Sunday, August 12, 2018

వరలక్ష్మీ అవతారాలు

వరలక్ష్మీ ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి. తన కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిలాల్లని వనితలు కోరుకోవడం అత్యాశేమీ కాదు. ఇంటి ఇల్లాలు వరలక్ష్మీమాతను నిష్టతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలూ తీరుతాయి. వరలక్ష్మి అవతారాలు అనేకం.

ఆమెను ‘అష్టలక్ష్మీ స్వరూపం’గా ఆరాధిస్తే అన్ని వరాలూ దక్కుతాయి. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీకృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మీ మాతకు అర్చన చేస్తే సరిపోతుంది. అందుకే లక్ష్మీతత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి, జీవితాన్ని సుఖమయం చేసుకోవడం, జన్మకు సార్థకత సాధించడం వీలవుతుంది.

పురాణ ప్రాశస్త్యం..

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జగన్మాత అయిన పార్వతీదేవి ఓ సందర్భంలో తన భర్త సాంబశివుడిని ప్రశ్నిస్తూ, ‘స్త్రీలు సర్వ సుఖాలు పొంది, పుత్రపౌత్రాభివృద్ధి సాధించాలంటే ఎలాంటి వ్రతం ఆచరించాలో చెప్పాల’ని కోరుతుంది. అందుకు పరమేశ్వరుడు- ‘వనితలకు సకల శుభాలు దక్కాలంటే ‘వరలక్ష్మీ వ్రతం’ పేరిట శ్రావణ శుక్రవారం రోజున నోము నోచాలం’టూ సమాధానమిచ్చాడు.

ఈ వ్రతానికి సంబంధించి ఓ కథ బహుళ ప్రచారంలో ఉంది. పూర్వం మగధ రాజ్యంలోని కుండినము అనే గ్రామంలో చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉండేది. భర్త, కుటుంబం మేలు కోసం ఆమె నిత్యం ఎంతో తపన చెందేది. రోజూ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించి, అత్తమామలను సేవిస్తూ, మితంగా మాట్లాడుతూ భగవంతుడి స్మరణతో ఆమె కాలం గడిపేది.

ఓ రోజు చారుమతి కలలో- లక్ష్మీమాత ప్ర త్యక్షమై, అనుకున్న ఆశలన్నీ ఫలించాలంటే వరలక్ష్మీదేవిని ఆరాధించమని చెబుతుంది. లక్ష్మీదేవి చెప్పినట్లే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు- శుక్రవారం రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మిని పూజించిన చారుమతి మంచి ఫలితాలను పొందుతుంది.

చారుమతి తన కలలో లక్ష్మీదేవి కనిపించగా చెప్పిన విషయాలను మిగతా మహిళలందరికీ వివరించి వారిచేత కూడా వ్రతాన్ని ఆచరింపజేస్తుంది. ఈ వ్రతం చేసిన వారందరూ చారుమతిని వేనోళ్ల కొనియాడతారు. మహాశివుడు పార్వతికి ఉపదేశించిన ఈ కథను ఆ తర్వాత సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పడంతో విశేష ప్రాచుర్యం పొందింది.

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఇలాంటిదే మరో కథ పురాణాల్లో మనకు కనిపిస్తుంది. స్వర్గలోకంలో పార్వతీ పరమేశ్వరులు ఓ రోజు కాలక్షేపం కోసం సరదాగా చదరంగం ఆడుతుంటారు. ప్రతి ఆటలోనూ పార్వతి విజయం సాధిస్తుంటుంది. తాను గెలిచి తీరుతానంటూ సాంబశివుడు ఆమెలో ఆతృత రేకెత్తిసుంటాడు.

ఈ దశలో ‘చిత్రనేమి’ అనే వ్యక్తిని ఆటలో పెద్దమనిషిగా ఉండమని పార్వతి కోరుతుంది. చిత్రనేమి నిజానికి శివుడి సృష్టే. అందుకే అతడు చదరంగం ఆటలో శివుడి పక్షాన నిలబడతాడు. అతడి వైఖరి పార్వతికి ఎంత మాత్రం నచ్చదు.

పక్షపాతం లేకుండా బాధ్యతలను నిర్వహించడంలో విఫలుడై తనకు మానసిక క్షోభ పెట్టాడన్న ఆగ్రహంతో చిత్రనేమిని పార్వతి శపిస్తుంది. ఫలితంగా అతడు భయంకరమైన వ్యాధికి లోనవుతాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని అతడు పార్వతిని పరిపరి విధాలా వేడుకుంటాడు.

చివరకు ఆమె కరుణించి, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతుంది. ఆ విధంగానే అతడు వరలక్ష్మిని ఆరాధించి శాపవిముక్తడవుతాడు.

ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదమతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరి పాలయమామ్ (1)

ధాన్యలక్ష్మి
ఆయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయమామ్ (2)

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరి పాలయమామ్ (3)

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వ ఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయమామ్ (4)

సంతానలక్ష్మి
అయిగజ వాహిని మోహిని చక్రణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి, సప్తస్వర భూషిత గాన నుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుగే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయమామ్ (5)

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞాన వికాసని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకర దేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయమామ్ (6)

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారత భార్గవి, శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హాస్యయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ పరిపాలయమామ్ (7)

ధనలక్ష్మి
ధిమి ధిమి ధింధిమి ధింధిమి, దుంధుభి నాద పూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ,
శంఖ నినాద సువాద్యమతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయమామ్ (8)

ఫలశృతి

శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని

శ్లో|| శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ||

Saturday, August 4, 2018

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం|
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం||

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరి, హృదయ
దేవి, శిరోదేవి,శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని,
నిత్యక్లిన్నే, భేరుండే ,వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరితే,
కులసుందరి,నిత్యే, నీలపతాకే, విజయే,సర్వమంగళే, జ్వాలామాలిని,
చిత్రే, మహానిత్యే!పరమేశ్వర పరమేశ్వరి,మిత్రేశమయి, షష్ఠీశమయి,
ఉడ్డీశమయి, చర్యానాధమయి,లోపాముద్రామయి, అగస్త్యమయి!
కాలతాపనమయి,ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీప కళానాధమయి!
విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి,
మనోజదేవమయి, కల్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి,
శ్రీరామానందమయి!అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,గరిమాసిద్ధే,
మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, ప్రాప్తిసిద్ధే,
భుక్తిసిద్ధే, ఇచ్చాసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి,
కౌమారి, వ్తెష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి,
సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి,
సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే,
సర్వయోగినే,సర్వత్రిఖండే, త్ర్తెలోక్యమోహనచక్రస్వామిని,
ప్రకటయోగిని!కామాకర్షిణి,ఋద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి,
శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి,గంధాకర్షిణి,
చిత్తాకర్షిణి, ద్తెర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి,
బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి,
సర్వాశాపరిపూరకచక్రస్వామిని, గుప్తయోగిని!అనంగకుసుమే,
అనంగమేఖలే, అనంగమదనే,అనంగమదనాతురే, అనంగరేఖే,
అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణచక్రస్వామిని,
గుప్తతరయోగిని!సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి,
సర్వాహ్లాదిని,సర్వసమ్మోహిని,సర్వస్తంభిని, సర్వజృంభిణి,
సర్వవశంకరి, సర్వరంజని,సర్వోన్మాదిని, సర్వార్ధసాదికే,
సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి,
సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని, సంప్రదాయయోగిని!
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ర్పదే, సర్వప్రియంకరి,
సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని,
సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి,
సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధసాధకచక్రస్వామిని,కుళోత్తీర్ణ
యోగిని! సర్వజ్ఞే ,సర్వశక్తే ,సర్త్వెశ్వర్య ప్రదాయిని,
సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే,
సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి,
సర్వేప్సిత ఫలప్రదే,సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని!
వశిని, కామేశ్వరి, మోదిని, విమలే,అరుణే, జయిని, సర్వేశ్వరి,
కౌళిని,సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని! బాణిని,
చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి,
మహా భగమాలిని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని, అతిరహస్యయోగిని!
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామిని,
పరాపరరహస్యయోగిని! త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి,
త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే,
త్రిపురాంబ, మహాత్రిపురసుందరి! మహామహేశ్వరి,
మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే,
మహామహానందే,మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా
శ్రీచక్రనగరసామ్రజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః

|| ఇతి శ్రీవామకేశ్వరతంత్రే,ఊమామహేశ్వరసంవాదే,
శ్రీదేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తం||

జాతకచక్రంలో బాధక స్ధానాల సమగ్ర పరిశీలన

భాదకులు:-చర లగ్నాలకు లాభాదిపతి భాదకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి భాదకుడు అవుతాడు.
ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి భాదకుడు అవుతాడు.

చరరాశుల రాశ్యాధిపతులు, ద్విస్వభావ రాశుల రాశ్యాదిపతులు, వాటి బాధక స్ధానాధిపతులు పరస్పర శత్రువులు కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారికి బాధక రాశ్యాధిపతుల దశలు, అంతర్ధశలు యోగించకపోవటం గమనించవచ్చును. ఎటువంటి శుభగ్రహ ప్రభావం లేని బాధక గ్రహాలు తీవ్ర వ్యతిరేక ఫలాలను కల్పించటంతో పాటు మారక నిర్ణయంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

చరలగ్నాలు అయిన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు వరుసగా మేషరాశికి లాభాధిపతి శని, కర్కాటక రాశికి లాభాధిపతి శుక్రుడు, తులారాశికి లాభాధిపతి సూర్యుడు, మకర రాశికి లాభాధిపతి కుజుడు భాదకులు అవుతారు.

