Wednesday, May 2, 2018

మానవ వ్యవస్థపై చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుంది


చంద్రుడు మన భూమికి ఉపగ్రహం. ఈ గ్రహానికి ఆకర్షితుడై విధిలేక ఈ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. మరి ఇది మనకి ఏ విధంగా ముఖ్యమైంది? ఈ పౌర్ణములు, అమావాస్యలు ఎందుకు మనకు ప్రాముఖ్యమైనవి? మీకు ఇది అనుభవపూర్వకంగా తెలిసి ఉండకపోవచ్చు, కాని మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అది ఏమిటంటే  ఎవరికైనా కొంచెం  మానసిక వ్యాధి ఉందనుకోండి పౌర్ణమి రోజులు, అమావాస్యలలో వారి రుగ్మత మరికొంచెం పెరుగుతుంది. ఈ విషయం మీకు తెలుసా? మీకు కూడా జరుగుతుందా? ఇది మీకు జరుగదు కానీ ఇది మరెవరికో జరుగుతూ ఉంటుంది.  అంటే చంద్రుడు ఒకరకమైన పిచ్చితనాన్ని కలిగిస్తాడు అని కాదు. ఈ చంద్రుడి స్థానాన్ని తీసుకున్నప్పుడు  మీరు ఏమిటో ఆ స్వభావం కొంచెం పెంపొందించబడుతుంది. మీరు ప్రేమగా ఉన్నారనుకోండి ఇంకొంచెం ప్రేమగా మారుతారు, మీరు ఆనందంగా ఉంటే, ఇంకొంచెం ఆనందంగా తయారవుతారు, మీరు పారవశ్యంతో ఉంటే, మీరు మరింత పారవశ్యంతో ఉంటారు. మీకు కొంచెం పిచ్చితనం ఉంటే, మరికొంచెం పిచ్చిగా తయారవుతారు . మీరు ధ్యానం చేయగలిగితే మీరు ఇంకొంచెం ధ్యానం చేయగలిగేట్టుగా మారుతారు. మీరు ఏది? మీ స్వభావం ఏది? అన్నదాన్ని ఇది మరి కొంచెం పెంపొందిస్తుంది. అందుకే ఈ రోజులు  ముఖ్యమైనవి అని మనం అనుకుంటాం.

ఏదయితే తర్కించలేమో పాశ్చాత్య దేశాలలో దీన్నే పిచ్చితనం అని అనడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనం తర్కానికి పరిమితులు ఉన్నాయి అని తెలుసుకున్నాము.

అందుకని మీరు ఎరుకతో మీకు కావల్సిన స్వభావాన్ని ఈ రోజుల్లో పెంపొందించుకుంటారు. ఇవాళ పౌర్ణమి అనుకోండి మీరు  పొద్దున్న లేచి స్నానం  చేసి మీలో ఒకరకమైన ప్రవృత్తిని, స్వభావాన్ని మీకు ఏది  కావాలో దాన్ని ఉండేలా చూసుకుంటారు. అప్పుడు  సాయంత్రానికి మీకు ఏం కావాలో ఆ రకమైన  స్వభావాన్ని అది మరికొంచెం మీలో మెరుగుపరుస్తుంది. ఇది ఎరుకతో చేయడం, మనకు తెలియకుండానే కేవలం దానికి బాధితులు అయిపోవడం కాకుండా, ఇది ఎంతో ఎరుకతో చేయడం, అంటే చంద్రుడు తనంత తానుగా మిమ్మల్ని పిచ్చివారుగానో లేకపొతే ధ్యానం చేసుకోగలవారిగానో తయారు చేయడు, మీరు అలావుంటే దాన్ని చంద్రుడు మరి కొంచెం పెంపొందిస్తుంది, అంతే, ఆ స్వభావాన్ని మరి కొంచెం పెంపొందిస్తుంది. మీకు తెలుసా? ఈ సముద్రం కూడా కొంచెం పిచ్చి తలలు వేస్తుంది అని.

