Friday, October 25, 2013

శ్రీ కుభేర వ్రత కల్పము

వ్రతమునాడు పాటించవలసిన నియమాలు :-

1) ఈ వ్రతాన్ని ఐశ్వర్యము కోరే పురుషులు కాని, స్త్రీలు కాని, దంపతులు కాని, చేయవచ్చు.
2) వ్రతము చేసిననాడు తలస్నానము చేసి ఆరవేసిన బట్టలుగాని, పట్టు బట్టలుగాని ధరించాలి.
3) ఉపవాసం చేయలేనివారు (12 గంటలు దాటకుండా) పూజచేయాలి. శక్తి కలిగిన వారు సాయంకాలం వరకు ఉపవాసం చేసి 6-30 నుండి 9-30 గంటలలోపు పూజచేయవచ్చును.
4) వ్రతము రోజున పగటి నిద్ర మానవలెను.5. ఈ వ్రతాన్ని తొమ్మిది వారాలు చేయాలి.
5) ప్రతి గురువారంనాడు కాని, ప్రతి శుక్రవారంనాడు కాని ఒక నీయమం పెట్టుకుని చెయ్యాలి.
6) స్త్రీలకు మద్యలో ఆటంకము వచ్చినా ఒక వారం మానినా తరువాత వారాలలో పూజలు చేసి, తొమ్మిది పూజలు పూర్తి చేయాలి.దంపతులు చేసినా ఇదే పద్దతి.
7) మొట్ట మొదటి సారి పూజ ప్రారంభిచడానికి మంచి రోజు చూసుకుంటేచాలు. మిగతా వారాలలో వర్జ్య దుర్ముహూర్తాలు లేకుండా చూచుకొని పూజలు చేసుకోవచ్చును.
8) వ్రతము చేసే రోజున మద్య, మాంసాదులు, ఉల్లిపాయలు ముట్టుకోకూడదు.
9) ఆ రోజున పూజ అయ్యే వరకు టిఫిన్లు తినకూడదు.
10) వ్రతం నాడు సాద్యమైనంత వరకు శుచిశుభ్రతలు పాటిచాలి.

కుభేరవ్రత సమయమున చేయు విధులు:-

1) స్నానాంతరం పూజగదిలో మండపం పెట్టేచోట పసుపుతోగాని, ఆవుపేడతోగాని శుభ్రంగా అలకాలి.
2) ఆపైన అందంగా పద్మాలు పెట్టాలి.
3) ఇంట్లో ఈశ్యాన్య దిక్కునగాని, తూర్పు దిక్కునగాని మండపం పెట్టాలి.
4) దాని మీద ఒక పెద్ద తువ్వాలు పరచి 5 సోలలు బియ్యం పొయ్యాలి.
5) వెండిదిగాని, రాగిదిగాని, ఇత్తడిదిగాని ఒక చెంబు బియ్యం మద్యలో నిలపాలి.
6) ఆ చెంబు మీద ఒలచిన కొబ్బరికాయను ఉంచాలి.
7) ఆ కాయ మీద ఒక రవికల గుడ్డను చిలకలా చుట్టి పెట్టాలి.
8) ఆ కలశమునకు వెనుకవైపు కుబేర యంత్రము, కుబేర చిత్రపటము నిలబెట్టాలి.
9) వెండి రూపాయి కాసంత లక్ష్మీ ప్రతిమను చేయించి దానిని, దాని కుడి ప్రక్కను ఒక రూపాయి బిళ్ళను(కుబేరుడుగా)ఒక తమల పాకులో పెట్టి కలశ మందు ఉంచాలి.
10) పూజా సమయంలో కలశలో నీరు పోసి ఒక పైస వెయ్యాలి.
11) పసుపుతో గనపతిని చేసి వేరే పళ్ళెంలో 5 సోలల బియ్యం పోసి ఆబియ్యంలో పెట్టి పూజించి, పూజ అంతా పూర్తిఅయిన తరువాత పసుపు గణపతిని తీసి దాచుకొని, ఈ బియ్యాన్నీ, మండపంలో పోసిన బియ్యాన్నీ కలిపి పూజ చేయించిన బ్రాహ్మనుకు ఇవ్వాలి.
12) తువ్వాలును, కొబ్బరికాయను, కలశను, రవికల గుడ్డను దాచుకొని తరువాత పూజలకు వాడుకోవచ్చును.
13) తొమ్మిది గురువారాలు గాని, తొమ్మిది శుక్రవారాలు గాని ఇలా పూజలు చేసి, పదవ వారంలో ఉద్యాపన చేసుకోవాలి.
14) ఈ 10 పసుపు గణపతులనూ నిర్మాల్యాన్నీ మొదటి నుంచీ జాగ్రత్త పెట్టి ఉద్యాపన అయిన తరువాత ఓక నదిలోనో చెరువులోనో కాలవలోనో నిమజ్జనం చేయ్యాలి.
15) ప్రతివారం పూజలోనూ తొమ్మిది వ్రత పుస్తకాలను కాడా ఉంచి పూజించాలి. పూజతరువాత వాటిని 9 మంది దంపతులకో, ముత్తైదువలకో పంచి పెట్టి వారిని కూడా ఈ వ్రతం చేసి శుభాలు, సంపదలూ పొందండని కోరాలి.
16) లక్ష్మీ స్వరూపమైన ధనానికి కుభేరుడు అధిపతి కనుక ఆయన అనుగ్రహం పొందదానికి వ్రతాంతమందు అష్టలక్ష్మీ, మహాలక్ష్మీ సోత్రాల్నీ, కనకధారాసోత్రాన్నీ పారాయణం చెయ్యాలి.
17) ఉద్యాపనం రోజున 81 కుబేర వ్రత పుస్తకాలను, (శక్తి లేని వారు 9 పుస్తకాలనైనా) పూజించి భక్తులకు పంచి పెట్టాలి. అందువల్ల వారికీ, మనకూ గూడా సుఖసంతోషాలు కలుగుతాయి.
18) ప్రతివారం పూజానంతరం వ్రతకథను శ్రద్దగా వినాలి. తరువాత టెంకాయ కొట్టి నివేదించాలి.
19) పూజావిధానం అంతా అయిన తర్వాత మనం తినే భోజన పదార్దాలు దేవునకు నైవేద్యం పెట్టాలి.
20) ఉద్యాపన మంత్రాలు, వ్రతకథ తరువాత ఉన్నాయి చూడండి.
21) కుబేర వ్రతకల్పం పుస్తకము మీ యింటిలో కూడా ఒకటి ఉండాలి.

కుబేర వ్రతము చేయుట వలన గలుగు సత్ఫలితములు:-

1) ఈ కుబేరవ్రతాన్ని శ్రద్దాభక్తులతో చేసేవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
2) ధర్మబద్ధంగా మనం కోరుకునే కొరికలన్నీ తీరుతాయి.
3) వివాహం కావలసిన యువతీ యువకులకు త్వరలోనే పెండ్లి వేడుకలు జరుగుతాయి.
4) విద్యార్ధులు చేస్తే వారికి విద్యా ధనం దొరుకుతుంది.
5) వ్యవసాయదారులు చేస్తే వారి పొలాలలో మంచి పంటలు పండుతాయి.
6) వ్యాపారస్తులు చేస్తే వారి వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతుంది.
7) సంతానం లేనివారు చేస్తే వారికి పుత్ర సంతానం కలుగుతుంది.
8) ఉద్యోగస్తులు చేస్తే వారికి పదోన్నతి కలగడమేగాక పై అధికారుల మెప్పు లభిస్తుంది.
9) "మిశ్రవసుడు" అంటే గొప్ప విద్యావంతుదని అర్ధం. అతని కుమారుడే కుభేరుడు, ఇతడు తండ్రిలాగానే మహా పండితుడు. అందుచేత ఇతనిని పూజిస్తే ఇహలోక భోగాలతోపాటు మోక్షానికి అవసరమైన బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తుంది. అంటే ఈ పూజ ఇహపరసాధనమైన మహయజ్ఞం వంటిదని భక్తులు గ్రహించాలి.
10) ఈ లోకంలో ఏ కష్టాలూ, రోగాలూ, దారిద్ర్య బాధలూ లేకుండా జీవించి మానవులు తరించాలంటే ఈ వ్రతం కంటే సులభమైన ఉపాయం మరొక్కటి లేదు. 

