Thursday, May 24, 2018

సుదంతుడు చేసిన హనుమంతుని స్తోత్రం

నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే |
అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే |1|

ఓ దేవనాయకా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టివానికి, నాశరహితునకు, శ్రేష్ఠునాకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము

యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ |
భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః |2|

యోగుల హృదయపద్మమున నుండువానికి, జననమరణమూల రోగమునకు ఔషధమువంటివానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము

రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే |
సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః |3|

శ్రీరామున కుపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్రస్వరూపునకు నీకు నమస్కారము.

గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే |
వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః |4|

పార్వతీగర్భమనే గొప్ప ముత్యపుచిప్పయం దుద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞాస్వరూపునకు, యజ్ఞోభోక్తకు నీకు నమస్కారము.

బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే |
శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే |5|

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది సమస్త దేవతలా స్వరూప మయినవానికి, శతకంఠరావణుని వధించుటకై శుభప్రదమగు శ్రవణానక్షత్రమున.

అవతీర్ణః పంచవక్త్రః తస్మై హనుమతే నమః |
నమ స్తుభ్యం కృపాపార! క్షమస్వ మమ దుర్ణయం |6|

అవతరించిన పంచముఖాంజనేయునకు నమస్కారము. ఓ దయాపూర్ణుడా నా అవినయమును క్షమింపుము.

మ మాపరాథ సంజ్ఞానే శక్తి ర్నాస్తి కపీశ్వరః |
అట స్సహనమే వైషాం యుక్తం భవతి ప్రాణద |7|

నా అపరాధములను నీవుకూడ లెక్కింపజాలవు. అందువలన వాటినన్నిటిని సహింప నీవే తగియున్నావు

పుచ్చాగ్ని లంకాపుర దాహకాయ సురాంత కాక్షాసుర మర్ధనాయ |
నమో స్తు భీభత్సవినిర్మితే ష్వ వ్యత్యర్థ భీభత్సరసోత్సవాయ |8|

తోకనిప్పుతో లంకానగరాన్ని దగ్ధం చేసినట్టి, దేవతలనే బాధించు అక్షరాక్షసుని వధించినట్టి వారధి నిర్మించు బీభత్సకార్యంలో బీభత్స రాసోత్సవమున నున్న నీకు నమస్కారము

జనన మరణ వర్ణితం, శాంతరూప విగ్రహమ్ |
ప్రమథగణ సుసేవితం, పాపసంఘ నాశకమ్ |9|

జనన మరణములు లేనట్టియు, శాంతస్వరూపము కల్గినట్టియు, వానర సమూహంచే సేవింపబడునట్టి, పాపములను పటాపంచలు చేయగల్గినట్టి, తాబేలు వెన్ను నధిరోహించినవానిని

కూర్మవృష్ఠధారణం, పార్థ కేతు చారిణమ్ |
వాలఖిల్య సంస్తుతం, వాయుసూను మాశ్రయే |10|

అర్జనుని రథపుటెక్కెమున సంచరించువానిని, వాలాభిల్యాది మునులచే స్తుతింపబడినవానిని, వాయు కుమారుడయిన హనుమంతుని ఆశ్రయించుచున్నాను

ఇంద్రవ్యాకరణాధిగ త్యవసరే యస్య స్వతో విహ్వాలో
దృష్టో రూప మహఃపతి శ్చరమ పూర్వాద్రిస్థి తాంఘ్రిద్వయః |
ప్రాదా దాత్మసుతాం సురూపగుణశ్రీ లానర్ఘరత్న శ్రియామ్
యస్మై నామ సువర్చలాం హనుమతే తస్మై నాహం కుర్మహే |11|

ఇంద్రవ్యాకరణమును నేర్చుకొనవలసి వచ్చినప్పుడు బ్రహ్మచారియగుటచే స్వయంగా అనర్హుడై కలత చెందిన వానరవీరుని, పూర్వపశ్చిమాద్రుల పాదము లుంచియున్న హనుమంతుని రూపము చూసి సూర్యుడు రూపగణ శీలములందు సాటిలేనటువంటి తన కుమార్తెయైన సువర్చలాదేవిని యిచ్చి వివాహం చేశాడు. అట్టి అంజనేయునకు నమస్కరించుచున్నాను.

