Friday, July 20, 2018

తొలి ఏకాదశి

హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం.
ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని ‘హరివాసరము’ అని కూడా అంటారు.

పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్ర్తి చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.

మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో దాక్కున్నాడు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.

తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి.

ఈ ఆషాడమాసంలోని ఏకాదశే తొలి ఏకాదశి ఎలా అయిందిఅంటే
పూర్వకాలంలో వర్షఋతువే ప్రథమ ఋతువుగా ఆషాఢమాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేదట. అలా ఆషాఢంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశినేశయనైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. దానివల్ల ఈ ఏకాదశి శయనైకాదశి గా పేర్గాంచింది.

ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఆవుల కొట్టాన్ని శుభ్రం చేసి కొట్టం మధ్యలో ముప్ఫైమూడు పద్మాలను వేసి మధ్యలో లక్ష్మీనారాయణులను ఉంచి పూజించాలి. గంధపుష్పాలతో అర్చించాలి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి.

Thursday, July 5, 2018

వటసావిత్రీ వ్రతం


సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతం - ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠబహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు. పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు కథనం.

ఈ వ్రతాచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్య వంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్ప టికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశా రు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడ వికి బయలుదేరగా, సావిత్రీ భర్తను అనుసరించింది. సమిధుల ను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడి లో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది.

కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగిం ది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావి త్రిని వరం కోరుకోమన్నాడు.

‘మామగారికి దృష్టి ప్రసాదించండి’ అని ఓ వరాన్ని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసా దించమని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా - ‘నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’ అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథ నం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి ‘వట సావిత్రి వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం.

వ్రత విధానం

ఈ వ్రతం నాడు స్ర్తిలు వేకువ జామునే నిద్ర లేస్తారు. భక్తిశ్రద్ధలతో తలారా స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరించి, చుట్టుపక్కల వారితో కలసి ఏటి ఒడ్డుకు వెళతారు. అక్కడ కడవలతో నీటిని సేకరించుకుని, సమీపంలో ఉన్న మర్రి చెట్లు దగ్గరికి వెళతారు. ముందు ఆ నీటితో మర్రిచెట్ల మూలాగ్రాన్ని శుభ్రం చేస్తారు. అనంతరం పసుపు, కుంకుమలు అద్ది, చెట్టుకుముందు అందమైన ముగ్గులు వేస్తారు. కొబ్బరికాయలు, అరటి పళ్ళు, ఇతర పిండివంటలు నైవేద్యం పెట్టి అనంతరం నూలు దారంపోగుల్ని చెట్టుమొదలు చుట్టూ కడతారు. అనంతరం చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి, తమ భర్తలు పది కాలాలపాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. తమ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తున్న వట (మర్రి) వృక్షాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అత్యంత పవిత్రమైన వృక్షరాజంగా పేర్గాంచిన మర్రిచెట్టును బోధి వృక్షంగా కూడా పిలుస్తారు. బౌద్ధులు ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. గౌతమబుద్ధుడంతటివారు ఈ వృక్షం కిందే జ్ఞానవిముక్తిని పొందాడు. అలాగే బంధవిముక్తుడయ్యింది కూడా ఈ చెట్టు కిందే కావడంవల్ల ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఈ పూజలో భాగంగా వటవృక్షం కొమ్మలు విశాలంగా విస్తరించి, సేద తీరాలని కోరుకునే వారందరికీ నీడనిచ్చి, ఈ వృక్షానికి మల్లే తన భర్త కూడా కుటుంబ సభ్యులందరికీ, నీడనివ్వాలని మనసా వాచా కోరుకుంటారు. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్ళయిన యువతులతో ఈ వ్రతం చేయిస్తారు. ఈ సందర్భంగా మిఠాయిలు, పిండి వంటలు, ప్రసాదాలు తయారుచేస్తారు. వ్రతం సందర్భంగా బంధుమిత్రుల్ని ఆహ్వానించి, ఘనంగా పూజాది వేడుకలు నిర్వహిస్తారు.

వట సావిత్రి వ్రతం ప్రాచీన భారతం అయిన ‘మిథిల’లో ప్రాచుర్యం పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఈ వ్రతం ఆచరించే స్ర్తిలు మర్రిచెట్టుకు పూజలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. తమ కోర్కెలకనుగుణంగా కొంతమంది ఒక రోజు, మరికొంతమంది ఒక పూట చొప్పున ఉపవాస దీక్ష చేసి, వ్రతం జరుపుకుంటారు. తమ భర్తల ఆరోగ్యాన్ని కాపాడి, మరో పది కాలాలపాటు మర్రిచెట్టులా కుటుంబమంతటికీ నీడనివ్వాలని, సాగించే ఈ వ్రతాన్ని జరుపుకోవడం విజ్ఞానపరంగా కూడా ఎంతో మేలైనదని పండితులు చెబుతారు.

