Wednesday, March 21, 2018

వైదికధర్మం" హిందూధర్మం

సనాతనమైన "వైదికధర్మం" హిందూధర్మం గా ప్రఖ్యాతమైంది. ధర్మానికి సరియైన పేరు అదే అవటం వలన "హిందూ ధర్మం" అనే పురాతన కాలంనుండి నేటి వరకూ ఆ పేరు స్థిరమై నిలచింది.

మన ధర్మం "హిందూ"శబ్ధంతో పిలవడానికి అనేక కారణాలు ఉన్నాయి.అతి ప్రాచీనమైన ఈ నామానికి మూలాధారం ఋగ్వేదమంత్రాలే అని కొందరు పరిశోద్గకులు నిరూపించారు. వేదంలో అనేక చోట్ల కనబడే " సప్తసింధు " శబ్ధంనుండి హిందూశబ్ధం పుట్టింది అని "రాహుల్ సాంకృత్యాయన్" అంటారు.,,,,ప్రాకృతజనులు, ఆర్యసన్నిహిత పారశీకులు 'స ' ను 'హ' గా అనడంలో "సప్తసింధు" అనేది "హప్తహిందు" అయి దాని సంక్షిప్త రూపం "హిందూ" అయిందని వివరించారు.

'స' కారం 'హ' కారంగా మారటానికెన్నో పదాలు ఉదాహరణలున్నాయి.

సప్త అనేది హప్తగా,కేసరి అనేది ప్రాచీన హిందీలో 'కేహరి' గా, సరస్వతి అనేది పర్షియాలో 'హరహ్వతి' గా, అసుర అనేది 'అహుర' గా అవుతుంది. పర్షియన్ల ప్రాచీన అవెస్తా గ్రంథంలో 'సప్తసింధువును' హప్తహిందువు' గానే చెప్పారు.పర్షియన్లు వైదికార్యుల్ని "హిందువులు" అనే పిలిచేవారు.

మీకు నిజంగా తెలివుంటే పరిశీలించండి.

హప్తహిందూ శబ్దానికి మూలమైన సప్తసింధువులు " ఇమం మే గంగే యమునే సరస్వతీ శుతుద్రీ స్తోమం సచతా పరుష్ణ్యా ఆశిక్న్యా మరుద్వృధే వితస్తయార్జీకీయే ఋణోహ్య సషోమయా " అనే ఋగ్వేదమంత్రంలో చెప్పబడ్డాయి.

గంగ,యమున,శుతుద్రీ,మరుద్వృధ,ఆర్జీకీయ,సుషోమ అనే ఏడునదులు సప్తసింధువులు.ఈ సప్తసింధూ శబ్ధం"అష్టౌవ్యఖ్యత్ కుకుభ: పృథివ్యా స్త్రీ ధన్వయోజనా సప్తసింధూన " (1-35-8) వంటి అనేక ఋగ్మంత్రాలలో కనబడుతుంది.ఆ సప్తసింధు వాసులు సింధువులై క్రమంగా హిందువులైనారు.

బహుళప్రచారంలో ఉన్న భాషలన్నిటా,, పైరీతి హిందూశబ్ధమే గ్రహింపబడుటవలన అదే స్థిరమైంది.అలా హిందూశబ్ధం "సప్తసింధు "ద్వారానే స్థిరపడినా,లేక స్వతంత్ర శబ్ధంగానే ఏర్పడినా అది అతి ప్రాచీనము,అతి పవిత్రమైన శబ్ధము.దానికెన్నో వివరణలు ఉన్నాయి.

క్రీ.పూ 4 వ శతాబ్ధం నాటి వృద్ధస్మృతిలో "హింసయా దూయతే యశ్చ - సదాచారతత్పర:; వేదగో ప్రతిమాసేవీ - స హిందూముఖ వర్ణభాక్ " అనిచెప్పబడింది. దీనినిబట్టి హింసనుగూర్చి
దు:ఖించేవాడు,సదాచార తత్పరుడు,వేదములు- గోవులు- దేవతాప్రతిమలనారాధించేవాడు "హిందువు " అని తెలుస్తుంది.అట్లే "హింసయా దూయతే చిత్తం - తేన హిందురితి స్మృత:" అని చెప్పడం వలన
శారీరక,మానసిక, వాచిక త్రివిధ హింసల విషయమునను మనస్సు పరితాపం పొందువాడు హిందువు.

