Sunday, February 11, 2018

జ్ఞాపక శక్తిని ప్రసాదించు శ్రీ శారదా స్తోత్రం

చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలి అంటే శ్రీ శారదా స్తోత్రం తెల్లవారు జామున 5 గంటల సమయంలో శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో జపించవలెను. శారదా స్తోత్ర మంత్ర పఠన మీలో శక్తిని, బలాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది.

శారదా స్తోత్ర మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి.మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.

శారదా స్తోత్ర మంత్రాలను చదవడం వల్ల మనలోనున్న చైతన్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని |
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే

యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా |
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ ||

నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్ |
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ ||

భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః |
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ ||

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ |
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః ||

యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ |
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః ||

యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః ||

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...