Saturday, November 22, 2014

పురాణాల విభజన

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. 

          

                   

పురాణ వాఙ్మయం ఆవిర్భావం

"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.[1]
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును[1].

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి కార కార కార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

 

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం


సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
  • అ -- అగ్ని పురాణం
  • నా -- నారద పురాణం
  • పద్ -- పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గ -- గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్కా -- స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]
  1. బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
  2. పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
  3. విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
  4. శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
  5. లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
  6. గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
  7. నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
  8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
  9. అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
  10. స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
  11. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
  12. బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
  13. మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
  14. వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
  15. వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
  16. మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
  17. కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
  18. బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.
వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్ నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్ భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్


ఉపపురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:

బ్రహ్మ పురాణంలో ఉన్న ముఖ్యాంశాలు.


నక్షత్రముల జన్మము, వివాహము

కశ్యపనీ భార్య దితి  గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు  వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.


ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.

చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట

ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్ధించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు.

చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.

దేవ, రాక్షస, మానవ గణములు

దక్షుడు ఇలా చెప్పాడు - రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు. కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది.

వివాహ సమయంలో చేసే ప్రమాణములు

చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తరుషులను అరుందతిని   చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను  విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.

చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము

తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.

  • వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు.

  • ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు

  • ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి

వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే.

కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే. జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, శ్రీహరి పంకేరుహ ధ్యానైక చిత్తుడై, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు.

ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

చంద్రుని క్షయరోగ విముక్తి

తన భార్యలను (అనగా చంద్రుని భార్యలు, దక్షుని పుత్రికలు అయిన వారిని) చంద్రుడు క్షోభకు గురి చేశాడు గనుక అతనికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరిపట్ల పక్షపాత బుద్ధి లేకుండా మెలగమని చెప్పాడు. అందుకొరకు దినమునకొక భార్యతో ఉండమని, ఆ 27 దినములు 27 యోగములు  అవుతాయని దక్షుడు చెప్పాడు. - అవి విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, వృద్ధి, ధృవము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, పరియాన్, పరిఘము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, ఇంద్రము, వైధృతి.


అలా ఉండడం వలన క్రమంగా రోగం క్షీణిస్తుందని, శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతుంటాడని దక్షుడు ఉపాయం చెప్పాడు. తన శాపం అమోఘం గనుక దానిని తొలగించడం సాధ్యం కాదని, కాని మదోన్మత్తుడైన రాజు (చంద్రుడు) క్రమంగా జరిగినదానిని మరిచిపోయే ప్రమాదం ఉంది గనుక ఆ విధాన్ని అలా ఉండనీయమని చెప్పాడు. దక్షునికి నమస్కరించి, అతని ఆనతి తీసికొని చంద్రుడు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు.

మహా పాతకము, పుణ్యములో పాపము

నక్షత్రాల, చంద్రుని కథ విన్న తరువాత జైమిని వ్యాసుని "మహాపాతకములు" అంటే ఏమిటని అడిగాడు. అందుకు వ్యాసుడిలా చెప్పాడు - పాతకాలలో ఐదింటిని "మహాపాతకాలు" అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు -

  1. స్త్రీ హత్య

  1. శిశు హత్య

  1. గో హత్య

  1. బ్రహ్మ హత్య

  1. స్వర్ణస్తేయము

ఇక బుద్ధి పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాకుండా తెలియక, ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాలు క్రమంగా హరిస్తాయి. ఇందుకు ఉదాహరణగా కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో ఇరుక్కొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.

ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు రాజు భీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కాని ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు. దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు చెందుతుంది. అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. పది దినములు దీక్షతో ఉండి, పుణ్యక్షేత్రాలు దర్శించి, ఉత్తమ దానములు చేయుము - అని చెప్పారు. రాజు అలాగే చేశాడు.

గోవు పుట్టుక

గోవుకు అంత పవిత్రత ఎందుకు కలిగిందని జైమిని అడిగాడు.

శ్వేతవరాహకల్పంలో విరాట్పురుషుడైన పరబ్రహ్మ యోగనిద్రనుండి లేచి ముందుగా తన నాభి కమలంనుండి బ్రహ్మను పుట్టించాడు. అనంతరం తనయందున్న ప్రకృతినుండి విష్ణువును, మహేశ్వరుని సృజింపజేశాడు. అనంతరం ప్రకృతి చేసిన ఒక తప్పిదం కారణంగా ఆమెను "పశువు" అన్నాడు. కాని మరల కరుణించి - నీ ముఖంలో పంచమహాపాతకాలుంటాయి. అయినా నీవు అతిపవిత్రవై యుందువు. నీ మలమూత్రములు కూడా పవిత్రములు. నీ దర్శనము సకల పాపములు పోగొట్టును. నిన్ను దానమిచ్చేవారి శరీరంలో ఎన్ని వెండ్రుకలుంటాయో అన్నివేల దివ్యాబ్ధములు వాఱు గోలోకంలో నివశిస్తారు.- అని చెప్పెను.