స్ధిర లగ్నాలు అయిన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు వరుసగా వృషభరాశికి భాగ్యాధిపతి శని, సింహరాశికి భాగ్యాధిపతి కుజుడు వృశ్చిక రాశికి భాగ్యాధిపతి చంద్రుడు, కుంభరాశికి భాగ్యాధిపతి శుక్రుడు భాదకులు అవుతారు.

ద్విస్వభావ లగ్నాలు అయిన మిధునం, కన్య, ధనస్సు, మీన రాశులకు వరుసగా మిధున రాశికి సప్తమాధిపతి గురువు, కన్యారాశికి సప్తమాధిపతి గురువు, ధనస్సు రాశికి సప్తమాధిపతి బుధుడు, మీనరాశికి సప్తమాధిపతి బుధుడు భాదకులు అవుతారు.

స్దిర లగ్నాల వారికి భాదకులు పరస్పర మిత్రత్వం కూడా ఉంది కాబట్టి భాద పెట్టి మాత్రమే ఫలితాన్ని ఇస్తారు. ప్రతి లగ్నాలకు లగ్నాదిపతి, పంచమాదిపతి, భాగ్యాదిపతి యోగకారకులు అవుతారు. స్దిర లగ్నాలకు బాగ్యాధిపతి భాదకుడు, యోగకారకుడు కావటం వలన భాద పెట్టి మాత్రమే యోగాన్నిస్తాయి.

భాదక గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో భాదకుడు ఏ భావానికి ఆదిపత్యం వహిస్తున్నాడో, ఏ భావాన్ని చూస్తున్నాడో ఆ భావ కారకత్వాలకు ఇబ్బందులు, బాధ కలుగుతాయి.

బాధక స్ధానాధిపతుల దశాంతర్ధశలు జరుగుతున్నప్పుడు దోషపూరితమైన గోచారం జరుగుతుంటే తీవ్ర వ్యతిరేక ఫలాలు అనుభవించక తప్పదు. అష్టకవర్గు బలం, ఇతరత్రా శుభగ్రహ సంబంధం కలిగినప్పుడు మాత్రం బాధక స్ధానాధిపతులు కొంత తక్కువ స్ధాయిలో దోష ఫలాలను ఇవ్వటం జరుగుతుంది. బాధక గ్రహాలు వివిధ లగ్నాలకు యోగకారక గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలలో ఉన్నప్పుడు కొంత యోగాన్ని ఇస్తున్నప్పటికి దుస్ధానాధిపత్యం పొందిన గ్రహాల నక్షత్రాలలో ఉన్నప్పుడు మాత్రం తీవ్ర వ్యతిరేక ఫలాలను ఇస్తాయి.

బాధకస్ధానాధిపతులు బలమైన యోగాలలో ఉన్నప్పుడు (రాజ యోగం, పంచమహా పురుష యోగం తదితరాలు) ఆ యోగ ఫలాలను బలహీన పరచటం, దుర్యోగాలలో భాగస్వాములుగా ఉన్నప్పుడు దుష్పలితాలను మరింత అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఫలిత నిర్ణయంలో బాధక స్ధానాలలోని గ్రహాలు కీలకమైనవిగా ఉన్నందున వీటి సమగ్ర పరిశీలన తరువాత మాత్రమే సరైన ఫలాలను నిర్ణయించవలసి ఉంటుంది.

Friday, August 3, 2018

వ్యాధిహర వైష్ణవ కవచం

విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః |
హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః ||

మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః |
పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణ స్తథా ||

ప్రద్యుమ్నః పాతు మే ఘ్రాణం అనిరుద్దో ముఖం మమ |
వనమాలీ గలం పాతు శ్రీవక్షో రక్షతాత్పురః |

పార్శ్వ తు పాతుమే చక్రం వామం దైత్య విదారణమ్‌ ||

దక్షిణం తు గదా దేవీ సర్వాసురనివారిణీ |
ఉదరం ముసలీ పాతు ! వృష్ఠం పాతు చ లాంగలీ ||

ఊరూ రక్షతు శార్గీ మే జరేఘ రక్షతు చర్మకీ |
పాణీ రక్షతు శంఖీ చ పాదౌ మే చరణా పుభౌ ||

వరాహో రక్షతు జలే విషమేషు చ వామనః |
అటవ్యాం నరసింహస్తు సర్వతః పాతు కేశవః ||

హిరణ్య గర్భో భగవాన్‌ హిరణ్యం మే ప్రయచ్ఛతు ! |
సాంఖ్యాచార్యస్తు కపిలో ధాతు సామ్యం కరోతు మే ||

