Friday, December 13, 2013

ఎందరో మహానుభావులు చెప్పిన మాటాలు

ఎందరో మహానుభావులు చెప్పిన మాటాలే మరోసారి చెప్పుకోవాలనిపించింది. అందులో స్వార్ధం ఉంది. అవి నాలోనూ నాస్నేహితులకు కూడా ఒకసారి విచారణచేసుకొడానికి ఉపయోగపడతాయన్న ఆశ. భగవంతుడు ఇచ్చిన ఈ బ్రతుకుని ఎంతవరకు సార్థకం చేసుకుంటున్నామని ఒకసారి అలోచిద్దాం. ఎమైనా లోపాలు ఉంటే దిద్దుకుని మారడానికి ఈ రోజునుండీ ప్రయత్నిద్దాం. మనలో చాలామందికి తప్పులు ఏమిటో తెలుసు.. మనగుణాలు. ముఖ్యంగా అరిషడ్వర్గాలు.. ఇవి మన ఇహలోక పరలోక అభ్యున్నతిని అడ్డుకుంటూ ఉంటాయి. వీటిని నియంత్రించడానికి మనవంతు కృషి చేస్తూ భగవంతుడిని శరణు వేడుదాం. ఈ ఆరు శత్రువుల గురించి అందరికీ తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి కాక మమత, అభిమానం కూడా స్థానభ్రంశం చెంది దుర్గుణాలుగా మారుతూ ఉంటాయి. వీటిని నియంత్రించాలంటే యమ, నియమ, ప్రత్యాహార, ఆసన, ధ్యాన మొదలైన అష్ట యోగాలను చెప్పేరు. ఇవి నియమ ప్రకారం చేయడం ప్రస్తుత జీవనశైళిలో కొంచెం కష్టమే. మనకి ఏ కోరికలు తీరాలన్నా భగవంతుడిని కోరుకోవడం అలవాటు. మరి ఈ గుణాలను నియంత్రించడానికి కూడా అతనినే త్రికరణ శుద్ధిగా శరణు వేడుదాం.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...