Thursday, March 22, 2018

జ్యోతిష్యం + వాస్తు= సంపూర్ణ జీవితం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

‘‘జ్యోతిషాం సార్యాదీనాం బోధక శాస్త్రం’’
సూర్యుని నుండి మొదలడి ఆకాశంలో కనప డే ప్రకాశ పదార్థాలను గురించి వివరించే శాస్తమ్రిది. అనగా నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైన ఆకాశంలో కనిపించే వివి ధ కాంతి పదార్థాలను గూర్చి తెలిపేది జ్యోతి షం అని కొందరి అభిప్రాయం. కొందరి దృ ష్టిలో ఫలిత బాగంతో సంబంధం లేని ఖగోళ శాస్తమ్రే జ్యోతిష్యం. మరికొందరి అభిప్రాయం లోనైతే సిద్ధాంత భాగంతో సంబంధంలేని ఫలిత జ్యోతిష్యమే జ్యోతిశ్శాస్త్రం. అనాది నుండి నేటి వరకూ మానవ జీవితంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు అధికంగా చూపే జ్యోతిష్య శాస్త్రం యొక్క నిర్వచనాలు కనిపిస్తున్నాయి.

ఈ శాస్తమ్రు మానవులకు మూఢనేత్రము లాంటిది. ఏదైనా ఒక విషయాన్ని వివరంగా తెలుపటాన్ని శాస్తమ్రు అంటారు. అట్టి జ్యోతిష శాస్తమ్రులో 1. సిద్ధాంత, 2. సంహిత, 3. హోర, 4, శకున 5. ప్రశ్న విభాగాలుగా ఉన్నాయి. అందుకే జ్యోతిష్యశాస్త్రాన్ని పంచ స్కందత్రయమని అన్నారు. ఇందులో ప్రతి విభాగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సకల మం త్రములలోనూ గాయత్రి ఎంత ప్రధానమో.. సకల శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పగలగాలి. ఇందులో ముఖ్యంగా సిద్ధాంత భాగాన్ని పరిశీలిస్తే... గణిత, ఖగోళ శాస్త్రాల గురించి చెప్పారు. హోరా భాగాన్ని చూస్తే జనన సమయ నిర్ధారణ, జాతక నిర్మాణము, షోడశ వర్గులు సాధన చేసే విధానం ప్రతివారికి ఉపయోగపడే వివిధ రాజయోగాలు, పూర్వ జన్మ విశేషాలు మొదలగునవి ఉన్నాయి. సంహిత భాగాన్ని పరిశీలిస్తే... అందులో మనకి వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి. దేవాలయ, తటాక, ఆరామ, గ్రామ, గృహ, శిల్ప వాస్తులన్నీ అందులోనే కనబడతాయి. అంతేగాక జలార్గళం, వివిధ రత్నాలు, పశు సాముద్రికం, అంగ సాముద్రికం మొ అంశాలను గమనించవచ్చు.

జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగాన్ని తీసుకున్నట్లయితే ‘సంహిత’ అనగా కూర్చబ డేది, పేర్చబడేది అని అర్థం. అనేక రకాల అంశాలను కలిపి ఇందులో పేర్చి మనకి అందించారు. జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగంలోని ఒక భాగమే వాస్తుశాస్తమ్రు. అం టే జ్యోతిష్యశాస్తమ్రులోని ఒక భాగమే వాస్తు శాస్తమ్రని అందరూ అర్థం చేసుకోవాలి. మరి కేవలం వాస్తు శాస్త్రాన్నే నమ్మి, జ్యోతిష్య శా స్త్రాన్ని వదిలేస్తే సరిపోతుందా? దశలను చెప్పే ది జ్యోతిష్య శాస్తమ్రు, దిశలను సూచించేది వాస్తు శాస్తమ్రు. ‘దశ బాగుంటే, దిశ బాగుం టుంది’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. అంటే జ్యోతిష్యం ప్రకారం నడుసుస్తున్న దశ లు బాగున్నప్పుడే మనం ఉంటున్న దిశలు (వాస్తుప్రకారం) బాగుంటాయి అన్నది అర్థ వంతమైన సంగతే కదా!

