Wednesday, November 7, 2018

దీపావళి - ప్రాముఖ్యము

        

ఆశ్వయుజ  బహుళ చతుర్దశిని  నరక చతుర్దశి అని , ఆ మరుచటి రోజు అమావాస్యను దీపావళి అని , మహా ప్రముఖమయిన   పండుగలుగా మహాలక్ష్మి అసీస్స్సుల కోరకు, అనుగ్రహము కొరకు  భారత దేశమే కాదు, విదేశాలలో కూడా    భారతీయులు నివసించు నేపాలు, శ్రీలంక, మలేషియా,  యూరప్, అమెరికా మొ. దేశాలలో వేడుక గా జరుపుకొను పండగ ఈ దీపావళి..దీనిని కొన్ని ప్రాంతములలో,.ఐదు రోజులు, నాలుగు రోజులుల, మూడు,రోజులు, రెండు రోజుల పండుగ గా జరుపుకొను అచారమున్నది.  ప్రాంతాల వారిగా దేశకాల ఆచారము బట్టి  జరుపుచున్నారు. త్రయోదశినాడు, అక్షయతృతీయ అని ,తరువాత నరక చతుర్దశి అని  తరువాత అమావాస్యనాడు దీపావళి గా  తరువాత కార్తిక మాసం మొదటి రోజు పాడ్యమి నాడు బలి  పాడ్యమని  విదియనాడు యమ విదియ గాను, ఈ పండుగను భారత దేశంలో అనాదిగా ఆచరించుచున్న ఆచారం .దీపావళి అనగా దీపముల వరుస. దీపముల సమూహము అని కుడా అర్ధము  చెప్పవచ్చును . ఈ పదము సంస్కృత సమము, .ఏకవచనము.,నామవాచకము.

                               శుభం కరోతి కల్యాణం  ఆరోగ్యం ధనసంపదం
                               శత్రు వృద్ది వినాశాయ  దీపం జ్యోతి నమోస్తుతే
                               దీపం జ్యోతి పర బ్రహ్మ దిపంజ్యోతి జనార్దనః 
                               దిపోహరతి పాపాని సంద్యా దీప నమోస్తుతే !

సకల కళ్యాణ ప్రదము,ఆరోగ్యము,ధనము,శత్రువులపై  విజయము ప్రసాదించు దీపమునకు నమస్కరించు చున్నాను,
ఈ దీపము ,పర బ్రహ్మ మహావిష్ణు స్వరూపము , సకల పాపములు. హరించు సంద్యా దీపమునకు  నమస్కారము. అని ఈ శ్లోకమున దీప ప్రాసత్యమును  చెప్పుచున్నారు. సంధ్య అనగా మూడు సంద్యలు అని అర్ధము.చెప్పుకోవాలి . .

ఈ దీప ఆరంభము  విశేషము గూర్చి తెలుసుకొందాము.  ఒకనాడు  ఇంద్రుడు  దుర్వాస మహా మునికి ఆతిధ్య మిచ్చి సకల సత్కారములు చేసి ఆసీస్సులర్ధించెను. దానికి ఆముని సంతోషించి మహా మహిమాన్విత మయిన ఒక పూలహారమును  బహుకరించెను.  ఇంద్రునకు అది అంత గొప్పదిగా కనిపించలేదు. ఆ హారమును తన ఐరావతము మేడలోకి విసిరెను.  ఆ ఏనుగు ఆ హారమును  క్రింద పడవేసి కాళ్లతో త్రోక్కేను . దానికి ఆ తాపసి ఆగ్రహించి , ఇంద్రుని తన ఐశ్వర్యము,పదవి పోయి బ్రష్టుడవు కమ్మని శపించి  వెడలిపోయేను..మహేంద్రుడు చేసిన అపరాధము గ్రహించి మహావిష్ణువు ఆశ్రయించి ,విషయము వివరించి , దానికి నివారణ, తరుణోపాయము అనుగ్రహించమని వేడుకొనెను.  ఆ పరమాత్మ ఇంద్రునకు మహాలక్ష్మి స్వరూపమయిన  దీప  మహత్యమును చెప్పి దీపారాధన ,జ్యోతి నమస్కారము , ,ఆవశ్యకత , ఫలము వివరించెను.  ఇంద్రుడు ఆ విధముగా  వివిధ దీపములతో  మహాలక్ష్మిని  ఆరాధించి  ఆమె అనుగ్రహము సంపాదించి  మరల పూర్వ  వైభవమును  సంతరించుకోనేను..  ఇది దీప మహాత్యము తెలుపు పురాణ గాధ . ఈ దీపము అజ్ఞానమును తొలగించి  సన్మార్గము చూపుచు మానవాళికి మహోపకారి యగు  మహలక్షియె నని హిందువుల  విశ్వాసము..