Monday, May 21, 2018

ఏకవింశతి దోషములు

1.పంచాంగ శుద్ధి హీనము, 2.సంక్రాంతి అహస్సు, 3.పాప షడ్వర్గు, 4.కునవాంశ, 5.కుజ అష్టమం, . 6.భృగుషట్కరి, 7.కర్తరీ, 8.అష్టమ లగ్న దోషము, 9.అష్టమ చంద్రుడు, 10.షడష్ట చంద్ర దోషం, 11.సగ్రహ చంద్ర దోషం, 12.వారజనిత దుర్ముహూర్త దోషం, 13.ఖార్జురి సమాంఘ్రిభం, 14. గ్రహణం దోషం, 15.ఉత్పాత దోషం, 16. .క్రూరయుక్త నక్షత్రం, 17. అశుభ వేధ, 18.విషయుత లగ్నం, 19.లగ్నాస్త దోషం, 20.గండాంతం, 21.వ్యతీపాత వైదృతి యోగములు. ఈ 21 దోషాలను సమస్త శుభకర్మల యందు విడిచి పెట్టవలెను.

ఏక వింశతి దోషములు అనేది ముహూర్త నిర్ణయంలో చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం. వివాహ, ఉపనయన, శంఖుస్థాపన, గృహ ప్రవేశ, గర్భాదాన, అక్షరాభ్యాసం వంటి ప్రధానమైన కార్యక్రమాలు ఈ ఏకవింశతి దోషములు లేకుండా సుముహూర్తము చేయవలసిన అవసరం చాలా అధికంగా ఉంది.

‘యః పంచాంగ విశుద్ధి హీన దిన కృత్ సంక్రాంత్యహః పాపినాం.
షడ్వర్గః కునవాంశకో ష్ట మకుజ ష్వట్కం భృగోః కర్తరీ’

ఇలా నాలుగు శ్లోకాలలో ఏకవింశతి దోషాలు నిక్షిప్తం చేశారు. అవి

1.పంచాంగ శుద్ధి హీనము: ప్రతి కార్యమునకు కొన్ని ఆధ్యాదులు ప్రత్యేకంగా చెప్పారు. ఏ కార్యమునకు ఏ తిథి వార నక్షత్రములు చెప్పారో వాటిని ఆచరించడం పంచాంగశుద్ధి అనియు, ఆచరింపక పోవడం పంచాంగ శుద్ధి హీనము అని చెప్పారు. ఉదాహరణకు కృష్ణ పాడ్యమి మంగళప్రదమని అంటారు. కానీ ఉపనయనం అక్షరాభ్యాసం విషయాలు బహుళ పాడ్యమి నిషిద్ధము కలిగిన తిథి. అలాగే మఘ నక్షత్రం వివాహానికి గ్రాహ్యత వున్న నక్షత్రం. ఇతరమైన ఏ కార్యమును మఘ నక్షత్రంలో చేయరు. ఇలా పంచాంగంములు ముహూర్త నిర్ణయాలు ప్రధాన భూమిక వహిస్తాయి.

2.సంక్రాంతి అహస్సు: ప్రతి నెలలో వచ్చే సంక్రమణము వున్న దినము అహస్సు అనగా పగలు అని అర్థం. రవి ప్రవేశమునకు 19 ఘడియలు ముందు వెనుకలు, మేష, కర్కాటక, తులా, మకర, సంక్రమణములకు ఆయన ప్రవేశములకు 30 ఘడియలుముందు వెనుకలు దోషము.

3.పాప షడ్వర్గు. హోర, ద్రేక్కోణ, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రిశాంశలను షడ్వర్గులు అంటారు. మనం నిర్ణయింపబోవు లగ్నము షడ్వర్గులలో పాప గ్రహాధిపత్యములు లేనిది అయి ఉండాలి. అందుకే మన ప్రాంతంలో పుష్కరాంశను గ్రహించారు.

