Saturday, October 6, 2018

గొప్ప సందేశం


బిచ్చగాడు అడుక్కునేటప్పుడు 'దానం చెయ్యండి' అనేబదులు "ధర్మం చెయ్యండి" అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి.
పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.

👉మొదటి రెండు భాగాలు స్వంతానికి.
👉మూడోభాగం పన్నులు, తదితరాలు.
👉నాలుగో భాగం   కళాకారులు ,గురువులు,పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి.

ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం.  
వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు.మన ధర్మం మనకి రక్ష. లేదంటే మన అహంకారానికి మనమే బలికాకతప్పదు.
*దానగుణం*
ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు.

          గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍

DON'T MISS

తప్పదు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గమనించగలరు

1995 వరకూ మాకు *హీరో సైకిల్* ఉండేది.
ఏదో తెలియని *ఆనందం

ఆదివారం వచ్చిందంటే చాలు..  కిరసనాయిల్ తో రిమ్ములు తుడిచేసి కొబ్బరినూనె గుడ్డ తో తుడిచేసి చూస్తుంటే ఆ ఆనందమే వేరండీ.

ఆదివారం వచ్చిందంటే.. ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్లం.

ఈ తరం పిల్లలు *బండి*  తుడవమంటే తుడవరు..!
*మేజోళ్ళు* అదేనండీ *సాక్సులు*  ఉతుక్కోమంటే ఉతకరు.! కనీసం *అండర్ వేర్* లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు..!
*లంచ్ బ్యాగ్* లు శుభ్రం చేసుకోవడం లేదు..!

ఎప్పుడైనా దాచుకోమని *డబ్బులు* ఇస్తే *నూడుల్స్ ప్యాకెట్లు, 5 స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు* కొనుగోలు చేస్తున్నారు..!

ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదు..!
ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..!
డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..!

*తల్లిదండ్రులు మారాలి*

భార్యకు వంట వండటం సరిగా రాదని *నేటి యువత* బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంటపడుతూ  చిన్న వయసులోనే *గ్యాస్టిక్, అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్* ల బారిన పడుతున్నారు..!

మరొక *ఫ్యాషన్* ఏమిటంటే..
పెరుగు, మజ్జిగ తీసుకుంటే *వాంతులు* చేసుకోవడం..!
కాలేజీ పిల్లలైతే చిన్న టిఫెన్ బాక్సు రైస్..!

Pregnant అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం..!
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం.!!

ఈ రోజు ఒక స్కూలు అమ్మాయి స్కూల్ అవ్వగానే  500 రూపాయల కాగితం ఓ షాపు అతనికి ఇచ్చి ఏదో 30 రూపాయల ice cream కొనుగోలు చేసింది. షాపతను 470 ఇచ్చాడు.
ఆ అమ్మాయి చిల్లర ఎంత ఇచ్చారో కూడా లెక్క పెట్టుకోలేదు.
షాపతను *చిల్లర సరిపోయిందా.?*  అనడిగితే.. *సరిపోతాయిలే అంకుల్..!* అంది.

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం.?*

*ఒక్కసారి ఆలోచించండి*

*బాధ్యత* 👈        
*బరువు* 👈
*కష్టం* 👈
*నష్టం* 👈
*ఓర్పు*👈
*నేర్పు*👈
*దాతృత్వం*👈
*మానవత్వం*👈
*ప్రేమ*👈             
*అనురాగం*👈
*సహయం*👈
*సహకారం*👈
*నాయకత్వం*👈
*మానసిక ద్రృఢత్వం* 👈
*బంధాలు* 👈
*అనుబంధాలు* 👈 అంటే ఏమిటో..
*పిల్లలకు అలవాటు చేద్దాం*

*మనం కూడా మమేకమవుదాం*

భావి తరాలకు ఒక మానవీయ విలువలతో కూడిన,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

సత్య అన్వేషణ


ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగినపుడు ఎవరు తప్పు, ఎవరు రైటు అన్న ప్రశ్న ఒక్కటే తప్పు, మిగిలినదంతా రైటే.