గాయత్రి ఉత్పత్తి

గాయత్రి  గురించి తెలుపమని జైమిని వ్యాసుని ప్రార్ధించాడు - అందుకు వ్యాసుని ఉత్తరం:

పరబ్రహ్మ నాభి కమలంనుండి జనించిన నాలుగు ముఖాల బ్రహ్మకు  ''ఓం'' అనే ప్రణవనాదం వినిపించింది. అప్పుడు బ్రహ్మ ఒకోముఖంనుండి ఆరు అక్షరాలు కలిగిన గాయత్రి మంత్రం (మొత్తం నాలుగు ముఖాలనుండి 24 అక్షరాలు) వెలువడింది. కనుక అన్ని వేదములకు ఈ మంత్రము మాతృక. అన్ని మంత్రములకు తల్లివంటిది. ఈ మంత్రాన్ని ఉపాసించేవారి కోరికలు ఈడేరును. బ్రహ్మమును ఉపాసించేవారికి ఇది ముఖ్యసాధనమైన బ్రహ్మవిద్య  ఉపనయనార్హత కలిగిన ద్విజులు తప్ప అన్యులు దీనిని జపించరాదు, ఉపాసింపరాదు."

బ్రహ్మ పురాణము అధ్యాయ క్రమంలో

  • మొదటి అధ్యాయములో బ్రహ్మ సృష్టి చేయ సంకల్పించుట. ఆ తరువాత ఉదకమును సృజించుట. ఆ ఊదకములో సృష్టి చేయడానికి వీర్యమును వదలుట. అవి బంగారు అందములుగా తెలియుట. అందు ఒక అండమునందు హిరణ్య గర్భుడుగా తానే జనించుట. బ్రహ్మ మానస పుత్రులను సంకల్ప కారణముగా పుట్టించుట. రుద్రుని పుట్టించుట. సనత్కుమారుడు జన్మించి స్కందుడగుట. పక్షులను, సాధ్యులను పుట్టించుట. ఉరుములు, మెరుపులు, ఇంద్ర ధనస్సు, మేఘములను సృష్టించుట, భువి, దివి, ఆకాశమును సృష్టించుట వర్ణించబడ్డాయి. బ్రహ్మ స్త్రీ పురుషులుగా మారి ప్రజలను వృద్ధి చేయుట. పురుషుడు జగములందు విష్ణువుగా వ్యాపించుట. విష్ణువు విరాట్పురుషుని పుట్టించుట. విరాట్పురుషుడు మనువును సృజించుట. మన్వంతరము కొనసాగుట వర్ణించబడినది.

  • స్వాయంభువ మనువు శతరూపల వివాహము వారి వంశాభివృద్ధి క్రమంలో ధృవ జననము, పృధువు జననము, దక్షప్రజాపతి జననము అతడి వివాహము వారి వివాహములు వర్ణించబడ్డయి.

  • తృతీయాధ్యాయములో దక్షుడు సంకల్ప మాత్రముగా దేవ దానవ యక్షులను పుట్టించడము. అస్నికను వివాహమాడడము, పుత్రులను కనడము, నారదుని మాటలు విని వారు గృహస్థ జీవితానికి విముఖులై వెళ్లి తిరిగి రాక పోవడము, దక్షుడు తిరిగి వైరిణి యందు వేయి మంది పుత్రులను పొందడము, వారు అన్నలను వెదుకుతూ వెళ్లి తిరిగి రాక పోవడము, తత్ఫలితముగా దక్షుడు కుపితుడై నారదుడిని శపించడము, శాపవశాన నారదుడు బ్రహ్మకు జన్మించడము, దక్షుడు తిరిగి అరవై మంది పుత్రికలను కనడము, వారిని ధర్మునుకి, కశ్యపునికి, చంద్రుడికి ఇచ్చి వివాహము వేయడము వర్ణించబదినది. దేవాసుర ఉత్పత్తి వర్ణించబడినది.

