చటి   ఆకుల   మధ్య   ప్రకృతిలో   మమేకమై,   ప్రకృతికి   నివేదించి,.    అందరూ   కలిసి   ఆనందంగా   ఆరగించడం,     వండిన   పదార్థాలను   దేవునికి   నివేదించి,.   వృక్షాల   నీడలో   సామూహింగా   భోజనం   చేయడం_

*ఇలా   వనభోజనం   చేయడంవల్ల   ఆధ్యాత్మిక   ఫలితాలు,   ఆరోగ్యంతో   పాటు   ప్రజల్లో   ఆత్మీయతానురాగాలు   పెంపొంది,   సామాజిక,     సామరస్యతకు,   సమైక్యతకు,   దోహదం   చేస్తుంది,*

ఆనందానికి   సంకేతం   పచ్చదనం,   దాన్ని   పంచుకుంటూ   ఆనందాన్ని   మనసులో   నింపుకొంటూ,   చిన్నపిల్లల   నుంచి   పెద్దవారి   వరకు,    వేద,   పురాణాల   వచనం,   ఆట,  పాటలతో, నృత్య,  గీతాలతో   ఆనందంగా   గడుపుతు,   చెట్టు   కింద    చక్కగా  వంట   చేసుకుని,   పరమేశ్వరుడికి ..  మహా   నైవేద్యం   పెట్టి,   అందరూ   ఒక్కటిగా   నిలబడి   అన్నం  తిని,   ఆ   ప్రకృతి   అన్రుగహాన్ని .., *శివ,  కేశవుల*   అన్రుగహాన్ని     పొందడానికి,    వనభోజనం   చేయాలి_

     గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...

నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..?

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.

_*నాగుల చవితి పూజా విధానం*_

నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద నువ్వులనూనెతో దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో “ఓం నాగేంద్రస్వామినే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో ఆవుపాలు పోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...