వ్రతాన్ని చేసే వారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉం డాలి. వ్రతం రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నా నం చేసి, ఇంటిని శుభ్రపరిచి, దేవుడిని స్మరించుకుని, పూజావస్తువులను తీసుకుని వటవృక్షం (మర్రి) చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు మొదలు వద్ద అలికి ముగుగ్లు వేసి, సావిత్రీ సత్యవంతులను ప్రతిష్టించాలి. వారి చిత్రపటాలు దొరకపోతే పసుపుతో చేసిన బొమ్మలనుగానీ ప్రతిష్టించు కోవాలి.

మనువెైధవ్యాదిసకలదోషపరిహారార్థం బ్రహ్మసావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ వటసావిత్రీ వ్రతం కరిష్యే అనే శ్లోకంతో సంకల్పించాలి.

చెప్ప వలసిన శ్లోకం:

వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||

ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము లభిన్చును.

మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము

మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను

౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే
౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే
౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని
౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే
౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే
౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే
౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని

తర్వాత వినాయకుడు, సావిత్రీసత్యవంతులు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, వటవృక్షాన్ని పూజించాలి. వట వృక్షమూలంతో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉంటారు కనుక త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం ‘నమోవెైవస్వతాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షానికి దారాన్ని చుడుతూ, 108 ప్రదక్షిణలు చేసి నెైవేద్యం సమర్పిం చడంతో పాటూ ముతె్తైదువులకు, బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఇలా మఱ్ఱిచెట్టు చుట్టూ దారాన్ని చుట్టడం వల్ల మఱ్ఱి చెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో, తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన ఐదవతనం వర్థిల్లుతుందనేది ప్రతి స్ర్తీమూర్తి కోరిక.

కొందరు స్ర్తీలు ఈపండుగను పూర్ణిమనాడు మాత్రం అనుసరిస్తుంటారు. మూడు రోజుల పాటు ఈ పర్వాన్ని అనుసరించే స్ర్తీలు, త్రయోదశి ఉదయాన్నుంచి, పెైర్ణమి నాడు సాయంకాలం వరకు ఉపవసిస్తారు. పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు నీళ్ళు, పాలు, తేనీరు, పళ్ళు పుచ్చుకోవచ్చు.

అయితే ఈ వ్రతాన్ని మనదేశంలో ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. కొంతమంది పూర్ణిమ నాటి మధ్యాహ్నం పురోహితునితో సావిత్రి కథను చెప్పించుకుంటారు. పురోహితుని ద్వారా కథను వింటే తప్ప ఆ వ్రతానికి ఫలం దక్కదని కొంతమంది నమ్మకం. ఇలా వటసావిత్రి వ్రతవిధానాన్ని చేయవచ్చు.

Monday, July 2, 2018

సాష్టాంగ నమస్కారము

సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చెయ్యాలి. స్త్రీలకు నిషిద్ధం.సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ ఎనిమిది అంగాలనూ, అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు.

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది. అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు ?

ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి. -

> > ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో^ ష్టాంగ ఈరితః <<

“అష్టాంగాలు” :- అంటే “ఉరసా” అంటే తొడలు, “శిరసా” అంటే తల, “దృష్ట్యా” అనగా కళ్ళు, “మనసా” అనగా హృదయం, “వచసా” అనగా నోరు, “పద్భ్యాం” అనగా పాదములు, “కరాభ్యాం” అనగా చేతులు, “కర్నాభ్యాం” అంటే చెవులు. ఇలా “8 అంగములతో నమస్కారం” చేయాలి.

“మానవుడు” సహజంగా ఈ “8 అంగాలతో” తప్పులు చేస్తుంటారు. అందుకే “దేవాలయంలో” బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ “దేవునికి” నమస్కరించి “ఆయా అంగములు” నెలకు తగిలించాలి.

ఇలా చేయడం వల్ల “మనం” చేసినటువంటి “పాపాలు” తొలగి “పుణ్యం” లభిస్తుంది.

ముఖ్యంగా :- “దేవాలయంలో” సాష్టాంగ నమస్కారం “దేవుడికి, ధ్వజస్తంభానికి” మధ్యలో కాకుండా “ధ్వజస్తంభం” వెనుక చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు
తాకాలి.

3) దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో
ఓం నమో మేరీతనయాయ అనో లేక ఓం నమో మహమ్మదాయ అనో
మాట పలుకుతూ నమస్కరించాలి.