శ్వేతద్వీప నివాసీ చ శ్వేతద్వీపం నయ త్వజః |
సర్వాన్‌ శత్రూన్‌ సూదయతు మధుకైటభ సూదనః ||

వికర్షతు సదా విష్ణుః కిల్బిషం మమ విగ్రహాత్‌ |
హంసో మత్స్యః తథా కూర్మః పాతు మాం సర్వతో దిశమ్‌ ||

త్రివిక్రమస్తు మే దేవః సర్వాన్‌ పాశా న్నికృంతతు ! |
నరనారాయణో దేవో వృద్ధిం పాలయ తాం మమ ||

శేషో೭శేసామలజ్ఞానః కరో త్వజ్ఞాన నాశనమ్‌ |
బడబాముఖో నాశయతు కల్మాషం య స్మయా కృతమ్‌ ||

విద్యాం దదాతు పరమా మశ్వమూర్ధా మమ ప్రభుః |
దత్తాత్రేయః పాలయతు సపుత్ర పశు బాంధవమ్‌ ||

సర్వాన్రోగా న్నాశయతు రామః పరశునా మమ |
రక్షోఘ్నె మే దాశరథిః పాతు నిత్యం మహాభుజః ||

రిపూన్‌ హలేన మే హన్యా ద్రామో యాదవ నందనః |
ప్రలంబ కేశి చాణూర పూతనా కంస నాశనః ||

కృష్ణో యో బాలభావేన స మే కామాన్‌ ప్రయచ్ఛతు |
అంధకారం తమో ఘోరం పురుషం కృష్ణ పింగళమ్‌ ||

పశ్యామి భయ సంతప్తః పాశహస్త మివాంతకమ్‌ |
తతో೭హం పుండరీకాక్ష మచ్యుతం శరణం గతః ||

యోగీశ మతిరూపస్థం శుభ శీతాంశు నిర్మలమ్‌ |
ధన్యో೭హం విజయీ నిత్యం యస్య మే భగవాన్‌ హరి! ||

స్మృత్వా నారాయణం దేవం సర్వోపద్రవ నాశనమ్‌ |
వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి మహీ తలే ||

అప్రధృష్యో೭స్మి భూతానాం సర్వ విష్ణు మయోహ్యహమ్‌ |
స్మరణా ద్దేవదేవస్య విష్ణో రమిత తేజసః ||

వివాహ యోగం కోసం "రుక్మిణీ కల్యాణం"

రుక్మిణీ కల్యాణం గ్రంధాన్ని ఈ క్రింద ఉన్న డౌన్‌లోడ్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు.

భారతీయ వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత వుంది ... మరెంతో ప్రత్యేకత వుంది. సంప్రదాయ బద్ధంగా కొనసాగే పెళ్లి పనులు, ప్రాచీనకాలం నుంచి వస్తోన్న ఆచార వ్యవహారాలకు అద్దం పడుతుంటాయి. ఆధునీక నాగరికత కొన్ని పద్ధతులను పక్కకి నెట్టేస్తున్నా, వివాహ వ్యవస్థ మాత్రం నేటికీ తన విశిష్టతను నిలబెట్టుకుంటూనే వుంది. వివాహమనేది స్త్రీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఆ విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు రాకపోవడం, వచ్చిన సంబంధాలు నచ్చక పోవడం యువతులను మానసిక వత్తిడికి గురిచేస్తుంటాయి. ఇంకొందరు తమకి సంబంధం నచ్చకపోయినా, పెద్దల మాట కాదనలేక తల వంచవలసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో యువతులు తమ దురదృష్టాన్ని నిందించుకుని కుమిలిపోతుంటారు. ఇలాంటి వారిని చూసిన మిగతా వాళ్లు కూడా తమ భవిష్యత్తును తలచుకుని ఆందోళన చెందుతుంటారు. తమ ఆశలకి ... ఆలోచనలకి తగిన వరుడు దొరుకుతాడో లేదోనని సతమతమైపోతుంటారు.

ఈ తరహా యువతులకి పరిష్కార మార్గంగా 'రుక్మిణీ కల్యాణం' పేర్కొనబడుతోంది. సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన 'శ్రీ భాగవతం'లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీ కృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ... ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంధాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన, యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది.

రుక్మిణీ కల్యాణం చదవడం వలన ... యువతులకు ఇష్టంలేని సంబంధాలు తప్పిపోయి, కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసభగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని ఈ విధంగా అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.

1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.
2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితముగా చదవాలి.
3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి.
4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి.
మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానముగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా లభిస్తుంది.

Monday, July 30, 2018

ఆహార నియమాలు

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమి నాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకును గాని, పాత్రను గాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.

ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి. ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )

ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు. అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి, ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .

ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు?

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...