Tuesday, March 6, 2018

వర్ణవ్యవస్థ

మన వర్ణవ్యవస్థ అనర్థకారియనీ, దీనివల్ల ద్వేషములు ప్రబలుతున్నవిగనుక, దీనిని నిర్మూలించవలసి వుంటుందనీ - అధికార దూర్వాహులయిన పెద్దలు అంటూవుండటం నేడు పరిపాటి అయిపోయింది. నిజానికి వర్ణ ద్వేష మనేది ఇటీవలనే పుట్టుకవచ్చింది. ఈ ద్వేషం తనంతట తానే బయలుదేరిందా? మన పూర్వపరిపాలకులవల్ల ఇది దాపరించిందా? అనే విచారణతో ఇపుడు పనిలేదు.

వర్ణముల మధ్య విరోధములు పుట్టిన మాట నిజం. వర్ణ ద్వేషవాయు ప్రచారం జరుగుతున్న మాటా నిజమే. ఈ వర్ణ ద్వేషంకంటె మతద్వేషాలు మరీప్రబలంగా వున్నవి. ఈ మతద్వేషాలు నేటివికావు. వీటికి పూర్వచరిత్ర చాలావుంది. మతద్వేషా లలా వుండగా, ఒక మతములోనే శాఖకూ శాఖకూ మధ్య సంఘరణలు పుట్టతూవచ్చినవి. క్రుసేడ్సనే వెనుకటి మతయుద్ధాలలా వుండగా, విమతస్థులపట్ల కాథలిక్కులు జరిపిన అత్యాచారాలూ, షియా, సున్నీవిరోధాలు, మనదేశంలో హిందూముస్లిము సంఘరణలు, బర్మాదేశంలో బౌద్ధులకూ ముస్లిములకూ కొట్లాటలు, తెంగల వడఘల విరోధాలు, శైవవైష్ణవ ద్వేషాలూ ఇవి అన్నీ ఏనాటినుంచో వుంటున్నవి. ఈయథార్థ సంఘటనలను చూచినమీదట - రక్తపాతాలకు, యుద్ధాలకు కారణమవుతున్న ఈవర్ణభేదాలను, మతభేదాలను నిర్మూలించవలెననే ఆలోచన ఒకటి బయలుదేరింది. స్థూలంగాచూస్తే ఈ ఆలోచన న్యాయమైన దనే తోస్తుంది.

మరి ఈవర్ణములకంటె, మతములకంటె అధికవిద్వేషాలను భాషాభేదాలు, రాజకీయ మతభేదాలు కల్పిస్తున్నవికదా, వాటి నేమిచేద్దామంటారు? మద్రాసు రాష్ట్రాన్నే చూడండి! ఇచట వర్ణములకంటె భాషలే ప్రబలవిరోధములుగా కనిపిస్తున్నవి. ప్రస్తుత మీ భాషావివాదం, దాని పుణ్యమాయని ఖండన మండనములతోనే సరిపెట్టుకొంటున్నది. ఉత్తరదేశమం దీవివాదం అంతటితో వూరుకొనక దొమ్ములాటలకుదారితీస్తున్నది. ఇలా వివాదాలకు, సంఘరణలకు కారణమవుతూ వున్నది. కనుక అసలు భాషనే నిర్మూలించి, మూగవాళ్ళంగా వుండడమే మేలు అందామా!

పూర్వం రాజ్యలోభంచే రాజులు పరస్పరం యుద్ధాలకు దిగేవారు. ఈనాడు చూడబోతే పరిపాలనావిధానం ఎలా వుండాలి. అనే మతభేదంవల్ల రాజ్యాలన్నీ రెండు తెగలుగా చీలి పరస్పరం ఢీకొనచూస్తున్నవి. ప్రజాసమ్మతిమీదనే పరిపాలనం నడవాలి అని అందరు అంగీకరిస్తారు. మరి, అమెరికా 'తనది ప్రజాసమ్మత ప్రభుత్వ' మంటే 'కాదు, అది సాహుకార్ల ప్రభుత్వ' మని ఆక్షేపిస్తుంది రష్యా. అలాగే రష్యాలో ప్రజా ప్రభుత్వంగా చెలామణి అయేదాన్ని కమ్యూనిజమనిఅమెరికా ఆక్షేపిస్తుంది. పూర్వపు రాజుల అహంకారంలాగే నేటి యీ రాజకీయ మతదురహంకారం స్పర్థలను తెచ్చిపెట్టుతున్నది. ఈ రాజరికపు మతభేదాలతో మాకు సంబంధం లేదు. మే మడిగేది ఒక్కటే- ఈ రాజకీయభేదాలు వివాద కారణంగా వుంటున్నవి కనుక మొదట ప్రభుత్వమనేదాన్నే రూపుమాపి వెనుకటి ఆటవికావస్థకు మాత్స్యన్యాయానికి తరలిపోవలసిందేనా? అని.