"ఒకడి మీద ఒకడు చిరాకు పడడం, ఎవరికి వారు వేరుగా పని చేసుకోవడం అనేవి ఏర్పడతాయి. ఈ విడిపోవడం సామాన్యంగా కొన్ని సంవత్సరాలు గాని, ఒక్కొక్కడికి ఆజన్మాంతం గాని ఏర్పడుతూ ఉంటాయి.

చిరాకు పడటంలో విషయం ఏమీ ఉండదు. చిరాకు పడడానికి ఎప్పుడూ పాయింటు ఉండదు. చిరాకుకు కారణం పనిలేని చిత్త వృత్తి. కనుక అది ఒక విధమైన వ్యాధి వంటిది.

దానిని‌ నివారణ చేసుకొన్న వాడికి తప్ప మిగిలిన వారికి తన నిత్య జీవితం కూడా ఇబ్బందులతో నడుస్తుంది. ఇక మహాకార్యాలు సాధించడం అనేది ఉండదు.

" నీకు గిట్టని వాళ్ళు, గిట్టని సిద్ధాంతాలు నశించటం సత్యం కాదు. కనుక అది ఎన్నటికి జరుగదు. వాటికి నీకు ఉన్న సంబంధం తెలుసుకొని, ఉండవలసిన సంబంధం ఏర్పరుచుకుంటే నీవు వాళ్ళని, వాటిని మలచ గల్గుతావు.

నీ కన్నా తక్కువ తెలిసిన వాళ్ళు నీ వెంట నడవాలంటే, నీవు నీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అడుగుజాడలలో నడవాలి

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ ...............✍

అంతర్యామి

భక్తి వల్లనే భగవంతుడు వశుడవుతాడంటారు. అటువంటి ‘భక్తి’ అని దేన్ని అంటారో ఎవరికీ స్పష్టంగా తెలియదు. భగవంతుడికి ప్రీతి కలిగించాలనే సంకల్పంతో భక్తులు నిత్యం పూజలు, జపాలు, ఇతర దైవకార్యాలన్నీ చేస్తుంటారు. అవన్నీ భక్తి పరిధిలోకే వస్తాయా అన్నది సందేహమే!
భక్తుణ్ని భగవంతుడు అనుగ్రహించాడని ఎలా తెలుస్తుంది? తన భక్తులైన ప్రహ్లాదుడికి, గజేంద్రుడికి, అలాగే మరికొందరికి కష్టాలు   వచ్చినప్పుడు ఆయన ఆదుకున్న కథలు అందరికీ తెలుసు. సర్వసహజంగా ఇతరులెవరికీ అంతటి కష్టాలన్నీ వచ్చే అవకాశం లేదు. వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు జాగ్రŸత్తలు తీసుకుంటారు. అడుగులు వేయడం తెలిసిన పసివాణ్ని ఆదుకునే అవసరం ఎవరికీ ఉండదు. నడవలేనివారికే సాయం కావాలి. మనిషి శక్తికి మించిన కష్టం కలిగినప్పుడే, దైవశక్తి అవసరం ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కొరవడినప్పుడే ఔషధాలు కావాల్సి వస్తుంది. ఇదీ అలాంటిదే!
భక్తుడు పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చి ఆదుకోడు. ఆ పిలుపు ఆర్తిగా వెలువడినప్పుడే, అది భగవంతుణ్ని చేరుతుంది. ప్రార్థన పెదవుల నుంచి, ఆర్తి మనసు నుంచి, పూజ బుద్ధి నుంచి వస్తున్నాయి. ఆత్మతో భక్తుడు ఎటువంటి అనుబంధమూ పెట్టుకోవడం లేదు. దైవం ఎక్కడో ఉన్నాడని భ్రమిస్తున్నాడు. ఆయన ‘అంతర్యామి’గా మదిలో కొలువై ఉన్నాడనే సత్యం భక్తుడికి ఒకపట్టాన అర్థం కావడంలేదు. ఆ లోపాన్ని అతడు తనకు తానే సరిదిద్దుకునే వరకు దైవానుగ్రహం లభించదు.
పూజ యాంత్రికం కారాదు. ప్రార్థన పూజగదికే పరిమితం కాకూడదు. మనిషి హృదయమే పూజా మందిరం. ముందుగానే అతడు అవలక్షణాల్ని తొలగించుకోవాలి. ఆ లక్షణాలేమిటో అతడికి ముందే తెలియాలి. అసూయ, అకారణ ద్వేషం, అంతరాలు, ఆధిక్య భావాలు... ఇవన్నీ తనలో ఉన్నాయని తెలిసినా, గుర్తించలేని స్థితికి చేరాడు. పరిపూర్ణుణ్ని, పరిశుద్ధుణ్ని- అనే భ్రమలు అతణ్ని వీడటం లేదు.    భగవంతుడు మానవుడికి అనేక ప్రజ్ఞలిస్తున్నాడు. అవన్నీ తనవేనని, అంతా తన ప్రజ్ఞేనని భావించి మనిషి అహంకరిస్తున్నాడు. అందరూ తనపై ప్రశంసలు కురిపించి, మహోన్నతుడిగా గౌరవించాలని అతడు ఆరాటపడుతున్నాడు.
అహంకారం, ఆధిపత్య ధోరణి అనేవి చెప్పుల జతలాంటివి. వాటికి ఎన్నడూ ఆలయ ప్రవేశం ఉండదు. వాటిని ధరించి వెళ్లినవారికి దైవదర్శనం ఎప్పటికీ లభించదు. సర్వసంగ పరిత్యాగం అంటే కేవలం కాషాయం ధరించడం కాదు. తలపుల్ని శూన్యం చేసుకోవాలి. మనసంతా దైవచింతనతో నిండాలి. వేషంతో కాదు, వ్యవహార సరళి ద్వారా వైరాగ్యం ప్రస్ఫుటమవుతుంది. అవధూతలకు ఎలాంటి ఆర్భాటాలూ ఉండవు.
భక్తి అంటే, భగవంతుణ్ని ప్రేమించడం ఒక్కటే కాదు. సమస్త సృష్టినీ సమభావంతో చూడటం, సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకచోటే దృష్టి కేంద్రీకరించడం! అప్పుడే అది సంపూర్ణ భక్తి అవుతుంది. అలాంటి భక్తితత్పరతకే భగవంతుడు   వశుడవుతాడు.
సంపూర్ణభక్తి అంటే- సమస్తంలోనూ భగవంతుణ్ని స్థిరబుద్ధితో చూడటం, చూస్తూనే ఉండటం!
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Friday, October 5, 2018

