ప్రకృతి వనభోజనం, *కార్తీక మాసం,
పూజా విధుల్లో ముఖ్యమైనది ..
*కార్తీక మాసంలో వనభోజనం* ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు, సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి,. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై, ప్రకృతికి నివేదించి,. అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం, వండిన పదార్థాలను దేవునికి నివేదించి,. వృక్షాల నీడలో సామూహింగా భోజనం చేయడం_
*ఇలా వనభోజనం చేయడంవల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది, సామాజిక, సామరస్యతకు, సమైక్యతకు, దోహదం చేస్తుంది,*
ఆనందానికి సంకేతం పచ్చదనం, దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, వేద, పురాణాల వచనం, ఆట, పాటలతో, నృత్య, గీతాలతో ఆనందంగా గడుపుతు, చెట్టు కింద చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి .. మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని .., *శివ, కేశవుల* అన్రుగహాన్ని పొందడానికి, వనభోజనం చేయాలి_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...