4.కునవాంశ: పాప గ్రహ ఆధిపత్యములు వున్న మేష, సింహ, వృశ్చిక, కుంభ, మకర నవాంశలుగాగల లగ్న సమయము విడనాడమని అర్థం. ఈ కునవాంశ ఆధారం చేసుకొని కేవలం పుష్కరాంశకే సుముహూర్తం చేయనవసరం లేదని మంచి గ్రహ ఆధిపత్యం వున్న నవాంశ సమయం, ముహూర్త సమయంగా నిర్ణయించవచ్చని ఆంధ్రేతరుల వాదన.

5.కుజ అష్టమం. ముహూర్త లగ్నమునకు 8 వ ఇంట కుజుడు ఉండుట దోషం.  6.భృగుషట్క దోషం:-  ముహూర్త లగ్నమునకు 6  వ ఇంట శుక్రుడు ఉండుట దోషం అయితే కుజ శుక్రులు బలహీనమైన స్థాన బలం కలిగినప్పుడు దోషం ఉండదు.

7.కర్తరీ: మే నెలలో వచ్చే కర్తరీ కాదు. లగ్నానికి వ్యయంలో వున్న పాపగ్రహం ఋజు మార్గంలోనే వున్ననూ దోషం లేదు.

8.అష్టమ లగ్న దోషము: జన్మ లగ్నము నుండి ముహూర్తము చేయబోవు లగ్నము ఎనిమిదవ లగ్నం అవకూడదు. అదే రీతిగా జన్మరాశిని కూడా చూడాలి. దీనికి మతాంతరం ఉన్నది.

9.అష్టమ చంద్రుడు: ముహూర్త కాలంలో చంద్రుడు వున్న స్థానం. మన జన్మ రాశి నుండి ఎనిమిదవ రాశి అవకూడదు.

10.షడష్ట చంద్ర దోషం  ముహూర్త లగ్నంలో చంద్రుడు లగ్నం నుండి 6,8,12 స్థానముల యందు ఉండరాదు. పాపగ్రహములతో కలిసి ఉండరాదు.

11.సగ్రహ చంద్ర దోషం.ముహూర్త లగ్నం నందు చంద్రునితో ఇతర గ్రహములు కలసి ఉండుట దోషం

12.వారజనిత దుర్ముహూర్త దోషం: ప్రాంతీయంగా దుర్ముహూర్తముల వాడకంలో పాఠాంతరములు ఉన్నాయి. పంచాంగంలో రోజూ దుర్ముహూర్త కాలం రాస్తారు. అయితే లగ్నం ఆరంభం నుండి అత్యంత వరకు కూడా దుర్ముహూర్తం తగులరాదు.

13.గ్రహణభం గ్రహణం ఏర్పడిన నక్షత్రం ఆ తరువాత ఆరు మాసాల వరకు ఆ నక్షత్రంలో ఏ విధమైన శుభ కార్యములూ చేయరాదు.

14.ఉత్పాత, భూకంపం ఏర్పడిన ప్రాంతాలలో వారు ఆ రోజున వున్న నక్షత్రమును ఆరు మాసాల వరకు శుభ కార్య నిమిత్తంగా వాడరాదు.

15.క్రూరయుక్త నక్షత్రం: పాప గ్రహములు వున్న నక్షత్రం శుభ కార్యములకు నిషేధము.

16.అశుభ వేధ: సప్తశలాక వేధ, పంచశిలాక వేధ అని రెండు రకాలయిన సిద్ధాంతములు వున్నాయి. వాటి ద్వారా వేధాక్రాంతలు అని రెండు రకాలైన విశేషములు వున్నాయి. వీటిని గురు ముఖం నేర్చుకోవలసిందే.

17.‘ఖార్జురి సమాంఘ్రిభం’ అనే 17వ దోషం కూడా గురువు ద్వారా తెలుసుకోవలసిన అంశం.

18.వ్యతీపాత వైధృతి పంచాంగంలో రాసిన యోగాలలో శుభకార్యాములు చేయుట నిషేధముగా చెప్పబడినది.

