Tuesday, August 20, 2013
నవదుర్గలు -మహిమలు
అమ్మలకే అమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ దుర్గా మాత నవ విధ అవతారాలని అత్యంత
భక్తితో పూజించే పర్వదినాలు ఈ దసరా నవరాత్రులు. దేవీ భాగవతంలో
శక్తిస్వరూపిణీ మాతకు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులకన్నా అధిక
ప్రాధాన్యమివ్వబడింది. విజయం ప్రాప్తించాలంటే శక్తిని అందుకోవడం
తప్పనిసరి.' త్రిపురార వ్యాసం'లోని మహాత్మ్యఖంఢం శక్తి ఉపాసనా విశిష్టతను
స్పష్టం గావించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం 'సప్తశతీ,
'లలితాత్రిశతి ', లలితా సహస్రనామం ఆదిగాగల గ్రంధాలలో కూడా కనపడుతుంది.
ఆమెయే త్రిపురా రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అట్టి దుర్గామాతకి జరిపే
ఉత్సవాలే దేవీ నవరాత్రులు.
తల్లిని దేవతగా గుర్తించి పూజించడం
శక్తాభావ వికాసంలోని పద్ధతి . నీవే సరస్వతివి, నీవే మహాలక్ష్మివి, నీవే
శాకంభరివీ, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణాన్ని సమన్వయాన్ని సాధించే
దిశలో శ్రీ శంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు.
వైదిక
సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తులుగా చెప్పబడింది. మహాకాళి,
మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని
శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య
విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు.
నవదుర్గలు -మహిమలు
శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.

శైలపుత్రి:
' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'
కుడిచేతిలో
త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని
స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.

బ్రహ్మచారిణి:
'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '
ఒక
చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో
సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం
సంప్రాప్తిస్తుంది.

చంద్రఘంట:
'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'
దుర్గామాత
మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన
శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని
ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన
ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి
మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

కూష్మాండ రూపం:
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా
స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను
కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది.
ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

స్కందమాత:
'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '
శక్తిధరుడైన
స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది.
సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం
నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో
స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

కాత్యాయిని:
'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '
కాత్యాయనీ
మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది.
కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి.

కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '
కాళరాత్రీ
దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం.
ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు
గల మరో నామం శుభంకరి.

మహాగౌరి:
'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'
అష్టమశక్తియైన
మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి.
ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి -
మహాగౌరి.