  • నాలుగవ అధ్యాయములో బ్రహ్మ సృష్టి అంతటికీ అధిపతులను నిర్ణయించుట, రాజులకు కుబేరుడిని, ఆదిత్యులకు విష్ణువును, జలాలకు వరుణిడిని, వసువులకు అగ్నిని, ప్రజాపతులకు దక్షుడిని, మరుత్తులకు వాసవుని, దైత్యులకు ప్రహ్లాదుడిని, పితరులకు యముడిని, యక్ష, భూత పిశాచములకు శివుడిని, పర్వతములకు హిమవంతుడిని, నదులకు సాగరుడిని, గంఘర్వులకు చిత్రరధుడిని, నాగులకు వాసుకుని, సర్పములకు తక్షకుడిని, ఏనుగులకు ఐరావతాన్ని, గుర్రములకు ఉచ్ఛైశ్వాన్ని, పక్షులకు గరుడిని, మృగములకు సింహాన్ని, గోవులకు గోవృషమును, వృక్షములకు జువ్విని అధిపతులను చేయడము. దిక్కులకు అధిపతులను నిర్ణయించడము. పృధు చక్రవర్తి సహాయముతో భూని గోవుగా చేసి అందరూ క్షీరమును పితకడము వర్ణించబడినది.

  • ఐదవ అధ్యాయమున మనువుల గురించి మన్వంతరముల గురించి మనువుల కుమారుల గురించి వర్ణించ బడినది. ఆయా మనువుల కాలములో సప్తఋషుల గురించి వర్ణించబడినది.

  • ఆరవ అధ్యాయములో కశ్పపునికి వివస్వంతుడు(సుర్యుడు) జన్మించుట, సూర్యుడు త్వష్ట ప్రజాపతి కూతురైన సంజ్ఞాదేవిని వివాహము చేసుకొనుట, ఛాయాదేవి సృష్తి, మనువు, యముడు, యమున, సావర్ణి మనువు, శనీశ్వర జననము, వారి విధులు వర్ణించబడ్డాయి.

  • ఏడవ అధ్యాయములో వైవసత్వమనువు వంశ చరిత్ర, పురూరవ జననము, దుంధుమారుని గురించి వర్ణించబడినది.

  • ఎనిమిదవ అధ్యాయములో సూర్యవంశానుక్రమములో త్రిశంఖు చరిత్ర, హరిశ్చంద్రుడు, సగరుడు, దశరధుడు, శ్రీరాముడు, కుశుడు, నలుడు మొదలైన వారి చరిత్ర వర్ణించబడినది.

  • పదియవ అధ్యాయములోచంద్రవంశ చరిత్ర చెప్పబడినది. గంగాదేవి జాహ్నవిగా మారుట, కవేరి, కైశికీ నదుల పుట్టుక, జమదగ్ని పరశురాముల జననము వర్ణించబడినది.

  • పదకొండవ అధ్యాయములో కాశ్యపవంశ వర్ణన చేయబడినది.

  • పన్నెండవ అధ్యాయములో యయాతి చరిత్ర వర్ణించబడినది.

  • పదమూడవ అధ్యాయములో యయాతికుమారులైన పురువు, దుహ్యుడు, తుర్వసుడు, అనువు, యదువుల చరిత్ర వర్ణించబడినది.

  • పదినాల్గవ అధ్యాయములో వృష్టి వంస చరిత్ర వర్ణించబడినది.

  • పదిహేవవ అధ్యాయములో భోజవంశ చరిత్ర గురించి చెప్పబడినది.

  • పదహారవ అధ్యాయమున అంధక వంశ చరిత్ర చెప్పబడినది. శ్యమంతకమణి వృత్తాంతము వర్ణించబడినది.

  • పదిహేడవ అధ్యాయములో శ్యమంతకమణి కథా సమాప్తము అయినది.

  • పద్దెనిమిదవ అధ్యాయములో భువునకోశ ద్వీప వర్ణన చేయబడినది.

  • పదొమ్మిదవ అధ్యాయములో జంబుద్వీప వర్ణన చేయబడినది.

  • ఇరవైవ అధ్యాయము ప్లక్ష్యద్వీపము, శాల్మద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, పుష్కరద్విపము అను ఆరు ద్వీపముల వర్ణన చోటు చేసుకున్నది.

  • ఇరవై ఒకటవ అధ్యాయములో అతల, వితల, సుతల, తలాతల, పాతాళ, రసాతల, నితల అను ఏడు పాల లొకముల వర్నన జరిగినది.

  • ఇరవైరెండవ అధ్యాయములో నరక లోక వర్ణన పాపములు ఫలితము విముక్తి మోక్షము గురించి వర్ణించబడినది.

  • ఇరవైమూడవ అధ్యాయములో ఊర్ధ్వలోక వర్నన, విష్ణుతత్వము సృష్టి గురించి తెలుపబడినది.

