శాస్త్ర చోదిత కర్మలను మనం విధిగా చేయవలసి ఉంది. ఇది అవసరమా, అనవసరమా అన్న ప్రశ్నకు తావులేదు. ఇలా కర్మానుష్టానం చేసిన తురువాత క్రమంగా మనకు రాగాద్యేషాలు క్షీణిoచి చిత్తశుద్ది ఏర్పడుతుంది.. మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధానం పటిష్ట మవుతుంది. ఇది రెండవ స్తితి. భక్తి పెరిగితే జ్ఞానప్రాప్తి. ఇదే చరమ స్తితి
అందుచే భక్తిని వదలి ముక్తికోసం ప్రత్యేకం ప్రాకులాడ వలసిన పనిలేదు. మనలోనో భక్తే తుదకు ముక్తిని అందిస్తుంది. భక్తీ కోశం భగవంతుని ప్రార్ధిస్తే చాలు. అందుచే మహాను భావులందరూ భక్తీ ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తు, " భక్తి బిక్ష పిట్టవే " అని అమ్మవారిని ప్రార్ధిస్తూ ఉంటారు. ఆ భక్తీ మనకు లభించిందంటే ముక్తి కరతలామలకమే.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ
No comments:
Post a Comment