ఎందరో
మహానుభావులు చెప్పిన మాటాలే మరోసారి చెప్పుకోవాలనిపించింది. అందులో
స్వార్ధం ఉంది. అవి నాలోనూ నాస్నేహితులకు కూడా ఒకసారి విచారణచేసుకొడానికి
ఉపయోగపడతాయన్న ఆశ. భగవంతుడు ఇచ్చిన ఈ బ్రతుకుని ఎంతవరకు సార్థకం
చేసుకుంటున్నామని ఒకసారి అలోచిద్దాం. ఎమైనా లోపాలు ఉంటే దిద్దుకుని
మారడానికి ఈ రోజునుండీ ప్రయత్నిద్దాం. మనలో చాలామందికి తప్పులు ఏమిటో
తెలుసు.. మనగుణాలు. ముఖ్యంగా అరిషడ్వర్గాలు.. ఇవి మన ఇహలోక పరలోక అభ్యున్నతిని
అడ్డుకుంటూ ఉంటాయి. వీటిని నియంత్రించడానికి మనవంతు కృషి చేస్తూ
భగవంతుడిని శరణు వేడుదాం. ఈ ఆరు శత్రువుల గురించి అందరికీ తెలుసు. కామ,
క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి కాక మమత, అభిమానం కూడా స్థానభ్రంశం
చెంది దుర్గుణాలుగా మారుతూ ఉంటాయి. వీటిని నియంత్రించాలంటే యమ, నియమ,
ప్రత్యాహార, ఆసన, ధ్యాన మొదలైన అష్ట యోగాలను చెప్పేరు. ఇవి నియమ ప్రకారం
చేయడం ప్రస్తుత జీవనశైళిలో కొంచెం కష్టమే. మనకి ఏ కోరికలు తీరాలన్నా
భగవంతుడిని కోరుకోవడం అలవాటు. మరి ఈ గుణాలను నియంత్రించడానికి కూడా అతనినే
త్రికరణ శుద్ధిగా శరణు వేడుదాం.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....
No comments:
Post a Comment