Tuesday, April 3, 2018

ప్రదక్షిణం దేనిగురించి చేస్తారు?

ప్ర : ప్రదక్షిణం (గుడి చుట్టూ తిరగడం) దేనిగురించి చేస్తారు? ఇక్కడ ఏ మంత్రాలూ ఉపయోగిస్తారు? ఎన్ని సార్లు ప్రదక్షిణ చేయాలి?

జ: ప్రదక్షిణం చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుంది. దేవాలయాలకు వెళితే ' గుడి చుట్టూ తిరగడం ప్రదక్షిణం'. మాములుగా ఇంట్లో దేవతారాధన చేస్తే చేయవలసినది 'ఆత్మప్రదక్షిన'. తనంత తాను దక్షిణం (కుడి) నుండి తిరగడం, మనలో ఉన్న పరమాత్మను దర్శించేందుకు అది ఒక విధానం. గుడిలో ఆత్మప్రదక్షిణ పనికిరాదు.

గుడిని నిర్మించిన ఆగమ శాస్త్రానుసారం గుడి నలువైపులా వివిధ దేవతాశక్తులు ప్రతిష్టింపబడి ఉంటాయి. గుడి చుట్టూ తిరగడం వల్ల ఆ దేవతా శక్తుల అనుగ్రహ దృష్టి మనపై పడుతుంది. అంతే కాక - గుడిలో ప్రధాన దైవం - దీపం వలె విశ్వతోముఖుడు. అంటే అన్నివైపుల నుండి నమస్కరించడం కూడా - ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం. సాధారణంగా దేవాలయంలో ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడులు ప్రకారం 11 - 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదువుకోవాలి.

యానికాని చ పాపాని
జన్మాంతరకృతానిచ!
తాని తాని ప్రణశ్యoతి
ప్రదక్షిణ పదే పదే!!
పాపోహం పాపకర్మాహం
పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయా దేవ
శరణాగత వత్సల!
"అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్యభావేన
రక్ష రక్ష మహేశ్వర!!

శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో

దేవ - దేవి
శరణాగత వత్సల - శరణాగతవత్సలే
మహేశ్వర - మహేశ్వరి అని మర్చి చదువుకోవాలి.

ఈ శబ్దాలు ఏ శక్తిదేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.......

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...