మైసూరు దగ్గర ఒక గుట్టమీద ఉన్న గుహలో పాపనాశన లింగం ఉందని తెలిసి శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారు( 1954 — 1989 ) అక్కడ సంధ్యాపూజ చేయడానికి ఉద్దేశించారు.
గుహలో కొంతదూరం పోయాక ఇరుకుగా ఉన్న ఒకచోట వంగి పాకుతూపోగా లోపల ఒక విశాలమైన ప్రాంగణం లో శివలింగం కనిపించింది.
లింగం వెనుక కొంత ఎత్తుగా ఉన్న మిట్టనుంచి నీళ్ళు ఉబికి లింగం పై ధారగా పడుతుందని వినిఉన్న మహాస్వామి ఆ గుహ లోపల లింగం దగ్గర తడి కనిపించినా ఎక్కడా నీరున్నట్లు తెలియలేదు.
పూజ చేయడం ఎట్లా ? అని ఆలోచించిన శ్రీ మహాస్వామి
" పురుష సూక్తం " మొదలు పెట్టారు.
అంతే .................. ! ! ! ! ! ! ! !
లింగం వెనుక ఉన్న ఎత్తైన మిట్ట నుండి నీటిధార పైకి లేచి లింగాన్ని అభిషేకించింది. ! ! ! !
" పురుషసూక్తానికి అంత మహిమ ఉన్నదని నేను అంతకుముందు విని గానీ , చదివి గానీ ఉండలేదు " అని శ్రీ స్వామి వారు చెప్పారు .
శ్రీ స్వామి వారి నుంచి ఈ వృత్తాంతం విన్న వారు కొందరు ముప్ఫై నలభై మంది ఆ గుహలోకి తమను తీసుకునిపోవలసినది గా శ్రీవారి ని అభ్యర్ధించారు.
గుహలోకి వెళ్ళి చూస్తే పొడి గా ఉంది.
" నేను మౌనంగా ఉన్నాను. భక్తులు ఏక కంఠం తో పురుష సూక్తం మొదలు పెట్టారు.
అంతే .......... ! ! ! ! ! ! ! !
ఆ అద్భుతం మరల జరిగింది ! .
శివలింగం మీద నీటిధార అభిషేకం మొదలైంది.
" పురుష సూక్తం ప్రత్యేకత ఇంకొకసారి నిరూపితమైంది.
అంతా భగవత్కటాక్షం ! "
అని శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి ఆ వృత్తాంతాన్ని స్మరించుకున్నారు.
No comments:
Post a Comment