మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీరతూనమూ" అంటరు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు. ధర్మం ఎవరు నిర్వర్తి౦చాలీ? ఒక్క మనుష్యునికే ధర్మం. ఆ ధర్మం నిరంతరమూ మారిపోతూ ఉంటంది. మిగిల్న వాటికనినిటికీ ఒకటే ధర్మం. తిర్యక్కులకు అంటే ప్రత్యేకించి పశువులకూ, పక్షులకూ అన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం అంటరు.
|| పశుధర్మ నమో ప్రీతం అంటారు" దేవీభాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ధర్మం ఒక్కటే. ఆకలేస్తే తనేయడం, దాహమేస్తే తాగడం, కామం కలిగితే సంభోగించడం, నిద్రవస్తే పడుకోవడం, కోపమొస్తే కుమ్మడం. అంతే వాటి ధర్మం. అంతే తప్పా వాటికి ఇతరవిధాలైన ధర్మం లేదు. ఇతరవిధాలైన ధర్మం అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. ఏ ధర్మాన్ని అనుష్ఠానించిన కారణంచేత ఇంక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరంలేని స్దితిని పందుతాడో, అటవంటి ధర్మాచరణం చెయ్యవలసిన స్దితి కానీ, అధికారం కానీ, ఇతరప్రాణులకు కలిగించబడలేదు. ధర్మానుష్ఠానమంతా ఎవరి కొరకు అంటే కేవలం మనుష్యుని కొరకు.
మళ్ళీ ఈ భూలోకానికంతటికీ కూడా ధర్మాచరణం కానీ, కర్మాచరణం కానీ, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహంచడం కానీ, అధికారం ఎక్కడ్ననిదీ అంటే ఒక్క భరతవర్షే, భరతఖండే, జంబూదీ్వపే. వేదం స్పష్టంగా ఆ మాటలు చెప్పింది. ఇక్కడ మాత్రమే కర్మానుష్ఠానం, యజ్ఞయ్గాది క్రతువులు జరుగుతాయి తప్పా ఇతరమైన ప్రదేశాల యందు భూమండలంలో ఈ క్రతువులు చేయయాడానికి యోగయామైన ప్రదేశాలు లేవు.
No comments:
Post a Comment