Tuesday, December 17, 2013

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు

శ్రీ విఘ్నేశ్వర ప్రార్ధన :

శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే…

ఆది దేవుడిని పూజించుకుంటూ విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం..
కార్తవీర్యుని వధించిన అనంతరం పరుశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. “పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి” అంటూ పరుశురాముడు ధిక్కరించాడు.
మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పైకిఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరుశురాముడు తన చేతిలోని గ్రండ గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరము నుంచి బయటికి వచ్చారు.
నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని “ఏకదంతుడి”గా పేరు పొందా

పూజా సమయం

మన పూర్వులు పూజా విధానాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. 5,16,18,226 విధాలుగ పూజలనూనుసరించడం జరుగుతోంది. అసలు మెలకువ్ వచ్చిన వెంటనే భగవంతుని స్మరిస్తూ కుడి అరచేతిని చూసుకుంటూ కళ్ళు తెరవాలని చెప్పారు. ఎందుకనే ప్రభాత కాలంలో కరదర్శనం కల్యాణప్రదం.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరపృష్ఠే చ గోవింద: ప్రభాతే కరదర్శనం
ఇక పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమీదని నిర్ణయించారు. త్ర్సంధ్యోపాసన అత్యంత ఫలదాయకమైనది. త్రిసంధ్యలను -
1. ప్రాత: సంధ్య
2. మధ్యాహ్నసంధ్య
3. సాయంసంధ్య అని మూడు రకాలుగా విభజించారు.
1. ప్రాత:సంధ్య – ఇద్ మరలా మూడు విధాలు. అ) ఉత్తమం (భ్రాహ్మీముహూర్తం) , ఆ) మధ్యమం (తారకా రహీం), ఇ) అధమం (సూర్యోదయం అనంతరం అంటే, సూర్యోదయానికి ముందు ఘడియలకు ముందన్నమాట.
2. మధ్యాహ్నసంధ్య – మిట్ట మధానానికి ఒకటిన్నర ఘ్డియల్ ముందు, ఒకిన్నర ఘడియల వెనుక
3. సాయంసంధ్య – అ) ఉత్తమం, సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు , ఆ) మధ్యమం, సూర్యాస్తమయకాలం. ఇ) అధమం, నక్షత్రాలు కనిపించిన తరువాత.
అన్ని సంధ్యలలో బ్రాహ్మీమూహూర్తకాలమే ప్రశస్తమైనది. బ్రాహ్మీముహూర్తమంటే తెల్లవారుఝామున 3.30 గంటల నుండి 4.45 గంటల మధ్య సమయమని పెద్దల వాక్కు. బ్రాహ్మీముహూర్తసమయంలో ప్రకృతి సత్త్వ గుణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఈ సమయం జప తపాలకు చాల అనుకూలమైన సమయమని చెప్పబడింది. ఇక, ఘడియకాలన్ని ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు లెక్కగడతారు. ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు 60 ఘడియలకాలం. అంటే 30 ఘడియలు పగలైతే, మిగతా 30 ఘడియలు రాత్రన్నమాట. సూర్యోదయం నుండి 55 ఘడియలు అనంతరపు 5 ఘడియల కాలాన్ని ఉష:కాలమని, 57 ఘడియలు దాటిన తరువాత మూడు ఘడియల కాలాన్ని అరుణోదయకాలమని అంటారు. 58 ఘడియలు దాటిన తదనంతరపు 2 ఘడియల కాలన్ని ప్రాత:కాలమని అంటారు. ఆ ప్రాత:కాలం తరువాతే సూర్యోదయం. ఇలా పరిశీలించినపుడు 55 వ ఘడియ నుంచి 58 ఘడియల మధ్యకాలం పూజలు, జపధ్యానాదులకు ప్రశస్తమైన సమయం గా చెప్పబడుతోంది. ఇక, ప్రాత:కాలన్నే నిద్రలేచి, స్నానాదికాలను ముగించి పూజ చేయడానికి ఉద్యుక్తులైన భక్తుల మనసులలో పూజ ఎలా, ఎక్కడ చేయాలన్న సందేహాలుంటాయి.
గృహే జపం సమం విద్యాగోష్ఠే శతగుణం భవేత్
నధ్యాం శత సహస్రం స్యాత్ అనంతం దైవ సన్నిధౌ
సముద్రతీరే చగ్రాదౌ గిరఒ దేవాలయేషు చ
పుణ్యాశ్రమే అర్వేషు జనం కోటి గుణోభవేత్
మన ఇంట్లో చేసే జపం సామాన్య పలితన్ని కలిగిస్తుంది. గోశాలలో చేసే జపం ఇంట్లో చేసే జపానికంటే నూరురెట్లు అధికమైన ఫలితాన్ని కలిగిస్తుంది. నదీతీరంలో చేసే జపం లక్షరెట్లు ఫలితాన్ని కలిగిస్తుండగా, సముద్ర తీరం, పర్వతశిఖరాలు, పుణ్యాశ్రమాలలో చేసే జపం కోటి ఫలితాలను ఇస్తుండాగా, దైవసన్నిధిలో చేసే జపం అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని ఋషివాక్కు.