కావలసిన వ్రత సామాగ్రి:-

పసుపు 20 గ్రా,
కుంకుమ 20 గ్రా,
తమలపాకు 25,
పోకచెక్కలు లేదా వక్కపొడి పొట్లములు 6,
అగరువత్తులు,
హారతి కర్పూరము 8 బిళ్లలు,
కొబ్బరి కాయ స్వామి వారికి కొట్టుటకు.
బెల్లం ముక్క,
గణపతికి నివేదనకు పళ్లు 6,
ప్రసాదము పాలతో చేసిన పిండి వంట లేదా కోవా పూజకు పువ్వులు కలశకు వేయు పూలదండ గంధము,
పసుపు లేదా కుంకుమాక్షతలు,
దూదితో చేసిన వస్త్రములు 2+2,
యజ్ఞోపవేతములు 2+2,
దీపారాదన సామాగ్రి,
కుంది,
వత్తులు,
నూనె,
అగ్గిపెట్టె,
సామానులుంచుకొనుటకు పళ్లెము,
ఆచమనము వగైరాలకు పంచపాత్ర ఉద్దరణి,
చిన్న పళ్లెము,
చేతి గంట,
అగరువత్తులు పెట్టుటకు స్తాండు,
కుబేర యంత్రము,
ఫోటో కలశ వెనుక ఫోటో,
యంత్రము పటము కట్టి ఉంచుకోవలయును.

శ్రీ ధనలక్ష్మీ జపనిధి

ఆచమ్య

మమ ధనలక్ష్మీ, ప్రసాదేన అఖండైశ్వర్యాభి వృద్యర్ధం
మనో వాంఛా పరిపూర్త్యర్దం ధనలక్ష్మీ మహామంత్రజపం కరిష్యే!
అస్య శ్రీ ధనలక్ష్మీ మహామంత్రస్య బ్రహ్మఋషయే నమః గాయత్రీ ఛందస్సే నమః ధంబీజాయ నమః హ్రీం కీలకాయ నమః శ్రీం శక్తయే నమః శ్రీ ధనలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్దే జపేవినియోగః

కరన్యాసమ్

ఓం థం అంగుష్టాభ్యాంనమః
ఓం హ్రీం తర్జనీభ్యాం స్వాహా
ఓం శ్రీం మధ్యమాభ్యాం వషట్
ఓం శ్రీం అనామికాభ్యాంహుం
ఓం హ్రీం కనిష్టకాభ్యాం వౌషట్
ఓం థం కరతలకర పృష్టాభ్యాం ఫట్

అంగన్యాసమ్

హృదయానమః
శిరసేస్వాహా
శిఖాయైవషట్
కవచాయహుం
నేత్రత్రయాయ వౌషట్
ఆస్తృయఫట్
కరన్యాసమైన పిదప అంగన్యాసము చేయవలెను.
భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ధ్యానం

శ్లో" పద్మాసనే స్థితాం దేవీం పద్మసన్నిభ కోమలాం
ఐశ్వర్య దాత్రీం భక్తానం కుభేరాజ్ఞానువర్తినీం
ధనదాంతాం మహాదేవీం ధ్యాయామి మనసా సదా"
తరువాత నిర్మలమైన మనస్సుతో 108 సార్లు తక్కువ కాకుండా యీ క్రింది మంత్రమును పఠించవలెను.

ధన లక్ష్మీ మూల మంత్రము:-

(ఓం థం హ్రీం శ్రీం ధనదాదేవ్యై నమః)
జపానంతరము "మయాకృత జపం ధనలక్ష్మీ దేవతార్పణమస్తు". అని నీటిని వదిలి పెట్టవలయును.

శ్రీ ధనలక్ష్మీసంపన్న కుబేరయంత్రము పూజా, జపనిధి

కుబేర మూలమంత్రానికి కరాంగన్యాసాలు

ఆచమ్య. . . . . . . . శ్రీ చిత్ర రేఖా సమేత శ్రి కుబేర స్వామి నమః ప్రీత్యర్ధం శ్రీ కుబేర మూల మంత్ర జపం కరిష్యే.

కరన్యాసమ్

ఓం రాజాధి రాజాయ - ఓం థం అంగుష్టాభ్యాంనమః
ఓం వైశ్రవణాయ - ఓం హ్రీం తర్జనీభ్యాం నమః
ఓం కుబేరాయ - ఓం శ్రీం మధ్యమాభ్యాం నమః
ఓం రాజాధి రాజాయ - ఓం శ్రీం అనామికాభ్యాంనమః
ఓం వైశ్రవణాయ - ఓం హ్రీం కనిష్టకాభ్యాం నమః
ఓం కుబేరాయ - ఓం థం కరతలకర పృష్టాభ్యాం నమః

అంగన్యాసమ్

హృదయానమః
శిరసేస్వాహా
శిఖాయైవషట్
కవచాయహుం
నేత్రత్రయాయ వౌషట్
ఆస్తృయఫట్
భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ధ్యానమ్:

శ్రీ సోమపాదభక్తాయ నిధీనామ్ పాలకాయచ,
ఆశ్రితాభీష్ట సందాత్రే రాజాధిరాజాయతే నమః.

కుబేరమూలమంత్రం:

ఓం "రాజాధిరాజాయ వైశ్రవణ కుబేరాయ నమః".

కుబేరగాయత్రి:

"రాజరాజాయ విద్మహే వైశ్రవణ కుబేరాయ ధీమహి,
తన్నః కుబేరః ప్రచోదయాత్."
మూలమంత్ర జపం తరువాత ఈ కుబేర గాయత్రిని కనీసం 28 సార్లు జపిఓచాలి.

వ్రతవిధానము

పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో ముందుగా ఈ క్రింది మంత్రములతో లోపలకు తీసుకోవాలి.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః చేతులు కడుగుకొని దీపారాదన చేయాలి. దీపమునకు గంధం అద్ది కుంకుమ పెట్టి ఈ క్రింది మంత్రముతో దీపం వెలిగించాలి. మం" దీపోజ్యోతిః పరబ్రహ్మ దీపస్పర్వతమోపహః,
దీపేనాసాద్యతే సర్వం దీప దేవ నమోస్తుతే"
ఓం రక్త ద్వాదశ శక్తి యుక్తాయ దీపనాధాయ నమః
ఈ మంత్రముతో వెలిగించి అక్షతలు పుష్పము ఈ క్రింది మంత్రముతో దీపము క్రింది భాగమున ఉంచవలెను. ఓం దీపదేవతాబ్యో నమః
దీపము వెలిగించిన తరువాత మరల మూడు మార్లు ఉద్ధరిణితో నీటిని ఈ క్రింది మంత్రములతో లోనికి తీసుకోవలయును.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః
చేతులు కడుగుకొని ఈ క్రింది నామ మంత్రములు చదవవలయును.
గోవింద, విష్ణో, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, స్ంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హారే, శ్రీకృష్ణాయ నమః

ఈ క్రింది శ్లోకమును చెప్పుచు గంటవాయించవలెను.

శ్లో" ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కుర్వేఘంటారావం తత్ర దేవతా హ్వానలాంఛనమ్
ఈ క్రింది శ్లోకము చెప్పుచు భూమి మీద పూజ చేయవలెను.