  • ఇరవైనాల్గవ అధ్యాయములో బ్రహ్మాండము, సూర్యుడు, వర్షము గురించి వర్ణించబడినది.

  • ఇరవై ఐదవ అధ్యాయములోసకల పూణ్యతీర్ధాల వర్ణన చేయబడినది.

  • ఇరవై ఆరవ అధ్యాయములోమునులు సుతుడిని మోక్షము నిచ్చే పుణ్యతీరధము గురించి ప్రశ్నించుట గురించి వర్ణించబడినది.

  • ఇరవైఏడవ అధ్యాయములో భరత ల్హండము గురిఛిన వర్ణన చేయబడినది.

  • ఇరై ఎనిమిదవ అధ్యాయములో సూర్యోపాసన, పుజావిధనము, కోణతీర్ధమహిమ గురించి వర్ణించబడినది.రామేశ్వర మహిమ గురించి చెప్పబడినది.

  • ఇరవై తొమ్మిదవ అధ్యాయములో సుర్యోపసన గురించి పుజా విధానము ఫలితాల గురిమ్చి వివరించబడింది.

  • ముప్పైవ అధ్యాయములో సుర్యుడి మహిమ గురించి వర్ణించబదినది.

  • ముప్పై ఒకట్వ అధ్యాయములో సూర్యుది మహిమ సూర్యోపసనా ఫలితాలు వర్ణించబడ్డాయి.

  • ముప్పై రెండవ అధ్యాయములో మార్తాండుడు జన్మించుట అతడికి తరణి పట్టి మూర్తిని సుందరముగా చెక్కుట వర్ణించబడినది.

  • ముప్పై మూడవ అధ్యాయములో సూర్య అష్టోత్తరము, శతనామావళి దాని ఫలితము.

  • ముప్పై ఐదవ అధ్యాయములో పార్వతీదేవి తపస్సు గురిమ్చి వివరంచబడినది.

  • ముప్పై ఆరవ అధ్యాయములో శివపార్వతుల వివాహాలంకరణ శోభ గురించి వర్ణించబడినది.

  • ముప్పై ఏడవ అధ్యాయములో శివకల్యాణము వర్ణించబడినది.

  • ముప్పై ఎనిమిదవ అధ్యాయములో శివుడు పార్వతితో విహరించుత శివుడు కైలాసమును వీడి మెరువును చేరుట వివరించబదినది.

  • ముప్పై తొమ్మిదవ అధ్యాయములొ దక్షయజ్ఞ వినాశనము గురిమ్చి వర్ణించబడినది.

  • నలభైయవ అధ్యాయములో దక్షుడు చేసిన శివసహస్రనామావళి గురించి వర్ణించబడినది.

  • నలభై ఒకటవ అధ్యాయములో ఏకామ్రేశ్వరుని మాహాత్మ్యము గురిమ్చి వర్ణించబడినది.

  • నలభై రెండవ అధ్యాయములో ఉత్కళ క్షేత్రవైభము గురించి వర్ణించబడినది.

  • నలభై నాల్గవ అధ్యాయంలో అవంతీపుర వర్ణనము చేయబడినది.

  • నలభై నాల్గవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్రం గురించి వర్ణించబడ్డాయి.

  • నలభై అయిదవ అధ్యాయములో పురుషూత్మ క్షేత్ర ఆవిర్భావము మహిమ గురించి వర్ణించబడినది.

  • నలభై ఏడవ అధ్యాయములో ఇంద్రద్యుమ్నుదు చేసిన అస్వమెధయజ్ఞము, విష్ణుదేవాలయ ప్రాసాద నిర్మానము గురంచిన వర్ణన జరిగినగినది.

  • నలభై ఎనిమిదవ అధ్యాయములో విష్ణురూప ముర్తి నిర్మాణము కొరముకు ధ్యానించుటను గురించి వర్నించబదినది.

  • నలభైతొమ్మిదవ అధ్యాయములో కృష్ణస్తుతి గురించి దాని మహిమ గురించి వర్ణించబదినది.

  • ఎభైయవ అధ్యాయములో జగన్నధ, బలరామ, సుభద్రల ముర్తుల నిర్మానము గురించిన వర్ణన చేయబడినది.

  • ఏభై ఒకటవ అధ్యాయములో పురిజన్నాధయాత్రా విధానము మహిమ వర్ణించబడినది.

  • ఎభైరెండవ అధ్యాయములో స్వయంభువు ఋషి సంవాదములో మార్కండేయుడు వటవృక్షమును దర్శించుట గురించి వర్ణించుట.