ఒకరి మనస్సొకరికి తెలియజెప్పికోవాలంటే ఏకమో అనేకమో భాషలు ఉండితీరాలి. మన దేశంలోనే చూడండి! ప్రతి 500 మెళ్ళకు ప్రాంతీయభాషలు భిన్నంగా కనిపిస్తున్నవి. అంతే కాదు, ప్రతిభాషా 500 ఏండ్ల కొకతూరి పెద్దగా మార్పు చెందుతున్నట్లు కనిపిస్తున్నది. కన్యాకుమారి నుంచి హిమాలయాలదాకా, ప్రాచీన కాలమునుండి నేటిదాకా పరికించి చూస్తే ఈమార్పులు స్పష్టంగా గోచరిస్తవి. భాషవల్ల మనకెంతో ప్రయోజనం వుంటున్నది. అట్టి భాషను తుడిచి పెట్టవలెనంటే ఎవరూ సమ్మతించరు. భాషలు వ్యవహారం కోసం పుట్టినవి కాని విరోధాల కోసం పుట్టలేదు కదా. కాబట్టి బుద్ధిశాలురైనవారు ఈ భాషాద్వేషాలకు కారణం ఏమైయుటుందా అని పరిశీలించి, ఆకారణాన్ని పరిహరించుకోవాలిగాని భాషనే విడనాడరు.

తమిళనాడు ఇతర భాషల కెప్పుడూ ఆతిథ్యమిచ్చి ఆదరిస్తూనే వచ్చింది. ఆంధ్ర మహారాష్ట్ర దేశాలకు దక్షిణదేశస్తు లేనాడో వలసపోయినారు. అలా వచ్చినవారినే తెలుగువారు ద్రావిడులని పిలుస్తారు. ఆ ద్రావిడులకు ఒక్క ముక్కయినా తమిళం రాదు. మహారాష్ట్రానికి వెళ్లిన ద్రావిడులుకూడా అచటి భాషనే అవలంబించారు. అట్లే ఆంధ్రులు, మహా రాష్ట్రులు, ఘూర్జరులు తమిళదేశంలో పాతకాపులైనారు. తమిళనాడులో ఎన్నో తరాలు గడచినా నేటికీ ఆయాదేశస్థులు తమ తమ మాతృభాషలను విడనాడలేదు. వారు తమిళభాషలోనూ పండితులై అనేక తమిళగ్రంధాలు రచించారు తమిళులు గూడా ఏ దేశం వెళ్లినా అచటిభాష నిట్టే అలవరచుకొంటారు. వస్తువుల చల్లదనాన్ని కాపాడే శైత్యకరండం వంటిది తమిళనాడు. తన మరుగుజొచ్చిన భాషలనది కాపాడుతుంది. ఇతర ప్రాంతములను చేరిన భాషలు అట్లుకాక తమ స్వరూపాన్ని కాల క్రమాన కోల్పోయినవి. ఇతరభాషల నిలా ఆదరించి రక్షిస్తూవచ్చిన ప్రశస్తకీర్తిని రక్షించుకొనేభారం తమిళులపై వుంది. ఇతర భాషలకంటె తమభాష గొప్పదనే భావముంటే ఈభాషావైమనస్యంనశించదు. భాషలుపరస్పరం సౌహార్దంతో చెట్టలు పట్టుకొని మెలగుతూ ఇతర భాషలలోని భావరత్నాలతో తమ్ము నలంకరించకొంటూవుంటే సకల భాషలు సంపన్నము లవుతవి. భిన్న భాషలవారికపుడు పరస్పరాభిమానాలు నెలకొంటవి. భాషాదురభిమానాలు సమసి పోవుట కిదేమార్గం.

