Sunday, April 15, 2018

శాశ్వత సత్యాలు

మనకేం కావాలో తెలియనపుడు ఎన్ని శాస్ర్తాలు నేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఏ శాస్ర్తం గొప్పది, ఏ మార్గం గొప్పది, ఎవరు గొప్పవారు‌ అనే ప్రశ్నలు మానవుని ఆచరణ శూన్యతకు, పతనానికి కారణాలు.

భగవంతుని కన్నా శాస్ర్తమే ఎక్కువ. అనే వెర్రిలో పడరాదు. భగవంతుడిని మరువలేని శాస్త్రమే కావాలి. భగవంతుడు లేడు లేడు అని అరుస్తుంటారు కొంతమంది. అలా అంటూనే మరల భగవంతుణ్ణి తిట్టే వారు కూడా ఉన్నారు. మనకీ భగవంతునికి మధ్య పొరలు తొలగాలంటే మిగిలిన జీవులకు మనకు మధ్య పొరలుండరాదు.

మనం ఉండటం అంటే మనము ఉన్నట్లు అనిపించడమే గాని అదికాక మనం అంటే ఏమిటో చెప్పు? ఎవడి అస్తిత్వము వాడికి ఉండడమే ఉండటం.

నువ్వు సర్వ శక్తి సంపన్నుడవు అంటే ఒక్కొక్కడు అంగీకరించడు . ఎందుకో తెలుసా? అలా అని నమ్మితే ఆ శక్తిని సద్వినియోగం చేయవలసిన బాధ్యత తన నెత్తిన పడుతుందేమోనని.

ఒక్కొక్కడికి తోచదు ఎవరైనా చెపుతూ ఉంటే వినడు. వినగలిగే మంచితనం, సహనం ఉండాలి. వినడానికి అహంకారం పడక, బుద్ధి గలిగి వినగలిగితే వినే ప్రతిమాట మంత్రమే-- మార్గమే.

తెలిసి తప్పు చేసినవాడు, ఇతరుల తప్పులను పట్టుకు కూర్చునే వాడు, చేసిన తప్పులను గూర్చి తపస్సు‌ చేసేవాడు, శరీరం మీద అభిమానం, మృత్యుభీతి ఉన్న వాడు బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు.......

........✍🏻 గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...