6) పద్భ్యాం నమస్కారం - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

Thursday, June 21, 2018

గురుగ్రహ దోష నివారణకు "సిట్రిన్ స్టోన్ ట్రీ"

సిట్రిన్ స్టోన్ ట్రీని ఇంటిలో గాని ఆపీసు,వ్యాపార సంస్ధలలో గాని తూర్పు ఈశాన్య దిక్కుల యందు టేబుల్ పైన గాని,షోకేష్ నందు గాని ఉంచాలి.పిల్లలు చదువుకునే టేబుల్ పైన ఉంచిన చదువులో ఏకాగ్రత ఉంటుంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్,మూత్ర రోగాలు,పెద్ద పొట్టతో కలిగిన దేహం,పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం,గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, నియంతగా ప్రవర్తించుట,బృహస్పతి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. కేంద్రాధిపత్యం వచ్చిన బృహస్పతి బహుదోషి. ఈయన మారక స్థానంలో ఉంటే వెంటనే మారకం చేస్తారు అని శాస్త్ర వచనం. అలాగే జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు .గోచార ఫలితాంశ నిర్ణయంలో కూడా గురువు ప్రభావం అధికంగా ఉంటుంది. ఏలినాటి శని నడుచుచున్ననూ గురుచారం బాగుంటే కాలం బాగా నడచును.

గురువు మేధావి వర్గానికి ప్రతీక, గురువు ప్రభావం అధికంగా గల వ్యక్తులు మేధావులవుతారు. అతి మేధావుల చరిత్రలు పరిశీలిస్తే వారి ప్రవర్తన బహు చిత్రంగా ఉంటుంది. తమ టెలిఫోను నెంబరు తామే మర్చిపోవడం, తాము అన్నం తిన్నారో లేదో తమకే గుర్తుండకపోవడం, తమ ఇంటి అడ్రస్‌ తమకు తెలియక ఫోన్‌ చేసి కనుక్కోవడం మొదలైన చిత్రవిచిత్రాలు చేస్తారు. మహా మేధావులు అతిస్వల్ప విషయములలో ఏమరపాటు కలిగి ఉండడానికి కారణం వారు ఆలోచించే ధోరణిలో అతిగా ఏకాగ్రత కలిగి తాము ఏ నూతనాంశమును కనుగొంటున్నారో దాన్ని తప్ప మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడమే. నిజానికి అన్ని విషయాలూ పట్టించుకుంటే ఒక విషయంలో ఏకాగ్రత కలిగి ఉండడం అసంభవమే.

ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును.పసుపు కొమ్ము గణపతిని,పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది.పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం సాయిబాబా, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.......

Sunday, June 17, 2018

సంతాన వేణు గోపాల వ్రతం

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

ఓం నమో భగవతే వాసుదేవాయ

సంతానగోపాలస్తోత్రం

1} శ్రీశం కమలపత్రాక్షం దేవకీనన్దనం హరిమ్
సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్

2} నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్
యశోదాఙ్కగతం బాలం గోపాలం నన్దనన్దనమ్

3} అస్మాకం పుత్రలాభాయ గోవిన్దం మునివన్దితమ్
నమామ్యహం వాసుదేవం దేవకీనన్దనం సదా

4} గోపాలం డిమ్భకం వన్దే కమలాపతిమచ్యుతమ్
పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుఙ్గవమ్

5} పుత్రకామేష్టిఫలదం కఞ్జాక్షం కమలాపతిమ్
దేవకీనన్దనం వన్దే సుతసమ్ప్రాప్తయే మమ

6} పద్మాపతే పద్మనేత్రే పద్మనాభ జనార్దన
దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే

7} యశోదాఙ్కగతం బాలం గోవిన్దం మునివన్దితమ్
అస్మాకం పుత్ర లాభాయ నమామి శ్రీశమచ్యుతమ్

8} శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత
గోవిన్ద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన

9} భక్తకామద గోవిన్ద భక్తం రక్ష శుభప్రద
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

10} రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా
భక్తమన్దార పద్మాక్ష త్వామహం శరణం గతః

11} దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

12} వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

13} కఞ్జాక్ష కమలానాథ పరకారుణికోత్తమ
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

14} లక్ష్మీపతే పద్మనాభ ముకున్ద మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

15} కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా
నమామి పుత్రలాభార్థ సుఖదాయ బుధాయ తే

16} రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే
తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే

17} అస్మాకం పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే

18} శ్రీమానినీమానచోర గోపీవస్త్రాపహారక
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే

19} అస్మాకం పుత్రసంప్రాప్తిం కురుష్వ యదునన్దన
రమాపతే వాసుదేవ ముకున్ద మునివన్దిత

20} వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ
పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో

21} డిమ్భకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ
భక్తమన్దార మే దేహి తనయం నన్దనన్దన

22} నన్దనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే
కమలనాథ గోవిన్ద ముకున్ద మునివన్దిత

23} అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే

24} యశోదాస్తన్యపానజ్ఞం పిబన్తం యదునన్దనం
వన్దేహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా

25} నన్దనన్దన దేవేశ నన్దనం దేహి మే ప్రభో
రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే

26} పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ
అస్మాకం దీనవాక్యస్య అవధారయ శ్రీపతే

27} గోపాల డిమ్భ గోవిన్ద వాసుదేవ రమాపతే
అస్మాకం డిమ్భకం దేహి శ్రియం దేహి జగత్పతే

28} మద్వాఞ్ఛితఫలం దేహి దేవకీనన్దనాచ్యుత
మమ పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునన్దన

29} యాచేహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసంపదమ్
భక్తచిన్తామణే రామ కల్పవృక్ష మహాప్రభో

30}ఆత్మజం నన్దనం పుత్రం కుమారం డిమ్భకం సుతమ్
అర్భకం తనయం దేహి సదా మే రఘునన్దన

31} వన్దే సన్తానగోపాలం మాధవం భక్తకామదమ్
అస్మాకం పుత్రసంప్రాప్త్యై సదా గోవిన్దమచ్యుతమ్

32} ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునన్దనమ్
క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్

33} వాసుదేవ ముకున్దేశ గోవిన్ద మాధవాచ్యుత
దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో

34} రాజీవనేత్ర గోవిన్ద కపిలాక్ష హరే ప్రభో
సమస్తకామ్యవరద దేహి మే తనయం సదా

35} అబ్జపద్మనిభం పద్మవృన్దరూప జగత్పతే
దేహి మే వరసత్పుత్రం రమానాయక మాధవ

36} నన్దపాల ధరాపాల గోవిన్ద యదునన్దన
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

37} దాసమన్దార గోవిన్ద ముకున్ద మాధవాచ్యుత
గోపాల పుణ్డరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్

38} యదునాయక పద్మేశ నన్దగోపవధూసుత
దేహి మే తనయం కృష్ణ శ్రీధర ప్రాణనాయక

39} అస్మాకం వాఞ్ఛితం దేహి దేహి పుత్రం రమాపతే
భగవన్ కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే

40} రమాహృదయసంభారసత్యభామామనః ప్రియ
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

41} చన్ద్రసూర్యాక్ష గోవిన్ద పుణ్డరీకాక్ష మాధవ
అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే

42} కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభసమర్చిత
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దనన్దన

43} దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే
సమస్తకామఫలద దేహి మే తనయం సదా

44} భక్తమన్దార గమ్భీర శఙ్కరాచ్యుత మాధవ
దేహి మే తనయం గోపబాలవత్సల శ్రీపతే

45} శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనన్దన
భక్తమన్దార మే దేహి తనయం జగతాం ప్రభో

46} జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే
వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో

47} శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

48} దాసమన్దార గోవిన్ద భక్తచిన్తామణే ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

49} గోవిన్ద పుణ్డరీకాక్ష రమానాథ మహాప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

50} శ్రీనాథ కమలపత్రాక్ష గోవిన్ద మధుసూదన
మత్పుత్రఫలసిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన

51} స్తన్యం పిబన్తం జననీముఖాంబుజం
విలోక్య మన్దస్మితముజ్జ్వలాఙ్గమ్

52} స్పృశన్తమన్యస్తనమఙ్గులీభిర్వన్దే
యశోదాఙ్కగతం ముకున్దమ్

53} యాచేఽహం పుత్రసన్తానం భవన్తం పద్మలోచన
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

54} అస్మాకం పుత్రసమ్పత్తేశ్చిన్తయామి జగత్పతే
శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివన్దిత

55} వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ
కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేన్ద్రపూజిత

56} కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనన్దనమ్
మహ్యం చ పుత్రసన్తానం దాతవ్యంభవతా హరే

57} వాసుదేవ జగన్నాథ గోవిన్ద దేవకీసుత
దేహి మే తనయం రామ కౌశల్యాప్రియనన్దన

58} పద్మపత్రాక్ష గోవిన్ద విష్ణో వామన మాధవ
దేహి మే తనయం సీతాప్రాణనాయక రాఘవ

59} కఞ్జాక్ష కృష్ణ దేవేన్ద్రమణ్డిత మునివన్దిత
లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా

60} దేహి మే తనయం రామ దశరథప్రియనన్దన
సీతానాయక కఞ్జాక్ష ముచుకున్దవరప్రద

61} విభీషణస్య యా లఙ్కా ప్రదత్తా భవతా పురా
అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ

62} భవదీయపదాంభోజే చిన్తయామి నిరన్తరమ్
దేహి మే తనయం సీతాప్రాణవల్లభ రాఘవ

63} రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద
దేహి మే తనయం శ్రీశ కమలాసనవన్దిత

64} రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే
భాగ్యవత్పుత్రసన్తానం దశరథప్రియనన్దన
దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ

65}కృష్ణ మాధవ గోవిన్ద వామనాచ్యుత శఙ్కర
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

66} గోపబాల మహాధన్య గోవిన్దాచ్యుత మాధవ
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే

67} దిశతు దిశతు పుత్రం దేవకీనన్దనోయం
దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్పుత్రలాభమ్

68} దిశతు దిశతు శీఘ్రం శ్రీశో రాఘవో రామచన్ద్రో
దిశతు దిశతు పుత్రం వంశ విస్తారహేతోః

69} దీయతాం వాసుదేవేన తనయోమత్ప్రియః సుతః
కుమారో నన్దనః సీతానాయకేన సదా మమ

70} రామ రాఘవ గోవిన్ద దేవకీసుత మాధవ
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

71} వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

72} మమాభీష్టసుతం దేహి కంసారే మాధవాచ్యుత
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

73} చన్ద్రార్కకల్పపర్యన్తం తనయం దేహి మాధవ
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

74} విద్యావన్తం బుద్ధిమన్తం శ్రీమన్తం తనయం సదా
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దన ప్రభో

75} నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్
ముకున్దం పుణ్డరీకాక్షం గోవిన్దం మధుసూదనమ్

76} భగవన్ కృష్ణ గోవిన్ద సర్వకామఫలప్రద
దేహి మే తనయం స్వామింస్త్వామహం శరణం గతః

77} స్వామింస్త్వం భగవన్ రామ కృష్న మాధవ కామద
దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః

78} తనయం దేహిఓ గోవిన్ద కఞ్జాక్ష కమలాపతే
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

79} పద్మాపతే పద్మనేత్ర ప్రద్యుమ్న జనక ప్రభో
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

80} శఙ్ఖచక్రగదాఖడ్గశార్ఙ్గపాణే రమాపతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

81} నారాయణ రమానాథ రాజీవపత్రలోచన
సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువన్దిత

82} రామ రాఘవ గోవిన్ద దేవకీవరనన్దన
రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత

83} దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

84} మునివన్దిత గోవిన్ద రుక్మిణీవల్లభ ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

85} గోపికార్జితపఙ్కేజమరన్దాసక్తమానస
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

86} రమాహృదయపఙ్కేజలోల మాధవ కామద
మమాభీష్టసుతం దేహి త్వామహం శరణం గతః

87} వాసుదేవ రమానాథ దాసానాం మఙ్గలప్రద
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

88}కల్యాణప్రద గోవిన్ద మురారే మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

89} పుత్రప్రద ముకున్దేశ రుక్మిణీవల్లభ ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

90} పుణ్డరీకాక్ష గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

91} దయానిధే వాసుదేవ ముకున్ద మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

92} పుత్రసమ్పత్ప్రదాతారం గోవిన్దం దేవపూజితమ్
వన్దామహే సదా కృష్ణం పుత్ర లాభ ప్రదాయినమ్

93} కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే
నమస్తే పుత్రలాభాయ దేహి మే తనయం విభో

94} మస్తస్మై రమేశాయ రుమిణీవల్లభాయ తే
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

95} మస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ
పుత్రదాయ చ సర్పేన్ద్రశాయినే రఙ్గశాయినే

96} రఙ్గశాయిన్ రమానాథ మఙ్గలప్రద మాధవ
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

97} దాసస్య మే సుతం దేహి దీనమన్దార రాఘవ
సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే

98} యశోదాతనయాభీష్టపుత్రదానరతః సదా
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

99} మదిష్టదేవ గోవిన్ద వాసుదేవ జనార్దన
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

100} నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే
భగవంస్త్వత్కృపాయాశ్చ వాసుదేవేన్ద్రపూజిత

ఫలశృతిః

యఃపఠేత్ పుత్రశతకం సోపి సత్పుత్రవాన్ భవేత్
శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ

జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్
ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః

ఇతి సంతానగోపాల స్తోత్రం సంపూర్ణమ్

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...