మీరు బీచ్ లో ఈత కొట్టే వారైతే  మీకు అది పిచ్చితనంగా కనిపిస్తుంది. కానీ మీరు ఒక పెద్ద ఓడను ప్రయాణం చేయించాలంటే అది మీకు ఓ పెద్ద వరంగా అనిపిస్తుంది. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ సముద్రమే ఎగసిపడాలని ప్రయత్నం చేస్తోంది. ఈ సముద్రమే ఎగసిపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదగడానికి  సానుకూలంగా ఉండి ఉండచ్చు. దీనిని మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లైతే ఈ మానవ జీవితం అన్నది ఇంకా ఎంతో మెరుగైనది, మీతో మీరు ఏం చేయాలన్నా మీకు ఈ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? అని ఎరుకతో ఉండడం అన్నది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఈ ఎరుకతో ఉంటే మీలో ఒక్కొక్క రకమైన స్వభావాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. మనకు ఆంగ్ల భాషలో చంద్రుడిని ‘లూనార్’ అంటారు, మరో అడుగు వేస్తే “లునాటిక్” అంటే ‘పిచ్చితనం’. సహజంగా చంద్రుడి ప్రభావం అనేది మనం తర్కించలేనిదిగా చెప్తాము. ఏదయితే తర్కించలేమో పాశ్చాత్య దేశాలలో దీన్నే పిచ్చితనం అని అనడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనం తర్కానికి పరిమితులు ఉన్నాయి అని తెలుసుకున్నాము.

తర్కాన్ని దాటి వెళ్ళగలగాలి

తర్కం ఎంతో ఉపయోగకరమైనదే. మన జీవితంలో మన బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి తర్కం అన్నది అవసరం. అది వ్యాపారమైనా, ఇల్లు కట్టుకోవడమైనా. మీరు ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి తార్కికంగా ఉండడం అన్నది ఎంతో అవసరం. ఇవి ఈ విధంగా మాత్రమే చేయగలం. మరో విధంగా చేయలేం. కానీ మనతో వచ్చిన సమస్య ఇదే. మనం బయట విషయాలను చేసుకోవడానికి దివ్యత్వాన్ని పిలుస్తూ ఉంటాం. మన అంతర్ముఖంలో చేయవల్సిన పనులనేమో, తార్కికంగా చేయాలని అనుకుంటాము. మనం బాహ్య ప్రపంచంలోనూ, అంతర్ముఖంగాను కూడా విజయం సాధించలేకపోతున్నాము. ఇక అంతర్ముఖ విషయాలకు వచ్చేసరికి మీరు కనక మీ తార్కిక స్వభావాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే జరిగేది ఏమి ఉండదు. నేను మిమ్మల్ని కళ్ళు మూసుకోండి అని సరళమైన ప్రక్రియ ఏదో చేయమన్నాననుకోండి. మీరు ఇక్కడ కూర్చొని నేను ఇది చేస్తే నాకేమి వస్తుంది, నాకేమవుతుంది అది, ఇది అని లెక్కలు వేయడం మొదలు పెడతారు. ఇలా ఐతే ఎప్పటికి ఏమి జరుగదు.

ధ్యానం గాని, ప్రేమ గాని, పారవశ్యం గాని, ఏదయినా అందమైనది మీ జీవితంలో మిమ్మల్ని స్పృశించాలి  అంటే మీలో కొంత పిచ్చితనం ఉండాలి

ధ్యానం గాని, ప్రేమ గాని, పారవశ్యం గాని, ఏదయినా అందమైనది మీ జీవితంలో మిమ్మల్ని స్పృశించాలి అంటే మీలో కొంత పిచ్చితనం ఉండాలి. అన్ని తార్కికముగా ఉండవలసిన విధంగానే ఉన్నాయి. కానీ మీరు దిగాలు మొహం వేసుకుని కూర్చుని ఉన్నారనుకోండి అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, మీరు సరిగ్గానే ఉన్నారు కానీ జీవితం ఇలా పని చేయదు. మీరు పొద్దున్నే లేచారనుకోండి, రేపు పొద్దున్న మీరు లేచిన తరువాత మీ మంచం మీద పడుకొని మీరు నూటికి నూరు శాతం తార్కికంగా ఆలోచించండి. మీరు అన్నీ మీ జీవితంలో ఆనందంగా ఆహ్లాదంగా గడిపిన క్షణాలని వేటినీ తలుచుకోకండి, ఇలాంటి అనుభవాల్ని తలుచుకోకండి. మీకు ఎంతో విలువైన అనుభవాల్ని తలుచుకోకుండా ఉండండి, ఈ ఆకాశంలో పక్షులు గాని, సూర్యదయాన్ని కానీ, మీ తోటలో పూసిన పూలను కానీ, మీ పిల్లవాడి మొహం కానీ, మీ జీవితంలో మధురమైన క్షణాలను కానీ వేటినైనా తలుచుకోకండి. కేవలం తార్కికంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు మంచం మీద నుంచి లేవాలంటే అది చిన్న విషయం అవదు కదూ, అదేమైనా చిన్న విషయం అవుతుందా? కాదు. ఇంకా దానికి మించి మీ కాల కృత్యాలు తీర్చుకోవాలి. ఇంకా అప్పుడు తినాలి, పని చేయాలి, తినాలి, పని చేయాలి తిని చేయాలి, పడుకోవాలి మళ్ళీ ఆ తరువాత రోజు ఇదే కథ.