19.విషయుత లగ్నము: లగ్నారంభం నుండి లగ్నాంతము వరకు వున్న కాలములో వర్జ్యము స్పృశింపరాదు. అలా వర్జ్యము తగలదని లగ్నములు మనము శుభకార్యములు చేయవచ్చు.

20.గండాంత దోషము: తిథి గండాంతం, లగ్న గండాంతం, నక్షత్ర గండాంతం అని మూడు రకాలు. రేవతీ చివరి 48 ని.లు అశ్వినీకి మొదటి 48 ని.లు అలాగే ఆశే్లష జ్యేష్ఠలలో చివరి 48 ని.లు మఘ మూల నక్షత్రములు ప్రారంభ 48 ని.లు గండాంతము అంటారు. మీనం కర్కాటకం వృశ్చికం లగ్నములు చివరి 48 ని.లు మరియు మేషము సింహం ధనస్సు లగ్నములలో ప్రారంభం 48 ని.లు. గండ సమయం అంటారు. దీనికి లగ్న గండాంతం అని పేరు. అలాగే పంచమి దశమి పౌర్ణమిలకు చివరి 48 ని.లు షష్ఠి ఏకాదశీ, పాడ్యమి తిథులకు ప్రారంభ 48 ని.లు తిథి గండాంత సమయము అంటారు. దీనికే గండాంత దోషం అని పేరు.

21.ఉదయాస్త శుద్ధి: సుముహూర్త నిర్ణయం చేయబడిన తరువాత ఆ ముహూర్తము యొక్క లగ్నాధిపతి నవాంశాధిపతి ఇరువురూ శుభ గ్రహముల చేత లేదా మిత్ర గ్రహముల చేతనయిననూ చూడబడు ముహూర్తం నిర్ణయించాలి. లగ్నాధిపతికి నవాంశాధిపతికీ పాప గ్రహములు శత్రు గ్రహముల వీక్షణ పనికిరాదు. ఈ విధంగా పైన చెప్పబడిన 21 దోషములు లేకుండా ఉండే మంచి ముహూర్తం నిర్ణయించాలి. ఇంకా ఒక్కో ముహూర్తానికి ఒక్కో విశేషం, దోషం చెప్పబడిననూ ప్రధానమయినవి పైన చెప్పిన ఏకవింశతి దోషములు. ఇవి బాగా పరిశీలించి ముహూర్త నిర్ణయం చేయవలెను.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

Thursday, May 17, 2018

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు

హిరణ్యకశిపుడిని సంవరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

జ్వాలా నరసింహ క్షేత్రము

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం  యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

అహోబిల నరసింహ స్వామి
నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.
గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

శ్రీ మహాలక్ష్మీ అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తె మహాలక్ష్మీ నమోస్తుతే

నమస్తే గరుఢారుఢే ఢోలాసుర భయంకరీ
సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సర్వగ్నే సర్వ వరదే సర్వదుష్ట భయంకరీ
సర్వదుఖః హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

ఆద్యంత రహితే దేవి ఆది శక్తీ మహేశ్వరీ
యోగగ్నే యోగ సంభుతే మహాలక్ష్మీ నమోస్తుతే

స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తీ మహొదరే
మహాపాపా హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

పద్మాసన స్థితే దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ
పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే

శ్వేతాం భరధరే దేవీ నానాలంకార భుషితే
జగత స్థితే జగన్మాత మహా లక్ష్మీ నమోస్తుతే

మహా లక్ష్మ్యస్టకం స్తోత్రం యః పఠేద్భక్తి మాన్నరః
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

ఏకకాలే పఠేన్నిత్యం మహా పాప వినాశనం ,
ద్వికాలం యః పఠే న్నిత్యం ధన ధాన్య సమన్వితం
త్రికాలం యః పఠేన్నిత్యం మహా శత్రువినాశనం
      
మహా లక్ష్మీ ర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా
ఇతీంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవం సంపూర్ణం.

Wednesday, May 16, 2018

బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత


అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనకు జూచుట) మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.

4. పాపవిమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5. సరియయిన నడవడి ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.

9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...