  • ఎభైమూడవ అధ్యాయములో మార్కండేయుడు ప్రళయదర్సనము చేయుట వర్ణించబదినది.

  • ఎభైనాల్గవ అధ్యాయములో మార్కండేయుడు భగవానుదైన వటపత్రశయి కుక్షి(ఉదరము)అందు ప్రవేశించుట వర్ణించబడినది.

  • ఎభై అయిదవ అధ్యాయములో మర్కండేయుడు భవానుదైన వతపత్రశాయిని స్తుతించుత వర్ణించబడినది.

  • ఎభై ఆరవ అధ్యాయములో వటపత్రశాయి అయిన నారాయణుడు ఆ క్షేత్రములో శివలింగ ప్రతిష్ట చేయమని మార్కండేయుడికి ఆనతి ఇచ్చుట. శివుడికి, విష్ణువుకు భేదము లేదని చెప్పుట.

  • ఎభై ఏడవ అధ్యాయములో పంచతీర్ధ విధిలో జగన్నధుని దర్శించు విధానము గురించి వర్ణించబడినది.

  • ఎభై ఎనిమిదవ అధ్యాయములో నృసింహ మహిమ గురించి వర్ణించుట.

  • ఎభై తొమ్మిదవ అధ్యాయములో శ్వేతమాధవుని మహిమ గురిమ్చి వర్ణించబడినది.

  • అరవైయవ అధ్యాయములో సముద్రస్నాన విధి గురిమ్చి వర్ణించబడినది.

  • అరవై ఒకటవ అధ్యాయములో విష్ణు పూజా విధానము గురించి వర్ణించబడినది.

  • అరవై రెండవ అధ్యాయములో సముద్ర స్నానము సముద్రుడికి నమస్కారము గురించి వర్ణించబదినది.

  • అరవై మూడవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్రములోని పంచతీర్ధ మహిమగురించి వర్ణించబడినది.

  • అరవైనాల్గవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్ర దర్శన ఫలసృతి ప్రస్థావించబడినది.

  • అరవై అయిదవ అధ్యాయములో పురుషోతమక్షెత్రాఅన్ని దెవతలు సహితము దర్శించుకుని తరిమ్చిన విధము వర్ణించబడినది.

  • అరవై ఆరవ అధ్యాయములో గుడివా రధయాత్రా వర్ణన చేయబడినది.

  • అరవై ఎనిమిదవ అధ్యాయములో గుదివా యాత్రాఫలము గురించి వర్ణించబదినది.

  • అరవై ఎనిమిదవ అధ్యాయములో విష్ణులోక వర్ణన చేయబదినది.

  • పురుషోత్తమ క్షెత్ర వర్ణన ప్[అరొసమాప్తి చేయబడినది.

  • అనంతవాసుదేవుని మాహాత్మ్యము గురించి వర్ణించబడినది.

  • పురుషోత్తమ క్షేత్రమున మరణించిన కలుగు ఫలము, వ్రతములు ఆచరిమ్చిన కలుగు ఫలము వర్ణించబడినది.

  • కండూపోఖ్యానము పేరుతో కండూపముని గురించిన వర్ణన చేయబడినది.

  • వసుదేవుని మానవ జననము గురించి మునులు వ్యాసుడిని ప్రశ్నించుట వివరించబడినది.

  • వాసుదేవుని చతుర్వ్యూహ వర్ణన చెయ్యబడినది.

  • హరియంశావతరణ గురించి వర్ణించబడినది.

  • కంస విచారము గురించి వర్ణించబడినది.

  • బృందావనగమనము గురించి వర్ణించబడినది. కంసుని కృష్ణుని నందుని ఇంట వదిలి వచ్చుట గురించి వర్ణించబడినది.

  • కాళీయమదనము (కాళీయ మర్ధనము ) గురించి వర్ణించబడినది.

  • ధేనుక కథ (ధేనుకాసుర వధ )గురించి వర్ణించబడినది.

  • గోవర్ధన గిరి యజ్ఞము గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణ బాలచరితము గోవింద పట్టాభిషేకము గురించి వర్ణించచబడినది.

  • శ్రీకృష్ణుడి రాసలీల గురించి వర్ణించబడినది.

  • కేశివధ గురించి వర్ణించబడినది.

  • అక్రూర ప్రత్యాగమనము అను పేర శ్రీకృష్ణ బలరాములను మధురకు తిసుకొనొని పోవుట వర్ణించబడినది.

  • కంసవధ గురించి వర్ణించబడినది.

  • బలరామ కృష్ణులు తల్లి తండ్రులను కలుసుకొనుట గురుదక్షిణ సమర్పించుట.