సిద్ధిధాత్రి:
'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
తొమ్మిదవ
శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె
కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు
పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం
సంప్రాప్తిస్తుంది.
సంకటనాశన గణేశ స్త్రోత్రం
నారద ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్టసిద్ధయే ||
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ ||
లంబోదరం పంచమం చ, షష్టం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ |
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరం |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధి కరం ప్రభో ||
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్ ||
జపేత్ గణపతిస్తోత్రమ్, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః ||
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ||
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశ స్త్రోత్రం
సంపూర్ణమ్
దారిద్ర్యదహన శివస్తోత్రమ్
విశ్వేశ్వరాయ, నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ, శశిశేఖర ధారణాయ,
కర్పూరకాన్తి ధవళాయ, జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
గౌరిప్రియాయ, రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ, భుజగాధిప కంకణాయ,
గంగాధరాయ, గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
భక్తప్రియాయ, భవరోగ భయాపహాయ
ఉగ్రాయ, దుఃఖ భవసాగర తారణాయ,
జ్యోతిర్మయాయ, గుణనామ సునృత్యకాయ,
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
చర్మాంబరాయ, శవభస్మ విలేఫనాయ
ఫాలేక్షణాయ, మణికుండల మండితాయ,
మంజీరపాదయుగళాయ, జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
పంచాననాయ, ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ, భువన త్రయమండితాయ,
ఆనంద భూమి వరదాయ, తమోపయాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
భానుప్రియాయ, భవసాగర తారణాయ
కాలాన్తకాయ, కమలాసన పూజితాయ,
నేత్రత్రయాయ, శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
రామప్రియాయ, రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ, నరకార్ణవ తారణాయ,
పుణ్యాయ పుణ్యభరితాయ, సురార్చితాయ,
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
ముక్తేశ్వరాయ, ఫలదాయ, గణేశ్వరాయ
గీతాప్రియాయ, వృషభేశ్వర వాహనాయ,
మాతంగచర్మ వసనాయ, మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్,
సర్వ సంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్.
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం, న హి స్వర్గ మవాప్నుయాత్.
ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్
సంపూర్ణమ్
భక్తుడి భగవంతుడి
సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరియైన పద్ధతేనా?? కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు . అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. దేవుది పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటె దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
"108 ఉపనిషత్తులు"
1. ఈశావాస్యోపనిషత్
2. కేనోపనిషత్
3. కఠోపనిషత్
4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్
6. మాండూక్యోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్
9. చాందోగ్యోపనిషత్
10. బృహదారణ్యకోపనిషత్
11. బ్రహ్మోపనిషత్
12. కైవల్యోపనిషత్
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
15. హంసోపనిషత్
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్
18. నారాయణోపనిషత్
19. పరమహంసోపనిషత్
20. అమృతబిందూపనిషత్
21. అమృతనాదోపనిషత్
22. అథర్వశిరోపనిషత్
23. అథర్వశిఖోపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్
26. బృహజ్జాబాలోపనిషత్
27. నృసింహతా పిన్యుపనిషత్ (పూర్వ తాపిని, ఉత్తర తాపిని )
28. కాలాగ్నిరుద్రోపనిషత్
29. మైత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్
32. మంత్రికోపనిషత్
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్
38. నాదబిందూపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
41. యోగతత్వోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యుపనిషత్
47. నిర్వాణోపనిషత్
48. మండల బ్రాహ్మణోఫనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
50. శరభోపనిషత్
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
54. రామరహస్యొపనిషత్
55 రామతాపిన్యుపనిషత్ 9పూరవ తాపిన్యుపనిషత్, ఉత్తర తాపిన్యుపనిషత్ )
56. వాసుదేవోపనిషత్
57. ముద్గలోపనిషత్
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్
60. భిక్షుకోపనిషత్
61. మహోపనిషత్
62. శారీరకోపనిసషత్
63. యోగశిఖోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
69. ఏకాక్షకోపనిషత్
70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్
72. అక్ష్యుపనిషత్
73. ఆధ్యాత్మోపనిషత్
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
76. ఆత్మోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
79. అవధూతోపనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
82. త్రిపురోపనిషత్
83. కఠరుద్రోపనిషత్
84. భావనోపనిషత్
85. రుద్రహృదయోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
87. భస్మ జాబాలోపనిషత్
88. రుద్రాక్ష జాబాలోపనిషత్
89. గణపత్యుపనిషత్
90. ధర్మనోపనిషత్
91. తారసారోపనిషత్
92. మహావాక్యోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
96. కృష్ణోపనిషత్
97. యాజ్ఞ్వల్క్యోపనిషత్
98. వరాహోపనిషత్
99. శాట్యాయనీయోపనిషత్
100. హయగ్రీవోపనిషత్
101. దత్తాత్రేయోపనిషత్
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
104. బాల్యుపనిషత్
105. సౌభాగ్యలక్ష్ముపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
107. బహ్వృచోపనిషత్
108. ముక్తికోపనిషత్
వేదములు - కొన్ని విషయాలు
వేదములు - కొన్ని విషయాలు
|
|
ఈ వేదం అన్ని వేదాలలోనికి ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదం మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింప బడింది. అగ్ని దేవుడికి అంకితం చేయబడిన ఈ వేదానికి అధిష్టానదేవత గురువు (Jupiter). ఈ వేదం మొత్తం 10 మండలాలుగా (Books) విభజించబడి, 1028 సూక్తములతో (Hymns) 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది.