శ్లో" అపసర్పంతు యే భూతాః యే భూతా భువి సంస్థితాః
యే భూతాః విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా"

శ్లో" అపక్రామంతు యే భూతాః యే భూతా భూమిభారకా
యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా"
పృధ్వి! త్వయా ధృతాలోకాః దేవిత్వం విష్ణునా ధృతా"
త్వం చ ధారయ మాం దేవి పవిత్రం చాసనం కురు
అని ప్రార్దించి పుష్పాక్షతలచే భూమిని పూజించి

సంకల్పము

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ ధనలక్ష్మీ సహీ కుబేర దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి యోర్మద్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన........ సంవత్సరే .......ఆయనే....... ఋతౌ.......మాసే. ............ పక్షే......తిథౌ.......వాసరే....... శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః ధర్మపత్నీసమేతః శ్రీమతః....గోతస్ర్య.......నామధేస్య స్త్రీలైనచో శ్రీమత్యాః...........గోత్రవత్యాః...........నామదేయ వత్యాః మమ ఆర్యోగ్య ధనలక్ష్మీ సంపన్న శ్రీ చిత్ర రేఖా సమేత కుబేర ప్రసాదేవ అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం మనోవాంఛా ఫలసిద్ధ్య ర్ధం, ఆర్యోగ్య ధనలక్ష్మీ సంపన్నకుబేర వ్రతం కరిష్యే ఆధౌనిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే, తదంగ కలశపూజాం కరిష్యే. పంచపాత్రకు మూడు వైపుల గంధము కుంకుమలు అద్ది గంధము,పుష్పములు అక్షతలు కలశలో వేసి అరచేతితో మూసి ఈ క్రింది శ్లోకమును చదవవలెను. శ్లో" కలశ్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యదర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయ కారకాః"
కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్య

కలశములోని నీటిని పుష్పముతో దేవునిపైన తమపైమ పూజాద్రవ్యములపైన చల్లుకొని పసుపుతొ చేసిన గణపతిపై ఈ క్రింది మంత్రముతో పుష్పాక్షతల నుంచవలెను. ఓం గణానాం త్యా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం.

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనఃశృణ్య న్నూతిభిస్పీద సాదనమ్. అస్మిన్ హరిద్రా బింబే సాంగం సాయుధం సహవానం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం గణపతి మావాహయామి, స్థాపయామి, పూజాయామి.
శ్రీ మహగణపతే స్థిరోభవ !వరదోభవ! శ్రీ అని పుష్పాక్షతలుంచి మరల పుష్పము అక్షతలు తీసకుని
ఓం శ్రీ గణపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహసనం సమర్పయామి, (అక్షతలుంచవలయును)
పాదయోః పాద్యం సమర్పయామి (పుష్పముతో నీటిని చల్లవలయును)
శ్రీ గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పముతో నీటిని చల్లవలయును)
శ్రీ మహగణపతయే నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పముతో నీటిని చల్లవలయును)
శ్రీ మహగణపతయే నమః
గంగాగోదావరీ కృష్ణా కావేరి నిర్మలైర్జలై
స్నపయామి గణాదీశ! ఆత్మశుద్ధ్యై గజానన"స్నపయామి"(ఆకులతో నీటిని చల్లవలయును)
శ్రీ మహగణపతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి. (చేసియుంచిన వస్త్రములను ఉంచవలెను)
శ్రీ మహగణపతయే నమః ఉపనీతం సమర్పయామి. (చేసియుంచిన యజ్ఞోపవీతం ఉంచవలెను)
శ్రీ మహగణపతయే నమః గంధం సమర్పయామి. (గంధము పుష్పమునకు అద్ధి దేవునకు సమర్పించవలయును)
శ్రీ మహగణపతయే నమః దూర్వాయుగ్మం సమర్పయామి.(2 దూర్వలు (గరికపోచలు) దేవునికి సమర్పించవలెను)
శ్రీ మహగణపతయే నమః అలంకరణార్ధం పుష్పాక్షతైః పూజయామి.(గణపతిని పుష్పములతో అక్షతలతో యీ క్రింది నామాలు చెప్పుచు పూజింపవలయును)

ఓం సుముఖాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం కపిలాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః ,ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గుజకర్ణకాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజాననాయ నమః,
ఓం లక్ష్మీగణపతయే నమః, ఓం వికటాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః
శ్రీ మహగణపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి.(అగరువత్తులు వెలిగించి ఆ పొగ స్వామివరికి ఈ క్రింది మంతముతో చూపవలయును.)

వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగంధై స్సుంసంయుతః,
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్,
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి
ఈ క్రింది మంతముతో దీపము చూపవలయును
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి
ధూపదీపానంతర ఆచచమనీయం సమర్పయామి (ఆకులతో నీటిని చల్లవలయును.) పండు లేదా బెల్లం ముక్క స్వామి ముందు ఉంచి ఈ క్రింది శ్లోకముతో స్వామివారికి చూపవలయును.

శ్లో" నైవేద్యం గృహ్యతాం దేవ వరసిద్ది వినాయక,
భక్త్యా సమర్పితం భుక్త్యా మాంరక్ష గమాయక
ఓం ప్రాణాయ స్వాహా - ఓం ఆపానాయ స్వాహ - ఓం వ్యానాయ స్వాహ

ఓం ఉదానాయ స్వాహ - ఓం సమానాయ స్వాహ
(ఈ అయిదు మంత్రములతో స్వామివారికి చూపవలెను.)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (పుష్పముతో నేరు వదలవలయును) శ్రీ మహగణపతయే నమః (అమృతాపిధానమసి), ఉథరాపొశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి,
పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహగణపతయే నమః తాంబూలం సమర్పయామి. (తాంబూలము ఉంచవలయును). శ్రీ మహగణపతయే నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. (హారతి కర్పూరం వెలిగించి ఈ క్రింది మంత్రముతో హారతి నివ్వవలయును.)
శ్లో" నీరాజనం ప్రదాస్వామి భక్తియుక్తేన చేతసా
స్వీకుష్య గణేశత్వం ఈశపుత్ర నమోస్తుతే
(మరలా పూవులు అక్షతలు తీసుకొని ఈ క్రింది మంత్రము చెప్పి స్వామి వారికి సమర్పించవలయును.)

శ్లో" గౌరీపుత్ర నమస్తేస్తు లంబోదర వినాయక
మంత్రపుష్పమిదం దేవ స్వీకురుష్య హరాత్మజ
శ్రీ మహాగణాధిపతయే సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

(ఈ క్రింది శ్లోకము చదివి పుష్పాక్షతలు స్వామివారి ముందు ఉంచవలెను.)
శ్లో" ఆయుర్దేహి శ్రియం దేహి లంబోదర హరాత్మజ
మమ పూజావిధానేన సంతుష్టోభవ సర్వదా
(చేతిలో అక్షతలు నీరు వేసుకుని ఈ క్రింది మంత్రముతో సెఆమివారి ముందు ధారపోయవలెను)
అనయా ఆవాహనాధి షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతిః సుప్రీతః వరదోభవతు

(ధార వదలి స్వామివారిని పూజించిన పుష్పము అక్షతలు ఈ క్రింది మంత్రముతో శిరస్సున ధరింపవలయును.)
శ్రీ మహగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
స్వామివారిని కదుపుతూ ఈ క్రింది మంత్రమును చెప్పవలయును.
"శ్రీ మహగణపతిం యథాస్తానం ప్రవేశయామి, శోభనార్దే క్షేమాయ పునరాగమనాయచ

ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేర స్వామి

వ్రతము

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయానం శుభతిథౌ శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేర ప్రసాదేవ అఖండ ఐశ్వర్యాభివృద్దర్ద్యం, ఇష్ట్కామ్యార్ధ సిద్య్ద్ధర్ధం శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేరవ్రతం కరిష్యే.(అని సంకల్పము చేసి) అస్మిన్ కలశే సమస్త తీర్ధాదిపం వరుణం, తదగ్రే శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేర స్వామినం సాంగం సాయిధం సవాహన సశక్తీ పత్నీ పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి.(పుష్పాక్షతలు కలశపై ఉంచవలెను.)

ధ్యానమ్:

(పుష్పములు,అక్షతలు చేతబుచ్చుకొని)
ధనలక్ష్య్మాసమాయుక్తకుబేర వరదాయక
అశ్వవాహన హేస్వామిన్ ధ్యాయామి మనసా ముదా శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేర ధ్యాయామి (దేవునిపై పుష్పాక్షతలు ఉంచవలెను)

ఆవాహనమ్:

మరల పుష్పములు, అక్షతలు చేతబుచ్చుకొని)
ఆవాహయామి త్యాం భక్త్యా ఉత్తరాశాపతే విభో
శక్తి సంయుత మాంరక్ష బింబేస్మిన్ సన్నిధిం కురు
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేర మావాహయామి (దేవునిపై ఉంచవలెను)

రత్నసింహసనమ్:

(పూలు అక్షతలు మరలా తీసుకొని)
సింహసన మిదం రమ్యం సౌవర్ణం రత్నభూషితం
కల్పితం చ మయాభక్త్యా స్వీకురుష్వ దయానిధే
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః రత్నసింహాసననార్ధం పుష్పాక్షతాన్ సమర్పయామి.