ఒక మంచివస్తువులో కొంత చెడ్డకూడా కనిపిస్తుంది. నిజమే. అపుడాచెడ్డను పరిహరించి మంచిని కాపాడుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. మతవిషయాన, వర్ణవ్యవస్థవిషయాన కూడా ఈమార్గమునే అవలంబించాలి. వర్ణవ్యవస్తనేపరిశీలించండి సంఘవ్యాపారము సుష్ఠుగాజరగడంకోసం పుట్టిందా వ్యవస్థ వృత్తివిభజనచేసి ఎవరిధర్మాన్ని వారు నిర్వహిస్తూ, సమిష్టిక్షేమాన్ని సాధించడమే దాని ఉద్దేశం ఆయావృత్తుల కనుగుణమైనఆహారవిహారములు, నిత్యానుష్ఠానాదులు, జీవన విధానము ఏర్పాటయినవి. ఆశ్రమ వ్యవస్థకూడాఇటువంటిదే. ఒకవర్ణము తక్కినవానికంటె అధికమని చెప్పికొనుట సమర్థనీయం కాజాలదు. వివాహవిషయంలో, స్వీయాచారములవిషయంలో కొన్నికట్టుబాట్లువున్నవి. అంటే, అట్టివిలోకమంతటా వున్నవే. ఐరోపీయులగు క్రిష్టియనులు, నీగ్రోక్రిష్టియనులతో సంబంధభాంధవ్యముల నొల్లరు. ఆ కారణాన క్రయిస్తవమతము పనికిమాలినదని రూపుమాపవచ్చునా? కేవలం స్వకీయములైన ఆచారభేదము లున్నంతమాత్రాన వర్ణవ్యవస్థను ఖండించుటయు న్యాయముకాదు.

ఇటీవలికాలమందుగాని, పరంపరా గతంగాకాని కొన్ని దురాచారములు ప్రవేశించిఉన్నట్లయితే వాటిని పరిహరించుకోవచ్చు ఇంతకు, ఒక వర్ణంకంటె మరొకటి అధికమనుకొనుటయే ఈ వివాదమంతటికి మూలంగా కనిపిస్తున్నది. ఇతరుల కష్టనష్టాలను, విపత్తులను మనవిగా ఎంచుకోవడం అలవాటుకావాలి. మనము ఇతరవర్ణస్థుడు కష్టాలలోవున్నప్పడు మనకష్టాలమాట అలావుంచి. ముందు అతని నాదుకోవాలి. శాస్త్రవిహితమైన ఇట్టి ఉదారదృష్టి అలవడితే నేటి పొరుపులు సమసిపోయి సామరస్యం ఏర్పడుతుంది. 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనేదే మనకు ధ్యేయం.

ఇక మతవిషయమంటారా ఇతరమతాలను, శాఖలను ఆక్షేపించటాన్ని ముందుగా మనం వర్జించాలి. ఇతర మతస్థుల నాక్షేపించేముందు ఎవరికివారు తమ మతధర్మాలను చక్కగా ఆచరిస్తున్నారో లేదో పరీక్షించుకోవాలి. మానవునకు ఆత్మ వికాసాన్ని ఘటించి, దివ్యత్వం సమకూర్చడంకోసం మతమనేది ఏర్పడింది. పరులకుపదేశించేముందు మనం కామక్రోధద్వేషాదులను జయించాలి. సమస్తమతాలను అడకువతో పరిశీలించి, వానియందున్న మంచిని గ్రహించుకోవాలి. అట్టి సహృదయత్వం ఏర్పడితే విోధబీజములు నశిస్తవి. విరోధకారణములుగా కన్పించే ఈ మతములప్పుడు ఆత్మకు పుష్టిని, ధర్మోత్సాహాన్ని సమకూరుస్తవి.

