Friday, October 25, 2013

కేదారేశ్వర వ్రతము

కేదారేశ్వర వ్రత విశిష్ఠత
మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం ఈ వ్రతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు..

వ్రతవిధానము

భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు మీరు కోరిన వరంబియ్యగలడు.

కేదారేశ్వర వ్రతకథ

సూతపౌరాణీకుడు శౌనకాది మాహర్షుల గాంచి ఇట్లనియె, ఋషిపుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం బనునొక వ్రతంబు గలదు. ఆ వ్రత విధానంబును వివరించెదను వినుండు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు. ఓ ఋషి శ్రేష్ఠులారా ! ఈ వ్రత మాహాత్మ్యంబును వివరించెద వినుండు, భూలోకమునందీశాన్యభాగంబున మెరుపుగుంపులుతో గూడి యున్నను గిరిత్కాల మేఘములుంబోలుచు నిఖిలమణి నిర్మితంబైన శిఖరముల చేతను, పలురంగులైన లతావిశేషములచేతను, బహువిదంబులగు పుష్పఫలాదులచేతను, నానావిధములైన పక్షుల చేతను మరియు ననేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తాల తమాల రసాల హింతాల వకుళాశోకచందన దేవదారు నారికేళామ్రపనసనాగపున్నాగ చంపకాదివృక్షముల చేతను నదియును గాక నానాతరు విశేషముల చేత భాసిల్లునట్టి ఉద్యానవనముల చేత బ్రకాశించుచూ నిఖిల కళ్యాణ ప్రదంబులై సర్వజన నమస్కృతంబై కైలాసం అని పేర్కొనబడియొక పర్వతశ్రేష్టము గలదు. అందు సద్గుణైశ్వర్యసంపన్నులగు మహనీయులగు యోగులచేతను, సిద్ధ, గంధర్వ, కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబయియున్న యా పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రథమగణములచే బరివేష్ఠింపబడి, భవానీ సమేతుడై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచుండి, ప్రసన్నుడై కూర్చుండియున్న యొక సమయంబున చతుర్ముఖాది సురలందరికి దర్శనమిచ్చె. అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మఱియు ఇంద్రాదిదేవతలును వశిష్ఠాది మహర్షులును, రంభా మొదలగు దేవతా స్త్రీలును, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలను,సేనానియు, గణపతియును, తత్సామీప్యంబును బొందియున్న నంది, భృంగి మొదలగు ప్రమధ గణములు తమను పరివేష్టించి కొలుచుచున్నట్టి భవానీ వల్లభుని యత్యద్భుతమంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకులా స్వామి యనుజ్ఞ వడసి గానము జేసిరి. రమణీయంబయి శ్రావ్యంబగు వ్యాదలయలతో గూడి నృత్యమొనర్చిరి. అప్పుడా వేల్పు బానిసెల లోపల మిగుల సొగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించె, ఆ సమయంబున భృంగిరిటి భక్తవరుండా స్వామి సన్నిధియందు తత్ వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా నా పార్వతి కైలాసాధిపతియొక్క పూర్వభాగమునందుండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాసముజనించె. అట్టి యాశ్చక్యకరంబగు హాసమువలన నప్పుడా పర్వతగుహలు నిండునటుల గొప్ప కలకలధ్వనికలిగె, ఇట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడా భృంగిరిటిని జూచి, నీచేత మిగలు హర్ష ప్రవృద్ధంబైన నాట్యము చేయబడెనని మెచ్చి మదంబంది యా భక్తుని యనుగ్రహించె. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు కలుగటంజేసి ప్రీతుండై సకల విధులచేత గౌరవింపబడి, సమాహితచిత్తుడై వినయముతో గూడి యా పార్వతీదేవిని వదలి యీశ్వరునికి మాత్రము ప్రదక్షిణమొనర్చి యాస్వామికి వందన మాచరించె. అప్పుడు పూజ్యురాలగు మృడానియు చిరునవ్వుతో గూడినదై తన భర్తయగు నప్పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామీ ! ఈ భృగిరిటి నన్ను విడిచి మీకు మాత్రము ప్రదక్షిణం బాచరించుటకు గారణంబేమి? వినవేడుకైయున్నది? ఆనతీయవో యని వేడగా, నా శశిశేఖరుండు ఓ ప్రియురాలా ! చెప్పెద వినుము.
పరమార్థవిదులగు యోగులకు నీవలన ప్రయోజనంబులేమింజేసి నాకు నమస్కరించెనని సెలవివ్వగా నా పరమేశ్వరి మిగుల వ్రీడనుబొంది ఆ భర్తయందున్న తన శక్తి నాకర్షించగా స్వామి త్వగస్థి విశిష్టామాత్రానయవుండాయె. అంతట నాదేవియు సారహీనురాలై వికుటరాలయ్యె, పిదప నాదేవి కోపించి దేవతల చేత నూనడింపబడినదై కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధములగు సింహ, శరభ, శార్దూల, గజ, మృగాదులచేత సేవింపబడియు నిత్య వైరంబుడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచేత నిబిడంబగు నానావిధ వృక్ష, లతా, గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్ఠ ప్రదంబై యున్న గౌతమాశ్రమమున బ్రవేశించె. అంత నా గౌతముండు వన్యంబులైన హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను గ్రహించుకొని వనంబునుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమంబగు నిది మిగుల శోభిల్లుచున్న రేకులవంటి కన్నులు గలిగి యలంకృతరాలైయున్న యామహేశ్వరింగనుకొని పూజ్యురాలవైన ఓ భగవతీ ! నీవిచటకేతెంచుటకు కారణంబేమి? అని యడుగ నద్దేవియు నాజడధారికి తన విషాదకరమును వచించి నమస్కరించుచు ఓయీ ! మునీశ్వరుడా ! యే వ్రతము యోగ సమ్మతంబైనదో ఏ వ్రతానుష్టానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో యట్టి వ్రతము ఉపదేశిపుము మనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనంబాచరించి యీప్సితార్థప్రదంబగు శ్రీమత్కేదారనామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశింపగా నంత నాదేవియు నావ్రతానుష్ఠాన క్రమంబానతీయుమని వేడగానిట్లు చెప్పదొడంగె. భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు నీవు కోరిన వరంబియ్యగలడు అని వచించిన నా కాత్యాయనియునట్లే యగును గాక ! యని యాచరించె. అంత పరమశివుండు సంతుష్ఠాతరంగుడయి , యిచ్చటికి దేవగుణంబులతోడ వచ్చి నిజశరీరార్థము నీకిచ్చెదననగా పార్వతి యుప్పొంగి శంకర దేహార్థమునండి లోకానుగ్రహము చేయదలచి తన భర్తయగు నీశ్వరునితో నీ వ్రతంబాచరించిన వారలకు సకలాభీష్టసిద్ది గలుగునటుల యనుగ్రహించితిరేని యెల్లవారు నాచరింతురనగా నట్లే యగుగాక! యని యంగీకరించి సురసంఘములతో గూడ నంతర్హితుండయ్యె. మరికొంత కాలమునకు శివభక్తి యక్తుండగు చిత్రాంగదుడను గంధర్వుండు నంది కేశ్వరునివలన నా వ్రతక్రమంబెఱిగి మనుష్య లోకమునకుంజని వారల కుపదేశింప వలయునను నిచ్ఛగలవాడై యుజ్జయనీ పట్టణమునకు బోయి వజ్రదంతుడను రాజున కుపదేశింప నతడు ఆ వ్రతమును గల్పోక్త ప్రకారంబుగా నాచరించి సార్వభౌముండాయెను.
మరికొంత కాలమునకు నా పట్టణంబుననున్న వైశ్యునకు బుణ్యవతియనియు, భాగ్యవతియనియు, నిద్దరు కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రియొద్దకుబోయి కేదారవ్రత మాచరించునట్లాజ్ఞ యొసంగుమని వేడగా నేనుమిగులరిక్తుండను. దానికీవలయుసామాగ్రి లేమింజేసి మీ సంకల్పంబు మాను డనగా ఓ తండ్రీ ! నీ యాజ్ఞ మాకు పరమదన్యంబు గాన నాజ్ఞయొసగు మని సెలవు పుచ్చుకొని బాదరించుట వటవృక్షమూలంబున కూర్చుండి ప్రతిరసము గట్టుకొని యధావిధిగా పూజింప వారల భక్తికిమెచ్చి యీశ్వరుడు అప్పుడు వలయుసామాగ్రినిచ్చెను.
అంతట వారలు చక్కగా వ్రతం బాచరించుటవలన నమ్మహాదేవుడు ప్రీతుండై యక్కన్యల కాయురారోగైశ్వర్యములును దివ్యరూపంబుల ఒసంగి యంతర్హితుడయ్యెను. పిమ్మట నావ్రతమాహాత్మ్యము వలన నుజ్జయనీ పట్టణమేలుచున్న రాజు పుణ్యవతియును కన్యను చోళభూపాలుడు భాగ్యవతియును కన్యను పాణీగ్రహ మొనర్చినందువలన నావైశ్యుండు ధనసమృద్ధుండై సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖంబున నుండ నంత వారిలో రెండవదియైన భాగ్యవతియనునది యైశ్వర్యమదమోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడలింపబడి పుత్రునితోడ యడవిని తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని యిల్లుచేరి, ఇచ్చట తన బుత్రుని జూపి యోపుత్రా! యక్కయగు పుణ్యవతిని యుజ్జయనీ పట్టణరాజు వివాహమాడియున్నాడు. నీవచ్చటికి జని దానింజూచి ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా నతండా పట్టణమునకు బోయి పెద్దతల్లికి తనయొక్క దుస్సహంబగు కష్టమును దెలపగా నా పుణ్యవతియును సుతునకు విస్తారముగా దనమునిచ్చె, అంతనంతండా ధనమును దీసుకొనివచ్చునెడల మార్గంబున నదృశ్యరూపుండైన యద్దేవునివలన నాధనము నపహరింపబడగా దోదూయమాన మానసుండై నిలువబడియున్న వానితో నీశ్వరుండదృశ్యుండై యో చిన్నవాడా ! వ్రతభ్రష్ఠుల కీధనము గ్రహించనలవిగాదని చెప్పగా నావాక్యము విని విస్మయంబంది యా చిన్నవాడు మరల పూర్వమువలె నచటికింజని యీశ్వరోక్తంబగు వృత్తాంతమును దెలుపగా నా పుణ్యవతి యాలోచించి పుత్రుని వ్రతం బొనర్రింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించునటుల చెప్పవలయునని ద్రవ్యము నొసంగి పంపగా నతండు బయలు వెడలి వచ్చునెడ మార్గంబున నప్రయత్నంబుగ పూర్వము గొనిపోయిన ధనమంతయు స్వవశమైనందున సంతసించి, సర్వము గ్రహించుకొని కాంచీపట్టణమును ప్రవేశించి సమయంబునకు జనియె . అంతట తల్లిదండ్రులతో గూడి సుఖముల ననుభవించుచుండె. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు ఈ అవిచ్చిన్నంబగు నిఖిల సంపదల ననుభవించుచుండిరి, కావున యెవ్వరైనను యదోక్త ప్రకారము నీ వ్రత మహత్మ్యమును భక్తియుక్తులైన వినిన, చదివిన నట్టి వారందరును, శ్రీ మహాదేవుని యనుగ్రహము వలన ననంతంబులగు నాయురారోగ్య ఐశ్వర్యములను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెనని సూతుండు శౌనుకాదులకు చెప్పగా శ్రీ వ్యాసభట్టారsకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను.


కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణము.

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)
శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)


అష్టోత్తర శతనామావళి

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం శశిరేఖాయ నమః
ఓం పినాకినే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం అంబికానాధాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కామారయే నమః
ఓం గంగాధరాయ నమః
ఓం కాలకాలయ నమః
ఓం భీమాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం అశ్వనీరాయ నమః
ఓం పరమాత్మవే నమః
ఓం హవిషే నమః
ఓం సోమాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం కపర్ధినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భవాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం కపాలినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం లలాటక్షాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం కవచినే నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషభరూఢాయ నమః
ఓం సోమప్రియాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం యజ్జమయాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం గణనాధాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం దుర్ధార్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం కృత్తివాసనే నమః
ఓం భగవతే నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం జగద్వాయ్యపినే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం అహిర్భుద్న్యాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం సాత్వికాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం అజాయ నమః
ఓం మృణాయ నమః
ఓం దేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం భగనేత్రవిదే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం తారకాయ నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం అనఘాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిప్రయాయ నమః
ఓం పురారాతయే నమః
ఓం ప్రమధాధిపాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్గురవే నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం శుద్ద విగ్రహాయ నమః
ఓం ఖండపరశువే నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం హరాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అనంతాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీ సదాశివాయ నమః

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...