ఈ వేదం మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని, ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తాలు, ఆత్మ సంబంధిత సూక్తాలు, సామాన్య జీవన విధాన సూక్తాలు ఇందులో పొందు పరచ బడ్డాయి.
ఇందులోనే 'ఐతిరేయ' మరియు 'కౌషితక' ఉపనిషత్తులు ప్రస్తావించ బడ్డాయి.
|
వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడ్డ ఈ వేదం వాయు దేవునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవత శుక్రుడు (Venus). ఈ వేదం 40 స్కంధాలుగా (Parts) విభజించబడి, 1975 శ్లోకాలతో అలరారుతుంది.
ఈ వేదాన్ని 'శుక్ల' యజుర్వేదం అని, 'కృష్ణ' యజుర్వేదం అని రెండు భాగాలుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదం ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదం యఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది.
యజుర్వేదం మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదం ముఖ్యం గా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానాలు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది.
కృష్ణ యజుర్వేదంలో 'తైతిరీయ ', 'కథా' ఉపనిషత్తులు ఉండగా శుక్ల యజుర్వేదంలో 'ఈషా', 'బృహదారణ్యక' ఉపనిషత్తులున్నాయి.
|
ఈ వేదం మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించ బడింది. ఈ వేదానికి అధిష్టాన దేవత అంగారకుడు (Mars). ఈ వేదం ఆదిత్యునికి (Sun) అంకితం చేయబడింది.
ఈ వేదం రెండుభాగాలుగా విభజించబడింది.
A). పూర్వార్సిక : 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.
B). ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.
మొత్తం 1564 మంత్రాలలో 75 మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించ బడ్డాయి.
మొదటిలో 1000 శాఖలుగా విస్తరించిన ప్రస్తుతానికి మూడు శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతం, శాంతి ప్రార్థనలు ఈ వేదంలో మనకు కనపడే విశేషాలు.
|
ఈ వేదం మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించదడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదానికి బుధుడు అధిష్టాన దేవత.
ఈ వేదం రెండుభాగాలుగా విభజించ బడినది.
A). పూర్వార్ధ: అనేక విషయాలపై చర్చ.
B). ఉత్తరార్ధ: వివిధ ఆచారాలపై కూలంకష చర్చ.
అధర్వ వేదం నాలుగు భాగాలుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది.
మొదట తొమ్మిది శాఖలలో ఉన్న ఈ వేదంలో ప్రస్తుతం 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
ఈ వేదంలో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామం గురించిన కథలు, భూతపిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రాలు, మంత్రవిద్య, తంత్ర విద్య లకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరిచారు.
ఇందులో 93 ఉపనిషత్తులు పొందు పరిచి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 'ప్రశ్న', 'మాండూక',మరియు 'మాండుక్య' ఉపనిషత్తులు.
ప్రతి వేదాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చు.
1. మంత్ర సంహితలు: ఇహలోక పరలోక లభ్ధికోసం వివిధ దేవతల గురించిన ప్రార్థనలు ఉన్న భాగం.
2. బ్రాహ్మణములు: వివిధ ఆచారాలు వాటిని పాటించేవిధాలని గురించి వివరించే భాగం.
3. అరణ్యకాలు: ఆచారాలకు తాత్విక (Philosophical) వివరణ.
4. ఉపనిషత్తులు: వీటినే వేదాంతాలు అనికూడా అంటారు. ఇవి వేదాలలోని సారాంశాన్ని వివరిస్తాయి.
మొత్తం వేద విజ్ఞానాన్ని ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణాలు ఆ చెట్టు పూలుగా, అరణ్యకాలు పచ్చి కాయలుగా, ఉపనిషత్తులని పండ్లుగా వర్ణించ వచ్చు.
ఊపవేదములు: వేదాల వెలె కాకుండా ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వీటినే"స్మృతులు" అనికూడా అంటారు. ఇవి వేదాల వలనే మొత్తం నాలుగు.
1. ఆయుర్వేదం: ఋగ్ వేదానికి సంబంధించిన ఇది ఆరోగ్యాంగా జీవించటానికి పాటించవలసిన విధులని తెలిపే శాస్త్రం.
A) చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథం.
B) శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.
C) వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.
D) కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.
2. ధనుర్వేదం: యజుర్వేదానికి సంబంధించిన ఈ ఉపవేదం బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే రచించబడినది. ఇది ముఖ్యంగా సైన్య (Military) శాస్త్రానికి సంబంధించినది. మొత్తం నాలుగు భాగాలలో ఈ శాస్త్రం యుద్దానికి సంబంధించిన అన్ని విషయాలని చర్చిస్తుంది. ఇందులోనే వివిధ మారణాయుధాలు, మంత్ర యుద్ధ పద్ధతులు యుద్ధ వ్యూహాల గురించి విపులం గా చర్చించబడింది.
3. గంధర్వ వేదం: సామవేదానికి సంబంధించిన ఈ ఉపవేదం ముఖ్యంగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రం. భరత మహాముని రచించిన గంధర్వ శాస్త్రం ఈ కోవలోనికి వస్తుంది.
4. అర్థశాస్త్రం: రాజకీయ మరియు అర్థశాస్త్రం. ఇందులో నీతిశాస్త్రం, శిల్పశాస్త్రం, అరవైనాలుగు కళలు, ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయాలను కులంకుషంగా చర్చించారు.
|
ఆనవాయతి ప్రకారం వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు మొత్తం ఆరు.
1. శిక్ష (Phonetics): పాణిని రచించిన శిక్ష.
2. వ్యాకరణము (Grammer): పాణిని రచించిన వ్యాకరణము, పతంజలి రచించిన మహాభాష్యము. ఇది పాణిని వ్యాకరణానికి వివరణ.
3. ఛందస్సు: పింగళాచార్యుల ఛందస్సు.
4. నిరుక్త (EtymOlogy): యక్షుని నిరుక్త.
5. జ్యోతీష: ఖగోళ మరియు జాతక శాస్త్రము, గార్గి ముని రచించిన జ్యోతిష గ్రంథము, ఇంకా చాలా గ్రంథములే ఉన్నాయి. భారతీయులు ఖగోళ శాస్త్రంలో వేద కాలంలోనే చాలా ప్రగతి సాధించిన విషయం జగమెరిగిన సత్యం.
6. కల్ప: ఆచార సంప్రదాయ పద్ధతుల గురించిన శాస్త్రం. ఇందులో మూడు భాగాలున్నాయి.
I) శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.
II) శులభ కల్ప: కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.
III) ధర్మ కల్ప: నీతి , ధర్మ విషయాలకు సంబంధించినది. ధర్మ కల్పంలో మొత్తం 18 విభాగాలున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.
1. మను స్మృతి: ఈ ధర్మసూత్రాలు త్రేతాయుగానికై నిర్దేశించబడినవి.
2. యాఙ్ఞవల్క్య స్మృతి: త్రేతా యుగానికై నిర్దేశించబదినది.
3. పరాశర స్మృతి: కలియుగానికై నిర్దేశించబడినది.
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....