లక్ష్మీదేవి అనుగ్రహానికి "శ్రీ లక్ష్మీ నారికేళం"

          శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం, పూర్ణ ఫలం అని కూడ అంటారు.శ్రీఫలాలు క్షార వృక్ష జాతికి చెందినవి. సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు పండుతాయి. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు , బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.   

        శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో చిన్న,పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. కొబ్బరి కాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరి కాయలకు ఉండే  విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

        శ్రీ లక్ష్మీ ఫలాన్ని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగినస్త్రీల ఋతు సమస్యలు, అతి మూత్ర వ్యాదులు,తెల్ల బట్ట,సుఖ వ్యాదులు,గర్బ సంబంధ రోగాలు నయం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా లేనివారు, ఎప్పుడు జలుబు,జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవు తున్నవారు శ్రీ లక్షీ ఫలంతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని స్వీకరించిన అనారోగ్యాలు మటుమాయం అవుతాయి.  

       శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసు కొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్లు పెట్టాలి.శ్రీఫలం చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు, యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి. కర్పూరం, సాంబ్రాణితో ధూపం చూపాలి. తరువాత పసుపు గాని,ఎరుపు గాని, తెలుపు గాని వస్త్రాన్ని తీసుకొని అష్టలక్ష్మీ స్వరూపంగా ఎనిమిది శ్రీఫలాలను గాని,లాభలక్ష్మీ స్వరూపంగా పద కొండు శ్రీలక్ష్మీ ఫలాలను  ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి. శ్రీలక్ష్మీ ఫలం తో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. "ఓం శ్రీం శ్రియై నమః"అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేసి పూజ అనంతరం శ్రీలక్ష్మీ ఫలాలను ఎర్రటి వస్త్రంలో కుంకుమ, నాణేలను మూటకట్టి వ్యాపారసంస్ధలలోగాని ఇంట్లోగాని ఉంచిన సుఖ సౌఖ్యాలు, ధన దాన్యాభివృద్ధి కలుగుతాయి.