మీలో అనుభవాలు అన్నవి తీసేసామనుకోండి ఒక్కసారి మీ జీవితాన్ని నూటికి నూరు శాతం తార్కికంగా ఆలోచించి చూడండి ప్రతిరోజు అవే పన్లు చేస్తూ ఉండాలి ఇంకో ముప్ఫయ్, నలభయ్ సంవత్సరాల పాటు అనుకోండి, మళ్ళీ మీరు యోగ కూడా చేసినట్లైతే మీ జీవితం ఇంకొంచెం పొడిగించచ్చు కూడాను. అది ఇంకొంచెం పొడిగిస్తుంది. ప్రతి రోజు ఇదే పని, ఇదే పని చేయాలంటే ఒక్కసారి తార్కికంగా ఆలోచించి చూడండి, ఇదంతా చేయడం అవసరమా అని? అది చేయడం అవసరమా? లేదు మీకు విపరీతమైన తర్కం చేస్తే అది ఆత్మహత్య వంటింది. అది ఆత్మహత్యలా అనిపిస్తుంది. మీ అందరు కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు, కానీ ఈ రోజుల్లో అన్ని ఒక్కసారిగా ఏది చేయరు కదా. అన్ని వాయిదా పద్ధతులలోనే చేస్తారు. మీరు మీ ఆత్మహత్యను కూడా ఇలా వాయిదా పద్ధతుల్లోనే చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోలేకపోతే మీరు ఇంటికి వెళ్లిన తరువాత మీకు ఐదారు ఏళ్ళ వయసులోని మీ ఫోటోలు తీసి చూసుకోండి అప్పుడు మీ మొహం ఇలా ఉండేదో  చూసుకోండి. ఇప్పుడు ఎలా దిగాలుగా తయారైపోయింది అని.

అందుకని మీరు మీ తర్కం నుంచి బయటపడాలి అనుకోండి మీరు దీన్నో విధంగా చేస్తే తప్పితే దానికి అర్ధం లేనిదిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదయినా అర్ధవంతంగా ఉండాలి అంటే, అది లాజికల్ గా  ఉండాలి. కానీ చూడండి మీ జీవితంలో ఎంతో అందమైన క్షణాలు మీరు మీ తర్కాన్ని పక్కకు పెట్టినప్పుడు మాత్రమే జరిగాయి. అవునా? మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని తర్కించి చూడండి, అది ఎంతో మూర్ఖంగా అనిపిస్తుంది అవునా?కాదా? కానీ మీ జీవితంలో అది ఎంతో అందమైన విషయం అయ్యుండవచ్చు. కానీ దాన్ని తార్కికంగా శల్య పరీక్ష చేసి చూస్తే అది ఎంతో మూర్ఖమైన పనిలాగా అనిపిస్తుంది. కానీ అది మీ జీవితంలో ఎంతో అందమైన అనుభూతిని కలిగించి  ఉండచ్చు.

హఠయోగ అంటే ఏవిటి? “హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు” ఈ రెండూ రెండు అంశాలు.