పాద్యము:

(పాద్యమునకు నీటిని పూలతో చల్లాలి)
శ్లో" పాద్యం గృహాణ యక్షేశ గంధాడ్యం సుమనోహరం
శీతలం స్పర్శసుఖదం సర్వమాలిన్య శోధకమ్
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః పాదయోః పాద్యం సమర్పయామి.(ఉదకము పుష్పముతో చల్లవలయును.)

అర్ఘ్యము:

(పూలు అక్షతలు నీళ్ళతో కలిపి ఇవ్వాలి.)
శ్లో" అర్ఘ్యం గృహాణ దేవేశ యక్షరాజ ధన ప్రియ
గంధ పుష్పాక్షతైరుక్తం సలిలం పావనం శుభం
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనం:

గంగానది సర్వతీర్దేభ్య ఆనీతం నిర్మలోదకం
భవదాచమనార్దం హే కృబేర! ప్రతి గృహ్యతామ్.
ఆచమనీయం సమర్పయామి.(రెండుమార్లు పుష్పముతో ఉదకము చల్లవలెను)

పంచామృతస్నానమ్:

(పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన మిశ్రముతో)
దధిక్షిరాజ్య మదుభిః శర్కరాఫల సంయుతం
పంచామృత స్నాన మిదం గృహాణ ధననాయక
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః పంచామృతస్నానం సమర్పయామి.

శుద్ధోదక స్నానం:

(మంచి నీటి స్నానం)
గంగా గోదావరి కృష్ణా కావేరి నిర్మలై ర్జలైః
స్నపయామి కుబేర త్వాం కురు స్నానం హరప్రియ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః శుద్ధోదకస్నానం సమర్పయామి

వస్త్రం:

(ప్రత్తితో చేసిన వస్త్రములు తీసుకొని
శ్లో" వస్త్రం దాస్యామి సౌవర్ణం కాంచనం చోత్తరీయకం
స్వీకురుష్య త్ర్యంబక సఖ సౌఖ్యం దేహి సురేశ్వర
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి.(స్వామివారికి వస్త్రములు ఉంచవలెను)

యజ్ఞోపవీతమ్:

(ప్రత్తితో చేసిన పసుపు దారము తీసుకొని)
శ్లో" యజ్ఞోపవీత మమలం బ్రహ్మణా నిర్మితంపురా
స్వర్ణసూత్రసమాయుక్తం స్వీకురుష్య ధనేశ్వర
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. (యజ్ఞోపవీతములు ఉంచవలయును)

గందము:

శ్లో" కర్పూరాగుర కస్తూరీ సుగణ్ద ద్రవ్య వాసితం
గంధం దాస్యామి విత్తేశ స్వీకురుష్య సుశోభవ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః గంధాన్ సమర్పయామి(పుష్పమునకు గందము అద్ది స్వామివారికి సమర్పించవలయును)

అక్షతలు:

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులూన్ శుభాన్
సువర్ణ వర్ణ సంయుక్తాన్ గృహాణ వరదోభవ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః అక్షతాన్ సమర్పయామి.(అక్షతలుంచవలయును)

పుష్పములు:

శ్లో" మల్లికా మాలతీ జాతీ చంపకా వకుళా నిచ
ఉపాహరామి పుష్పాణి స్ఈ కురుష్య ధనప్రియ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః పుష్పాణి సమర్పయామి.(పుష్పములతో స్వామివారిని పూజింపవలయును)

అథ అంగ పూజా

ఓం యక్షరాజాయ నమః - పాదౌపూజయామి
ఓం గూఢగుల్ఫాయ నమః - గుల్ఫౌపూజయామి
ఓం ధన ప్రియాయ నమః - జంఘేపూజయామి
ఓం రంభోరవే నమః - ఊరూపూజయామి
ఓం యక్షరాజాయ నమః - కటింపూజయామి
ఓం నిమ్ననాభాయ నమః - నాభిం పూజయామి
ఓం సువక్షసే నమః - వక్షస్థల పూజయామి
ఓం దీర్ఘబాహవే నమః - బాహూపూజయామి
ఓం సుకంఠాయ నమః - కంఠంపూజయామి
ఓం చంద్రవదనాయ నమః - ముఖంపూజయామి
ఓం సునాసికాయ నమః - నాసికాంపూజయామి
ఓం సునేత్రాయ నమః - నేత్రేపూజయామి
ఓం ధనపతయే నమః - ముఖంపూజయామి
ఓం కుబేరాయ నమః - సర్వాణి అంగాణి పూజయామి
ఇతి అంగ పూజ

కుబేరాష్టోత్తర శతనామావళిః

ఓం కుబేరాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం శ్రీదాయ నమః
ఓం రాజరాజాయ నమః
ఓం ధనీశ్వరాయ నమః
ఓం ధనలక్ష్మీ ప్రియతమాయ నమః
ఓం ధనాడ్యాయ నమః
ఓం ధనిక ప్రియాయ నమః
ఓం దాక్షిణ్యాయ నమః
ఓం ధర్మనిరతాయ నమః
ఓం దయావతే నమః
ఓం ధృడవ్రతాయ నమః
ఓం దివ్యలక్షణ సంపన్నాయ నమః
ఓం దీనార్తి జనరక్షకాయ నమః
ఓం ధాన్యలక్ష్మీ సమారాద్యాయ నమః
ఓం ధైర్యలక్ష్మీవిరాజితాయ నమః
ఓం దయారూపాయ నమః
ఓం ధర్మబద్దయే నమః
ఓం ధర్మసంరక్షణోత్సుకాయ నమః
ఓం నిధీశ్వరాయ నమః
ఓం నిధీనాం పరిపాలకాయ నమః
ఓం నియంత్రే నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిష్కామాయ నమః
ఓం నిరుప్రదవాయ నమః
ఓం నవనాగ సమారాధ్యాయ నమః
ఓం నవసంఖ్యా ప్రవర్తకాయ నమః
ఓం మాన్యాయ నమః
ఓం చైత్రరదాదీశాయ నమః
ఓం మహాగుణ గనాన్వితాయ నమః
ఓం యాజ్ఞికాయ నమః
ఓం యజనాసక్తాయ నమః
ఓం యజ్ఞభుజే నమః
ఓం యజ్ఞ రక్షకాయ నమః
ఓం రాజచంద్రాయ నమః
ఓం రమాదీశాయ నమః
ఓం రంజకాయ నమః
ఓం రాజపూజితాయ నమః
ఓం విచిత్ర వస్త్ర వేషాడ్యాయ నమః
ఓం వియద్గమన మానసాయ నమః
ఓం విజయాయ నమః
ఓం విమలాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం వందారు జనవత్సలాయ నమః
ఓం విరూపాక్ష ప్రియతమాయ నమః
ఓం విరాగిణే నమః
ఓం విశ్వతోముఖాయ నమః
ఓం సర్వ వ్యాప్తాయ నమః
ఓం సదా నందాయ నమః
ఓం సర్వ శక్తి సమన్వితాయ నమః
ఓం సామదానతరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సర్వభాదా నివారకాయ నమః
ఓం సుప్రితాయ నమః
ఓం సులభాయ నమః
ఓం సోమాయ నమః
ఓం సర్వకార్య ధురంధరాయ నమః
ఓం సామాగానప్రియాయ నమః
ఓం సాక్షాత్ విభవశ్రీ విరాజితాయ నమః
ఓం అశ్వవాహన సంప్రీతాయ నమః
ఓం అఖిలాండ ప్రవర్తకాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం అర్చన ప్రీతాయ నమః
ఓం అమృతాస్వాదనప్రియాయ నమః
ఓం అలకాపురవాసినే నమః
ఓం అహంకార వివర్జితాయ నమః
ఓం ఉదారబుద్దయే నమః
ఓం ఉద్దామ వైభవాయ నమః
ఓం నరవాహనాయ నమః
ఓం కిన్నరేశాయ నమః
ఓం వైశ్రవణాయ నమః
ఓం కాలచక్ర ప్రవర్తకాయ నమః
ఓం అష్టలక్ష్మ్యా సమాయుక్తాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అమలవిగ్రహాయ నమః
ఓం లోకరాధ్యాయ నమః
ఓం లోకపాలకాయ నమః
ఓం లోకవంద్యాయ నమః
ఓం సులక్షణాయ నమః
ఓం సులభాయ నమః
ఓం సుభగాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం శంకరారాదన ప్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శుద్ధగుణోపేతాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శుద్దవిగ్రహాయ నమః
ఓం సర్వాగమజ్ఞాయ నమః
ఓం సుమతయే నమః
ఓం సర్వదేవ గణార్చితాయ నమః
ఓం శంఖచక్రదరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం శమాదిగుణ సంపన్నాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం దీనవత్సలాయ నమః
ఓం పరీపకారిణే నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం తరుణాదిత్య సన్నిభాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం సర్వగుణోపేతాయ నమః
ఓం సురేంద్ర సమవైభవాయ నమః
ఓం విశ్వఖ్యాతయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం విజ్ఞానినే నమః
ఓం జ్ఞానినాం వరాయ నమః
ఓం అనంత దేవతా సేవ్యయా నమః
ఓం అనంతానం సౌఖ్యాదాయ నమః
శ్రీ ఆరోగ్య-కుబేర లక్ష్మీ సమేత శ్రీ కుబేరాయ నమః