అనేకకాష్ఠములను ఒక్క త్రాడుబంధించి వుంచుతుంది. వానిలో ఒక్కకట్టెను వెలికిలాగితే, బంధనం సడలిపోయి. కట్టెలన్నీ విడిపోతవి. అలాకాకుండా ఆకట్టెలను ముందునాలుగైదు చిన్న కట్టెలుగాకట్టి. పిమ్మట అన్నిటినీఒకత్రాటితో బంధిస్తా మనుకోండి. అపుడుఒకకట్టెను జారలాగినా, తక్కనవిఆ యేక బంధమున సురక్షితంగా వుంటవి. అలాగే సమానధర్ములైన మానవులను వర్ణములనే చిన్నకట్టలుగా కట్టి, పిమ్మట వాని నన్నిటిని మతమనే ఏకసూత్రముతో బంధించాలి వర్ణములు, మతము అనేవి సంఘమును ఇలా ఏకబంధాన పరిరక్షిస్తున్నవి. మతమనే ఆ పెద్దమోపులో ఇమిడిన వర్ణములనే చిన్నకట్టలు పరస్పరసహకారభావంతో, ద్వేషమత్సరాలనువిడనాడి స్వక్షేమమును సమిష్టిక్షేమమును సాధించుకోవడంకోసమే మత వర్ణమలు ఏర్పడినవి. మనమిట్లు పాపచింతా విముఖలమై, మానవ సౌందర్యాన్ని ఆరాధిస్తూ, ఈశ్వరానుగ్రహానికి పాత్రులం కావాలి.

వర్ణమునుబట్టి, పదవినిబట్టి ఎవరును అహంకరింపరాదు. మన వర్ణ ధర్మాలను గూర్చిన విచారణతప్ప ఎక్కువతక్కువలను తలపెట్టగూడదు. ఏ వర్ణమువారైనను ఈశ్వరభక్తిచే ఈశ్వర పదాన్ని అధిష్టింపగలరు వర్ణాభిమానములు నశింపవలెనంటే స్వధర్మానురక్తీ భక్తిజ్ఞానములే సాధనాలు. వివేక విజ్ఞానధనులైన పవిత్రులు - భక్తిజ్ఞాన ప్రపూర్ణులగుటచే వర్ణాభిమానం వారి నంటదు. మానవుని కర్మప్రవృత్తియందు ధర్మం లోపించగానే, హృదయంభక్తిశూన్యము బుద్ధిజ్ఞానశూన్యం అవుతుంది. అంతట వర్ణాభిమానాలు ప్రకోపిస్తవి. వర్ణములు నశించాలని చెప్పే పెద్దలు ధర్మమును, భక్తిని, జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవాలనికూడా చెప్పవలసివుంటుది. వూరకే వర్ణ భేదాలు పోవాలి, పోవాలి అంటే అవి పెరుగుతవేకాని తరగవు మందు త్రాగేవాణ్ణి కోతినిగూర్చి తలచుకోవద్దు అన్నట్లుగా వుంటుందది. భక్తిజ్ఞానధర్మాలు వేరుదన్నుకొంటే వర్ణభేదాలు వాటంతటవే వెనుక బడిపోతవి. భక్తులపట్ల, జ్ఞానులపట్ల వర్ణభేదం చేయక వారిని ఆరాధిస్తాము. మహాత్ములైనవారు తమ్ము దాము పరమాణువులుగా ఎంచుకుంటారు. మనశాస్త్రాలు వర్ణాహం కృతిదూష్యమనీ, పాపమని చెప్పుతున్నవి. ఏ వర్ణానికి విహితమైన ధర్మాలను ఆ వర్ణం శ్రద్దాలను ఆ వర్ణంశ్రద్ధాభక్తులతో ఆచరించవలెనేకాని స్వవర్ణాభిమానం వహించగూడదు. ఏ వర్ణమువాడైనా తన్ను నికృష్ణునిగా ఎంచుకోవాలేగాని ఉత్కృష్టత నాపాదించుకో గూడదు. శ్రీరంగ దేవాలయానికి పెద్దలు వచ్చినపుడు వారి కాలయమర్యాదలు నెరపుతారు. అపుడాపెద్దలు 'కుక్కకంటె హీనుడను' అని బదులుపలకడం ఆచారం. శైవ వైష్ణవభక్తి గీతాలలో ఈ నైచ్యానుసంధానం స్పష్టంగా గోచరిస్తూ వుంటుంది. మన తప్పులను దిద్దుకొనే వివేకాన్ని, శక్తిని పరమేశ్వరు డనుగ్రహించుగాక!                       

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.

అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.

ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాకా

పురాణకాలంలో ధన్వంతరీ వైద్య విధానాలు

పురాణకాలంలో రోగాలు నయం కావటానికి చేసిన వైద్య విధానాలను గురించి అగ్నిపురాణం రెండువందల డెభ్బై తొమ్మిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ వివరణను చూస్తే దానధర్మాలు కూడా ఆనాడు రోగాలు నయం కావటానికి ఉపయుక్తమయ్యాయన్న విషయం అవగతమవుతుంది. అలాగే తిన్న ఆహారం ఏమవుతుందన్న విషయాన్ని కూడా ఆనాటి వారు నిర్థారించిన అంశాలు కనిపిస్తాయి. వీటన్నిటినీ ధన్వంతరి వివరించాడు.

