Tuesday, December 17, 2013

ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది

అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి

చారిత్రక కధనం ప్రకారం – కర్ణాటకలోని, హంపీవద్ద గల ‘ గుంలవ్య తోట ‘ అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని ‘అంజని గుహ ‘లో , పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేఱి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు , యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గుఱు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుని భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా , ఆమెకు ఆంజనేయులు జన్మించినట్లు రామాయణంలోఉంది. అందుచేతే శ్రీరాముడు హనుమను తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.

images
ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కఱచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో ‘ హనుమ ‘అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుని హనుమ తన గురువుగా భావించి సేవించి ,ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది , గురుదక్షిణగా సూర్య కుమారుడైన , సుగ్రీవుని సేవించను అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాగ్ దీక్షకూ, గురుభక్తికీ తార్కాణం.
మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు , ఆoజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో – అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ‘ పంచముఖ ఆంజనేయులుగా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం .
యుధ్ధానంతరం హనుమ హిమాలయ పర్వతం మీద నివసిస్తూ ‘హనుమద్రామాయణాన్ని’ తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఆ రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపఱచగా , హనుమ కారణం అడుగుతాడట!, అప్పుడు వాల్మీకి మహర్షి ‘ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించనందున అది అసంపూర్తిగా ఉన్నది కనుక తనకు అసంతృప్తికలిగించినదని ‘ చెప్పారు. అప్పుడు హనుమ తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమను ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందఱూ హనుమను పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విలసిల్లి ఉన్నాయి

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

రవిగ్రహ దోష నివారణకు..

ఆదివారం సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఆదిత్యుడైన సూర్యభగవానుడిని ఆదివారం దర్శించుకుని ఆయనకు గోధుమలను సమర్పించుకుంటే సౌభాగ్యం చేకూరుతుందని విశ్వాసం.
images (1) images surya-bhagavan-veemeswarar-temple-serappananchery
ఆదివారం ఉదయమో లేదా సాయంత్రం పూటనో సూర్యదేవుని ఆలయానికి చేరుకుని, సూర్య స్తోత్రం పఠించి.. నేతితో దీపమెలిగించే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఇంకా నవగ్రహాల్లో ఆదిదేవుడైన సూర్యభగవానుడిని పూజిస్తే ఈతిబాధలు తొలిగిపోతాయని విశ్వాసం.
ఇంకా ప్రతి ఆదివారం సూర్యదేవునికి సజ్జలు, గోధుమలు, రాగి గింజలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించేవారిని.. నరాలు, కంటికి సంబంధించిన వ్యాధులు సోకవని పురోహితులు అంటున్నారు. అలాగే ప్రతిరోజూ సూర్యనమస్కారం చేసే వారికి కంటిచూపు మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
ఇకపోతే.. ఆదివారం గోధుమలతో చేసే పదార్థాలు, పూరీ, చపాతీ వగైరాలు భుజించడం మంచిది. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నవగ్రహాల్లో రాహుగ్రహానికి పరిహార క్రియలు

నవగ్రహాల్లో రాహుగ్రహానికి దుర్గాపూజ, సరస్వతీ పూజ, కుమారీ పూజ, దుర్గాస్తోత్ర పారాయణ, దేవి భాగవత పురాణ పారాయణ చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మేధస్సు, శిరోపరిభాగం, గడ్డం అనే శరీర భాగాలకు రాహువు ప్రాతినిధ్యం వహిస్తాడు.
1460091_406259216143111_126438057_n
రాహువు పరిహార క్రియల విషయానికొస్తే.. శక్తిగలవారు దున్నపోతును దానం చేయవచ్చును. స్కందపురాణ, సుబ్రహ్మణ్య చరిత్రను మండల దీక్షతో పారాయణ చెయ్యాలి. నవగ్రహాల్లో రాహు గ్రహం వద్ద 18 వత్తుల దీపారాధన-గోధుమ రంగు వస్త్రదానం చేయడం మంచిది.
దుర్గాదేవి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో మంగళవారం లేదా శనివారం నాడు పేదలకు అన్నదానం లేదా ప్రసాదాన్ని పంచిపెట్టడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు, రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కావున దుర్గాక్షేత్ర సందర్శన, సర్వక్షేత్రాలు (మోపిదేవి, తిరుత్తణి మొదలగునవి) సందర్శించడం మంచిది.
శ్రీకాళహస్తి, పెద కాకాని దేవాలయాల్లో 9సార్లు రాహుదోష నివారణ పూజ చేయించాలి. ఆదివారం రోజున మినపగారెలు లేదా మినుములతో చేసిన పదార్థాలను సాధువులకు పంచడం మంచిది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో నాగ ప్రతిష్టలు చేయించడం మంచిది. రాహువునకు 18వేల జపం చేయించి, ఐదు కిలోల 250 గ్రాముల మినుములు దానం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికవృద్ధి, వ్యాపారాభివృద్ధి. విద్యాభివృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇంకా గ్రహణం రోజున కాని, అమావాస్య ఆదివారం రోజున కాని, శక్తిని బట్టి బంగారం లేదా వెండి సర్ప ప్రతిమను పడగ ఉండే విధంగా చేయించి దానం చెయ్యాలి. 18 శనివారాలు ఉపవాసం ఉంటూ, చివరి శనివారం రాహువుకు అష్టోత్తర పూజ, దుర్గాదేవికి కుంకుమ పూజ జరిపించాలి. దర్భలతో, ఆవునెయ్యి, తేనె హోమం చేయించడం శుభఫలితాలనిస్తుంది. మినపగారెలు, మినుములతో చేసిన పదార్థాలతో సద్భ్రాహ్మణోత్తమునికి ఆదివారం రోజు సంతృప్తికరంగా భోజనం పెట్టాలి.నిమ్మ డొప్పలతో రాహుకాల దీపాలు పెడితే రాహు దోషం పోతుంది.
ఇకపోతే.. సంఖ్యాశాస్త్ర ప్రకారం 04 సంఖ్య వారు రాహు సంఖ్య అవుతారు. 04 అంటే ఏ నెల, ఏ వారం, ఏ సంవత్సరంలో అయినా 4,13,22 సంఖ్యల వారు పై నివారణోపాయాలను పాటిస్తే సత్ఫలితములు పొందుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

చంద్ర గ్రహ దోష నివారణలు............