ఈ హిందూ నిర్వచనాన్ని స్పష్టపరుస్తూనే ఆదికవి వాల్మీకి నుండి ఆదికావ్యం రామాయణం వెలువడింది.ఆ రామాయణమే "రామో విగ్రహవాన్ ధర్మ:"అనిపించుకున్న ధర్మస్వరూపుడైన రామునిచరిత్ర తెలియజేసింది.బోయవాడు క్రౌంచపక్షిని బాధించుటచే బాధపడ్డ వాల్మీకి హృదయం నిజమైన హిందూ హృదయం.అందుండి అప్రయత్నంగా వెలువడిన "మానిషాద" అనే శ్లోకమే హిందూ హృదయానికి అద్దంపట్టే రామాయణ మూలకారణం.

క్రీ.శ 4 వ శతాబ్దినాటిదే అయిన బార్హస్పత్య శాస్త్రంలో"హిమాలయం సమారభ్య - యావదిందుసరోవరం; తద్దేవ నిర్మితం దేశం - హిందుస్థానం ప్రచక్షతే " ఇక్కడ హిమాలయం నుండి హిందూమహాసముద్రం వరకు వ్యాపించినది హిందూభూమిగా చెప్పబడింది.

ఈ హిందూభూమియందు నివసించువారు హిందువులనికూడా దీని ద్వారా గ్రహించవచ్చు.ఈ దేశం పరమాత్ముని సృష్టికి నాభివంటిది.అందువలన దీనికి "అజనాభ" అనికూడా పేరు వచ్చింది.

వృద్ధస్మృతిలో చెప్పినట్లే మేరుతంత్రంలోకూడా "హీనం చ దూషయత్యేవ హిందురిత్యుచ్యతే ప్రియే " అని హీనతను దూషించేవాడే హిందువని పార్వతీదేవికి పరమశివుడు వివరిస్తాడు.కార్తవీర్యార్జునుడు సిద్ధిపొందిన మంత్రాలే ఈ "మేరుతంత్ర "గ్రంథం.

క్రీ.శ 11 వ శతాబ్దినాటి పారిజాతాపహరణ నాటకంలో "హినస్తి తపసా పాపాన్ దైహికాన్ దుష్ట మానసాన్ ; హేతిభి: శతృవర్గశ్చ స హిందురభిదీయతే " అని ఎవరు తన దేహ మనస్సంబంధమైన పాపాలను తపస్సుద్వారా నాశనం చేసుకొంటారో,శతృవులను ఖడ్గంతో అంతంచేస్తారో వారు హిందువులు అని చెప్పబడింది.

హిందూ శబ్ద విశిష్టతను చాటే నిర్వచనాలలో క్రీ.శ 14వ శతాబ్దినాటి మాధవ దిగ్విజయంలో "ఓంకార మూలమంత్రాఢ్య: - పునర్జన్మ దృఢాశయ: ; గోభక్తో భారతగరు: - హిందుర్హింసక దూషక:" అని చెప్పబడినది. ఓంకారాన్ని మూలమంత్రంగా భావించేవాడు, పునర్జన్మయందు విశ్వాసం కలవాడు,గో భక్తుడు, భారతమే గురుస్తానమైనవాడు,హింసను దూషించేవాడు "హిందువు " అని చెప్పబడింది.
హిందూశబ్దం అనేక నిఘంటువులలో వివరింపబడినది.

శబ్దకల్పదృమంలో " హీనం దూషయతి ఇతి హిందు:" జాతివిశేష: అని చెప్పుటవలన చెడును దూషించేవాడు హిందువని,
హిందూ అనేది ఒక జాతి అని తెలుస్తుంది.అదే మన హిందూజాతి." పృషోదరాదిత్వాత్సాధు:" అని రూపసాధన కూడా వివరింపబడింది.
" హిందు: - హిందూ - హిందవ:" అని శంభుశబ్దమువలే ఉకారాంతంగా గ్రహించాలి అని మేదినీకోశం చెబుతుంది.
"హిందుర్హిందుశ్చ సంసిద్ధౌ దుష్టానాం చ విధర్షణే " అని హిందువు దుష్టులను, చెడును,అంతం చేయడానికే ఏర్పడినాడని అద్భుతరూపకోశం చెబుతోంది.
దీనినిబట్టి "హిదు " , "హిందూ " రెండు శబ్దాలుగా స్వీకరించవచ్చునని, రెండూ సాధుశబ్దాలే అని గ్రహించగలం.