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

ధూపము:

శ్లో" దశాంగం గగ్గులోపేతం గంధాడ్యం సుమనోహరం
ధూపం కుభేర గృహ్ణీష్వ ప్రసన్నో భవసర్వదా
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః ధూపమాగ్రయామి.
(అగరువత్తులు వెలిగించి చూపవలెను)

దీపము:

(రెండు వత్తులు వేసిన దీపము వెలిగించి చూపవలెను)
శ్లో" సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా
దీపం స్వీకుర హే దేవ! అజ్ఞాన తిమిరాపహమ్
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః దీపం దర్శయామి.(ఆ పుష్పముతో నీటిని కలశ యందుంచవలయును.)

నైవేద్యము:

శ్లో" నైవేద్యం షడ్రసోపేతం ఫలయుక్తం మనోహరం
గృహ్యతాం చంద్రధవళదధినా సంయుతం విభో
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః నైవేద్యం సమర్పయామి.(నైవేద్యము పెట్టు పదార్దములు స్వామివారి ఎదుట పెట్టి ఈ క్రింది మంత్రములతో అయిదుమార్లు స్వామికి చూపవలయును.)
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా
మద్యే మద్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోశనం సమ్ర్పయామి, హస్తౌ, పాదౌ, ప్రక్షాళయామి, శుద్ధాచమనం సమర్పయామి.

తాంబూలము:

శ్లో" ఫూగీఫల సమాయుక్తం కర్పూరేణ సమన్వితం
ఏలా లవంగ మిళితం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః తాంబూలం సమర్పయామి. (తాంబూలమునుంచవలెను.)

నీరాజనము:

శ్లో" నీరాజన మిదం తుభ్యం మంగళాయతనం మహత్
మంగళా వాప్తయే దాస్యే గృహాణ వరదోభవ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః నీరాజనం దర్శనయామి.(హారతి కర్పూరము వెలిగించి స్వామి వారికి చూపించవలయును )

మంత్రపుష్పము:

శ్లో" మంత్రంపుష్పం ప్రదాస్వామి భక్తియుక్తేన చేతసా
స్వీకురుష్య ధనా దీశ పాహిమాం కృపయానఘ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః మంత్ర పుష్పం సమర్పయామి

ప్రదక్షణలు:

శ్లో" ప్రదక్షిణం కరిష్యామి త్రివారం త్రిగుణాత్మక
అపాకురు మదీయాంత ర్మాలిన్యాని శుభావహ!
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాః కృపయా దేవ శరణాగతవత్సల
అన్యధ్యాశరణం నాస్తి త్వమేన శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నిధీశ్వర!
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.(మూడుసార్లు సాష్టాంగదండ ప్రణామములు ఆచరించవలయును.)

ప్రార్ధనా నమస్కారములు:

శ్లో" చిత్రరేఖా సమాయుక్త! కుబేర! నిధిపాలక!
యథాశక్తి భవత్ ప్రీత్యై వ్రతం భక్త్యా కృతం మయా
శ్లో" సంతుష్టోభవ హే స్వామిన్ మమకామ్యంప్రపూరాయ
సాదరం ప్రణమామి త్యాం క్షమస్వ త్రాహి మం ప్రభో
ప్రార్ధనా నమస్కారాన్ సమర్పయామి.
అనయా ధ్యానవాహనాధి కల్పోక్త షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేస్వామి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.(అక్షతలు, నీళ్ళు వదలాలి)
శ్రీ కుబేర ప్రసాదం శిరసా గృహామి. హరిః ఓం తత్సత్
ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. (కొంచెము నీళ్ళు వదలాలి.)


