Thursday, March 8, 2018

ధ్యానయోగ సాధనకి విఘ్నలు ఏమిటి??? అతిగా భుజించువారికి,ఏ మాత్రము భుజించని వారికి అలానే అతిగా నిద్రించువారికి ఏ మాత్రము నిద్రిమ్పక మేల్కొని ఉండే వారికి ధ్యాన యోగము సిద్దించకుండా ఉండటానికి కారణం ఏమిటి??

🕉🕉🕉🕉🕉🕉

*శ్రీమద్భగవద్గీత*
*6:16*

నాత్యశ్నతస్తు యోగోస్తి
న చైకాంత మనశ్నతః,
న చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున.

అర్జునా! ఈ ధ్యానయోగము అధికముగ భుజించువానికిని, బొత్తిగా భుజింపనివానికిని, అట్లే అధికముగ నిద్రించువానికిని, (బొత్తిగా నింద్రించక) ఎల్లప్పుడు మేలుకొని యుండువానికిని కలుగనే కలుగదు.

🌺 *పూర్తి వివరణ* 🌺

అతిగా భుజించుట వలన మత్తు వస్తుంది,సోమరితనము ఏర్పడుతుంది. జీర్ణ శక్తిని పట్టించుకోక అతిగా తిన్నచో వివిధ రోగములు ఉత్పన్నమగును. అట్లే ఆహారము పూర్తిగా త్యజించినచో వాని ఇంద్రియములు,ప్రాణములు,మనస్సు శక్తి హీనములు అవుతాయి. అప్పుడు అతను ఆసనముపై స్థిరంగా కూర్చోలేడు. పరమేశ్వరుడు యందు మనస్సు లగ్నము చెయ్యలేడు. ఈ విధముగా ధ్యాన సాధనకి విఘ్నము ఏర్పడుతుంది. కావున ధ్యాన యోగి అవసరముకి మించి భుజించరాదు. కటికి ఉపవాసములు చేయరాదు.

తగినంతగా నిద్రించుట వలన అలసట తొలగి,చురుకుదనం ఏర్పడుతుంది. ఆ నిద్ర అవసరం కంటే ఎక్కువ అధికమైనచో తమోగుణము హెచ్చును. దీని వలన సోమరితనం ఆవహింస్తుంది.స్థిరముగా కూర్చోవడం కష్టం అవుతుంది. దీనికి తోడు అతిగా నిద్రించుట వలన జీవితమును అమూల్యమైన కాలం వ్యర్థం ఐపోతుంది. అలానే ఏ మాత్రం నిద్రిమ్పక పూర్తిగా మేల్కొని ఉన్నా అలసట కలుగును. చురుకుదనం నశిస్తుంది.. శరీరము,ప్రాణము, ఇంద్రియాలు శక్తిహీనులై శిథిలమగును. క్రమక్రమంగా అనేక రోగాలు ఏర్పడతాయి. ఆ కారణముగా మబ్బుగా ఉండుట సోమరి అవ్వడం సంభవిస్తుంది. ఈ విధముగా ఎక్కువగా నిద్రించుట కానీ ఎల్లప్పుడూ మేల్కొని ఉండుట కస్ని ఈ రెండు ధ్యాన యోగ సాధనకి విఘ్న కారణాలే. కావున ధ్యాన యోగి తన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ధ్యానయోగ సాధనకి ఏ మాత్రము విఘ్నము కలుగ నీయరాదు. ఈ ఉద్దేశ్యం తోనే తన శరీర స్థితిని,ప్రకృతిని,ఆరోగ్యాన్ని గమనిస్తూ అవసరము కంటే ఎక్కువ మేల్కొనరాదు ఎక్కువ నిద్రింపరాదు.

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...