Sunday, October 14, 2018

శ్రీ దుర్గ సప్త శ్లోకి

ఓం హ్రీం దుం దుర్గాయై నమః !!

      

ఓం  అస్యశ్రీ  దుర్గా  సప్త  శ్లోకీ  స్తోత్రమంత్రస్య,  నారాయణ ఋషిః,  అనుష్టుప్ ఛందః,
మహంకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వత్యో దేవతాః,  శ్రీ దుర్గాంబా ప్రీత్యర్థం " సప్త శ్లోకీ
దుర్గా పాఠే "  జపే వినియోగః !!

1- ఓం  జ్ఞానినా  మపి  చేతాంసి  దేవీ  భగవతీ  హి  సా !
     బలాదా  కృష్యమోహాయ  మహామాయా  ప్రయచ్ఛతి !!

2- ఓం  దుర్గే  స్మృతా  హరసి  భీతి  మశేష  జంతోః,
     స్వస్థైః  స్మృతా  మతిమతీవ  శుభామ్  దదాసి !
     దారిద్ర్య  దుఃఖ  భయహారిణి  కా  త్వదన్యా,
     సర్వోపకార  కరణాయ  సదార్ద్ర  చిత్తా !!

3- ఓం  సర్వ  మంగళ  మాంగళ్యే  శివే  సర్వార్థ  సాధికే !
     శరణ్యే  త్ర్యయంబికే   దేవీ  నారాయణీ  నమోస్తుతే !!

4- ఓం  శరణాగత  దీనార్త  పరిత్రాణ  పరాయణే !
     సర్వస్యార్తి  హరే  దేవీ  నారాయణీ  నమోస్తుతే  !!

5- ఓం  సర్వ  స్వరూపే  సర్వేశే  సర్వశక్తి  సమన్వితే !
     భయేభ్య  స్త్రాహినో  దేవీ  దుర్గే  దేవీ  నమోస్తుతే !!

6- ఓం  రోగా  నశేషా  నపహంసి  తుష్టా
     రుష్టాతు  కామాన్  సకలా  నభీష్టాన్ !
     త్వా  మాశ్రితానాం  న  విపన్నరాణాం
     త్వా  మాశ్రితా  హ్యాశ్రయతాం  ప్రయాంతి !!

7- ఓం  సర్వబాధా  ప్రశమనం  త్రైలోక్య  స్యాఖిలేశ్వరీ !
     ఏవమేవ  త్వయాకార్యం అస్మద్వైరి  వినాశనం !!
          -: ఓం శాంతిః  శాంతిః  శాంతిః :-

ఆత్మ బంధువులారా !   మార్కండేయ పురాణంలో నున్న" చండీ సప్త శతి "
(దేవీ మహాత్యము) 700 ల మంత్రపూరిత
శ్లోకాలలో  ఏడింటినీ  ఏర్చి కూర్చి (7) శక్తివంతమైన మంత్రాలతో సులభమైన సూక్ష్మమైన " మంత్రరాజం " ను
మన ఋషులు తయారు చేశారు !!

సర్వ శక్తి స్వరూపిణి , సకల దేవతా స్వరూపిణియైన ఆ " దుర్గా పరమేశ్వరీ దేవి " మధుకైటభ, మహిషాసుర, చండ-ముండ, ధూమ్రాక్ష, రక్తబీజ, శుంబ-నిశుంబాది
రాక్షసులను సంహారం చేసింది !! 

అందరూ దేవతలు కలసి అమ్మను వేడుకున్నారు !! అమ్మా !! ధర్మానికి  హాని తలపెట్టే ఆసురీ శక్తులను నాశనం చేసి
దైవిక  శక్తులకు తోడుగా వుండమ్మా!! అని
దుర్గా సప్త శతి లో పై మంత్రములతో వేడుకున్నారు!!

మరిమనం కూడా కలసి ప్రార్థన చేద్దాం !!

ఈ " దుర్గా సప్త శ్లోకీ " మంత్రములను నిత్యం పఠించు వారలకు సర్వ బాధలు, ఆపదలు తొలగిపోతాయి !  సకల భయాల నుండి విముక్తులవుతారు !  సర్వ శత్రు వినాశనం
జరిగి , సర్వత్రా " విజయం" సిద్ధిస్తుంది !!

ఘోరమైన వ్యాధులు, దారిద్ర్య బాధలు దూరమవుతాయి !! సకల అభీష్టములు నెరవేరి సకల సౌఖ్యాలు లభిస్తాయి !!

ఈనాడు ప్రపంచానికి పెను సవాలుగా మారిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు సర్వ మానవాళిని రాక్షసుల రూపంలో భయ
కంపితులను చేస్తున్నారు !! 

తీవ్రవాద, ఉగ్రవాద,  సర్వ శత్రు వినాశనానికి  మరియు " హిందూ ధర్మ రక్షణ"  కొఱకై  "విశ్వశాంతి" పరి రక్షణకై  " శ్రీ దుర్గామాత" ను ఈ మంత్రాలతో నిత్యం సామూహికంగా ఆరాధన చేస్తూ పఠిద్దాము !!

సూచన:- ఈ "  దుర్గ సప్త శ్లోకి " శ్లోకాలను
కార్డు రూపంలో కాని, కరపత్రము ద్వారా
కానీ అచ్చు వేసి ప్రచారం చేయండి!!

!! ధర్మాన్ని రక్షించండి !! ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది !!
               -: శుభమ్ భూయాత్:-

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...