అందుకని జీవితంలో తర్కం అనే అంశం అనుభవపూర్వకమైన అంశం, ఇవి రెండు భిన్న ధ్రువాలు. యోగంలో మిమ్మల్ని రెండు అంశాలుగా చూస్తాం. సూర్యుడు, చంద్రుడు అని. హఠ అన్న మాట విన్నారా? హఠయోగ అంటే ఏవిటి? “హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు” ఈ రెండూ రెండు అంశాలు. దీనికి ఎన్నో రకాల ప్రతీకలు ఉన్నాయి. శివుడు సగం , పురుషుడు సగం స్త్రీ గా చూపించడం చూసారు ఇవన్నీ ఎందుకంటే మీకు ఒక తార్కికమైన కోణం, అది కాని మరొక కోణం ఉన్నాయి అని చూపించడానికి ఇవన్నీ ప్రతీకలు. మీరు ఇదో, అదో ఐతే మీరు సంపూర్ణమైన వారు కారు.. లేకపోతే మీరు సగం జీవితం మాత్రం గడుపుతున్నారు. మీరు సగం ప్రాణి గానే మిగిలిపోతారు. మనం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియో, యోగానో అన్నప్పుడు  ఏమనుకుంటున్నాము అంటే ఒక పరిపూర్ణమైన జీవన ప్రక్రియగా ఎలా మారాలి అని, ఏదో అలా ఒక సగం జీవన ప్రక్రియగా మాత్రం కాదు. కేవలం శరీరం మాత్రమే సజీవంగా ఉంటే అది మాత్రమే సరిపోదు కదా. ఇక్కడ మీరు కూర్చున్నా, మీరు కళ్ళు మూసుకున్నా మీరు ఏం చేస్తున్నాసరే ఇక్కడ ఉండడం ఉపయోగకరమే. మీలో ఓ భాగం మాత్రమే సజీవంగా ఉంటే,  ఏం చేసినా అది ఉపయోగంగా అనిపించదు.

ఒక పౌర్ణమి రోజైనా, ఒక అమావాస్య రోజైనా సరే చంద్రుడి ప్రభావం మన మీద ఉంటుంది. ఇది ఎంతగానో ఉంటుంది. మీరు అవగాహన చేసుకోగలిగినా, అవగాహన చేసుకోలేకపోయినా ఈ ప్రభావం అన్నది ఉంటుంది. మీలో ఒక తార్కికమైన అంశం ఉంది. ఇది మీరు బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే మీరు గమనించినా, గమనించకపోయినా ఈ చంద్రుడి ప్రభావం మీ మీద ఎంతగానో ఉంది. పౌర్ణమి రోజుల్లో కంటే, అమావాస్య రోజుల్లో, మీ మీద చంద్రుడి ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది. మీరు దేనినైనా అవగాహన చేసుకున్నా, చేసుకోకపోయినా సరే ఉన్నదేదో ఉంటుంది.

మీలో ఒక తార్కికమైన కోణం ఉంది. ఇది మన పరిసరాల్ని మన బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి ఉపకరిస్తుంది. అలానే తార్కికాన్ని మించిన కోణం కూడా మీలో మరొకటి ఉంది. అది లేకుండా మీ అంతర్ముఖమైన విషయాలను మీరెప్పటికీ సరిచూసుకోలేరు. ఈ చంద్రుడు దీనికి ప్రతీక. ఆ కోణానికి ప్రతీక.

సద్గురు  ప్రేమాశిస్సులతో
                                      గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......
 

Sunday, April 29, 2018

శ్రీ నృసింహ జయంతి

ఈ రోజు  28-04-2018 , శనివారం, వైశాఖ శుద్ధ చతుర్దశి )

_*ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం _*
_*నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ॥*_

శ్రీ నృసింహ జయంతి. శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో....
అవతార వృత్తాంతం:
వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీ హరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని, రాత్రి గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, అస్త్రం చే గాని, శస్త్రం చేత గాని, మనిషి చేత గాని, మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు.
కానీ హిరణ్య కశిపుని భార్య లీలావతికి పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని ఎంత బోధించినా, బెదరించినా, చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా, లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు.
ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా. "ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి" అని భక్తితో ప్రహ్లాదుడు "ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు" అని చెప్పగా, దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు "ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి" అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు. అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.
పాంచరాత్రాగమంలో 70కి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. కానీ ముఖ్యమైనవి మాత్రం
*నవ నారసింహమూర్తులు. అవి...*
1) ఉగ్ర నారసింహుడు
2) కృద్ధ నారసింహుడు
3) వీర నారసింహుడు
4) విలంబ నారసింహుడు
5) కోప నారసింహుడు
6) యోగ నారసింహుడు
7) అఘోర నారసింహుడు
8) సుదర్శన నారసింహుడు
9) శ్రీలక్ష్మీ నారసింహుడు
నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.
అందరికీ *నరసింహ జయంతి శుభాకాంక్షలు....

జై నారసింహ !  జైజై నారసింహ !!