కుబేర వ్రత కథ

నైమిశ్యారణ్యములో మహర్షులంతా సతయ్రాగము చేస్తుండగా ఆ యాగానికి వ్యాస శిష్యుడైన సూతులవారు కూడా వచ్చారు. మధ్యాహ్న సమయంలో మహర్షులంతా సూతులవారి వద్దకు చేరి "ఓ సూతా! సర్వపురాణాలు వ్యాసుల వారి వద్ద తెలుసుకొన్న మహనీయుడవు. ఈ భూ మండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంతారు. ఆ సుఖం ఏంతో కష్ట్పడి తపస్సుచేస్తేగాని, భగవంతుని అనుగ్రహం వల్లగాని లభించదు. అంత కష్టపడే స్వభావం కలియుగంలో మానవులకు ఉండదు. తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతం చేయాలో దానిని మాకు తెలియజేయుము." అని ప్రార్థించిరి. అపుడు సూతులవారు "ఓ మహర్షులారా! లోకుల మేలు కోసం మంచి ప్రస్న వేశారు. అటువంటి వ్రతం ఒకటి ఉంది. దానిని కుబేర వ్రతం అంటారు. ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలుగగా, దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు. అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడిగా అదికారము పొందినాడు. అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకొన్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మీ. లక్ష్మీసహితుడైన ఆ కుబేరుని ఆరాధించినవారు ధనవంతులై సుఖపడతారు. అందులో సందేహము లేదు. కుబేరునికి ఈ పదవికలుగుటకు కారణం చెబుతాను శ్రద్ధగా వనండి." కాంచీపురంలో ధనదత్తుడనే షావకారు ఉండీవాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. ధనాని సంపాదించడమేగాని ఖర్చు పెట్టేవాడు కాదు.అతడు ఆరోజుల్లో చాలా ధనవంతుడనే పేరు ప్రతిష్టలు సంపాదించాడు. దానికి తోడు నలుగురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు ఉండేవారు. ధన సంపద కుటుంబ సంపద గల ఆ షావుకారు, కుటుంబం గడవడానికి కూడా సరిగా ఖర్చు పెట్టక పీనాసి తనంతో జీవయాత్ర గడిపేవాడు. పిల్లలందరికీ ఈ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అల్లుళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వ్యాపారాలు చేయించేవాడు. చివరకి ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరమొస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందూ వెనుకా చాలా ఆలోచించేవాడు. దేవాలయాలకి వెళ్లి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసయినా దానం చేసిన పాపాన పోలేదు. పీనాసివాడనే పేరు తాను పొదడమేగాక ఇంత్లోని వారందరికి ఆ పేరు వారసత్వంగా అందించాడు.కాలం గడిచిపోతుంది. ఒకనాడు మహసిద్ధుడు ధనదత్తుని దగరకు వచ్చాడు. అతన్ని చూడగానే ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊరిలో చాలా మంది స్వయం పాకాలు ఇచ్చేవారున్నారని, దయ చేసి వెళ్లమని సాగనంపి తలుపులు వేసుకున్నాడు. కొద్దిరోజులు గడిచాయి. మళ్లీ ఆ సిద్ధుడు దనదత్తుని దగరకు వచ్చాడు. ధనదత్తుడు మంచిమాటలు చెప్పి ఆ సిద్దుని వెళ్ళిరమ్మన్నాడు. ఆ సిద్దుడు ఏదో చెప్పబోతుండగా మాట వినిపించుకోకుండా తలుపు వేసుకొని లోపలకి వేల్లిపోయాడు. మరలా ఆ సిద్దుడు దనదతుని ఇంటి వద్దకు వచ్చినేను స్వయం పాకం కోసం రాలేదని నా మాటలు వినిపించూకోమని చెప్పాడు. దనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని, చాలా తొదర పనులు ఉన్నాయని నెలరోజుల తరువాత రమ్మని పంపించివేసి తలిపులు వేసుకున్నాడు. నెలరోజులు దాటిన తర్వాత ఆసిద్దుడు మరలా వచ్చాడు. వచ్చీరాగానే అయ్యా! నాకు ఇంకా ఖాళీ అవలేదు. రెండు మాసాల తర్వాత దయచేయండి అని తలుపులు వేసుకున్నాడు. ఈ విధంగా సాకులు చెపుతూ ఒక సంవత్సరం గడిపేశాడు. ఆ సిద్దుడు రావడం మానలేదు. చివరకు దనదత్తుడు మీరేమి చెబుతారో ఒక్క మాటలో చెప్పి వెళ్ళండి అన్నాడు. వెంటనే ఆ సిద్దుడు ఓ షావుకారూ! నీ భార్యా పుత్రులకోసం నువ్వు ఈ లంపటంలో మునిగి నీకు రాబోవు కష్టాన్ని తెలుసుకొవటం లేదు. అనగానే ధనదత్తుడు నాకే కష్టాలు రాబోతున్నాయో త్వరగా తెలపండి అని, అయినా అనేక సంపదలు సంపాదించాను నా కుటుంబం కూడా చాలా వృద్ది పొందింది. నాకు లోటు ఏమున్నది అనెను. అప్పుడు ఆ సిద్దుదు ఓ ధనదత్తా! నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది. ఆ మృత్యువు నుండి నిన్ను నీవు కాపాడుకొనుటకు ఒకే ఒక్క మార్గము కలదు. నీ భార్యాగానీ నీ సంతానము ఎవరైనా ఆ అపమృత్యువును తీసుకొనుటకు అంగీకరించినచో నీవు ఇంకా అరువది సంవత్సరములు సుఖముగా జీవిస్తావు. లేని యెడల నీకు మృత్యువు తప్పదని పలికెను. అప్పుడు ధనదత్తుడు తన వారందరిని పిలిచి మృత్యువును మీరు ఎవరైనా స్వీకరిస్తారా అని ప్రశ్నించెను. ఎవరు మృత్యువు వాత పడుటకు ఇష్టపడక నీపాపము నీవే అనుభవించవలసిందేనని అల్కిరి. అంతటి ధనదత్తుడు ఆయోగితో నా వారెవ్వరు అపమృత్యువును స్వీకరించుటకు సమ్మతించడం లేదు. నా ధనమునే అందరూ కోరుకొనుచున్నారు. కాబట్టి నా అపమృత్యువును తొలగించుటకు వేరొక మార్గము చెప్పమని యోగిని ప్రార్ధించెను. అపుడా సిద్దుడు నీవు ధనము ఖర్చు పెట్టి అఖండ శివారాదన చేయాలని చెప్పాడు. నా ప్రాణముల కంటే ధనము ఎక్కువదా? తప్పక ఖర్చు చేయగలనని చెప్పెను. వెంటనే ఆ వైశ్యునిచేత అఖండ శివారాదన చేయించెను. అతడు శివారాదనా తత్పురుషుడై భక్తిశ్రద్దలతో శివారాధన సలుపుతూ జీవితమంతా గడిపి కొంతకాలమునకు శివనామార్చన జరుపుతూ తనను చాలించెను. తత్ఫలితముగా ఆ ధనదత్తుడు శివలోక ప్రప్తిపొంది శివుని ఆంతరంగిక మిత్రుడయ్యెను. శివానుగ్రహముచే దేవలోకమునకు ధనషతియై కుబేరుడని పేరు గాంచెను.అతనికి దేవలోకములోని సంపదలపైన, నవనిధులపైనా, అధికారము కలిగెను. చిత్రరేఖ అను పేరుతో ధనలక్ష్మి ఆ కుబేరుని అర్ధాంయై వెలసెను. ధనలక్ష్మి సహితుడగు తనను ఆరాదన సలిపిన భక్తులకు ఆరోగ్య భాగ్యాలను, ఇష్టసంపదలనూ , ఇచ్చెదనని ఆయన ప్రతిజ్ఞ చేసెను. నవనిధి పరిపాలకుడగుటచేతన పూజను తొమ్మిది వారాలు ఆచరించవలయుననియు. తొమ్మిది మందిచే చేయించినవారికి అంతులేని సంపదలు ఇచ్చెదననియు. ప్రతిన బూనెను. తొమ్మిది గురువారములుగాని, తొమ్మిది శుక్రవారములుగాని ఈ వ్రతమును ఆచరీంచవలయును. పదవ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారములు పూజ చేయలేని అశక్తులు కనీసం అయిదు వారములు లైననూ పూజ చేసి ఆరవ వారము ఉద్యాపనము చేసుకొనవచ్చును.

ఉద్యాపనము:

పదవ మామూలుగా ధనలక్ష్మీ సమేతుడైన కుబేరుని పూజించి, కలశ దగ్గర తొమ్మిది వ్రత విదాన పుస్తకాలను ఉంచి, పూజించి ఆ పుస్తకాలను తొమ్మిది మంది దంపతులకు లేదా ముత్తైదువలకు పండు తాంబూలముతో వాయనమివ్వవలెను. వారు కాడా ఈ వ్రతము ఆచరించునట్లు నచ్చజెప్పవలెను. భక్తి శ్రద్దలు ప్రదానము. ఇందులోనున్న కుబేర యంత్రమును పటము కట్టించుకొని పూజామందిరంలో ఉంచుకొనవలెను. ఇట్లు చేసిన వారికి సమస్త రోగములూ తొలగి ఆరోగ్యము కలుగును. అష్టైశ్వర్యములును, భోగ భాగ్యములు కలుగును. ఇహపర సౌఖ్యములు గలుగటకు ఇంతకుమించిన వ్రతము లేదు. అని సూతుడుమహర్షులకు లోకానుగ్రహార్ధము వినిపించెను. పూజానంతరం ఈ కథను చదివి అక్షతలను శిరసుపై వేసుకొనవలయును.
ఇది స్కాంద పురాణమందలి రేవా ఖండములోని ఇరువది నాలుగవ అధ్యాయము.
శుభం భూయాత్.

