Monday, February 26, 2018

గ్రహదోషాలకు


గోపూజ అద్భుతంగా పని చేస్తుంది:

#గోపూజ
అంటే గోవుకు ఆహారాన్ని తినిపించటమే....

ఉదాహరణకు #అష్టమ_అర్థాష్టమ_ఏలిననాటి_శనిదశలు జరుగుతున్నవారు శనివారం(వీలునుబట్టి) గోవుకు ఆహారం (కనీసం 6 అరటి పళ్ళైనా - 19 వారాలు క్రమం తప్పకుండా) సమర్పించినట్లైతే మంచి ఫలితాలు కలుగుతున్నాయి.,
ఈవిధంగా చేయడం వలన ఎన్నోప్రయాసలకు ఓర్చి #ధర్మం కోసం గోశాలలను నిర్వహిస్తున్న మన మిత్రృలకు సహాయం చేసిన వారం కూడా అవుతాము.....
ప్రతి హైందవుడు ఈవిధంగా చేయాలని ఆశిద్ధాం....
కేవలం 6 అరటిపళ్ళు గోమాతకు సమర్పించటం భారం అవుతుందా....??
ప్రతి హైందవుడు ఆవిధంగా చేయ గలిగితే గోమాతలకు ప్రస్తుతమున్న దుస్థితి వస్తుందా....??

#గోమాత లక్ష్మీదేవితోపాటు క్షీరసముద్రంలో పుట్టినది.,
సతీదేవి దేహత్యాగం అనంతరం దీర్ఘతపస్సులోకి వెళ్ళిపోయిన పరమశివుని మేల్కొల్పుటకు దేవతలు మన్మధుణ్ణి పంపించారు, కళ్ళుతెరచిన శివుని శక్తిని తాళలేక వసంతుడి దేహం బస్మమై పోతుంది, తరువాత దేవతలకు ఏంచేయాలో అర్థంకాక అందరూ వెనకాల ఉండి గోమాతను శివుని దగ్గరకు పంపుతారు.,
దత్తాత్రేయుని వెనకాల గోమాత ఉంటుంది.,
గోమాతతో పెట్టుకుని మహావీరుడు కార్తవీర్యార్జునుడే వంశాన్ని నాశనం చేసుకున్నాడు.,
పూర్వయుగంలో ఒక రాజు పొరపాటున/తెలియక దానమిచ్చిన గోవును మళ్ళీ దానంగా ఇచ్చి కొన్ని వేల సంవత్సరాలు ఉడుంగా బిలంలో కాలం గడిపవలసి వచ్చింది(గోవు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అర్థం)
గోదావరి పుట్టుకకు కారణం అయింది గోమాత.,
ఆత్మలింగాన్ని అడ్డుకొనుటకు గోకర్ణ ప్రాంతంలో వినాయకుడు గోవులను కాసే బాలుడుగా రావణుడికి కనిపించాడు.,
శ్రీక్రృష్ణ పరమాత్మ గోవులను కాయటాన్ని వ్రృత్తిగా ఎంచుకున్నాడు.,
చిన్ని క్రృష్ణుని అవతారంలో ఉన్న పరమాత్మ శక్తిసామర్థ్యాలను పరీక్షించదలచుకున్న బ్రహ్మ ఏంచేయాలో అర్థంకాక గోవులను మాయం చేశాడు.,
అత్యంత రహస్యంగా అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులను బహిర్గతం చేయుటకు ధుర్యోదనాదులు విరాటరాజు గోవులను అపహరించారు, గోవులను కాపాడడం కోసం పాండవులు బయటపడటానికి కూడా సిద్ధపడ్డారు.,
గోమాత కారణంగానే మొదటగా వేంకటేశ్వరస్వామి లోకానికి తెలిసారు.,
వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను కాస్తూనే మొదటిగా తన దైవత్వాన్ని తెలియజేశారు.,
రమణమహర్షి తన తల్లితో సమానంగా గోవుకు అంత్యసంస్కారాలు జరిపించారు.,
అవధూత #కాశినాయన వెనకాల గోవు ఉంటుంది.,
అనేక పుణ్యక్షేత్రాల స్థలపురాణాలతో గోమాతకు సంబంధం ఉంటుంది.,
గోవు పాదం మోపనిదే #గ్రృహప్రవేశానికి అర్థం లేదు.,
అంతెందుకు #క్రృత_త్రేతా_ద్వాపర యుగాలలో క్రౄరమైన రాక్షసులు సైతం సాధారణంగా గోమాత జోలికి పోయినట్టు లేదుకదా....??
లోకపాలకుడు మహావిష్ణువు యొక్క అన్ని లోకాలలో ఉన్నతమైనది వైకుంఠం కాగా, ఆ వైకుంఠం కన్నా పైన ఉన్నది #గోలోకం అని శాస్త్రాలలో చెప్పబడినది.,
గోవును #ఆషామాషీగా తీసుకోవద్దు....
కొద్ది క్షణాలు గోవుతో గడపడమే మహా భాగ్యం....
#భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో గంటల వ్యవధిలోనే కొన్ని వేలమంది చనిపోయారు, కాని చుట్టూఉన్నవాళ్ళు చనిపోయినా కొన్ని కుటుంబాలవారు మాత్రం కొద్దిపాటి అస్వస్థతతో తిరిగి కోలుకున్నారు, తరువాత పరిశోధనలో తేలిందేమంటే వీళ్ళంతా గోశాల సమీపంలో ఉన్న కుటుంబాలు మరియు గోవు నెయ్యితో నిత్యం హోమం చేసే కుటుంబాలు అని తేలింది....
తనను కాచే యజమానికి ఏదైనా వ్యాధి రాబోతుంటే ఆ లక్షణాలను ముందే పసిగట్టి దానిని నివారించే ఔషధ సంబంధ మేత/గడ్డి జాతులను తిని తన  పాలతో యజమానికి తెలియకుండానే వ్యాధిని నివారించే #అద్భుత లక్షణం గోవుకు ఉన్నట్లు ఇటీవలనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...