  • జరాసంధుని దండయాత్రల గురించి వర్ణించబదినది.

  • కాలయవనోపాఖ్యము గురించి వర్ణించబదినది.

  • బలరాముడు నందగోకులముకు పోవుట.

  • బలరామ క్రీడగురించి వర్ణించబడినది.

  • రుక్మిణీ కల్యాణం శంబరాసుర వధ వర్ణించబడినది.

  • ప్రద్యుమ్నుడు రుక్మిణిని కలుసుకొనుత గురించి వర్ణించడినది.

  • రుక్మివధ గురించి వర్ణించబడినది.

  • నరకాసురవధ గురించి వర్ణన జరిగింది.

  • ఇంద్రుడు హరినిస్తుతించుట గురించి వర్ణన జరిగింది.

  • పారిజాతాపహరణం ఇంద్రస్తుతి గురించి వర్ణించబడింది.

  • ఇంద్రకృష్ణ సంవాదం కృష్ణుడితో పరహారు వేల నూరు మంది స్త్రీల వివాహం గురించి వర్ణించబడినది.

  • అనిరుద్ధచరిత్ర గురించి వర్ణించబడినది.

  • బాణాసుర యుద్ధం గురించి వర్ణించబడినది.

  • పౌండ్రకవాసుదేవుని కథ గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణజాంబవంతిల కుమారుడైన సాంబుడి వివాహము గురించి వర్ణించబడినది.

  • బలరాముడు నరకాసుర వధకు కోపించి అందుకు బదులుగా భూలోకమును తపింపజేసిన ద్వివిధవానరమును వధించుట వర్ణించబడినది.

  • బలరామ నిర్యాణం శ్రీకృష్ణుడు నిజధామముకు ఏగుట గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణ నిర్యాణం గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణ చరిత్ర సమాప్తి గురించి వర్ణించబడినది.

  • విష్ణ్వతార సంకీర్తనం అనే పేరుయ్తో దశావతారవర్ణన జరిగినది.

  • యమలోక మార్గ స్వరూపము వర్ణించబడినది.

  • యమలోకము యొక్క దక్షిణ మార్గము గురంచి వర్ణించబడినది.

  • అధర్మానుగతి పేరుతో పాపములు శిక్షలు గురించి వర్ణించబడినది.

  • జీవుడి చక్ర భ్రమణము అను పేరుతో జీవచక్రము గురంచి వర్ణించబడినది.

  • అన్నదాన మహిమ గురించి వర్ణించబడినది.

  • పితరులకు పిండ ప్రధాన విధానము గురిమ్చి వర్ణించబడినది.

  • శ్రాద్ధకర్మ గురించి వర్ణించబడినది.

  • సదాచారముల గురించి వర్ణించబదినది.

  • వర్ణాశ్రమ ధర్మాల గురించి వర్ణించబడినది.

  • సంకరజాతి లక్షణాల గురించి వర్ణించబడినది.

  • దండనిరూపణము గురించి వర్ణించబడినది.

  • ఋషి పరమేశ్వర సంవాదమ అనే పేరుతో వాసుదేవుని మహిమను గురింవి వర్ణించబడింది.

  • వైష్ణవగతి ఉపాఖ్యానము అను పేరుతో వైష్ణవులు పొందే ఉత్తమగతుల వర్ణన జరిగింది.

  • విష్ణుగాన ప్రశస్తి గురించి వర్ణించబడినది.

  • విష్ణుమాయాప్రభావము గురించి వర్ణించబడినది.

  • భవిష్యత్తు కథ అను పేరుతో కలియుగధర్మము గురించి వర్ణించబడినది.

  • భవిష్యత్దర్శనం కలియుగధర్మము గురించి వర్ణించబడినది.

  • సృష్టి సంహారము గురించి వర్ణించబడినది.

  • నైమిత్తిక ప్రళయము ప్రకృతి లయ గురించి వర్ణించబడినది.

  • ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది భూతము గురించి వర్ణించబడినది.

  • యోగవిధానము గురించి వర్ణించబడినది.

  • సాంఖ్యయోగము గురించి వర్ణించడినది.

  • యొగవిధుల గురించి వర్ణించబడినది.

  • జనక వశిష్టుల క్షరము అక్షరముగురించిన వర్ణన చేయబడినది.

  • పరతత్వవర్ణన పరిసమాప్తి.

  • రొమహర్షణ మునుల సమావేశంలో చెప్పబడిన పురాణ శ్రవణ ప్రసంశ.

ఇట్లు 
గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ

కర్మ ఫలం అంటే ఏమిటి.............?

