Wednesday, March 21, 2018

జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !


                ఓం గం గణపతయే నమః

    పరమ శివుని పూజలందుకున్న మహా గణపతి

వినాయక చవితి ప్రతీ ఏటా మనం హిందూ పంచాజ్ఞం ప్రకారం భాద్రపద శుక్ల చవితి నాడు జరుపు కోడం అనాదిగా హిందువులకు వస్తున్న ఆచారం . వినాయక చవితిని భారత దేశ వాసులు జాతి మత  బేధాలు లేకుండా జరుపుకుంటారు అంటే అతిశయోక్తి కాదు . పెద్ద బొజ్జ , ఏనుగు తల , గుజ్జురూపం , ఎలుక వాహనం గా గల  వినాయకుడు భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పూజలందు కుంటున్నాడు . విదేశాలలో ఎలిఫెంట్ హెడ్ గాడ్ అని హిందూ బుద్ధ అని పిలుస్తూ వుంటారు . పరమేశ్వరుడు గణాసురుని తపస్సుకి మెచ్చి అతనికి సత్వ , తమో , రజో , గుణాల వలన జన్మించిన వారినుండి మరణము లేనట్లు వరం పొందుతాడు . గణాసురుని వధించేందుకు వినాయకుని పార్వతీ దేవి నలుగు పిండితో తయారు చెయ్యడం , తరువాత శివుని కోపానికి గురై శిరస్సు ఖండించబడి పార్వతీ దేవి అభ్యర్ధన మేరకు శివుడు గజాసురుని తలను వినాయకునికి అతికించి ప్రాణం పోయడం మనకందరికీ తెలిసినదే .

విద్యకి , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు . ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజ లందుకోనేది వినాయకుడే అనడంలో అతిశయోక్తి కాదు . మనస్సులో తలచుకున్నంత మాత్రాన విఘ్నాలు తొలగించి విజయాన్ని చేకూర్చే దేముడు అనడం లో తప్పులేదు . వినాయకుని పుజించేవారికి అనేక శక్తులు సిద్ధిస్తాయి .

వినాయకుని అధీనం లో తంత్ర విద్యలైన అభిసార విద్యలో ఆరు రకాల దుష్ఠ శక్తులు కుడా వున్నాయి . అందుకే వసీకరణం  , చిల్లంగి మొదలయిన దుష్ఠ శక్తుల ఉపాసకులు వినాయకుని పూజించి  యీ శక్తులను పొందుతారు  .  వినాయకునిది చిన్నపిల్లల మనస్తత్వం గా వర్ణిస్తారు .

భరత ఖండం లో శైవం , వైష్ణవం , బౌద్ధం వీటితో పాటు భ్రామ్యం ( భ్రహ్మ ని మాత్రమే పూజించేవారు ) , గణపత్యం ( గణపతి ని మాత్రమే పూజించే వారు )  కుడా ప్రాచుర్యం లో ఉండేవి . ఆరవ శతాబ్దం లో యీ గణపత్యం ప్రాచుర్యంలోకి వచ్చి తొమ్మిదవ శతాబ్దం లో రాజుల ప్రాపకం సంపాదించిందని శ్రీ ఆనందగిరి గారు తన  ' శంకర దిగ్విజయం ' లో రచించేరు . పదవ శతాబ్దంలో వినాయకుని ప్రత్యేకంగా కోవెల నిర్మాణాలు జరిగేయి . అలా నిర్మితమైన   మందిరాలలో ముఖ్యం గా చెప్పుకోతగ్గవి మహారాష్ట్ర లోని అష్ఠ గణపతుల మందిరాలు , తిరుచురాపల్లి లో వున్న ' ఉచ్చి పిళియార్  ( ఉచ్ఛ వినాయకుడు ) ' .  గణపత్యం అవలభించేవారు మహా గణపతి సృష్ఠికి ముందు నుండి ప్రళయాంతం తరవాత కుడా వుండే మహా శక్తి అని నమ్ముతారు .

యీ గణపత్యం దక్షిణ భారత దేశం నుంచి పశ్చిమ భారత దేశం వరకు ప్రాకి పేష్వాల పరిపాలనలో మరాఠా సామ్రాజ్యం వున్నప్పుడు , పెష్వాలు వినాయకుడిని యిష్ఠ దైవం , కుల దైవంగా పూజించేవారు .

