🕉🕉🕉🕉🕉🕉
గృహములో వలె చక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది.భద్రుడు అనే బుుషి భద్రమనే పర్వతముగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ, అవత రించారని పురాణాలు సెలవిస్తున్నాయి.
భగవంతుడు ఆ భక్తులకోసం ఆ కొండలమీదే వెలిశాడు. కాన ఆ రాళ్ళనుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు.నిత్యం దేవుడిని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ,అట్లాగేఅంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము. దేవాలయల్లో గడపను తొక్కి దాటకండి,కేవలం దాటండి.
🕉🕉🕉🕉🕉🕉
No comments:
Post a Comment