కర్మ ఫలం అంటే ఏమిటి


"కర్మ" అనే మాటకు సరి అయిన అర్థం "కార్యము" లేదా "కృత్యము", మరింత విస్తారముగా చెప్పలంటే, అది కారణము మరియు పరిణామము, స్పందన మరియు ప్రతిస్పందనల యొక్క విస్వజనీనమయిన సూత్రమును పేర్కొంటుంది, హిందువులు దానిని మనిషి యొక్క చేతనని నడిపించేదిగా నమ్ముతారు. కర్మ అంటే విధి కాదు, ఎందుకంటే మనిషి తన జీవితంలో రాబోవు పరిణామాలను తన స్వేచ్ఛానుగతమయిన సంకల్పము చేత నిర్దేశించబడిన చేతల ప్రభావంతో సృష్టించుకుంటాడు. వేదాల ప్రకారము, మనం మంచితనాన్ని నాటితే మంచి ప్రతిఫలాన్ని పొందుతాము, చెడుని నాటితే, చెడు ఫలితాన్ని పొందుతాము. కర్మ అనేది మన కార్యాలని అన్నింటినీ సమిష్టిగా సూచించి వాటికి ప్రస్తుత జీవితంలోనూ, గత జన్మలలోనూ అనుసరించి ఉన్న ప్రతిస్పందనలను సూచిస్తుంది, ఇవన్నీ మన భవితవ్యాన్ని నిర్ధారిస్తాయి. కర్మను జయించడము తెలివయిన కార్యాచరణలోనూ మరియు నిశ్చలమయిన ప్రతిస్పందనలోనూ ఉన్నది. అన్ని కర్మ ఫలితాలూ వెంటనే సంభవించవు. కొన్ని జమ అయ్యి, ఈ జన్మలోనో లేదా ఇతర జన్మల్లోనో అనుకోని విధంగా సంభవిస్తాయి మనం నాలుగు విధాలుగా కర్మని ఉత్పత్తి చేస్తాము:
  • ఆలోచనల ద్వారా
  • మాటల ద్వారా
  • మనమే చేపట్టే మన కార్యాల ద్వారా
  • మన ఉపదేశాలను అనుసరించి ఇతరులు చేసే కార్యాల ద్వారా
మనం ఆలోచించేది, మాట్లాడేది, చేసేది లేదా దేనికైనా కారణమయ్యేది అంతా కూడా కర్మ; ఈ క్షణంలో మనం ఆలోచించేది, మాట్లాడేది లేదా చేసేది కూడా కర్మే.హిందూ శాస్త్రాలు కర్మను మూడు రకాలుగా విభజిస్తాయి:
  • సంచిత అనేది కూడబెట్టబడిన కర్మ. అన్ని కర్మలనూ ఒకే జీవితంలో అనుభవించడం, భరించడం అనేది అసాధ్యం. ఈ సంచిత కర్మ యొక్క ఖాతాలోనుండి, చేతిలో పట్టేటన్ని ఒక జీవితంలో అనుభవించడానికి వెలికి తీయడం జరుగుతుంది, ఈ కార్యాలు, ఫలించడం మొదలు పెట్టి, అవి ఫలించాకనే వాటిని అనుభవించడం ద్వారా తరిగిపోతాయి, వేరే విధంగా కాదు, దానిని ప్రారబ్ధ కర్మ అని అంటారు.
  • ఫలించగలిగే ప్రారబ్ధ కర్మ అనేది కూడబెట్టబడిన కర్మలోని ఒక భాగం, అది "పండి", ప్రస్తుత జీవితంలో ఒక ప్రత్యేకమైన సమస్యగా గోచరిస్తుంది.
  • క్రియమాన అనేది ప్రస్తుత జీవితంలో మనం ఉత్పత్తి చేసేది. అన్ని క్రియామాన కర్మలూ సంచిత కర్మ లో జమ అయ్యి, తదనంతరముగా మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. మానవజన్మలో మాత్రమే మనం మన భవిష్యత్గమ్యాన్ని మార్చుకోగలము. చనిపోయాక మనం మన క్రియా శక్తి (పని చేయకలిగే శక్తి) కోల్పోయి, (క్రియామాన) కర్మను మళ్ళీ మనిషి శరీరంలో జన్మించేంతదాకా చేయలేము.
స్పృహతో చేసిన కార్యాలు, స్పృహ లేకుండా అంటే తెలీకుండా చేసిన వాటికంటే చాలా భారీగా ఉంటాయి. ఎలాగయితే విషం తెలీకుండా తీసుకున్నా కూడా మనల్ని ప్రభావితం చేస్తుందో అలాగే, మనకు తెలీకుండా ఇతరులని బాధిస్తే, దానికి కూడా తగిన విధమైన కార్మిక ప్రభావం ఉంటుంది. మంచి చెడుల మధ్య తేడా తెలిసిన మనుషులు మాత్రమే (క్రియామాన) కర్మను చేయగలరు. జంతువులు మరియు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు కొత్త కర్మని సృష్టించడం లేదు (అందుకని వాళ్ళు తమ భవిష్యద్గమ్యాన్ని ప్రభావితం చేసుకోలేరు) ఎందుకంటే వాళ్ళు మంచి, చెడుల మధ్య తారతమ్యం గ్రహించలేరు. కానీ స్పర్శా జ్ఞానం కలిగిన ప్రతి జీవీ కర్మ యొక్క ప్రభావమును అనుభవించగలదు, అవి వాటికి ఆనందము మరియు బాధగా తెలుస్తాయి.