మహారాష్ట్ర లో వినాయక చవితి పూజలు దేశ విదేశాలలో ప్రసిద్ది అని మనందరికీ  తెలిసినదే .  అలాంటి మహారాష్ట్ర లో అష్ఠ గణపతులు కొలువై వున్నారు .  యీ అష్ఠ గణపతులు స్వయంభూగా వలిసినవే . ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్ఠాదశ శక్తి పీఠాలు లాగే  అష్ఠ గణపతులు కుడా  .

అష్ట వినాయక అంటే ఎనిమిది గణపతులని అర్ధం చెప్పాలి. మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో కల ఎనిమిది గణపతి దేవాలయాలకు పర్యటన అని భావించాలి. ఈ ఎనిమిది దేవాలయాల పేర్లు వరుసగా చెప్పాలంటే, మోర్గాంవ్ వద్ద కల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ వద్ద పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి వద్ద ధేయూర్, ఒజార్ వద్ద విగ్నేశ్వర్, రంజన్ గాంవ్ వద్ద మహాగణపతి, మరియు చివరిదైన మహాద్ వద్ద వరద వినాయక దేవాలయాలు. ఈ ఎనిమిది అష్టవినాయక దేవాలయాలు కూడా పురాతనమైనవి మరియు ప్రాచీన కాలంనాటివి. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంధాలైన గణేష మరియు ముద్గాల పురాణాలలో పేర్కొన్నారు. ఈ దేవాలయాల శిల్ఫశైలి ఎంతో అందంగా ఉంటుంది. ప్రతి హిందూ మతస్తుడు తన జీవితంలో ఆనందాలను అదృష్టాలను పొందేందుకు కనీసం ఒకసారైనా ఈ అష్టవినాయకుల ఎనిమది దేవాలయాలు దర్శించి తరించవలసిందే. ఈ దేవాలయాలన్నింటికి ఒక ఉమ్మడి అంశం ఏమంటే, వాటిలో ప్రతి ఒక్కటి స్వయంభూ దేవాలయమే.

🌹 *1. సిద్ధి వినాయక దేవాలయం* 🌹

గణపతి విగ్రహంలో ఉన్న భంగిమ అంటే ఆయన తొండము కూడి వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. కాని సిద్ధాటెక్ వద్దగల సిద్ధి వినాయక దేవాలయంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనపడుతుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత అంటే, ప్రదక్షిణం. పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది.

🌹 *2. మయూరేశ్వర దేవాలయం* 🌹

మయూరేశ్వర దేవాలయం మోర్గాంవ్ గ్రామంలో కలదు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. సమీపంలో పెద్ద దీపమాల అంటే ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది.

🌹 *3. బల్లలేశ్వర దేవాలయం* 🌹

బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అన్ని దేవాలయాల వలే కాక ఈ దేవాలయానికి బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించిన ఒక భక్తుని పేరు పెట్టారు.

🌹 *4. గిరిజాత్మజ దేవాలయం* 🌹

గిరిజాత్మక దేవాలయం గుహలు కల ఒక కొండ పైభాగాన కలదు. దీనిని దర్శించాలంటే 300 మెట్లు ఎక్కాలి. కష్టమైనప్పటికి పైకి వెళితే అక్కడి అందచందాలకు ఎంతో ఆనందం కలుగుతుంది.

🌹 *5. చింతామణి దేవాలయం* 🌹

చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి రూపం కలిగి ఉంటాడు.

🌹 *6. విఘ్నేశ్వర దేవాలయం* 🌹

ఓజార్ వద్ద గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరం బంగారంతో తయారు చేయబడ్డాయి. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగాంవ్ మరియు జున్నార్ ల నుండి ఓజార్ 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలలో చేరవచ్చు.

🌹 *7. మహాగణపతి దేవాలయం* 🌹

మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దదిగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇది రంజన్ గాంవ్ లో కలదు.

🌹 *8. వినాయక దేవాలయం* 🌹

చివరగా, మహాడ్ గ్రామంలో వరద వినాయక దేవాలయం కలదు. ఈ దేవాలయ విగ్రహం ఒక సరస్సు ఒడ్డున లభిస్తే దానిని దేవాలయంలోపల ప్రతిష్టించారు. నేడు మనం చూసే వరద వినాయక దేవాలయం వాస్తవానికి పేష్వా పాలకులచే పునరుద్ధరించబడిన దేవాలయం.

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...