Thursday, October 4, 2018

శరన్నవరాత్రులలో కుమారి పూజ విశిష్టత

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు. ఆశ్వీయుజమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించాలి. ఈ శరన్నవరాత్రి పర్వదినాలలో కొన్ని ప్రాంతాలలో కుమారిపూజను చేస్తారు. ఈ పూజ హస్తా నక్షత్రముతో కలిసిన పాడ్యమి రోజున మొదలు పెట్టడం చాలా మంచిది అని పెద్దలు అంటారు.

కుమారిపూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీమంత్రంతో కానీ బీజ మంత్రంతో కానీ మొదలుపెట్టాలి. ఈ కుమారిపూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూజిస్తారు. కొత్తబట్టలు, నగలు ఇచ్చి పూజ చెయ్యాలి. అవలక్షణాలు ఉన్న బాలికలు, రోగాలతో ఉన్న బాలికలు, పది సంవత్సరాలు దాటిన బాలికలు ఈ పూజకు అనర్హులు. ఈ బాలికలకు షడ్రుచులతో భోజనం పెట్టి, వస్త్రాలతో సత్కరిస్తారు. ఒక్కొక్కరోజు ఒకొక్క వయస్సు బాలికకు పూజలు చేస్తారు.

రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి. మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది.

ఏడుసంవత్సరాల బాలికను చండిక అని అంటారు. చండికను పూజించడం వల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఎనిమిదిసంవత్సరాల బాలికను శాంభవి అని అంటారు. శాంభవిని పూజను నృపసమ్మోహకం అని అంటారు. ఈ పూజ వల్ల అధికారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిదిసంవత్సరాల బాలికను దుర్గ అని అంటారు. దుర్గను పూజించడం వల్ల సర్వసుఖాలూ లభిస్తాయి.
ఈ పద్ధతిలో శ్రద్ధాభక్తులతో, శాస్త్రోక్తకంగా నవరాత్రులు పూజ చేయడం సర్వశ్రేయస్కారం, శుభదాయకం.

కన్యా పూజా లేదా కుమారి పూజ నవరాత్రి వేడుకలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఇది నవరాత్రి అంటే అష్టమి మరియు నవమి అతిముఖ్యమైన రోజుల సమయంలో జరుగుతుంది.

మనం ఎంతమందిని అయిన ఈ కన్యా పూజాకి ఆహ్వానించవచ్చు. సాధారణంగా 1,3,5,7,9 మంది కన్యలను ఆహ్వానించవచ్చు.
ఒక అమ్మాయికి పూజలు చేస్తే ఐశ్వర్యము అందిస్తుంది.
ఇద్దరు బాలికలుకి పూజలు చేస్తే భోగము మరియు మోక్షం అందిస్తుంది.
ముగ్గురు అమ్మాయిలకి పూజలు చేస్తే ధర్మము, అర్థము మరియు కామము అందిస్తుంది.
నలుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే అధికారం అందిస్తుంది.
ఐదుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే విధ్య అంటే నాలెడ్జ్ పెరుగుతుంది.
ఆరుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే , 6 రకాల సిద్ధి అందిస్తుంది.
ఏడుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే రాజ్యసభ అంటే శక్తి మరియు రాజ్యం సాధించడంలో సహాయపడుతుంది.
ఎనిమిది మంది అమ్మాయిలకి పూజలు చేస్తే సంపద పెంచుతుంది.
తొమ్మిది మందిఅమ్మాయిలకి పూజలు చేస్తే పృథ్వీ. యాజమాన్యం ఇస్తుంది.

Saturday, September 29, 2018

పృధ్వీ స్తోత్రం

అత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.

జయజయే జలా ధారే జలశీలే జలప్రదే l
యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే ll

మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే l
మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే ll

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే l
సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ll

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని l
పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ll

సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే l
సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భవే ll

భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణే l
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ll

ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ l
కోటిజన్మసు సభవే ద్బలవాన్బూ మిపేశ్వరః ll

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...