Saturday, March 17, 2018

ఆడవారు బయట ఉన్నప్పుడు ఇంట్లో కలుపుకోవచ్చా?

ఈమధ్యకాలంలో ఇది సాధారణ విషయం అయిపొయింది కానీ ఎన్నో ఏళ్ళ నుండి మన సాంప్రదాయం తప్పని చెబుతోంది. ఇందుకు సంబంధించిన వివరణ.
శ్రీమద్భాగవతంలో ఆరవ స్కంధంలో వివరింపబడిన ప్రకారం పూర్వం ఒకసారి ఇంద్రుడు త్వష్ట పుత్రుడైన విశ్వరూపుని చంపినప్పుడు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. అప్పుడు ఇంద్రుని పాపాన్ని నలుగురు పంచుకుంటామని ముందుకు వచ్చి అతడిని బ్రహ్మహత్యాపాతకాన్నుండి విముక్తి కలిగించారు. స్త్రీ-భూ -జల- ద్రుమైర్ వలన తనకు విముక్తి కలిగిందని చెప్పుకుంటాడు. ఇందుకు ఈ నలుగురికి కొన్ని వరాలను ఇస్తాడు. ఇవే వివరాలను గరుడ పురాణం, దేవీభాగవతం, తైత్తరీయం ఇంకా మరెన్నో పురాణ వాన్గ్మయాలలో చెప్పి వున్నారు.
1. తాను తీసుకున్న బ్రహ్మహత్యాపాతకం వలన భూమి లో కొన్ని ప్రదేశాలలో జీవరాశి ఉండదు. భూమి బీటలు వారడం, ఎడారులు తయారు అవడం అనేవి భూమి తీసుకున్న దోషం వలన సంప్రాప్తిమ్చాయి. దానికి బదులుగా ఇంద్రుని దగ్గరనుండి తవ్విన చోట మరల పూడుకునేలా వరం పుచ్చుకుంది భూమి.
2. నీటిలో నురగ బుడగలు జలం తీసుకున్నపాపం వలన వస్తుంది అని, దానికి ప్రతిగా దేనిలో అయితే జలం కలపబడుతోందో దాని పరిణామము పెరుగుతుంది అని వరం తీసుకుంది. అందుకుని బుడగలు, నురగతో ఉన్న నీటిని పవిత్రకార్యాలకు ఉపయోగించరు.
3. చెట్లు తాము తీసుకున్న పాపం వలన వాటిలో పాలు స్రవిస్తూ ఉంటాయి, ఏ చెట్టు కొమ్మ అయినా చిన్నగా చిదిమి చూస్తె ఈ పాలు వస్తూ ఉంటాయి, వారిని పుచ్చుకోవడం మానవులకు నిషేధం. ఈ పాపానికి ప్రతిగా ఎప్పుడు తమని తరిగినా మరల ఆ చెట్టు చిగురించాలి అన్న వరం పుచ్చుకున్నాయి వృక్షాలు.
4. స్త్రీలకు తాము తీసుకున్న పాపం వలన నెలలో మూడురోజులు ఆ పాప భారాన్ని భరిస్తామని, అందుకు ప్రతిగా తమకు తమ పతితో స్వర్గసుఖాలు అనుభవించేలా వరాన్ని, అలాగే సంతతిని తాము భరించి వృద్ధి చెయ్యాలన్నా వరాన్ని పుచ్చుకుంటారు.

ఇందువలన ఆ మూడు రోజులు వారు బ్రహ్మహత్యాపాతకాన్ని భరిస్తున్న కాలం కనుక వారికి వంట, పూజా గదులలో ప్రవేశం నిషిద్ధం. మన ఇళ్ళలో వంట చేస్తున్నారంటే అదొక యజ్ఞంగా తీసుకునేవారు. అగ్నిభాట్టారకుడు సాక్షాత్తు అగ్ని దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనం పెట్టిన పదార్ధాలను పక్వం చేస్తున్నాడు. ఇదే తలంపుతో రోజు కూడా వంట స్నానం చేస్తే కానీ మొదలు పెట్టారు. మన కడుపులో ఉన్న వైశ్వారనునికి ఇచ్చే హవిస్సును తయారు చేసే అన్నం, ఇత్యాది భక్ష్యభోజ్యాల తయారీ కూడా ఒక యజ్ఞమే. ఇంటి ఇల్లాలు స్నానం చేసి మడి కట్టుకుని ఒక పూజా కార్యక్రమంగా చేసే వంట వలన ఆ ఇళ్ళలో ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉండేవి, ఉంటున్నాయి. కాబట్టి వంట కార్యక్రమం కూడా పూజావిధానంలో ఒక భాగంగా వుంటుంది. దేవునికి నివేదించి కానీ పుచ్చుకునే సాంప్రదాయం లేని సంస్కారం మనది. ఈ కారణం వలన ఆ మూడు రోజులు ఆడవారికి వంటిల్లు, వంట నిషేధం.

