Friday, April 6, 2018

నీ భక్తి ఎంత?


     

*కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు.*

ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది.

*పూజారి బయటకు వచ్చి చూడగా.*

పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది.

*వెళ్లి చూడగా...*
*దానిపై*

‘నా భక్తుని కొరకు’
అని రాసి ఉంది.

*ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు.*

పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే...

*అది మట్టిపాత్రగా మారిపోయింది.*

విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది.

ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది.

*ఆలయం కిక్కిరిసిపోయింది.*

ఒక్కో భక్తుడు రావడం...
పళ్లాన్ని ముట్టుకోవడం...
అది మట్టిపాత్రలా మారిపోవడం...
ఇదే తంతు!

*విషయం కాశీ రాజుకు తెలిసింది.*

రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు.

*జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు.*

అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు... నలుపు రంగులో కనిపించింది.

*తానెంత అధముడనో రాజుకు అర్థమైంది.*

అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.

*ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు.*

మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు.

కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు.

*‘విశ్వనాథా !*
*ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’*
*అని మొరపెట్టుకున్నాడు.*

మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు.

ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు.

*చివరగా ఆలయంలోకి వచ్చాడు.*

స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది.

*ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు.*

దూరంగా నిల్చుని చూస్తున్నాడు.

తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి..

*‘ఓ పెద్దాయన... నువ్వూ వచ్చి ముట్టుకో... రోజూ* *గుడికొస్తావ్‌గా, నీ భక్తి*
*ఏ పాటిదో తెలిసిపోతుంది’*
అని హేళనగా అన్నాడు.

పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు.

అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది.

*అందరూ ఆశ్చర్యపోయారు.*

అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు.

*ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి.*

అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.

*నా జీవితం లోనివి*
*కష్టాలు కాదు,*
*భగవంతుని వరాలు!*

నేను శక్తిని అడిగాను --
*భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.*

నేను సంపదను అడిగాను--
*భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.*

నేను ధైర్యాన్ని అడిగాను --
*భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.*

నేను వరాలు అడిగాను --
*భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.*

నేను ఆయన ప్రేమను అడిగాను-
*భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.*

నేను జ్ఞానాన్ని అడిగాను -
*భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.*

నేను పురోగతి అడిగాను -
*భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.*

నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను -
*భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.*

నేను ఆయన్ను మరువకూడదు
అని అడిగాను --
*భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.*

నేను పాపాలు క్షమించమని అడిగాను --
*భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.*

అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు -
*నాకు కావలసిందే నేను పొందాను.*

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు *అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.*

*చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.
మీరు కూడాఅర్ధం చేసుకోండి.*

జరిగేది అంతా మన మంచికే.

లోకా సమస్తా సుఖినోభవ౦తు

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...