తులసిదాస్ అనే హిందు సాధువు ఈ విధంగా అన్నాడు: "మన శరీరం సృష్టిలో భాగం కాక ముందే మన గమ్యం నిర్దేశించబడుతుంది."సంచిత కర్మ లోని ఖాతా అంతమయ్యే వరకూ, దానిలోని కొంచం భాగము ఒక జీవిత కాలంలో ప్రారబ్ధ కర్మ ను అనుభవించడానికి వెలికితీయడం జరుగుతుంది, అది జనన మరణ చక్రానికి దారితీస్తుంది. జీవుడు జమకాబడిన సంచిత కర్మ పూర్తిగా తరిగిపోయేంత వరకూ జనన మరణాల చక్రం నుండి మోక్షం పొందలేడు.
భూమిపైన జనన మరణాల చక్రం అనేది 84 లక్షల జీవాకృతుల నుండి ఏర్పడుతుంది, వాటిల్లో ఒకటి మాత్రమే మానవ జన్మ. మనుషులుగా మాత్రమే మనం మన గమ్యస్థానం కోసం సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఏదో ఒకటి చేసే స్థానంలో ఉంటాము. మంచి పనుల వల్ల, స్వచ్చమయిన ఆలోచనల వల్ల, ప్రార్థన వల్ల, మంత్రము మరియు ధ్యానం వల్ల, మనం కర్మ యొక్క ప్రభావాన్ని ప్రస్తుత జీవితంలో తగ్గించుకోగలిగి, మన గమ్యాన్ని బాగు చేసుకోగలము. మన కర్మ ఏ రకంగా, ఏ వరుసక్రమంలో పరిపక్వం చెందుతుందో అన్న విషయం తెలిసిన ఆధ్యాత్మిక గురువు మనకి సాయపడగలడు. మనుషులుగా మనం మంచి పనులు చేయడమనే అభ్యాసం ద్వారా మన ఆధ్యాతిమ పురోగమనాన్ని త్వరితం చేసుకోగల అవకాశం ఉంది. మనకు జ్ఞానము లేదా స్పష్టత లేక పోవడం వలన మనము చెడు కర్మను ఉత్పత్తి చేస్తాము.
నిర్దయగా ఉండటం చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని పాపం అంటారు, మంచి పనులు తియ్యటి ఫలాలను తీసుకువస్తాయి, వాటిని పుణ్యము అంటారు. మనం చేసే పనులకు తగ్గట్లుగా మనం తయారవుతాము: సన్మార్గపు కార్యాల వలన సన్మార్గులుగానూ, దుర్మార్గపు కార్యాల వల్ల దుర్మార్గులుగానూ మారతాము.

ఇట్లు 
గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ

Saturday, September 13, 2014

చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు ?



ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు.

గుట్టి. సుబ్రహ్మణ్యశర్మ 

Thursday, August 7, 2014

వరలక్ష్మీ వ్రతం

 శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారత దేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు.









నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాధ

స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఎందుకు ఈ వ్రతం

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి ఉంటే) పానకము (ఆనవాయితి ఉంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

వ్రత విధి విధానం

తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

తోరగ్రంథి పూజ

తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.

  • ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.

  • ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.

  • ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.

వరలక్ష్మి వ్రత కథ

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం

శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం

లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః

బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం

వందేముకుందప్రియాం||


అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

 PRIEST

గుట్టి సుబ్రహ్మణ్య శర్మ 

 9848288711

Sunday, June 15, 2014

క్షమాపణ

జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి 

దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హరి హర పుత్రా అయ్యాన్ అయ్యప్ప స్వామి మీ పాదాల చరణ విందములకు ఈవె మా శరణములు 

 

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...