రోగాలు శారీరకాలు, మానసికాలు, ఆగంతుకాలు, సహజాలు అని నాలుగు రకాలుగా ఇక్కడ ధన్వంతరి వివరించి చెప్పాడు. జ్వరం, కుష్ఠులాంటివి శరీర రోగాలు. క్రోధాదులు మానసిక రోగాలు. దెబ్బలు తగలటం లాంటివి ఆగంతుకాలు. ఆకలి, ముసలితనం అనేవి సహజాలు. శరీర, ఆగంతుక వ్యాధులను తొలగించుకోవటానికి ధన్వంతరి చెప్పిన వైద్య పద్ధతులు ఈనాటి వారికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఆనాడు అలా చెయ్యటం వల్ల ఆ రోగాలు తగ్గాయని రుజువులు కూడా పురాణాలు చూపిస్తున్నాయి.

శరీర, ఆగంతుక వ్యాధులు సంక్రమించినప్పుడు శనివారం నాడు పండితుడిని పూజించి ఆయనకు నెయ్యి, బెల్లం, ఉప్పు, బంగారం, దానం చేసేవారు.

సర్వరోగ విముక్తికి సోమవారం నాడు వేదపండితుడికి అభ్యంగన స్నానం చేయిస్తుండేవారు. అలాగే శనివారం నాడు తైలదానం చేసేవారు. ఆశ్వియుజ మాసంలో గోరసాలను దానం చేసేవారు. శివలింగానికి పెరుగు, నెయ్యిలతో స్నానం చేయించిన వాడు రోగ విముక్తుడవుతాడని ధన్వంతరి వివరించాడు. అలాగే రోగ విముక్తికి త్రిమధురాలలో గరికను ముంచి గాయత్రీ మంత్రంతో హోమం చేసేవారు. ఏ నక్షత్రంలో రోగం పుట్టిందో ఆ నక్షత్రంలోనే స్నానం చేసి దానాది విధులను నిర్వర్తించేవారు.

మానసిక రోగ విముక్తికి విష్ణుస్తోత్రాన్ని జపించేవారు. తిన్న ఆహారం లోపలికి వెళ్ళాక కిట్టంగానూ, రసభాగంగానూ మారుతుంది. కిట్టంగా అయినదే మూత్ర, స్వేద, దూషికాది రూపాలలోనూ, నాసిక, కర్ణాలు దేహం నుంచి వెలువడే మలరూపంగానూ పరిణమిస్తుంది. రసభాగమంతా రక్తంగా మారుతుంది. రక్తం నుంచి మాంసం, దాని నుంచి మేథస్సు, దాని నుంచి అస్తి, అస్తి నుంచి మజ్జ, దాని నుంచి శుక్రం, దాని నుంచి రాగ, ఓజస్సులు పుడతాయి. చికిత్సకుడు దేశకాల పీడా బలశక్తి ప్రకృతి భేషజ బలాలను గుర్తించి వాటికి అనుగుణంగా తగిన చికిత్సలు చెయ్యాలి.

చవితి, నవమి, చతుర్థశి తిధులలో మంద, క్రూర నక్షత్రాలను విడిచి చికిత్సను ప్రారంభించేవారు. విష్ణు, గోవు, వేదపండిత, చంద్ర, సూర్యాదుల పూజ చేసి రోగినుద్దేశించి బ్రహ్మదక్షుడు, అశ్వినీ దేవతలు, రుద్ర, ఇంద్ర, సూర్య, అనిల, అనల, రుషులు, ఓషధీ సముదాయం, భూత సముదాయం అన్నీ రక్షించు గాక. రుషులకు రసాయనం ఎలాగో, దేవతలకు అమృతం ఎలాగో, నాగులకు సుధ ఎలాగో అలాగే నీకు ఈ ఔషధం ఆరోగ్యకరమూ, ప్రాణ రక్షణకరమూ అగుగాక అనే అర్థాలు గల శ్లోకాలను పఠిస్తూ ఔషధాన్ని ఇవ్వటం ప్రారంభించే వారు.

