Monday, February 12, 2018

పాదరస మేరు శ్రీయంత్రం

   ‘పాదరస మేరు శ్రీయంత్రం’ పురాతనమైన, అద్బుతమైన, అమూల్య మైన యంత్రాలలో ముఖ్యమైనది, శక్తివంతమైనది. ప్రపంచంలో దేన్నయినా సాదించగలమనే విశ్వాసాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం లేదా వరలక్ష్మీ వ్రతం రోజు లేదా దీపావళి రోజు శ్రీయంత్రానికి పూజ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట నిలచి ఉంటుంది అని చాలా మంది విశ్వసిస్తారు. ధనం చేతిలో నిలబడని వారు, ధనాభివృద్ధికి  పాదరస శ్రీయంత్రం కుంకుమార్చన చేస్తే మంచిది.

      కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీయంత్ర మేరువును పూజించి భవిష్యత్ కార్యక్రమాలపైన మంచి అవగాహన కలగి ఉండేవారు. అమూల్యమైన పాదరస శ్రీయంత్రాన్ని వ్యాపారసంస్ధల యందు,దేవాలయాలలో, పూజా మందిరాలలో, లాకర్స్ నందు ప్రతిష్టించవచ్చు. తమిళ సిద్ధయోగులు పాదరసాన్ని శివుని యొక్క ప్రతి రూపంగా భావిస్తూ, శివ స్వరూపమైన పాదరసాన్ని, అమ్మవారి స్వరూపమైన గంధకంతో ఘనీభవించిగా వచ్చిన అమ్మవారి శక్తి స్వరూపమైన పాదరసమేరు శ్రీయంత్రాన్ని పూజిస్తారు.

   అక్షయ తృతీయ రోజుగాని, దీపావళి రోజుగాని, లాభపంచమి రోజుగాని పాదరస శ్రీయంత్ర సాధన చెయ్యాలి. ప్రాతఃకాలంలో స్నానమాచరించి పాదరస శ్రీయంత్రాన్ని పూజామందిరం దగ్గర పసుపు వస్త్రం పరచి దానిపైన రాగి, ఇత్తడి ప్లేటును ఉంచి దానిలో పసుపు, కుంకుమ కలిపిన అక్షింతలను ఉంచి పాదరస శ్రీయంత్రాన్ని స్ధాపించాలి. 

     ధూపదీప నైవేద్యాలు సమర్పించి శ్రీసూక్తం పఠిస్తూ పూజ అనంతరం అక్షితలు శిరస్సున ధరించి తామరమాలతో గాని, వైజయంతి మాలను గాని ఉపయోగించి “ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం ఓం హ్రీం శ్రీం క ఈ ల ఏ హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః అను మహాత్రిపుర సుందరీదేవి మూల మంత్రమును యధావిధిగా జపించి  లలితాసహస్త్రనామంతో కుంకుమార్చన చేసిన సౌభాగ్యం, ధనధాన్యాభి వృద్ధి కలుగుతాయి. ఆఇల్లు సిరిసంపదలకు నిలయంగా మారుతుంది.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...