ఉద్యాపనము

తొమ్మిది వారాలు పూజ ముగిసిన పిదప ప్దవ వారములో మరలా యధావిధిగా పూజ చేసి 9 వ్రత విధాన పుస్తకములను పుష్పాక్షతలతో స్వామివారి ఎదుట ఈ మంత్రము చెప్పి ఉంచవలెను. శ్లో" ఉద్యాపనార్ధం యక్షేశ నవసంఖ్యాక కోశకాః
సమర్పితా మయా భక్త్యా స్వీకురిష్య కృపానిధే

పుస్తకము వాయనము ఇచ్చునప్పుడు ఈ క్రింది మంత్రముతో ఇవ్వవలయును.
శ్లో" కుబేరానుగ్రహప్రాప్యై కోశం తుభ్యం దదామ్యహం
స్వీకురిష్య దయాసింధో వ్రతమాచర సత్వరం

వాయనము తీసుకున్నవారు ఈ క్రింది మంత్రముతో స్వీకరించవలయును.
శ్లో" కుబేరస్య వ్రతగ్రంధం పవిత్రాం పాపనాశానం
లబ్ధం త్వత్తః స్వీకరోమి ఆచరిష్యామి తద్ర్వతమ్

కుబేరాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శ్లో" కుబేరో ధనద శ్రీదః రాజరాజో ధనేశ్వరః
ధనలక్ష్మీ ప్రియతమో ధనాఢ్యో ధనికప్రియః
దాక్షిణ్యో ధర్మనిరతః దయావంతో ధృఢవ్రతః
దివ్యలక్షణ సంపన్నో దీనార్తిజనరక్షకః
ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితః
దయారూపో ధర్మబుద్దిః ధర్మ సంరక్షణోత్సకః
నిధీశ్వరో నిరాలంబకో నిదీనాం పరిపాలకః
నియంతా నిర్గుణాకారః నిష్కామో నిరుప్రదవః
నవనాగ సమరాధ్యో నవసంఖ్యా ప్రవర్తకః
మాన్యశ్చైత్రరదాదీశః మహాగుణగణాన్వితః
యాజ్ఞికో యజనాసక్తః యజ్ఞభు గ్యజ్ఞరక్షకః
రాజచంద్రో రమాధీశో రంజకో రాజపూజితః
విచిత్రవస్త్రవేషాఢ్యః వియద్గమనమానసః
విజయో విమలో వంద్యో వందారుజనవత్సలః
విరూపాక్షప్రొయతమో విరాగీ విశ్వతోముఖః
సర్వవ్యాప్తో సదానందః సర్వశక్తి సమన్వితః
సామదానరతస్సామ్యః సర్వబాధా నివారకః
సుప్రీత స్సులభ స్సోమో సర్వకార్యధురంధరః
సామగానప్రియ సాక్షాశ్రీద్విభవవిరాజితః
అశ్వవాహనసంప్రీతో అఖిలాండప్రవర్తకః
అవ్యయోర్చనసంప్రీతః అమృతాస్వాదన ప్రియః
అలకాపురసంవాసీ అహంకారవివర్జితః
ఉదారబుద్ది రుద్దామవైభవో నరవాహనః
కిన్నరేశో వైశ్రవణః కాలచక్రప్రవర్తకః
అష్టలక్ష్మ్యాసమాయుక్తః అవ్యక్తో మల విగ్రహః
లోకారాధ్యో లోకపాలః లోకవంద్యో సులక్షణః
సులభ సుభగ శ్శుద్ధో శంకరా రాధనప్రియ
శాంత శ్శుద్ద గుణోపేతః శాశ్వత శ్శుద్దవిగ్రహః
సర్వాగమజ్ఞో సుమతిః సర్వదేవగణార్చకః
శంఖహస్తధరః శ్రీమాన్ పరం జ్యోతిః పరాత్పరః
శమాదిగుణ సంపన్న శ్శరణ్యో దీనవత్సలః
పరోపకారీ పాపఘ్న స్తరుణాదిత్యసన్నిభః
దాంత స్సర్వగుణోపేతః సురేంద్రసమవైభవః
విశ్వఖ్యాతో వీతభయః అనంతానంతసౌఖ్యదః
ప్రాతఃకాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్యా దినే దినే,
తేన ప్రాప్నోతి పురుషః శ్రియం దేవేంద్రసన్నిభమ్.

ఇతి శ్రీ స్కాందే దేవాఖండే
కుబేరాష్టోత్తర శతనామస్తోత్రమ్ సంపూర్ణమ్

అష్టలక్ష్మిస్తోత్రము

1. ఆదిలక్ష్మి

సురగణ వంధిత, సుంధరి, మాధవి
చంద్ర సహోధరి హేమమయి
మునిజనసంస్తుత మోక్ష విధాయిని
మంజుల భాషిణి, వేదనుతే,
సరసిజవాసిని దేవసురక్షణి
సద్వర వర్షిణి శాంతయుతే
జయజయహే మధుసూధన కామిని
ఆదిరమే! పరిపాలయ మామ్.

2. ధాన్యలక్ష్మి

అయికలికల్మషనాశిని కామిని
వైధికభాసిని వేదమయి
కలాశమహాబ్దిజ మంగళరూపిణి
మంత్ర నివాసిని మంత్రనుతే,
శుభఫలదాయిని నీరజవాసిని
దేవగణా శ్రితపాదయుగే
జయ జయహే మదుసూదన కామిని
ధాన్యరమే! పరిపాలయ మామ్.

3.ధైర్యలక్ష్మి

జయవరవర్ణిని వైష్ణవి భార్గవి
మంత్ర సరూపిణి మంత్రమయి
సురగణ మానిని శీఘ్రఫలప్రద
కీర్తివికాసిని శాస్త్రనుతే,
భవభయహారిణి పాపవిమోచని
సాధుజనాశ్రితపాదయుగే
జయ జయహే మదుసూదన కామిని
ధైర్యరమే! పరిపాలయ మామ్.

4.గజలక్ష్మి

జయ జయ దుర్గతినాశిని కామిని
సర్వఫలప్రదశాస్త్రమయి
రథగజతురగపదాతిసమావృత
రాజమహేంద్ర గణాభినుతే,
హరి హర దాతృసుపూజితరూపిణి
తాపనివారకపాదయుతే
జయ జయహే మదుసూదన కామిని
(రాజ్య) హస్తిరమే! పరిపాలయ మామ్.

5.సంతానలక్ష్మి

అయి ఖగవాహనమోహిని చక్రిణి
రాగవివర్దిని జ్ఞానమయి
గుణ గణ వారది లోకహితైషిణి
నారదతుంబురగానరతే
సకలసురాసురదేవమునీశ్వర
మానవందిత పాదయుగే
జయ జయహే మధుసూదనకామిని
సంతతిరూపిణి! పాలయ మామ్ !

6.విజయలక్ష్మి

జయ భయభంజని సద్గతిదాయిని
జ్ఞానవికాసిని గానమయి
అనుదిన మర్చితకుంకుమధూసరి
తాఖిలగాత్రి సువాద్యరతే,
కనకమహాస్రుతిసన్నుతికారక
శంకరదేశికమాన్యపదే
జయ జయహే మధుసూదనకామిని
దిగ్విజయేశ్వరి! పాలయ మామ్

7.విద్యాలక్ష్మి

ప్రణతసురేశ్వరి భారతి భార్గవి
శోకవినాశిని దీప్తమతే
మణగణరాజితకర్ణవిభూషణ
కాంతిసమావృతా తదివ్యముఖి,
శ్రుతిహితవేదపురాణసుశాస్త్ర
సమీరి తవైదికమార్గహితే
జయ జయహే మధుసూదనకామిని
వాక్పరివర్షిణి! పాలయ మామ్.

8.ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి-ధింధిమి
దుందుభినాదవినోదరతే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖనినాదవికాసమతే !
నవనిధిదాయిని దుర్మలహారిణి
కామితదాయకహస్తయుతే
జయ జయహే మధుసూదనకామిని
హైమావికారిణి! పాలయ మామ్.

మహాలక్ష్మీ స్తోత్రము

మాత ర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వతమాతః!
క్షీరోదజే కమలకోమల గర్భగౌరి! ప్రసీద సతతం నమతాం శరణ్యే!

త్వం రూపేంద్రసదనే మదనైకమాతః జ్యోత్స్నా సి చంద్రమసి, చంద్రమనోహరాస్యే!
సూర్యే ప్రభా సిచ, జగత్రితయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే!

త్వం జాతవేదసి సదా దహనాత్మకశక్తిః వేధాస్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్,
విశ్వంభరోపి బిభృయాదఖిలాం భవత్య లక్ష్మీ! ప్రసీద సతతం నమతాం శరణ్యే!

త్వ త్త్యక్త మేత దమలే, హరతే హరోపి త్వం పాసి, హంసి, విధదాసి, పరావరాసి,
ఈడ్యో బభూవ హరి రప్యమలే త్వదాప్త్యా లక్ష్మి! ప్రసీద సతతం నమతాం శరణ్యే!

