*అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే నా అస్థిత్వాన్ని గుర్తిస్తూ, ఉహించినవాటికి వ్యతిరేకంగా జరిగితే నా అస్తిత్వాన్ని ప్రశించే వారు నా భక్తులెలా అవుతారు ?*
మేలు జరిగినా ,
విజయాలు చేకూరినా,
ధనధాన్యాలు, సంపదలు
చేకూరినా,
భాగస్వామి లభించినా,
బిడ్డలు పుట్టినా,
సుఖ సంతోషాలు ,ఆనందాలు
దరిచేరినా,
*"ఈశ్వరా నాకే ఎందుకు ఇలా ?"* అని ప్రశ్నించరు. కానీ -
ఎమన్నా కీడు జరిగినా,
అపజయాలు చేకూరినా,
ధనధాన్యాలు సంపదలు
కోల్పోయినా,
భాగస్వామి బాధించినా,
బిడ్డలు బాధ పెట్టినా,
సుఖ సంతోషాలు , ఆనందాలు
దూరమైనా -
*"ఈశ్వరా నాకే ఎందుకు ఇలా?"* అని ప్రశ్నిస్తారు. నా సృష్టి అంతా నా బిడ్డలే అయినపుడు -
- ఎవరి మీద "ప్రేమ",ఎవరి
మీద "ద్వేషం"?
- ఎవరి మీద "అభిమానం" ,
ఎవరి మీద "అనుమానం"?
- ఎవరి మీద "వాత్సల్యం",
ఎవరి మీద "శత్రుత్వం" ?
- ఎవరు "అయిన"వారు,
ఎవరు "కాని" వారు ?
*కేవలం ఎవరు చేసిన "కర్మ"ను అనుసరించి, వారికి ఫలితం లభిస్తుంది*
*అయినప్పటికీ "కర్మ" ఫలితాన్ని మార్చగల , నిర్మూలన చేసుకోగల "శక్తి" - జీవుల*
* "నిర్మలమైన భక్తి"కి ఉంటుంది;
* "నిశ్చలమైన నమ్మకాని"కి
ఉంటుంది;
* "నిరుపమానమైన సేవ"కి
ఉంటుంది.
* "సర్వ సమర్పణా భావాని"కి
ఉంటుంది.
లేదా
* నా "అనుగ్రహాని"కి,
"కరుణ"కి, "దయ"కు,
"వాత్సల్యాని"కి ఉంటుంది.
*ఎన్ని జన్మలు ఎత్తినా జీవులు, తమ తమ "కర్మ ఫల" నిర్మూలనకే !*
*నా నుంచి దూరమైనా, నా అస్థిత్వాన్ని స్థిరంగా నమ్మిన నాటి నుంచి నా వైపు పయనం మొదలవుతుంది.*
*"నేనే సర్వం ,నేనే సకలం, నన్నే చేరుట పరమార్ధం !" అనుకున్న వారు నాకు చేరువవుతారు.*
*నన్ను తనలోనే కాక, నా సృష్టిలో అన్ని జీవులందు దర్శించినవారు, నాలో భాగమై - "ముక్తి" పొందుతారు.*
- దేవుడు
No comments:
Post a Comment