మన శరీరంలో మలం ఎన్నో రకాలుగా పోతూ వుంటుంది. కటి ప్రదేశం పైన ఉన్న రంధ్రాల ద్వారా పోయే మలాన్నుండి ఆ భాగాలను కాళ్ళను కడుక్కోవడం వలన పోతున్నాయి. కానీ కటిప్రదేశం నుండి కాళ్ళ వరకు పోయే మలాన్ని శుద్ధిపొందాలంటే మలాపకర్షణ స్నానం చేస్తే తీరుతుంది. ఈ మూడు రోజులు వారు నిత్యం అదే స్థితిలో ఉంటారు, అందువలన శారీరకంగా నీరసంగా ఉంటారు కావున వారికి ఆ మూడు రోజులు విరామం చెప్పింది. ఇన్నాళ్ళు మనకు అన్నీ చేసి పెట్టె వారికి ఆ మూడు రోజులు విరామం తప్పకుండా ఇవ్వాలి. శారీరకంగా నీరసంగా ఉన్నవారికి విరామం, ప్రశాంతత ఇవ్వడం మన కనీస కర్తవ్యం. అందుకు ఆ ఇంటి యజమాని కొంత పూజ అయినా మానేసినా సరే ఇంటి పనులు చేసుకోవాలి. దీపం వెలిగించి గోవిందా గోవింద అనుకున్నా సరిపోతుంది  అంటారు పెద్దలు. రోజు చేసే విధంగా అంతంత సేపు పూజ చెయ్యక్కర్లేదు, కేవలం వంట పని, ఇంటి పని చేసుకుని అందరినీ చూసుకుంటే సరిపోతుందని హితవాక్యం. మాకు కుదరదు అంటూ ఇళ్ళలో కలుపుకుంటే మనకు తెలియని ఎన్నో నెగటివ్ విబ్రేషన్స్ ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. మనం పవిత్రం, మన పూజ పవిత్రం, మనం తీసుకునే అన్న పవిత్రం, దేవుని ప్రసాదం అనుకున్న వారికి ఇవన్నీను. అలాంటివి లేవు ఇది నా సంపాదన, ఈ తిండి నా గొప్పదనం, ఇది నా ప్రసాదం అనుకున్న వారికి ఇటువంటి విషయాలు వర్తించవు లెండి.
ఇందుకే కొందరు ఆచారవంతులు పెద్దలు బయట వండిన వంట కూడా తినరు. కొన్ని చోట్ల బయట తినడం మానలేని పరిస్థితి ఉన్నవారికి కనీసం ఇంట్లోనైనా శౌచం పాటిద్దాం. తరిద్దాం.

ఇంకో విశేషం చెప్పనా...కొందరు సైంటిస్ట్ లు...భోజనంతయారు చేసన కొంతమంది వంటవారి యొక్క మానసిక స్థితి తెలుసుకోగోరి...ఆ వండిన పదార్థాలు magnetic resonance images తీసి చూడగా...శాంతచిత్తంతో వండిన పదార్ధం లో అణువుల అమరిక కీ...అశాంతి తో చేసిన వంట లోని అణువుల అమరికకీ చాలా తేడా ఉందని  తేల్చి చెప్పారు.కనుక మహిళలు వత్తిడి కిలోనయ్యే ఆ సమయంలో వంట మొ.వి చేయకపోవడం ఇంటిలో మిగతావారి ఆరోగ్యానికి మంచిది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...