మౌనము మనగా మాట్లాడకుండుట కాదు. మాట్లాడవలసిన ఆవశ్యకతను తగ్గించుట
మౌనము. మనస్సు చెలరేగుచుండగా గొంతు బిగించుకొనుట మౌనము కాదు.
దీనివలన రక్తపోటు, తలనొప్పి, నిద్రలేకుండుట మున్నగు వ్యాధులు సంక్రమించును.
ఎక్కువ మాట్లాడుతుంటే నీకున్న ప్రజ్ఞ అంతా నిర్వీర్యమవుతుంది.
వాక్ప్రవాహము సహస్రారము చేరి, అక్కడనుండి భ్రూమధ్యము వచ్చి, హృదయము చేరి నిశ్వాస ఆధారముగా బయటకు ఉచ్చారణ రూపములో వస్తుంది.
మనలను మనము పండించుకోవాలంటే బయటకు ఉచ్చరించేటపుడు వాక్కును filter చేసుకోవాలి.
No comments:
Post a Comment