Saturday, March 10, 2018

కలశ స్ధాపన ప్రాముఖ్యత


కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజించడం, విజయం కోసం ఆశీస్సులు కోరడం హిందువుల సాంప్రదాయం. మానవ జీవితాన్ని నీటితో నిండిన కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక. అందువలన ప్రార్థనలలో, పుణ్యకార్యాలలో, పట్టాభిషేకాలలో, నూతన గృహ ప్రవేశాలలో, తీర్థయాత్ర ప్రారంభ సమయాలలో ఇలాంటి అనేక సందర్భాలలో కలశ ఆరాధన లేదా కలశ పూజ చేయడం ఆనవాయితీగా మారింది.

మంత్ర జలంతో నింపబడిన కలశాన్ని పూజా మందిరంలో స్థాపించాలి. అందుకోసం కలశానికి చుట్టూ పసుపు రాసి, మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. కలశ జలంలో గంధం, అక్షతలు, పుష్పాలు ఉంచాలి.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

అర్ధం: కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠ భాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉన్నారు. కలశంలోని జలాల్లో సాగరాలన్నీ, సప్తద్వీపాలతో కూడిన భూమి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, వేదాంగాలతో సహా సమస్త దేవతా గణాలు ఆశ్రయించి ఉన్నారు.సమస్త పాపాలను తొలగించడానికి వారంతా వచ్చెదరు గాక.

హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో, ఇంకా ఇంతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారుచేసి, పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న జడ శరీరానికి ప్రతీకగా పేర్కొంటారు. అందువల్లే ఇది హిందూ శాస్త్రాలలో పూర్వం నుంచి తమ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇత్తడి లేదా రాగి లేదా మట్టితో తయారుచేయబడిన ఒక పాత్రను నీటితో నింపుతారు. ఆ పాత్రకు మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బిరికాయను వుంచుతారు. తెలుపు లేదా ఎరుపు రంగు గల దారాన్ని ఆ పాత్ర మెడచుట్టూ పూర్తిగా లేదా సమచతురస్రాకారపు ఆకారంలో చుట్టబడి వుంటుంది. ఇలా ఈ విధంగా తయారుచేబడిన పాత్రను ‘‘కలశం’’ అంటారు. అటువంటి పాత్రను నీటితో లేదా బియ్యంతో నింపినప్పుడు.. దానిని ‘‘పూర్ణకుంభం’’గా పేర్కొంటారు.

పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు... పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి (స్పష్టంగా, నిటారుగా) వున్నాడు. ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఆ విధంగా ఉద్భవించిన బ్రహ్మ.. ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు.

అదేవిధంగా కలశంలో వున్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. విశ్వంలో వున్న అన్యప్రాణాలకు, జడ పదార్థాలకు ఇది అంతర్గత సృష్టికర్త. అలాగే ఆకులు, కొబ్బరికాయలు సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. కలశానికి చుట్టబడిన దారం సృష్టిలో బంధించిబడిన ‘‘ప్రేమ’’ను సూచించబడుతుంది. అందుకే కలశాన్ని శుభసూచికగా పూజించబడుతుంది.

పూర్వం రాక్షసులు, దేవతలు పాలసముద్రాన్ని వధించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘‘కలశం’’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...