దశలు, దిశలు సరిచేసుకున్నప్పుడే వ్యక్తి జీవితం బాగుంటున్నది నిర్వివాదాంశం. కుటుంబానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ రెం డు కన్నులే గాని ‘కేవలం వాస్తే ప్రధానం... కాదు.. కాదు.. జ్యోతిష్యమే ప్రధానం’ అని అనుకోకూడదు. వ్యక్తి జీవిత చక్రంలో వున్న సమస్యలను సరిగా విశ్లేషించి నడుస్తున్న దశలు, అంత ర్ధశలు, గోచార ఫలితాలు గమనించి ఎలాం టి ప్రతిబంధకాలని అతను ఎదుర్కొంటున్నా డో గమనించి దానికి తగ్గ రెమెడీస్‌ (పరిహార క్రియలు... అనగా జపం, దానం, శాంతి, హోమం, రత్నధారణ మొదలగునవి) పాటిం చి... ఆ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయ టపడగలిగిన తరువాతే ప్రశాంతత లభ్య మవుతుంది. యాభై పాళ్ళు పైగా జాతకం యొక్క ప్రభావం మనిషి పై ఉంటుంది.
ఇంక మిగిలిన వాస్తును సరిచేసుకోవాలి.

అనగా ఎలాంటి ఇంట్లో వుండాలి?ఏ ముఖ ద్వారం ఉండాలి. ఇలా ఇల్లంతా... లోపల, బయట కూడా వాస్తు ప్రకారం వుందా? వీధి శూలలు, వెన్ను శూలలు లేవుకదా? చుట్టూ సక్రమమైన ప్రహారీ ఉందా? అంతేగాక ఇంట్లో వస్తువులన్నీ వాస్తు ప్రకారం అమి రాతయా లేదా?అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే వ్యక్తి పైన జాతకం ప్రభావం దాదాపు జాతకం 60 శాతం ఉంటే, వాస్తు 40 శాతం ఉంటుంది. రెండూ సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా దాని ప్రభావం ఆ వ్యక్తిపైన వుండి తీరుతుంది. ఇంకో విచిత్రమైన అం శం ఏమిటంటే మనకి నడుస్తున్న దశలు సరి గ్గా లేనప్పుడు మనం ఉండే గృహం కూడా వాస్తు సరిగ్గా లేనిదే అవుతుంది.

దీన్ని బట్టి మనకి అర్థం అవుతున్న అంశం ఏమి టంటే... వ్యక్తి జాతకాన్ని ముందుగా పరిశీ లించి అతను ఎదుర్కొంటున్న సమస్య లను విశ్లేషించి అట్టి వ్యక్తి ఎలాంటి రూములో, ఎలాంటి ద్వారము, ఎలాంటి సమస్యలు న్న ఇంట్లో ఉంటున్నాడో చెప్పగలుగుతు న్నాము. అంటే జ్యోతిష్య శాస్తమ్రును బట్టే ప్రధానంగా మనము గ్రహించి చెబుతున్నా ము. అప్పుడు ఆ దశలను బట్టి పరిహార ప్రక్రియలు వ్యక్తి పాటించి 60 శాతం వూరట చెందాక, ఆ ద్వారానికి, ఇంటికి గాని ఉన్న సమస్యను కూడా వాస్తు ప్రకారం సరిచేస్తే పూర్తిస్థాయి మంచి ఫలితాన్ని అతను అనుభవించగలడు. కేవలం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టేసి అందు లో వ్యక్తిని వుంచితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ వ్యక్తికి నడుస్తున్న దశలు ఎంత అధ్వా న్నంగా ఉన్నా మామూలుగా మారిపోలేడు కదా? లేని రాజయోగాలు రావుకదా! అలా అని జ్యోతిష్యం ప్రకారం రెమెడీస్‌ పాటించి వా స్తు బాగుండని ఇంట్లో ఉంటే ఫలితాలు సగమే ఉంటాయన్న విషయం మరిచిపోకూడదు.

ఎవరైనా సరే జ్యోతిష్యం ప్రకారం నడిచే దశలు, గోచారాన్ని ముందుగా చూపిం చు కొని అసలు ఆ వ్యక్తి జీవితంలో అతను ఆశిస్తు న్నవి అనగా సంసారం, పిల్లలు, ఆయుష్షు, ఆరోగ్యం, ఉద్యోగం... ఇత్యాది విషయాలు వున్నాయా? ఉంటే అవి రాకుండా ప్రతిబంధకాలు ఏం వుంటున్నాయి? అవి సరిచే యగలమా? జ్యోతిష్య పరంగానూ, పరిహారక్రియలను ప్రయోగించి అ న్ని అంశాలను పరిశీలించుకోవాలి. ఆ తర్వాత వాస్తు పరంగా ఇల్లు వుం దా? లేక ఇల్లు మారటానికైనా, మార్చటానికైనా తగిన బలాన్ని సాదించుకోవ టానికి ఏం చేయా లి? జోతిష్యపరంగా అని ఆలోచించాలి? ఆ రకంగా జ్యోతిష్య, వాస్తు సమ్మేళనాన్ని ఉపయో గించి జీవితాన్ని బాగుచేసుకోవాలి.

