ఆచరణీయమైన దానిని ఆచారము అంటారు. బుద్దివంతులు, మేధావులు, పండితులు, ధర్మవేత్తలు, కులపెద్దలు, ఆగమ కోవిదులు ఎందరెందరో ఆలోచించి, తర్కించి, అనిషిని మహోన్నతుని చేయటానికి, దురాచారం నుండి దూరం చేయటానికి ప్రవేశపెట్టిన ఆలోచనే ఆచారము.
మన ప్రాచీన గ్రంధాలలో మనుష్యుల వృత్తినిబట్టి, ప్రవృత్తిని బట్టి మన సమాజములో నాలుగు మాత్రమె కులాలు వున్నవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను వర్ణములు మాత్రమె కలవు. ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క ఆచారము వున్నది. కాలక్రమములో శూద్ర వర్ణం వివిధ రకాల మార్పులకు, వివిధమైన చిభాగాలకు లోనైనది. ఫలితముగా అనేక తెగలుగా విడిపోయి ఎవరికి ఇష్టమైన ఆచారములను వారు స్థిరపరుచుకున్నారు. ఒక్కొక్క తెగకు ఒక్కొక గురువు (కులపెద్ద) ఉండటమువలన ఎవరి ఆచారాలు వారు అనుసరించడము జరిగినది.
ఇందులో కేవలము శూద్రవర్ణము మాత్రమె వివిధ కులాలుగా విడిపోయినది. అందుకు కారణము వారు విద్యావంతులు కాకపోవటమే. చాలా వరకు తమ తమ తేగల కట్టుబాట్ల కోసమే ఈ ఆచారములు ఏర్పడినవి.
No comments:
Post a Comment