Friday, April 6, 2018

మెడిటేషన్


ఆత్మ స్వరుపులందరికి ఆత్మాభివందనములు .
ఈ పృద్వి మీద ఏ వస్తువుకైనా చలనము కావాలంటే శక్తి కావలి .ఈ ప్రకృతి అంతా శక్తి మయమే .పంచ భూతాలైన భూమి ,నీరు ,అగ్ని ,వాయువు ,ఆకాశము వివిధ శక్తి స్వరూపాలే .ఒక విత్తనము మొలకెత్తాలంటే పృథ్వి శక్తి ,జలశక్తి కావలి .ఈ రెండు లేకుంటే విశ్వమే లేదు .ఈ సకల చరాచర జీవులలో కొన్ని జీవరాశులకు మాత్రమే ఆలోచనా జ్ఞానం కలిగి ఉన్నవి .అందులో మానవులకు మాత్రమే అత్యంత ఙ్ఞాన సముపార్జన ,ఆలోచనా శక్తి ఈ విశ్వము ప్రసాదించింది .ఎంత శక్తి వున్నా అది సక్రమముగా పనిచేయాలంటే శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ సార్ధవంతముగా పనిచేయాలి .

మనవ శరీరంలో కొన్ని సున్నితమైన పాయింట్లు ఉన్నాయి .వాటిని 7 శక్తి కేంద్రాలు అంటారు .వాటినే చక్రాస్ అంటారు .మహ యోగులెందరో ఈ చక్రాలను పద్మలుగా అభివర్ణిస్తారు .వీటినే షట్చక్రాలు అంటారు .

1 . మూలాధార చక్రం
2 . స్వాధిష్ఠాన చక్రం
3 . మణిపూరక చక్రం
4 . అనాహత చక్రం
5 . విశుద్ధి చక్రం
6 . ఆజ్ఞ చక్రం
7 . సహస్రార చక్రం
ఈ చక్రాలు భౌతికంగా మానవ శరీరంలో అనేక జీవ ప్రక్రియలను నిర్దేశిస్తాయి .ఈ చక్రాలు మనిషి బౌతికంగా గాని ,ఆధ్యాత్మికముగా గాని పరిపూర్ణత సాధించడానికి దోహదం చేస్తున్నాయి .ఈ చక్రాలను ఎప్పటికపుడు శక్తివంతం చేసుకుంటూ  ఉండాలి .అవసరమైన యోగాసనములు ,ప్రాణాయామములు ,మనస్సు పరిశీలన ,ఆత్మపరిశీలన ద్వారా ఈ చక్రాలను శక్తివంతము చేసుకొవలెను .

మనిషి నిరంతరమూ శరీరమే నేను అనుకుంటూ నేను అని అహంకరించుకుంటూ ,ఎందుకు పుట్టాడో ,ఎందుకు బ్రతుకుతున్నాడో ,ఎందుకు కష్టాలు వస్తున్నాయో ?,ఎందుకు అనారోగ్యాలు  వస్తున్నాయో ,ఎందుకు చనిపోతున్నామో కూడా తెలుసుకొకుండా బ్రతుకుతున్నడు .శరీరము అంటే ఏమిటి ? శరీరంలో అసలు ఏమి ఉంటాయి ? శరీరములో చక్రాలఅంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ,అవి వేటిమీద ప్రభావితమై ఉంటాయి ? వాటిని ఏ విధముగా శక్తివంతము చేసుకోవాలి అని వాటిమీద ఏమాత్రము శ్రద్ద లేదు ఎదో లెగిసాము ,తిన్నాము ,పని చేసాము ,పడుకున్నాము ,మరలా లెగిసాము .కాళీ లేకపోయినా కాళీ చూసుకుని సినిమాకి వెళ్ళామా ,లేక షికారుకు వెళ్లమా ,ఇదే జీవితం అనుకుంటున్నడు .

ఒక్కసారి చక్రాల వంక చూడండి .వాటితో మమేకమవ్వండి .వాటిని ఉపయోగించుకుని భగవంతునితో మమేకమవ్వండి .ఎందుకు            బ్రతుకుతున్నామో కాదు .ఎందుకు బ్రతకాలో తెలుస్తుంది .ఎలా బ్రతకాలో తెలుస్తుంది .ఏవిధముగా ఆనందముగా వుండాలి తెలుస్తుంది .ఏ విదముగా ఆరోగ్యముగా ఉండాలో తెలుస్తుంది .ఏ విదముగా శరీరము వదలలో తెలుస్తుంది .  ఇది జీవితంలో తెలుసుకోవడమంటే .ఇది జీవితంలో సాదించడమంటే .ఇది జీవన్ముక్తి అంటే .ఇదే ఋషి జీవితమంటే .అంతేగాని సకల చరాచర జీవులు బ్రతుకుతున్నాయి ,మనవులు బ్రతుకుతున్నరు .వాటికి మానవుడికీ ఏవిధమైన భేదము కనిపించకుండా పొతుంది .వాటికి మానవుడికి భేదము వుంది .అది ఏమిటంటే వాటికి బట్టలు లేవు ,మానవుడికి ఉన్నాయి .కొన్ని జీవులు  గుడు కట్టుకోవు ,కొన్ని కట్టుకుంటాయి ,కాని మానవులందరుకి గూడు ఉంటుంది .అదే భేదము .అంతకు మించి భేదము లేదు .

యోగిక్ మెడిటేషన్ నేర్చుకొండి .భగవంతునితో మమేకమవ్వండి .మీకు ఏమి కావాలన్న సాధించుకోవచ్చు .

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...