జ్యోతిష్య శాస్తప్రరంగా మనకి లేని ను దుటిరా తను వాస్తు బాగున్న ఇంటి లో ఉండి పొందలే ము. వాస్తు బాగుండని ప్రదేశంలో నివశిస్తున్నా.. జ్యోతిష్యపరంగా రావలసిన యోగాలని ఎలాం టి ఎలాంటి అడ్డంకులు, ప్రతిబంధకాలు లే కుండా సాధించలేము. రెండూ కావాలి. రెం డింటిలోనూ లోపాలను పరిహారక్రియల ద్వా రా సరిచేసుకోవాలి. కేవలం జ్యోతిష్యం చాలు. .. వాస్తు లేదు అనుకోవద్దు. అలాగే వాస్తు మాత్రమే జీవితాన్ని మారుస్తుంది, జ్యోతిష్యం అనవసరం అనుకో వద్దు. ముఖ్యంగా జ్యోతిష్యంలో ‘జన్మ కుండలిలోని లోపాలను పరిహార క్రియలు పాటించి సరిచేస్తే బుర్రకి స్థిరస్థ్వం చెయ్యాలనే సంకల్పం ఏర్పడితేనే వాస్తు ప్రకారం ఆలోచిద్దామనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది నగ్న సత్యం.

ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తి జాతకం బా గున్నంత కాలము వాస్తు ప్రభావం అంతగా బయట కనపడదు. జాతకం బాగులేనప్పుడే వాస్తు ప్రభావం అమితంగా కనపడుతుంది. దశ బాగుంటే దిశ బాగుంటనేది దీనర్ధం. అనారోగ్యం (జలు బు) తో ఉన్న వ్యక్తి వర్షంలో వెళుతున్నప్పుడు ‘గొడుగు’ యొక్క అండతో కాపాడబడతాడు. అనారోగ్యం ఉండ డం (జాతకం బాగోని వ్యక్తి) జ్యోతిష్యం అయి తే గొడుగు అనేది వాస్తు శాస్త్రం. అంటే జాత కం బాగుండకపోతే ‘సమస్య జటిల మవు తుంది’ అని దీని సారాంశం.
అందుకే వ్యక్తికి జాతకం + వాస్తు = జీవితం. అన్నది అతి ముఖ్యమైన వి షతయం ఏదో ఒకటే చూడరాదు. రెండూ సరిచూసుకొని జీవితాన్ని సక్రమమార్గంలో పెట్టుకోవాలి.

ఎవరైనా సరే జాతకంలో వున్న దోషాలను ముందుగా పరిహార ప్రక్రి యల ద్వారా సంపూర్ణంగా సరిదిద్దు కోవాలి. అలాగే వాస్తు దోషాలు సరి చేసుకోవాలి. జాత కాన్ని మార్చలేము గాని, వాస్తు మా ర్చుకోవచ్చు. కనుక అలా మార్చటానికి వీలైన పరిస్థితులు కల్పించేది ఆ వ్యక్తి జాతక బలమే.
అందుకే జ్యోతిష్యశాస్త్రాన్నే ప్రదానంగా తీసు కోవాల్సిన అవసరం ఉంది. ‘అప్రత్యక్షాణి శాస్త్రాణి వివాదన్తేషు కేవలం ప్ర త్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్క యాత్ర సాక్షి ణా’ సూర్యచంద్రుల సాక్షిగా ఈ శాస్త్రం ప్రత్యక్ష ఫలితాలందిస్తుందని భావం. ‘యధాశిభా మ యూరాణాం నాగానాం మణయో యథ తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిష్యం మూర్ధ నిస్తతం’ (ఋగ్జేతిహం)నెమళ్ళకు పింఛములాగా, పాము
లకు తలపై నుండే మణిలాగా వేదాంగ శాస్త్రాలన్నింటిలోనూ జ్యోతిష్యశాస్త్రం అఖండమైనది.‘వేదచక్షసా...’ వేదపురుషు నికి కన్నులాం టిది. ఆరు అంగాలలో జ్యోతిష్యం ఎవరూ మరచిపో రాదు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...