కర్కాటక రాశి నాథుడైన చంద్ర భగవానుడి శాంతికి సోమవార వ్రతము చేయటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. చంద్ర గ్రహానుకూలత కోసం నవరత్నాలలోని ముత్యాన్ని ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇంకా పౌర్ణిమనాడు చంద్రోదయ సమయమున రాగి పాత్రయందు తేనెకలిపిన పాయసమును వండి చంద్రునికి సమర్పించినట్లైతే వ్యాపారంలో అభివృద్ధి, కీర్తి, ప్రతిష్టలు వంటి శుభఫలితాలు చేకూరుతాయి.
పౌర్ణమి రోజున శివోపాసనం, శివస్తుతి చేసినట్లైతే సర్వసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇంకా సోమవారం వ్రతం చేసి వెండి, శంఖము, తెల్లని చందనము, శెనగలు, శ్వేతపుష్పములు పెరుగు, పాలు,ముత్యాలు వంటివి బ్రాహ్మణులకు దానమిస్తే సకల సంపదలు, వంశాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇక నవగ్రహాల్లో రెండో స్థానానికి అధిపతి అయిన చంద్రుడి ఆకారవర్ణన ఎలా ఉంటుందంటే..? చంద్రుడు గౌరవర్ణం కలవాడు. చంద్రగ్రహ మహాదశకాలము పది సంవత్సరాలు. చంద్రుని వస్త్రము, అశ్వము, రథము శ్వేత వర్ణములే. స్వర్ణమకుటము, ముత్యాలహారము ధరిస్తాడు. హస్తగధాయుధుడు. మరో హస్తమున వరముద్రను కలిగి ఉంటాడు. ఇతనిని అన్నమయుడు, మనోమయుడు, పురుషస్వరూపుడని అంటారు.
శ్రీ కృష్ణభగవానుడు జన్మించకముందే చంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇతనిని షోడశ కళాపరిపూర్ణుడందురు. చంద్రుడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించియుంటాడు. అత్రి మహర్హి, అనసూయలపుత్రుడైన చంద్రభగవానుడిని సర్వమయుడని కూడా పిలుస్తారు. బీజ, ఓషధి జలపూరుడైన చంద్రుడు అశ్విని, భరణిలతో కూడిన 27మంది నక్షత్రాలను వివాహమాడాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
చంద్రుడిని సతీమణులైన ఈ 27 మంది నక్షత్రాలుగా తిరుగుతూ పతివ్రతా ధర్మములను పాలిస్తూ… వర్షములను, మాసములను విభజించుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇక చంద్ర భగవానుడి వాహనమైన శ్వేత రథములో మూడు చక్రములు, దివ్యమైన పది అశ్వాలుంటాయి. అశ్వాల నేత్రములు కూడా శ్వేత వర్ణమును కలిగియుంటాయని పురోహితులు అంటున్నారు.
ఇకపోతే.. చంద్రునికి బుధుడు అనేపుత్రుడు కలడు. ఇతడు తారకకు జన్మించిన వాడు. చంద్రునికి అధిదేవత, ప్రత్యధిదేవత గౌరీదేవి. అందుచేత గౌరీదేవిని పూజించడం ద్వారా చంద్రగ్రహ ఆధిపత్యంతో కలిగే కొన్ని సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

బుధగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజించండి

బుధవారం.. ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిదని పురోహితులు అంటున్నారు. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇంకా బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.
అదే రోజున పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చింత, సీమచింత పండ్లు స్వీకరించడం కూడా శ్రేయస్కరం.
ఇదేవిధంగా.. బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా… స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది.

మహా విష్ణు పూజ

బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, మతిపరుపు, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బుధవారం రోజున పేదలకు పెసర హల్వా పంచిపెడితే మంచిది.కుడిచేతి వేలికి పచ్చ జాతిరత్నంతో బంగారపు ఉంగరం చేయించి పెట్టుకోండి.నవగ్రహములలో బుధగ్రహమువద్ద బుధవారం 17 ఆకువచ్చ దారముల ఒత్తులతో దీపారాధన చేసి, ఆకుపచ్చ వస్త్రాన్ని దానము చేయండి
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నన్ను నన్నుగా గుర్తించలేని సమాజం కోసం {మంచోడు అనే చేద్దపెరు నాకు వద్దు}

ఎప్పటికైనా నా దెగ్గరకె వచ్చే సంతోషాన్ని వెతుకుతూ నేను పోను''
ఎప్పుడు నేను  అనుభవిస్తున్న భాదని వదిలి నేను  ఉండలేను"
నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చెయ్యను
చేసిన  వాగ్దానాలని మరవను
నన్ను నన్నుగా   గుర్తించలేని సమాజం కోసం {మంచోడు అనే చేద్దపెరు నాకు వద్దు}

I Hate This Kind Of People

మనిషి బ్రతికి ఉన్నంత వరకు ఏడిపిస్తారు 
చనిపోయాక ఫోటో పట్టుకుని ఏడుస్తారు 
నేను ఇతరుల నుండి కోరుకునేది లేదు కోల్పోయేది లేదు 
 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...