అయితే నేటి పరిస్థితులలో, కాలంతో పోటి పడుతున్న మనిషికి అంత తీరిక లేకపోవచ్చు. అందుకే కాస్త పెద్ద ఇల్లుగలవాళ్ళు పూజగదిని, ఇరుకు ఇళ్ళూగలవాళ్ళు ఓ వైపు పూజాప్రదేశాన్ని ఏర్పాటుచేసుకుని పూజలను నిర్వహించుకుంటునారు. పూజా ప్రదేశాన్ని పరిశుభ్రముగా ఉంచుకోవడంతో పాటూ మనసును కూడ ప్రశాంతముగా ఉంచుకోవాలి. అప్పుడే పూజలను నిర్విఘ్నంగా చేసేందుకు వీలవుతుంది.
పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడ అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నంగా జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకె ఆసనం గురించి ఈ క్రింది విధంగా చెప్పారు.
ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం
ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి, నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, ‘ఆసనం’ అత్యంతావశ్యకమైయున్నదని చెప్పబడుతోంది.
ఇక ‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, ‘ స ‘ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం. ఆ రోజులలో పులిచర్మాన్ని, కృష్ణాజినం, కంబళి, దర్భాసనం, పట్టు వస్త్రం, నూలువస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించేవారు. నేటి పరిస్థితులకు తగినట్లుగా పులిచర్మం, కృష్ణాజినం తప్ప మిగితావాటిని అసనాలుగా ఉపయోగించుకోవచ్చు.
కొంతమంది పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.
పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా ధ్యానంతో ప్రారంభిస్తాం. ధ్యానం ద్వారా భక్తునికి, తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు. అన్ని కర్మలను విడిచిపెట్టి మన మనస్సును లీనం చేయడం ఆవాహనమనబడుతుంది. ఆ స్వామే అన్నింటికి ఆధారమన్న జ్ఞానాన్ని ఆసనం. స్వామిపట్ల అంకిత భావాన్ని కలిగిఉండటం పాద్యం. మనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం గంధం. కర్మవాసనలకు దూరంగా ఉండటమే అక్షతలు. మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం ధూపం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీ ఆయనవలననే లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని సమర్పిస్తుంటాం.
నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. మౌనంగా ఉండటం స్త్రోత్రం. సర్వసంతోషమే విసర్జనం అని చెప్పబడింది. ఇలా మన నిర్వహించే పూజలోనిఉపచారాలు అంతరార్థమై ఉంది.
అలాగే మన పెద్దలు అధ్యాత్మిక సాధనలో ఇంద్రియాలే సాధనాలని, ప్రాణాలే సేవకులని, షట్ కమలాలే పువ్వులని, శరీరంలో ఉన్న అగ్నే ధూపమనీ, జీవకళలే దీపాలని, అనందమే నైవేద్యమని, లోనున్న సూర్యచంద్ర జ్యోతులే హారతులనీ, బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది.
త్వం సర్వభూతేషు విరాజసే సదా
సర్వేషు జీవేస్వపి జీవనం స్వయం
త్వద్దర్శనం సర్వగమేస్తు సర్వత
స్తలైన పూజాస్తు చ కర్మభిర్మమ
ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు. సర్వత్రా నీ దఋశ్నం మాకు కలుగుగాక. నా సమస్త కర్మలతోనే నీ పూజ అగుగాక.
నీ కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలి స్వామీ!!
“మన పూజా విధానాలలో అనేక అంతరార్థాలున్నయి. పెద్దలు మన కోసం ఏర్పరిచిన ఈ విధానాలు, మన జీవితాలనుసన్మార్గం వైపు నడిపించి, జీవితాన్ని అనందమయం చేస్తాయి. పూజా విధానంలో ప్రతిఒక్క ఉపచారం వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంది.”
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ  

స్వామి శరణమయ్యప్పా

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.
అయ్య (=విష్ణువు),
అప్ప (= శివుడు)
అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.
అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
మహిషి కధనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. ‘తధాస్తు’ అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి – సోమవారము నాడు జన్మించినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు — మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో
శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
శబరిమలైలో నివాసం
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.

వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది

భారతీయుల ఆచార వ్యవహారాల్లో వివాహానికి ఎంతో విశిష్టత వుంది. అలాగే పితృకార్యాలు నిర్వహించడంలోను ఈ ఆచార వ్యవహారాలు ప్రముఖమైన పాత్రను పోషిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ ఇంట్లో వివాహ వేడుకను జరిపించిన కొద్ది కాలానికే తమ పెద్దలకు తద్దినాలు పెడుతుంటారు. తెలిసి చేసినా … తెలియక చేసినా ఇందు వల్ల దోషం కలుగుతుందని చెప్పబడుతోంది.
వివాహ వేడుక జరిగిన ఇంట్లో ఆరునెలలు దాటకుండా తద్దినాలు పెట్టకూడదు. మనకి ఆరునెలల సమయం అంటే అది పితృదేవతలకు ఒక పూటతో సమానం. ఆరు నెలలు కాకముందే తద్దినాలు పెట్టవలసి వస్తే, రెండు కార్యక్రమాలకు వారిని ఒకే పూట ఆహ్వానించినట్టు అవుతుంది. వివాహ సమయంలో పితృ దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనం కోరుకునే సందర్భం వుంటుంది. అలా వివాహ వేడుకకి వచ్చిన పితృదేవతలను, అదే పూట తద్దినానికి ఆహ్వానించడం వారి మనసుకి కూడా కష్టం కలిగిస్తుంది.
అందువలన వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితే అయితే ఆ కార్యక్రమాన్ని నదీ తీరాల్లో జరిపించడం ఉత్తమమని అంటోంది. ఇక నూతనంగా గృహప్రవేశం చేసిన వారి విషయంలోనూ ఇదే పద్ధతి వర్తిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. అందువలన శాస్త్రం చేస్తోన్న సూచనలను దృష్టిలో పెట్టుకుని ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడం మంచిదనే విషయాన్ని గ్రహించాలి.

శుక్రవారాల నోము నోచుకోవడానికి కారణమైన కథ ?

నోములన్నింటిలోకి ‘శుక్రవారాల నోము’కి ఎంతో ప్రాధాన్యత … ప్రాముఖ్యత వున్నాయి. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి, తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గానీ, ఏ వూరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్ర వారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ, 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి. ఆ తరువాత ‘లక్ష్మీ తులసి’ దగ్గర 20 దీపాలు పెట్టి, 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు వాయన దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను … దక్షిణ తాంబూలాలతో సహా దానమివ్వాలి. ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త, ఉన్న పళంగా బయల్దేరమంటూ తొందర పెట్టాడు. ఆ రోజున శుక్రవారం కావడం వలన, అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా, తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో బయలుదేరాడు.
ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే వున్నారు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి, ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే వున్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా, ఆ పెద్దమనిషి బండి దగ్గరికి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమనీ, అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందనీ, అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.
ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి … అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయనీ, శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమనీ, ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం … అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

శ్రీ కాల భైరవ అష్టమి

images kalabhairava-yantra-be-ahead-of-time-250x250
కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు … కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
“శ్రీ కాల భైరవ అష్టమి”. ఎంతో మంచి రోజు. పిలిస్తే పలికేవాడు భైరవుడు. మహా రక్షకుడు.
కాలభైరవునికి ….. ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్హి (wik) గా చేసి , భైరవుని తలచుకుంటూ, దేవుని ముందు .. 2 దీపాలు నువ్వుల నూనె తో వెలిగించి పెట్టండి. ఎంతో మంచిది . భైరవుడు ఎంతో సంతోసిస్తాడు . దీవిస్తాడు .
మఖ నక్షత్రం లో అష్టమి రావడం మరీ శుభ ప్రదం. 12 సంవత్సరాలకు ఒక సారి ఇలా వస్తుంది. స్త్రీలకు మరీ శుభ ప్రదం.
గాయత్రి …..
ఓం కాల కాలాయ విద్మహే
కాలాతీతాయ ధీమహి
తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ॥
శ్రీ కాళభైరవాష్టకమ్
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం l
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ ll
నారదాది యోగిబృంద వందితం దిగంబరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం l
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ll
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
శూలటంక పాశదండ పాణిమాది కారణంl
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ ll
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం l
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ ll
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం l
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ ll
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం l
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ll
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం l
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ ll
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం l
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ ll
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం l
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ll
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం l
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ll
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే l
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ll
కాల భైరవం భజే l
కాల భైరవం భజే ll
~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ~

బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా?

శివునికి ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా..! తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె “ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?” అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.
అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.
గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.
అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ‘ఆకలి! ఆకలి!!’ అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.
అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, “తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో ‘విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః’ అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి” అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...