వీనికి దైత్యారి అనే అర్థం కూడా చెప్పబడింది. అంటే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం రాక్షసత్వమే అని గ్రాహ్యం.హిందువనగా విష్ణువని, యోగి అనికూడా అర్థం. " హిందుర్హి నారాయణాది దేవతారక్త: " శ్రీమన్నారాయణాది దేవతలయందు భక్తి కలవాడు హిందువని హేమంత కవికోశం చెబుతున్నది.
హిందూ శబ్ద విశిష్టతను చాటే నిర్వచనాలలో 14వ శతాబ్ది నాటి #మాధవ_దిగ్విజయంలో "ఓంకార మూల మంత్రాఢ్య: - పునర్జన్మ దృఢాశయ: ; గోభక్తో భారతగరు: హిందుర్హింసక దూషక:" అని చెప్పబడినది. ఓం కారాన్ని మూలమంత్రంగా భావించేవాడు, పునర్జన్మయందు విశ్వాసం కలవాడు,గో భక్తుడు, భారతమే గురుస్తానమైన వాడు, హింసను దూషించేవాడు "హిందువు " అని చెప్పబడింది.
హిందూ శబ్దం అనేక నిఘంటువులలో వివరింపబడినది.

#శబ్దకల్పదృమంలో " హీనం దూషయతి ఇతి హిందు:" జాతివిశేష: అని చెప్పుటవలన

చెడును దూషించేవాడు హిందువని, హిందూ అనేది ఒక జాతి అని తెలుస్తుంది.అదే మన హిందూజాతి."
పృషోదరాదిత్వాత్సాధు:" అని రూపసాధన కూడా వివరింపబడింది.
" హిందు: - హిందూ - హిందవ:" అని శంభుశబ్దమువలే ఉకారాంతంగా గ్రహించాలి అని #మేదినీకోశం చెబుతుంది.

"హిందుర్హిందుశ్చ సంసిద్ధౌ దుష్టానాం చ విధర్షణే " అని హిందువు దుష్టులను, చెడును,అంతం చేయడానికే ఏర్పడినాడని #అద్భుతరూపకోశం చెబుతోంది.

హిందువనగా విష్ణువని, యోగి అనికూడా అర్థం. " హిందుర్హి నారాయణాది దేవతారక్త: " శ్రీ మన్నారాయణాది దేవతలయందు భక్తి కలవాడు హిందువని #హేమంతకవికోశం చెబుతున్నది.

!! హిందుర్దుష్టనృహాప్రోక్తా నార్యనీతి విదూషక: ;
సద్ధర్మపాలకో విద్వాన్ - శ్రౌతధర్మపరాయణ: !!
అనగా దుష్టులను అంతమొందించు వాడు, దుష్టనీతిని నిరసించువాడు, ధర్మమును పాలించువాడు, విజ్ఞుడు, వేద ధర్మములను ఆచరించేవాడే

హిందువని #రామకోశం చెబుతుంది.
మరి హిందూ శబ్దం సంస్కృతంలో లేదంటారా...?
ఇలా ఎన్నో సందర్భాలలో హిందూ అనే పదం చర్చించబడింది గమనించగలరు
నేను హిందువుని....
నాధర్మం గొప్పదని నాకు తెలుసు...
నాకు ఎవరినీ విమర్శించాల్సిన అవసరం లేదు (నా ధర్మం జోలికి రానంతవరకు) .....
నా ధర్మాన్ని విమర్శించేవారు అజ్ఞానులనే నా అభిప్రాయం....
నరాలుతెగి రక్తం చిందుతున్నా...
నా గుండెచప్పుడు ఆగేవరకు గర్వంగా చెప్పగలను నేను "హిందువు"నని

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...