మరియు  శ్రీ మహావిష్ణువు  ద్వాపరమున  నరకాసురుని సంహరించి  దేవ మునిగణ  సాదు సజ్జనులను వాని బారి నుంచి కాపాడిన రోజుగా నరక చతుర్దశిని  జరుపు కొనుట మన ఆచారము.ఆ తరువాతి అమావాస్యనాడు ఆ సంబరము జరుపుకొని మహాలక్ష్మిని  పూజించుట దీపావళి ప్రాముఖ్యము.   ఆ నరకాసుర సంహార ఘట్టమును ముందు వివరముగా మనవిచేసేదను.  మరియొక గాధ :  శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతా సమేతుడయి  అయోధ్యకు వచ్చిన రోజుగా కొందిరి భావము . జైనుల చివరి తీర్ధంకరునకు, మోక్షం  సిద్ధించిన రోజుగా వారి  ఆచారము ప్రకారము ఈ దీపావళి పండుగ జరుపు కొందురు.  బలిచక్రవర్తి  పాతాళము నుంచి తిరిగి వచ్చిన రోజని  మరి కొందరి నమ్మకము.. .  .

దక్షణ భారతమున మాత్రము నరక చతుర్దశి  దీపావళి పాడ్యమి  మూడు రోజలు అరుపుకోను ఆచారమున్నది. కార్ణాటక మహారాష్ట్రలలో, కార్తికమాస మొదటి దినము  పాడ్యమినాడు పశువులకు అలంకారము చేసి పూజించు సాంప్రదాయము కలదు. దీనిని బలిపాడ్యమి గా  వ్యవహరింతురు . ఆ తరువాతి రోజు , విదియనాడు యమ ధర్మ రాజు తన సోదరి ఇంటికి వెళ్లి ఆతిధ్యము స్వీకరించి ఆమెను ఆశిర్వదించేనని యమవిదియ నాడు  సోదరులు సోదరి గృహమునకు వెళ్లి ఆశీర్వదించి  బహుమతులు ఇచ్చుట మనము చూచుచున్నాము ...

ఈ పర్వదినమున  హిందువులు ఉదయమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానము చేసి , గృహములను పువ్వులతోను తోరణములతోనూ  అలంకరించి ముగ్గులువేసి అలంకరించాలి . సాయంకాలమున , ప్రదోష  సమయమున, దీపము దక్షిణదిక్కుగా తిరిగి వెలిగించి,  పెద్దలకు నమస్కారము చేయవలెను..  ఇలా చేయుట వారికి ముక్తి మార్గము చూపునది  అని  భావిస్తారు. దీనినే ఉల్కాదాన మంటారు. దీనిని దీపావళి నాటి సాయంత్రము  ముందుగా చేయవలెను.  అనం తరము  భక్తి శ్రధలతో మహాలక్ష్మి ఆరాదించి ప్రార్ధించి  వేడుకగా బణసంచా వెలిగించి  ఆనందించు పండుగ ఈ దీపావళి .ఈ పండుగ ప్రాముఖ్యమంతయు మహాలక్ష్మిని  ఆరాధించుట ,కొలుచుట ,పూజించుట అని గ్రహించవలెను .

పంచ భూతములలో అగ్ని ప్రధానమయినది.  ఈ అగ్ని దీపమే, దీపస్వరూపమె . అగ్నిలో తేజస్సు, ఆహారం, విద్యా నిండి ఉంటాయి . అందుచే అగ్ని హోత్రమునకు మన సంప్రదాయమున మిక్కిలి ప్రాధాన్య మీయబదినది దీపములో మూడు రంగులు కలిసి ఉంటాయి  అవి నీలము ,పసుపు, తెలుపు. ఇవి సత్య ,తమో,  రజో గుణాలకు సంకేతములు మరియు లక్ష్మి ,సరస్వతి, దుర్గలకు కూడా ప్రతీకలు .ఈ దీపాన్ని ఆరాధించుట త్రిజగన్మాతలను  ఆరాధించుటయే.ఈ దీపారాధన తో ముగురమ్మలను పూజించి, ప్రసన్నం చేసుకోను తరుణోపాయం   ఈ దీపావళి  రోజుని , ఉత్తర భారత దేశమున నూతన సంవత్సరముగా  భావించి , క్రొత్త కాతాలు, పుస్తకాలు తెరచి  వ్యాపారారంభం చేయు ఆచారము మనకు తెలిసినదే. ఇట్టి మహా మహిమాన్వయితమయిన ఈ పండుగ హిందువులందరి  ముఖ్యమయినది .శుభ మయినది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...