ఆనాడు ఇలా కొన్ని కొన్ని రోగాలకు దైవపూజలు, దానాలు మాత్రమే చికిత్సలుగా ఉండేవి. కొన్ని కొన్ని రోగాలకు తగిన ఔషధులను కూడా ఇచ్చేవారిని ఈ అధ్యాయం వివరిస్తోంది.

Monday, March 5, 2018

లోకం, మనిషి, భగవంతుడు -- మూడు మౌలిక సత్యాలు!

మనం(జీవి), మనం జీవించే లోకం (జగత్తు), ఈ రెండిటికీ కారణభూతమైన భగవంతుడు - ఈ మూడూ మౌలిక సత్యాలు. ఈ మూడూ నిజానికి ఏమిటి, వీటికి మధ్య నెలకొన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలు అనాదిగా తత్త్వ వేత్తలను ప్రేరిపిస్తూ వస్తున్నాయి. మన ఉపనిషత్కాలపు ఋషులు ఈ మూల సత్యాలను చక్కగా విచారణ చేసి చక్కని సమాధానాలను పొందగలిగేరు. అవి ఏమిటో మన పరిదిలో మనం చూద్దాం. 

లోకం: 
లోకం అంటే ఎదో శూన్యం నుంచి ఒక్కసారిగా సృస్థించబడింది కాదు. కారణం లేకుండా ఏ కార్యమూ జరుగదు. శూన్యం నుండి దేనిని సృస్థించలేము. ఆ విధంగా, ఉన్న దేనినీ లేకుండా చేయడం సాధ్యం కాదు.  అది అత్యంత సూక్షం గా మారవచ్చు. మళ్ళీ స్థూల వస్తువు గా మార్పు చెందవచ్చు. బీజం నుండి చెట్టు, చెట్టునుండి బీజం ఇలా పునరావ్రతం అవుతాయి. ఇదేవిధంగా జంతువులు, మానవులు కూడా. స్థూలం నుండి సూక్ష్మం ...మళ్ళీ సూక్షం నుండిస్తూలం; ఇలా చంక్రమణం సాగుతూ ఉంటుంది. 

దీనిని బట్టి చూస్తే, ఈ లోకానికి ఆద్యంతాలు లేవని తెలుస్తోంది. సృష్టి ఆద్యంతరహితమైనదని వేదాలు చెపుతున్నాయి. కనుక సృష్టి లేనటువంటి కాలం ఎప్పుడూ లేదని తేలుతోంది.  కొన్ని సమయాలలో లోకం నిష్క్రియ స్థితిలోనూ, కొన్ని సమయాలలో క్రియాజనిత స్థితిలోనూ ఉంటుంది. అంటే లయం నుండి ఆవిర్భావం, ఆవిర్భావం నుండి లయం కొనసాగుతూ ఉంటాయి. 

మనిషి: 
ఇక మనిషి ఎవరన్న ప్రశ్నకు మన ఉపనిషత్తులు నుండి రెండు ముఖ్యమైన సమాధానాలు లభిస్తున్నాయి. వాటిలో ఒక సమాధానాన్ని మాండూక్యోపనిషత్తు చెపుతుంది. మనిషి లో నాలుగు పరిమాణాలు నిండి ఉంటాయి అంటుంది ఈ ఉపనిషత్తు. 

జాగ్రద్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులలో మనం మార్చిమార్చి సంచరిస్తూవుంటాము. వీటిలో మనం విభిన్నమైన అనుభవాలను పొందుతాము.ఇన్ని పరిమాణాలు అతడికి ఉన్నప్పటికీ అతడు ఎవరు అంటే ఇన్ని పరిమాణాలను తనలో ఇముడ్చుకున్న ఒక మనిషి. 
మనం ఈ మూడు స్థితులలోనూ లోకంతో సంబంధం కలిగి ఉంటాము. ఈ మూడు అవస్థలను ఇముడ్చుకున్న మొత్తం పరిణామమే ఆత్మ. ఇది నాలుగవ పరిమాణం అని చెప్పబడుతోంది. 

