Sunday, August 16, 2015

భారతీయుడు

నాగరికత లేక ప్రపంచం అల్లాడుతున్నప్పుడు….విజ్ఞానం తెలియక నరులు పామరులై ఉన్నప్పుడు మన భారత దేశం సంపూర్ణ సాంకేతిక విజ్ఞానంతో విరాజిల్లింది. మన వేదాలు, మన పురాణాలు అందించిన జ్ఞాన సంపదను ఆసరాగా చేసుకొని భారతీయ ఋషులు శాస్త్ర, విజ్ఞాన రంగంలో అభుతాలు చేసి చూపించారు.

ప్రపంచానికి వైద్యం తెలియని ఆ కాలంలోనే సుశ్రుతుడు వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించాడు. ప్లాస్టిక్ సర్జరీ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఈ వైద్య విద్యను సుశ్రుతుడు ఆనాడే యుద్దంలో గాయపడిన సైనికులకు నిర్వహించాడు.
విశ్వం, సౌర కుటుంబం, గ్రహాల గమనం వంటి ఖగోళ రహస్యాలను ఆర్యభట్ట ఆనాడే ప్రపంచానికి చాటి చెప్పాడు.
గణిత శాస్త్రంలో ఒక అద్భుతంగా చెప్పుకొనే పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా భారతీయులే.
మన రామాయణ కాలంలోనే పుష్పక విమాన ప్రయాణం గురించి మనం విన్నాం..
ఇప్పుడు రైట్ బ్రదర్స్ కనుక్కున్నారని చెప్పుకుంటున్న విమానం… వారికంటే ముందుగానే భారత్ లో 1895 లో శివకర్ బాపూజీ తాల్పడే అనే భారతీయ ఇంజనీర్ రూపొందించాడు. 1903లో రైట్ బ్రదర్స్ ఎగరేసిన విమానానికి మూలం తాల్పడే విమానమే అనేది నేటి ఆధునిక వైజ్ఞానికులు అంగీకరించిన సత్యం…
వీరే కాదు జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజన్, C.V. రామన్ వంటి అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు ఆధునిక భారత విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటారు.

ఇక నేడు జరగాల్సింది సంపూర్ణ ఆధునిక భారతీయ వైజ్ఞానిక వికాసం… మన పురాణాలు, వేదాలలో మహనీయులు చెప్పిన మహత్తర విశేషాలను ఆచరణలోకి తీసుకొచ్చి, ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞాన బోధ చేసిన భారత మాతను మళ్ళీ జగద్గురు స్థానంలో నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. భారత దేశ వైభవాన్ని తొక్కి పెట్టాలని భావించిన పాలకుల నుండి పాలకుల నుండి జాతీయ వాద భావాలున్న, మన ప్రాచీన జ్ఞాన సంపద మీద అపార గౌరవం ఉన్న దేశ భక్తుల పాలనలోకి దేశం నడిచింది. ఇక మన భారతాన్ని విశ్వ గురువుగా చూడాలని కలలు కన్న మహనీయుల కలలు నెరవేర్చాల్సిన సమయం… నెరవేర్చగల నిష్ఠా కలిగిన ప్రభుత్వ హయాంలోనే ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావాలని ఆశిస్తూ…. సగటు భారతీయుడు

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...