శూరస్స ఏవ, సుగుణీ, సబుధ, స్సధన్యో మాన్య స్స ఏవ, కులశీలకలా కలాపైః
ఏక శ్శుచి స్సహి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే! కరుణా కటాక్షః

యస్మిన్ వసేః క్షణ మహో పురుషే, గజేశ్వే స్రైణే, తృణే, సరసి, దేవకులే, గహేగ్నే,
రత్నే, పతత్రిణి, పశౌ, శయనే, ధరాయాం సశ్రీక మేవ సకలే! తదిహాస్తి నాన్యత్.

త్వత్స్పృష్ట మేవ సకలం శుచితాం లభేత త్వత్త్యక్తమేవ సకలం త్వ శుచీహ లక్ష్మి!
త్వన్నామ యత్ర చ సుమంగళ మేవ తత్ర శ్రీ విష్ణు పత్ని! కమలే ! కమలాలయేపి

లక్ష్మీం శ్రియం చ కమలాం కమలాలయాం చ పద్మాం రమాం నలినయుగ్మ కరాం చ మాంచ,
క్షీరోదజా మమృత కుంభకరా మిరాం చ విష్ణు ప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖమ్?

యేపఠిష్యంతి చస్తోత్రం త్వద్భక్త్యా మత్కృతం సదా, తేషాం కదాచి త్సంత్సాపో మాస్తు మాస్తు దరిద్రతా
మాస్తు చేష్ట వియోగశ్చ మాస్తు సంపత్తిసంక్షయః సర్వత్ర విజయ శ్చాస్తు విచ్చేదో మాస్తు సంతతేః
ఇతి శ్రీ స్కాంద పురాణే, కాశీఖండే, అగస్త్యమహామునికృత (కోలాపుర)
శ్రీ మహలక్ష్మీస్తోత్రమ్ హరిః ఓం తత్సత్

శ్రీ కనకధారాస్తవమ్

వినాయక ప్రార్ధనా

వన్దేవన్దారు మన్దార మిన్దిరానంద కందలమ్
అమన్దానన్ద సందోహ బన్దురం సింధురాననమ్

కనకధారాస్తవమ్

అఙ్గం హరేః పులకభూషణమాశ్రయ న్తీ
భృంగాంగ నేవ మకుళాభరణం తమాలం
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలాదృశో ర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభావా యాః

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష
మానంద హేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం
ఇందీవరోదర సహోదర మిందియా యాః

ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద
మానంద కంద మనిషేష మనంగ నేత్రమ్
అకేకర స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోஉపి కటాక్షమాలా
కళ్యాణ మావహతు మే కమలాలయా యాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
దారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవ నందనా యాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన
మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబు ధారా
మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే
దుష్మర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబు వాహః

ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్ట పపదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః

గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి
శాకంభరీతి శశశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయా పరాయై
నమోస్తు శారంగాయుధ వల్లభాయై

నమోస్తు కాన్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలర్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనిలయే సరోజహస్తే
దవళ తమాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్

దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రీమ్

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానం
ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః

బిల్వాటవీమధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్
అష్టాపదామ్భోరుహపాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్

కమలాసన పాణినా లలాటే
లిఖితామక్షరపంక్తి మస్య జంతో
పరిమార్జయ మాత రంఘ్రిణాతే
ధనికద్వారనివాసదుఃఖదోగ్ర్ధీమ్

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృగృహం మురారే
కారుణ్యత కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందం

స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్
గుణాధికా గురుతుర భాగ్య భాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

ఫలశ్రుతి:

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్
ఇతిశ్రీమత్స రమహంస పరివ్రాజకాచార్య జగద్గురు
శంకరాచార్యాప్రణీతం
కనక్ధారా స్తోత్రం సంపూర్ణమ్

పురాణాలలో కుబేరుడు

కుబేరుడు గుహ్యకులకు నాయకుడు. శివభక్తుడు. శివుని అనుగ్రహముచేత సకలసంపదలను పొదెను. ఇతని వామభాగమునుండిఓక కన్య పుట్టెను. ఆమె పేరు మనోరమ. ఆమె కుబేరుని భార్య అయ్యెను. (బ్రహ్మవైవర్త పురాణము)
కుబేరుడు పూర్వజన్మలో యజ్ఞదత్తుని కుమారుడు. అతని పేరు గుణనిధి.అతడు అవగుణములన్నింటికిని నిధియై దుర్వ్యసనపరుడైనాడు. తండ్రి వాని చర్యలు భరించలేక ఇంటినుండి పారద్రోలినాడు. గుణనిధి తిండి లేక మలమటించుచూఓక గుడిలో నివేదన చేసిన శివప్రసాదము దొగిలించి తినెను. అందుకు రాజు భటులువానిని కొట్టి చంపిరి. శివ ప్రసాదము తినుట చేత శివ దూతలు వచ్చి వానిని తమతో కైలాసమునకు తీసుకునిపోయిరి. అతడు శివునికి ప్రీతిపాత్రుడయ్యెను. తర్వాత జన్మలో కళింగ రాజైన అరిందముడుగా పుట్టెను. దీక్షతో కాశీవిశ్వేశ్వరుని సేవించెను. శివుడు పార్వతితో ప్రత్యక్షమయ్యెను. దివ్య దృష్టి ఇచ్చెను. రాజు పార్వతి అందమును చూచుచూ ఉండిపోగాఆమె అతని కనుగ్రుడ్డు ఒకటి పేలిపోవునట్లు శపించెను. శివుడు పార్వతితో వేడు నీ పుత్రుని వంటి వాడు కనుక క్షమించి అనుగ్రహింపుమనగా ఆమె దయతో అతనికి కంటినిచ్చి దీవించెను. శివుడు అతనిని ఉత్తరదిశకు పాలకునిగా జేసి అలకాపురిని రాజధానిగానిచ్చెను. ఉత్తరదిక్కు కుబేరస్థానమైనందున గృహనిర్మాణముచేయునపుడు ఉత్తర దిశను ఖాళీగా ఉంచవలెనని వాస్తుశాస్త్రము. (శివపురాణము)
విశ్రవోబ్రహ్మకు దేవర్ణిని యను భార్య వలన కుబేరుడు జన్మించెను. పుట్టగానే బ్రహ్మ వచ్చి ధనపతి యగునని దీవంచెను. కుబేరుడు తండ్రి దగ్గర చదువులు నేర్చి బ్రహ్మను గూర్చి మూడువేల యేండ్లు తపస్సు చేసెను. బ్రహ్మ సాక్షాత్కరింపగా "నాకు దిక్పాలకత్వమును, ధనాదిపతిత్వమును అనుగ్రహింపుమని కోరెను. ఆయన ఆ వరములను పైగా పుష్పక విమానమును కూడా ఇచ్చెను. కుబేరుడు తండ్రి వద్దకు వచ్చి నాకు నివసించుటకు పురమును నిర్మించి ఇమ్మని కోరగా, విశ్రవుడు, పూర్వము విశ్వకర్మ ధక్షణ సముద్రమద్యమున లంకలో ఒక పురమును నిర్మించినాడనియు దానిలో నీవు నివసింపుమని చెప్పి పంపెను. కుబేరుడు దనములతోను, పుష్పక విమానముతోనూ లంకలో ప్రవేశించె చాలాకాలముండి, తర్వాత రావణాసురునిచే నిర్వాసితుడై అలకానగరమునకు చేరెను. (ఉత్తర రామాయణము)
వేంకటేశ్వరుడు పద్మావతిని వివాహము చేసికొన నిశ్చయించుకొనిధనమును అప్పుగా నిమ్మని కుబేరుని అడిగెను.కలియుగాంతమున అప్పు తీర్చేదనియు, అంతవరకు వడ్డీ కట్టుచుండెదనియు పత్రము వ్రాసి యిచ్చెను. కుబేరుడు ధనమును అప్పుగా ఇచ్చెను. వేంకటేశ్వరుడు దానికి వడ్డీ కట్టుటకై భక్తుల వద్ద నుండి కానుకలు స్వీకరించుచున్నాడు. అందుకే ఆయనకు వడ్డీ కాసులవాడని పేరు. (వేంకటేశ్వర పురాణం)


No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...