భగవంతుడు:
భగవంతుడు అనే పదానికి అత్యున్నత స్థితి వివరణను మాండూక్యోపనిషత్తు ఇస్తోంది. భగవంతుడు ఎవరు అనే దానికి 'ఆత్మే భగవంతుడు' అనే మహావాక్యాన్ని 'అయమాత్మా బ్రహ్మ'  అని చెప్పింది.భగవంతుడు సర్వవ్యాపి కనుక అయన మనలోనూ కొలువై ఉన్నాడు. మన హృదయం లో ప్రకాశించే స్థితిలో  ఆయన ఆత్మ గా పేరుగాంచాడు. ఓంకారం  అనే ప్రణవనాదాన్ని భగవంతునికి ప్రతీకగా మాండూక్యోపనిషత్తు నెలకొల్పుతోంది. 

సమస్తమూ ఒకటే!
భగవుంతుడిని ఓంకారం గా చెప్పినప్పుడు, అయన సర్వవ్యాపి కనుక లోకం కూడా ఓంకారంలోనే ఇమిడి వుంది. మనిషి లోకంలోని వాడు కనుక, మనిషి కూడ ఓంకారం లో ఉన్నట్లే. అలాగే ఆత్మ స్థితిలో మనిషి, భగవంతుడు ఒకటే అని చెప్పుకున్నాము కనుక మనిషి = భగవంతుడు. . అవన్నీ పరిశీలించిన పిదప, లోకమూ, మనమూ, భగవంతుడు వేరు కాదన్న విశిస్థమైన అభిప్రాయం మాండూక్యోపనిషత్తు ప్రతిపాదిస్తుంది. అనగా లోకం = మనిషి = భగవంతుడు

Sunday, March 4, 2018

శిక్ష అనుభవించాల్సిందే

🕉🕉🕉🕉🕉🕉

కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. ‘కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు... వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా. వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే. ... అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది..’’ అంటూ ప్రశ్నించింది.

శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. ‘‘వారు చేసిన పాపం ఏమిటి’’ రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు.‘‘నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ. వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు’ ‘‘ఏం తప్పు చేశారు?’’ ‘‘పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే, పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకుమించిన నేరమేముంది...’’ ‘‘మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా.

గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా. ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా’’ ‘నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే, యుద్ధరంగంలో యోధానుయోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు... మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి, పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు.

ఆ తరవాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైనదేనా? న్యాయమైనదేనా? అని ఆలోచించాలి’’ సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్ముడు.

🕉🕉🕉🕉🕉🕉

కోరికలు తీర్చే శ్రీ కృష్ణ మంత్రములు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది.

  *శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :*

*" కృం కృష్ణాయ నమః "*

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి.

  *" ऊँ శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు.

  *" గోపివల్లభాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి.

  *" గోకులనాథాయ నమః "*

అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.

  *" క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "*

ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.

  *" ॐ నమో భగవతే శ్రీ గోవిందాయ "*

దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది.

  *" ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది.

  *" ॐ శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "*

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.

  *" ॐ నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి.

*" లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "*

ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది.

*" నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "*

ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి.

*" ॐ కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "*

ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

వెలిగించవలసిన వత్తులు..............!!

1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.

2. గతపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వ్రత
సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు...

1. ఆరోగ్యము కొరకు - 1 ఏకవత్తి లేదా ద్వాదశ వత్తులు
2. మానసిక రోగములు నివారణకు - 2 ద్వి వత్తులు
3. వివాహ ప్రాప్తికొరకు - 3 త్రి వత్తులు
4. కుజ దోష నివారణకు - 3 త్రి వత్తులు
5. విద్యాప్రాప్తి కొరకు - 4 చతుర్‌ వత్తులు
6. ఉద్యోగ ప్రాప్తి కొరకు - 5 పంచమ వత్తులు
7. ఋణ బాధలు తీరుటకు - 6 షణ్ముక వత్తులు
8. వ్యాపారాభివృద్ధి కొరకు - 6 షణ్ముక వత్తులు
9. ఏలినాటి అష్టమ శని కొరకు - 7 సప్త వత్తులు
10. సర్వదోష నివారణ - 8 అష్టమ వత్తులు
11. సంతానప్రాప్తి కొరకు - 9 నవమి వత్తులు
12. అపమృత్యుదోష నివారణకు - 10 దశమ వత్తులు
13. ధనప్రాప్తి కొరకు - 12 ద్వా దశ వత్తులు
14. నాయకత్వము కొరకు - 14 చతుర్దవ వత్తులు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...