ప్రపంచ తోబుటువుల దినోత్సవ శుభాకాంక్షలు

                      పుట్టింటి బంధం

వివాహానంతరం కూడా అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం అలాగే వుండటం కోసం మన పెద్దలు ఆచారం అనే జాబితాలో ఎన్నో అంశాలను చేర్చారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల బాగోగులు సోదరులు తెలుసుకోవాలనీ ... అవసరమైతే అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఆడపిల్ల ఇంట జరిగే ప్రతి శుభకార్యంలో మేనమామ ప్రధాన పాత్రను పోషించేలా చేశారు.

మేనకోడలికి చెవులు కుట్టించడం దగ్గర నుంచి .... వివాహ సమయంలో పెళ్లి కూతురిగా బుట్టలో వేదికపైకి తీసుకు వచ్చేంత వరకూ మేనమామగా తన వంతు పాత్రను పోషించేలా చేశారు. అలాగే ఆడపిల్ల కూడా పుట్టింటి వారిని మరిచిపోకుండా వుండటం కోసం ... ఆ కుటుంబంలో తాను ఎప్పటికీ ఓ సభ్యురాలినేననే విషయాన్ని గుర్తించేలా ఆమె జోక్యాన్ని ఏర్పరిచారు. ఈ కారణంగానే పుట్టింటి వారు ఏ శుభాకార్యాన్నయినా ఆడపిల్ల చేతుల మీదుగా జరిపించాలనే ఆచారాన్ని ప్రవేశ పెట్టారు.

ప్రతి ఆడపిల్ల కూడా సోదరుడి వివాహానికి అందరి కంటే ముందుగా వచ్చి పెళ్లి పనులు చక్కబెడుతుంది. ప్రేమానురాగాలు పంచడంలో తన తరువాతే ఎవరైనా అనేలా, సోదరుడిని పెళ్లి కొడుకుగా అలంకరిస్తుంది. ఆడపిల్లగా తనకి పుట్టినింటి పై ఎప్పటికీ హక్కు వుంటుందన్నట్టుగా, తనకి రావలసిన లాంఛనాలను అధికారికంగా తీసుకుంటుంది. ఒకవేళ పుట్టింటి వారి పరిస్థితి బాగోలేకపోతే, వారికి అన్నివిధాలుగా ఆసరాగా నిలబడటానికి కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోను వెనుకాడదు.

28/04/2018

అక్షతలు అంటే...?

రోకటిపోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం.  నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి దానవస్తువు బియ్యం.

   *శ్వేతాక్షతలు :*

తెల్లని ఈ అక్షింతలను  పితృకార్యాలలో ఉపయోగిస్తారు. వీటిని నీటితో తడిపి, తర్పణాదులకు కర్తలను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు.

   *హరిద్రాక్షతలు *

అలంకార ప్రియుడైన విష్ణువును అర్చించడానికి వైష్ణవ మత అనుయాయులు పసుపుతో చేసిన అక్షింతలను వాడతారు. స్వర్ణం లక్ష్మీదేవికి ప్రతీక కనుక హరిద్రాక్షతలు లక్ష్మీపూజలలో, వివాహాది శుభకార్యాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

  *కుంకుమాక్షతలు *

ఈశ్వరునికి, అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం. కనుక కుంకుమాక్షతలను శైవ, శాక్లేయులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

తలపై వేసే అక్షింతల శక్తిని బ్రహ్మ రంద్రం గ్రహించి నేరుగా శరీరాంతటికీ అందజేసి ఆశీర్వచన ఫలితాలను పొందగలరు.

  మానవుడిలోని దైవశక్తిని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడానికి మరియు మంత్ర శక్తిని, దేవతారాధన ఫలితాన్ని లేదా పెద్ద ఆశీర్వచన శక్తిని ఇంకొకరికి బదిలీ చేయడానికి జలము మరియు అక్షింతలు వాహకంగా ఉంటాయనేద మన శాస్త్రం చేబుతోంది. మంత్ర పఠనంతో మనస్సు పూర్వకంగా ఆశీర్వచనం చేస్తూ శిరస్సున అక్షింతలు వేసి ఆశీర్వచనం చేయడంతో బ్రహ్మరంధ్రం వాటి శక్తిని నేరుగా గ్రహించి, శరీరంలోని సహస్త్ర చక్రాలను ఉత్తేజపరుస్తూ శరీర మంతటికీ అందిస్తుంది. శరీరంలోని షట్‌ చక్రాలు #బ్రహ్మరంధ్రానికి అనుసంధానమై ఉంటాయి.

శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిసి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.మనుషుల్లో తమో, రజో, సాత్తియాకాలనే త్రిగుణాలకు కారకము. పెద్దలు వధువరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో , దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి .ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విధ్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమమామలు వివాహ సమయంలో శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పరమార్థం ఇదే..!

ఆయుర్వేదం ప్రకారం చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపు కుంకుమకుంది , అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చుకొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతే కాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
వివాహ శుభకార్యంలో జీలకర్ర , బెల్లం పెటటే వేళ , మాంగల్యధారణ వేళ వధువరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి 'దీర్ఘాయుష్మాన్ భవ' ,'చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్యప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు'అంటూ ఆశీర్వదిస్తుంటారు.

వివాహంలో #తలంబ్రాలలో వధూవరులు దోసిలితో పోసిన తలంబ్రాలకు మంత్రోక్తంగా....

*ప్రజామే కామ సమృద్యాతాం*
*పశవోమే కామ సమృద్యాతాం*
*యజ్ఞోమే కామ సమృద్యాతాం*
*శ్రీయోమే కామ సమృద్యాతాం*

అంటూ గృహస్తుల జీవితంలో వారు ఎలాంటి మనోవాంచులను కోరుతున్నారో జీవితంలో వారికి ఎలాంటి కోరికల సిద్ధిద్వార సుఖ జీవనం గడుపుతారో మంత్రోక్తంగా చెబుతూ (గృహము, సంతానం, యజ్ఞము, ధనము, పశువులు, పంటలు ఇలా మరెన్నో కోరుకలు) వధూవరులు ఒకరి శిరసుపై మరొకరు తలంబ్రాలు పోసుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీంతో గృహస్తు జీవితంలోమ తమన ఇష్ట కోరికలు తీరి వారిమధ్య అన్యోనత పెరుగుతుంది. అంతే కాకుండా వివాహంలో తలంబ్రాలు ఘట్టం వధూవరుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. వారిలో అనురాగాన్ని పెంచుతుంది. ఇదే మన పూర్వీ మహర్షుల మన సనాతన ధర్మ గొప్పతనం. ప్రతి సంప్రదాయంలో ఒక గొప్ప విలువైన సైన్స్‌ సూత్రాలను కూడా ఇమిడ్చి ఉంచారు. అదే మన సంస్కృతి మహత్యం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

Thursday, April 26, 2018

నక్షత్రముల జన్మము వివాహము

                     చంద్రునికి  దక్షుని  శాపం

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు.

వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.
ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెళ్ళి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.

🌷 *చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట*

ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్థించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు.

చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.

🌼 *దేవ, రాక్షస, మానవ గణములు*

దక్షుడు ఇలా చెప్పాడు - రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు. కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది.
వివాహ సమయంలో చేసే ప్రమాణములు
చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తర్షులనుఅరుంధతిని చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.
చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము
తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.
వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు.
ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు
ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి
వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే.

కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే.

జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, శ్రీహరి పంకేరుహ ధ్యానైక చిత్తుడై, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు.

ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

చంద్రుని క్షయరోగ విముక్తి
తన భార్యలను (అనగా చంద్రుని భార్యలు, దక్షుని పుత్రికలు అయిన వారిని) చంద్రుడు క్షోభకు గురి చేశాడు గనుక అతనికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరిపట్ల పక్షపాత బుద్ధి లేకుండా మెలగమని చెప్పాడు. అందుకొరకు దినమునకొక భార్యతో ఉండమని, ఆ 27 దినములు 27 యోగములు అవుతాయని దక్షుడు చెప్పాడు. - అవి విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, వృద్ధి, ధ్రువము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, పరియాన్, పరిఘము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, ఇంద్రము, వైధృతి.
అలా ఉండడం వలన క్రమంగా రోగం క్షీణిస్తుందని, శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతుంటాడని దక్షుడు ఉపాయం చెప్పాడు. తన శాపం అమోఘం గనుక దానిని తొలగించడం సాధ్యం కాదని, కాని మదోన్మత్తుడైన రాజు (చంద్రుడు) క్రమంగా జరిగినదానిని మరిచిపోయే ప్రమాదం ఉంది గనుక ఆ విధాన్ని అలా ఉండనీయమని చెప్పాడు. దక్షునికి నమస్కరించి, అతని ఆనతి తీసికొని చంద్రుడు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...